అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Published Wed, Mar 5 2025 2:04 AM | Last Updated on Wed, Mar 5 2025 2:04 AM

అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్స

అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్స

దెందులూరు: మండలంలోని ముప్పవరం సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. వివరాలను ప్రకారం వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నవదిశా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు సోమవారం సాయంత్రం వైజాగ్‌లో 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే అర్ధరాత్రి వంటి గంట సమయానికి ముప్పవరం వద్ద రిపేర్‌ వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ సంస్థకు ఫోన్‌ చేయగా యజమాని దుర్భాషడాలరని ప్రయాణికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంటేశ్వరరావు బస్సు డ్రైవర్‌తో మాట్లాడి, యజమానికి విషయం తెలపడంతో మంగళవారం మీ సొమ్ములు చెల్లిస్తానని యజమాని చెప్పాడు. దీంతో ప్రయాణికులు రాత్రి సమయంలో వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement