నిజాయతీతో సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

నిజాయతీతో సేవలందించాలి

Published Mon, Mar 3 2025 12:31 AM | Last Updated on Mon, Mar 3 2025 12:38 AM

నిజాయ

నిజాయతీతో సేవలందించాలి

ఏలూరు టౌన్‌: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీతో సేవలందించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశో క్‌కుమార్‌ అన్నారు. అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆదివారం ఏలూరు రేంజ్‌ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వులు అందజేశారు. రేంజ్‌ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తిచేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 1, తూర్పుగోదావరి జిల్లా 15, పశ్చిమగోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లా 20, ఎన్‌టీఆర్‌ జిల్లా 56 మంది ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. బాధి తుల పక్షాన న్యాయం చేయటం, నిందితులకు చట్టా ల మేరకు శిక్షలు విధించేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. నేరస్తులకు భ యం, బాధితులకు అభయం అందించేలా పనిచేయాలన్నారు. పోలీస్‌ విధుల్లో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు.

ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌

100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు అందజేత

No comments yet. Be the first to comment!
Add a comment
నిజాయతీతో సేవలందించాలి 1
1/1

నిజాయతీతో సేవలందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement