p
-
Cantonment: బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి కీలక నేత
హైదరాబాద్: ఎన్నికల వేళ కంటోన్మెంట్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్.శ్రీగణేశ్ కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్ మంగళవారం ఉదయం బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్ వాకర్స్తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు. అటు నుంచి శ్రీగణేశ్ నేరుగా పికెట్లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీగణేశ్ను కలిశారు. కాంగ్రెస్లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్లో చేరిపోవడం గమనార్హం. -
కమలం.. నిస్తేజం..!
సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మాతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంటే.. జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో కాషాయ పార్టీ అధినేతలు ఉంటే.. జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికలవేళ బీజేపీయేతర పార్టీల క్యాడర్ కలిసి తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే జిల్లాలో కమలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో కలిసిరాని క్యాడర్తో ఆందోళన చెందుతున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తితో కొందరు సీనియర్లు అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోపక్క.. ఎమ్మెల్యే టికెట్టు పొందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తమ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, జూనియర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే కారణంతో కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్పల్లికి చెందిన ఆ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి సద్దిబత్తుల వేణు పదిరోజుల క్రితమే పార్టీనీ వీడి కారెక్కారు. మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు హమీద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పి.శేఖర్, బీసీ విభాగం మెట్పల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండు నెలల క్రితమే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన జేఎన్.వెంకట్కు కమలం పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసింది. దీంతో అప్పటివరకు ఆ స్థానం నుంచి టికెట్పై ఆశలు పెట్టుకున్న మెట్పల్లికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోరుట్లకు చెందిన రైల్వేబోర్డు సభ్యురాలు పూదరి అరుణ సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి సీనియర్లు వెంకట్కు మద్దతుగా ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వెంకట్ తన బీసీ కార్డు, పాత పీఆర్పీ క్యాడర్తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై బాజోజి భాస్కర్ వివరణ ఇస్తూ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు సీనియర్లను కలుపుకుపోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో పూదరి అరుణ కొన్నిరోజుల పాటు హైదరాబాద్లో ఉన్నారు. రేపటి నుంచి ప్రచారంలో పాల్గొంటారు. మెట్పల్లిలో మాత్రం బీజేపీ బలంగా ఉంది. పార్టీ అధినేతలను పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. జగిత్యాల, ధర్మపురిలో బహిరంగ సభలు పెడ్తాం అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్ధి కన్నం అంజయ్యకు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏళ్ల నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే అభ్యర్థి ఏనాడూ ప్రచారానికి పిలవలేదని మండిపడుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు సైతం తీసుకోలేదంటూ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నీలకంఠం, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మారెడ్డి, కిసాన్మోర్చా నాయకుడు ఏలేటి లింగారెడ్డి, నాయకులు హనుమాండ్లు, గోవర్ధన్రెడ్డి తదితరులు ఇటీవల పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. జగిత్యాలలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇక్కడినుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఎం.రవీందర్రెడ్డి గెలుపు మాత్రం అనుమానంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్, మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి మధ్యే ప్రధాన పోరు ఉంది. ఈ రెండువర్గాలు చేస్తున్న పోటాపోటీ ప్రచారానికి తగ్గట్టు రవీందర్రెడ్డి ప్రచారం చేయకపోవడం.. క్యాడర్ అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది. ప్రచారానికి అతిరథులు దూరం..! ఎన్నికల వేళ.. తమతమ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ అతిరథులు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి మాత్రం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, స్వామి పరిపూర్ణానంద మెట్పల్లిలో ఒక్కోసారి పర్యటించారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో స్వామి పరిపూర్ణానంద పది నిమిషాలు కూడా మాట్లాడలేదు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్రెడ్డితో ప్రతిజ్ఞ చేయించి వెళ్లిపోయారు. ధర్మపురిలో మాత్రం ఒక్కరూ పర్యటించలేదు. దీంతో కోరుట్ల మినహా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో అభ్యర్థులే అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం వంటి చిన్న జిల్లాల్లోనూ బీజేపీ కేంద్ర నాయకులు హాజరుకావడం.. ఉద్యమాల గడ్డ అయిన జగిత్యాలకు రాకపోవడంతో కమలనాథులను నిరాశకు గురిచేస్తోంది. -
బంగ్లాదేశ్ను గెలిపించిన ముస్తఫిజుర్
అబుదాబి: ఆసియా కప్లో మరో సూపర్ పోరులో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్పై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్తాన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఆఖరి ఓవర్ను కట్టుదిట్టంగా వేసిన ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం భారత్తో జరిగే ఫైనల్లో తలపడుతుంది. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇమ్రూల్ కైస్ (72; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (74; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 126 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడింది. ఇసానుల్లా (8), రహ్మత్ షా (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్ను ఓపెనర్ షహదత్ (53; 8 ఫోర్లు), హష్మతుల్లా (71; 5 ఫోర్లు) ఆదుకున్నారు. మూడో వికెట్కు 63 పరుగులు జతచేశాక షహదత్ పెవిలియన్ చేరాడు. తర్వాత హష్మతుల్లాతో జోడీ కట్టిన కెప్టెన్ అస్గర్ (39; 2 ఫోర్లు) జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. అయితే జట్టు స్కోరు 167 పరుగుల వద్ద అస్గర్, 192 పరుగుల వద్ద హష్మతుల్లా నిష్క్రమించడంతో అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి. -
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి హబీబ్నగర్కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్నగర్లో ఆర్ఎంపీ బషీర్బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను ఆర్ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్కు చికిత్స చేసిన ఆర్ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఇందూరు : నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ వస్తుందో, రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైఖేల్, విశాల్ రెడ్డి, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
సూరత్లో ఘనంగా తెలంగాణ సంబరాలు
సాక్షి, ముంబై: సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్యసమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూరత్లోని ప్రతాప్నగర్ ప్రాంతంలోగల శ్రీమార్కండేయ మందిరం ప్రాంగణంలో సోమవారం సాయంత్రం వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డుంబాల్ వార్డు తెలుగు కార్పొరేటర్ పి.వి.యస్. శర్మ, ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు, సూరత్ పద్మశాలి సమాజం కార్యదర్శి అంకం సోమయ్య, శ్రీ మార్కండేయ మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్తోపాటు తెలంగాణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి శర్మ, రాపోలు బుచ్చిరాములు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించడానికి ముఖ్య భూమిక పోషించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తదుపరి బాణసంచా కాల్చి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా ఎదురు చూసిన తెలంగాణ ప్రజల కల సాకారమైందని, తెలంగాణ అంటే నాలుగు అక్షరాలు కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. అటువంటి తె లంగాణను సాధించడానికి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది అమరవీరుల త్యాగ ఫలితంగా కళ సాకారమై ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరికీ ఎనలేని సంతోషాన్ని కలుగజేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటైతే సొంత రాష్ట్రానికి వెళ్తామనే ఆశ స్థానికుల్లో ఉందని, తమ పిల్లలకు సొంత రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని, అవన్నీ తెలంగాణలో నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి సూరత్లో ఉన్న వలస ప్రజలకు మధ్య స్నేహ వారధిగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో, సూరత్లోని అన్ని వర్గాల ప్రజల సహాయసహకారాలతో సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితిని ఏర్పాటు చేశామని, లక్ష్యం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తామని కార్యనిర్వాహకులు మచ్చ వీరన్న, శంకుపెల్లి బుగులాచారి, శ్రీనివాస్ తెలిపారు. వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో... ముంబైలోని వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుధీర్గ పోరాటంతో తెలంగాణ, అమరవీరుల త్యాగ ఫలితంగా కల సాకారమైందని వాషి తెలంగాణ సమితి అధ్యక్షుడు సైదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్, గిరి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చి అంధేరీలో.. పశ్చిమ అంధేరీలోని కపాస్వాడి ప్రాంతంలో నివసిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు సోమవారం సాయంత్రం తెలంగాణ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. గూడ నారాయణగౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, రం గులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కె. చంద్రశేఖర్గౌడ్, ఎస్. బందయ్య గౌడ్, ఎం. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో మూవీ స్టిల్స్
-
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
-
ప్రజలతో తమ అనుబంధం పెరిగింది: విజయమ్మ
-
నేటితో ముగియనున్న షర్మిళ పాదయాత్ర
-
అడుగుల ఆశీస్సులు - స్పెషల్ ఎడిషన్
-
210వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ తీరంలో 5th july 2013
-
షర్మిల 200వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
షర్మిళగారు విశాఖ ఎంపీగా పోటీ చేయండి: అభిమానుల ఫ్లెక్సీలు
-
గాజువాక సెంటర్ నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 4th july 2013
-
షర్మిల 199వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
పైడివాన నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 3rd july 2013
-
షర్మిల 198వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
వైయస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు
-
విశాఖ తీరంలో 2nd july 2013
-
అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర
-
ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధలేదు: షర్మిల
-
విశాఖ తీరంలో 1st july 2013
-
విశాఖతీరంలో 29th June 2013
-
షర్మిల 194వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
హాస్టల్ విద్యార్థులతో షర్మిళ
-
విశాఖ తీరంలో 27th june 2013