వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 201వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణశ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. షర్మిల శనివారం తూర్పు నియోజక వర్గంలోని వాల్తేరు వైఎస్సార్ సెంటర్లో పాదయాత్ర మొదలు పెడతారు. ఏఎస్రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా సాగి హనుమంతువాక సమీపంలో లంచ్ చేస్తారు. తర్వాత పెదగదిలి, తోట గరువు మీదుగా ఆరిలోవ చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు.