![రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/15sktp84-370024_mr-1718477651-0.jpg.webp?itok=9lhaUVLt)
కొత్తవలస: కొత్తవలస నుంచి విజయనగరం వైపు వెళ్లే రైల్వేలైన్లో నిమ్మలపాలెం గ్రామ సమీపంలో గల రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమచారం అందించగా ఎస్సై రవివర్మ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుందని.. నీలం రంగు షర్ట్ ధరించాడాని ఎస్సై చెప్పారు. మృతుడి వద్ద తాపీపని చేసే సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని విజయనగరం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.