వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 199వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ విశాఖనగర కన్వీనర్ వంశీకృష్ణశ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. షర్మిల గురువారం గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్లో పాదయాత్ర మొదలు పెడతారు. నాతయ్యపాలెం,షీలానగర్ మీదుగా సాగి ఎయిర్పోర్టు సమీపంలో లంచ్ చేస్తారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని ఎన్ఏడీ జంక్షన్ మీదుగా కంచరపాలెం మెట్టు చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు. పర్యటించే ప్రాంతాలు గాజువాక సెంటర్, నాతయ్యపాలెం, షీలానగర్, ఎయిర్పోర్టు, ఎన్ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం,ఐటీఐ జంక్షన్, కంచరపాలెం మెట్టు