chintamaneni prabhakar
-
ఎమ్మెల్యే చింతమనేనికి ఝలక్!
ఏలూరు టౌన్: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మూడు పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు త్రీటౌన్ పోలీసులకు శనివారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వద్ద కారు డ్రైవర్గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు శివారు సీతారామపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని... నాగరాజును ఏరా అంటూ బూతులు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తిడుతూ అతని తల్లిని సైతం దూషిస్తూ దుర్భాషలాడుతూ.. రాడ్డుతో దాడి చేశారు.దీంతో, పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్తోపాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్ రాజు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులో కోరారు. అలాగే.. ఎమ్మెల్యే చింతమనేని తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మట్టా ప్రవీణ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
ఏపీలో దౌర్జన్యకాండ.. రెడ్బుక్ రాజ్యాంగానికి ఖాకీల సెల్యూట్!
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికార మదంతో అక్రమ కేసులు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు సైతం పనిచేస్తున్నారు. తాజాగా దెందులూరులో సైతం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారు. చింతమనేని ఆదేశాలంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కనుసన్నల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెండు రోజుల క్రితమే వట్లూరులో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అతని అనుచరులపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా వారే దాడి చేసి రివర్స్లో బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయించారు చింతమనేని. తాజాగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.చింతమనేని గన్ మ్యాన్ వద్ద గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కట్టుకథలతో చింతమనేని ఫిర్యాదు చేయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో పాటుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చింతమనేని దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేసి తమపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. కేసు ఏంటో చెప్పకుండా హైదరాబాద్ వరకు వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కార్ తమకు చట్టం, న్యాయం, రాజ్యాంగాలతో పనిలేదని రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు సామాన్యుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి సర్కారు వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులకు తెగబడింది. బుధవారం రాత్రి పెదపాడు మండలం వట్లూరులోని పద్మావతి గార్డెన్స్లో వివాహ వేడుకకు హాజరైన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేసి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపైన, వైఎస్సార్సీపీ నేతలపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. గురువారం తెల్లారేసరికి మొత్తం కథ మార్చేశారు. తన డ్రైవర్ మానుకొండ సుధీర్తో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో అబ్బయ్య చౌదరి, దెందులూరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. వారు తనను దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని సుధీర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, మట్టా ప్రవీణ్, జానంపేట బాబు, జితేంద్ర, సాయిరామ్ చౌదరి, మరో 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.వివాహ వేడుకలో ఇదేం పని?నోరు విప్పితే బూతులు మాట్లాడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వివాహ వేడుకలో కావాలనే గొడవకు దిగినట్టు వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. అందరూ సంతోషంతో జరుపుకొనే వివాహ వేడుకలోనూ రాజకీయ రచ్చకు దిగడం, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో గొడవ పెట్టుకోవటంపై టీడీపీ నేతలు సహా అందరూ తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని కారు వెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ, ఏదోలా రగడ సృష్టించాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్పై బూతులతో రెచ్చిపోయారని అంటున్నారు.షూ వేసుకునే స్టిక్తో దాడి?ఎమ్మెల్యే చింతమనేని బూట్లు వేసుకునేందుకు రెండు అడుగులు ఉండే ఐరన్ స్టిక్ను వినియోగిస్తారని తెలుస్తోంది. దానికి చివరగా పదునైన వంపు ఉంటుందని, దానితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఆయన బూతులు తిడుతుండగా వీడియో తీస్తున్న హేమంత్ నుంచి సెల్ఫోన్ లాక్కున్నారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతుండగా వారించిన వైఎస్సార్సీపీ పెదవేగి మండల అధ్యక్షుడు జానంపేట బాబు, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల నాయకులు ఎం.కృష్ణారావుపై దాడి చేశారు. జానంపేట బాబుకు రెండు చేతులపై గాయాలయ్యాయి. వీడియో తీస్తున్న వారిపై చింతమనేని అనుచరులు దాడి చేసి సెల్ఫోన్లు లాక్కున్నట్లు చెబుతున్నారు. -
భయపెడితే భయపడే వాడు ఎవడు లేదు.. తాగేసి రచ్చ చేసాడు ..
-
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
జనసేన నేతలపై టీడీపీ శ్రేణులు దాడి
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు
-
పోలీసులపై చింతమనేని అనుచరులు దాడి
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన చింతమనేని అరాచకాలు
-
అట్లుంటయ్.. చింతమనేని వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికారులు, ఉద్యోగులపై టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులకు ఇదో మచ్చుతునక. ఏలూరు జిల్లావ్యాప్తంగా 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రాగా 57 మంది కొత్త స్థానాల్లో చేరారు. తన నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఆరుగురి పదోన్నతికి మాత్రం చింతమనేని మోకాలడ్డు పెడుతున్నారు. ఆ ఆరుగురిని టార్గెట్ చేసి వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరో 3 రోజులు జాప్యం జరిగితే వచ్చిన పదోన్నతులు దక్కకపోగా స్థానికంగా తీవ్ర అవమానాలు, భౌతిక దాడులు భరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలూరు జిల్లాలో ఈనెల 8న 63 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 పదోన్నతి దక్కింది. పదోన్నతి ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పదోన్నతుల వ్యవహారం సజావుగా సాగింది. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 12 మందికి పదోన్నతి దక్కితే ఆరుగురు నానా తంటాలు పడి గత వారంలో రిలీవ్ అయి కొత్త స్థానంలో విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురిని మాత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, స్థానిక నేతలతో సన్నిహితంగా ఉన్నారని, ఇలా రకరకాల ముద్రలు వేసి ఆ ఆరుగురు పదోన్నతులు అడ్డుకున్నారు. తనకు చెప్పకుండా వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదని జిల్లా పంచాయతీ అధికారికి ఆయన ఆదేశించారు. దీంతో ఆ ఆరుగురి భవితవ్యం గాలిలో ఉంది. రెడ్బుక్ రాజకీయాలుదెందులూరు మండలంలో రామారావుగూడె, పెదవేగి మండలంలోని విజయరాయి, నడిపల్లి, భోగాపురం, జగన్నాథపురం, ఏలూరు రూరల్ మండలంలో మల్కాపురం పంచాయతీ కార్యదర్శులను వేధిస్తూ ఎమ్మెల్యే రెడ్బుక్ రాజకీయాలకు తెరతీశారు. కక్ష సాధింపులతో నిరంతరం అవమానాలకు గురిచేయడంతో పాటు మాటలతోనూ వేధిస్తున్నారు. వీరిలో ఒక పంచాయతీ కార్యదర్శిపై కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో 40 నిమిషాల పాటు బహిరంగ వేదికపైనే తీవ్రస్థాయిలో చింతమనేని విరుచుకుపడ్డారు.ప్రొటోకాల్ పాటించలేదనే కారణంతో సదరు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీపీఓను ఆదేశించడంతో డీపీఓ ఆగమేఘాలపై సస్పెన్షన్కు ఫైల్ రెడీ చేశారు. మరో పంచాయతీ కార్యదర్శి రిలీవ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆ కార్యదర్శిని మందలించి మరీ పంపినట్లు సమాచారం. -
పసుపు పూసుకున్న పోలీసులు
-
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
-
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
-
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్స్టేషన్కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్లను అక్కడికి పంపారు. హైదరాబాద్కు కూడా మరో టీమ్ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్కు పంపారు. -
రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..!
కౌరవ సంతతి మొత్తం తెలుగుదేశంలోనే ఉందా? మహిళల మీద దాడులు చేసేవారు, దళితులను నీచంగా చూసేవారు, రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇలాంటి నికృష్ట పనులకు కేరాఫ్గా నిలిచారు. మహిళా తాహసీల్దార్ మీద దాడి నుంచి ఎన్నికల్లో దాడుల వరకు ఆ మాజీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ మీదపడి అరెస్టయిన తన మనిషిని తీసుకెళ్లిపోయేంతగా తెగించాడు. ఇంతకీ ఈ అరాచక పచ్చ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం.ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నాయకులు కొందరుంటారు. వారిలో రాజకీయాల్లో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందినవారు కొందరైతే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, గూండాయిజంతో అందరిపైనా చిందులు తొక్కుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు మరికొందరున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పచ్చ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన నేరాల్లో సెంచరీ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. గూండాగిరీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున గెలిచి తన అధికార అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్పారు. తాజా ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థం కావడంతో తన గూండాగిరీతో అటు ప్రజల్ని..ఇటు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి చేరాడు చింతమనేని ప్రభాకరచౌదరి.ఎంపీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేంతవరకూ చింతమనేని నేరాలు, దౌర్జన్యాల చిట్టా విప్పితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని అంటే దెందులూరులో ఒక రౌడీగా గుర్తింపు వచ్చిందే గాని రాజకీయ నాయకుడిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోలేకపోయారు.చింతమనేని దురాగతాలపై పలు కేసులు నమోదు అయినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనుంచి మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చింతమనేని తన నోటి దురుసు, దుడుకుతనంతో నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తన అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తాహసీల్దార్ వనజాక్షిని నదిలో ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభుత్వ అధికారిపై దాడి చేసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా..ఆ తాహసీల్దార్నే తప్పుపట్టారు.ఇక అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల మీద, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, పోలీసులనే బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. దళితులంటే ఆయనకు ఎంత చిన్నచూపంటే..మీకు రాజకీయాలెందుకురా? రాజకీయాలు చేస్తే మేమే చేయాలంటూ.. మా బ్రీడ్ వేరు..మా బ్లడ్ వేరని తిక్కగా మాట్లాడే నందమూరి బాలకృష్ణలా అహంకారంతో కూడిన డైలాగ్స్ వదిలారు.ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని పోలీసులతో ఓవరాక్షన్ చేయవద్దని..అలా చేస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వారిని బెదిరించాడు. తమను అడ్డుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది. చింతమనేని మాటలకు ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులు అయ్యారు. ఎంతకాలం అయినా చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.. 13వ తేదీన పోలింగ్ జరుగుతున్నపుడు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం..కొప్పులవారిగూడెంలో పంచాయతీ సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవిపై టిడిపి కార్యకర్త రాజశేఖర్ కత్తెరతో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్ట్ కు తీసుకువెళ్లే క్రమంలో ముద్దాయిని కస్టడీలో ఉంచారు. మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్కు వచ్చిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడ్డారు. సీఐ తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడుతూ...హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను చింతమనేని ప్రభాకర్ తన కారులో అక్కడి నుంచి తీసుకుని పరారయ్యాడు. అరెస్టయిని ముద్దాయిని పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరిపై కేసుల చిట్టా భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి. రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని చింతమనేని తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఉదంతం రాష్ట్రం మరచిపోదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్పై దాడిచేసిన కేసులో ప్రభాకర్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది. తాజాగా పెదవేగి పోలీస్ స్టేషన్ విధ్వంసం సృష్టించడంతో మరో కేసు నమోదు అయింది.తమ బిడ్డపై దాడి చేసిన వ్యక్తిని చింతమనేని దౌర్జన్యంగా స్టేషన్ నుండి తీసుకుపోవడంపై కొప్పులవారి గూడెం సర్పంచ్ సంజీవరావు.. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు..లేనపుడు కూడా చింతమనేని ప్రభాకర చౌదరి రౌడీయుజం, గూండాగిరీ ఏమాత్రం ఆగడంలేదు. ఆఖరుకు ఎన్నికల్లో కూడా అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి శిరచ్ఛేదం చేశాడు. మరి ఇప్పటికి 93 కేసులు తనపై ఉన్నాయని స్వయంగా చెప్పిన చింతమనేని అహంకారం ఎప్పుడు దిగుతుందా అని దెందులూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ను పోలీస్స్టేషన్కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్స్టేషన్కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
చింతమనేని గూండాగిరి
-
పచ్చ ముఠాల విధ్వంస కాండ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తెగబడ్డ టీడీపీ, జనసేన సోమవారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. చోద్యం చూసిన ఈసీ టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్ యాప్ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అయినా సరే పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్ను మాత్రమే గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. మచ్చుకత్తితో దాడి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ కార్యకర్త నవీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై హత్యాయత్నం పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రిలీవ్ ఏజెంట్గా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కారెంపూడిలోని 288 నెంబర్ బూత్లో ఎన్నికల ఏజెంట్గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్రెడ్డిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్ బూత్లతో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్ బూత్లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్ బూత్లో ఏజెంట్గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు. పసుపు కండువాతో ‘గంటా’ హల్చల్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్ బూత్ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాల బూత్లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్ సీపీకి చెందిన బూత్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..> పోలింగ్ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఏజంట్పై కత్తితో దాడి చేశారు. అనంతరం పోలింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి. > వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జి షాహీద్పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. > రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్సీపీ నేత తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. > మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
జనసేన పరువు తీసిన చింతమనేని
-
చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు
ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.... ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. -
దళితులపై మరోసారి చింతమనేని దాష్టీకం
-
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్కుమార్తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
ఒరేయ్ చింతమనేని నీకే చెప్తున్న...పోసాని స్ట్రాంగ్ వార్నింగ్
-
YSRCP చేసిన అభివృద్ధిపై బాబుతో చర్చకు సిద్ధం: MLA
-
చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
-
మొదటి లిస్ట్ లో చోటు దక్కని చింతమనేని..హాట్ కామెంట్స్
-
సీనియర్లు.. ఎదురు‘తన్నులు’
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు. చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు. చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. లాబీయింగ్ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా ! మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. యరపతినేనికి ఎసరే! ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు. ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు. -
మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి టీడీపీ, జనసేన నేతల షాక్
-
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్ -
చింతమనేని ఓవరాక్షన్
ఏలూరు టౌన్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబుకు వైద్య చికిత్స నిమిత్తం న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా దాన్ని చింతమనేని హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లిన చింతమనేని సిబ్బందికి స్వీట్లు పంచారు. ఈ లోగా సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ చంద్రశేఖర్ స్టేషన్లో హడావిడి చేస్తున్న చింతమనేనిని బయటకు గెంటుకుంటూ వచ్చి గేటు బయటకు పంపివేశారు. పోలీస్స్టేషన్కు కూడా వెళ్లి చింతమనేని సిబ్బందికి స్వీట్లు పంచడం సరైన విధానం కాదంటూ పలువురు పోలీస్ అధికారులు అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని కావాలని ఇరుకునపెట్టేలా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..
ఏలూరు టౌన్: తన విపరీత ధోరణితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వందలాది మందితో లోనికి వెళ్లి వైద్య సేవలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. ఐసీయూలోకి ఏకంగా తోపుడు బండ్లపై మామిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచే కార్యక్రమం చేపట్టడంతో సిబ్బంది, రోగుల బంధువులు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రెచ్చిపోయారు. బ్యాక్టీరియా, వైరస్లు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించే ఐసీయూలోకి తోపుడు బండ్లు తీసుకుని వెళ్లడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు వేసుకుని మరీ ఆస్పత్రిలో హడావుడి చేయడంపై వైద్యులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై దెందులూరు పోలీస్స్టేషన్లో ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఎస్సై ఐ.వీర్రాజు చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభాకర్ను ప్రభుత్వాసుపత్రి నుంచి పెదవేగి తరలిస్తుండగా సోమవరప్పాడు బైపాస్ వద్ద జీపు దిగి విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి వెళ్లిపోయారన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీపు డ్రైవర్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 2/23తో 341, 24, 506, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్పై ఈ నెల 2న కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. చదవండి: (చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్) -
రెచ్చిపోయిన చింతమనేని.. పబ్లిక్లోనే బూతులు తిడుతూ..
సాక్షి, పినకమామిడి: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఏలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని.. మహిళలు, చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం మరిచిపోయి బూతులు మాట్లాడారు. అయితే, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని పినకమామిడిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ మీటింగ్లో బూతుపురాణం అందుకున్నారు. అట్రాసిటీ కేసు పెట్టిన దళితుడిపై మరోసారి అశ్లీల వ్యాఖ్యలు చేశారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సభలో **** నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కూడా తప్పుడు ప్రచారం చేశాడు. మరోవైపు.. వివాదస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని
-
తిప్పనగుంటలో టీడీపీ నేతలకు చుక్కెదురు
-
‘ఇంటింటికీ’లో టీడీపీకి షాక్! బచ్చుల, చింతమనేని బృందానికి చేదు అనుభవం
హనుమాన్ జంక్షన్ రూరల్: ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నేతలపై మహిళలు మండిపడుతున్నారు.కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. బచ్చుల అర్జునుడుతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించటంపై గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటూ ఎమ్మెల్సీ అర్జునుడిని గ్రామానికి చెందిన కొలవెంటి లక్ష్మీతో పాటు పలువురు నిలదీశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామ అభివృద్ధితో పాటు తమకు ఏ ఇబ్బంది వచ్చినా వంశీనే ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బచ్చుల అర్జునుడు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆమెను వారించేందుకు ప్రయత్నించడంతో ‘మీరు ఏం చేశారు? వస్తున్నారు.. వెళ్తున్నారు.. ! మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు’ అని మహిళలు విరుచుకుపడటంతో టీడీపీ నేతలు నిష్క్రమించారు. -
Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని
సాక్షి, ఏలూరు: సొంత ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోడిపందేలు నిర్వహించడం ఇబ్బందిగా మారడం.. తన ఆటలు ఇక్కడ సాగకపోవడంతో చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ వైపు రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. పఠాన్చెరు మండలంలో చింతమనేని ప్రభాకర్ వారం క్రితం కోడిపందేలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. దీంతో చింతమనేని పరారైన తరువాత చివరిగా ఆయన మొబైల్ సిగ్నల్ శంషాబాద్లో చూపించి, అక్కడ కట్ అయింది. ఇతర రాష్ట్రాలకు పరారై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. చింతమనేని దౌర్జన్యకాండ ఇదే.. నిజానికి.. చింతమనేని దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, దౌర్జన్యాలకు దిగడం ద్వారా వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ► అతనిపై ఇప్పటివరకు మొత్తం 60 కేసులున్నాయి. పెదవేగి ఎంపీపీగా ఉన్నప్పుడే 10 కేసులు నమోదయ్యాయి. రెండు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి. ►గతంలో ఎస్ఐలుగా పనిచేసిన ఆనంద్రెడ్డి, మోహనరావులపై, అంగన్వాడీ కార్యకర్తలపై బూతు పురాణం, దౌర్జన్యం చేసిన ఘటనలో కేసు, తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి దాడిచేసిన కేసు వీటిల్లో ముఖ్యమైనవి. అలాగే.. ► 2010లో ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో చింతమనేనిపై తెరిచిన రౌడీషీట్ నేటికీ కొనసాగుతోంది. ► గతంలో అప్పటి రాష్ట్రమంత్రి వట్టి వసంత్కుమార్పై దాడిచేసిన కేసు కూడా ఉంది. ► చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దెందులూరు నియోజకవర్గాన్ని కోడిపందేలు, పేకాటకు అడ్డాగా మార్చేశాడు. ► 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా తన వ్యవహారశైలి మారకుండా అదే రీతిలో కొనసాగుతూ పందేలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాడు. చదవండి: (చింతమనేనిదే పందెం కోడి!) -
చింతమనేనిదే పందెం కోడి!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్లో కోడిపందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడిపందేల స్థావరంపై బుధవారం రాత్రి పటాన్చెరువు పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని పటాన్చెరువు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్ను స్వీచ్చాఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే, పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. ఆయన కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే, చింతమనేని బుధవారం కోడి పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. మరోవైపు.. ఇదే స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థాయిని బట్టి బరుల ఏర్పాటు కోడిపందేల్లో పాల్గొనే వారిని చింతమనేని వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తూ రప్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్లో చింతమనేని లోకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు. గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ స్థావరంలో రూ.500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించిన చోట గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. సీజ్ చేసిన వాహనాల్లోనూ ఇవి లభించాయి. పట్టుబడిన 21 మంది వీరే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులు హైదరాబాద్తోపాటు ఏలూరు, కృష్ణాజిల్లా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులైన అక్కినేని సతీశ్, శ్రీనివాస్రావు, చేతేశ్వర్రావు, శ్రీరామకృష్ణ, బాలస్వామి, లింగాల నాగేశ్వర్రావు, రవడి శ్రీను, రవీంద్ర చంద్రశేఖర్, నాగబాబు, నాగశేషు, సూర్యనారాయణరావు, వంశీ, షణ్ముఖ్సాయి, నిఖిల్, గంటా శ్రీనివాసరావు, పార్స శ్రీనివాసరావు, బొడపాటి నాగేశ్వరరావు, ముల్లపుడి నర్సన్న, సత్యనారాయణ రాజు, నర్ర సాంబశివరావు, ప్రకాశ్లను రిమాండ్కు తరలించారు. ఇక్కడే రేవ్ పార్టీలు కూడా? చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్లో హైదరాబాద్కు చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
కోడి పందాల కేసు.. చింతమనేనికి అదిరిపోయే షాక్
-
కోడి పందేల కేసులో ఏ1 చింతమనేనే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్లో కోళ్ల పందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోళ్ల పందేల స్థావరంపై బుధవారం రాత్రి దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకొనేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. చింతమనేని పోస్టుకు సమయం వచ్చినప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చింతమనేని కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే పోలీసులు ఆ వీడియోలను విడుదల చేయకముందే చింతమనేని బుధవారం చిన్నకంజర్ల గ్రామ శివారులో కోళ్ల పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. వాట్సాప్ ద్వారా సమీకరణ... వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తూ కోళ్ల పందెంలో పాల్గొనే వారిని చింతమనేని సమీకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని 25 ఎకరాల మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్లో చింతమనేని లొకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు. గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చింతమనేని నేతృత్వంలో మరికొందరు ఒక ముఠాగా ఏర్పడి ఆ పందేలను నిర్వహిస్తున్నారని... పందేల నిర్వహణ ద్వారా రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారని తేల్చారు. ఈ స్థావరంలో రూ. 500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటు చేశారు. ఈ బరులకు వెళ్లే దారులకు సంబంధించి ఫాంహౌస్లో సూచికలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. భారీగా మద్యం... పోలీసులు దాడులు నిర్వహించిన చిన్నకంజర్లలో గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. పందెం రాయుళ్లకు తాగినంత మద్యం కూడా నిర్వాహకులు సరఫరా చేసినట్టు గుర్తించారు. ఘటనా స్థలం వద్ద సీజ్ చేసిన వాహనాలను డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్ఐలు సత్యనారాయణ, రామానాయుడు, ప్రసాద్రావు గురువారం తనిఖీ చేయగా అందులో 11 లిక్కర్ బాటిళ్లు, రెండు బీర్ కాటన్లు లభించాయి. మరోవైపు కోళ్ల పందేల నిర్వహణే కాకుండా ఈ స్థావరంలో పందెం కోళ్ల పెంపకం కూడా సాగుతున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వాహనాల్లో కోళ్లను తీసుకొస్తున్నట్లు తేలడంతో కోళ్లను రవాణా చేసిన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా అక్కడి, ఇక్కడి వారే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులను హైదరాబాద్తోపాటు ఏపీలోని ఏలూరు, కృష్ణా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కోడి పందేల స్థావరంలో రేవ్ పార్టీలు? ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్లో హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే రేవ్ పార్టీలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: లక్షల్లో కోడిపందాలు బెట్టింగ్.. పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని -
హైదరాబాద్ శివారులో కోడిపందాల కలకలం
-
లక్షల్లో కోడిపందాలు.. పోలీసులను చూసి పరారైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని
పటాన్చెరు: కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చేసిన దాడిలో ఆంధ్రప్రదేశ్లోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్హౌస్పై బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి కోళ్ల పందేలు ఆడుతున్న వారిని పట్టుకున్నారు. మొత్తం 70 మంది వరకు పందెం ఆడుతున్నట్లు పోలీసులు లెక్కతీశారు. అయితే పోలీసులు ఫా మ్హౌస్లోకి వెళ్తుండగానే కొందరు పరారయ్యా రు. చింతమనేని ప్రభాకరే కోళ్ల పందేన్ని నిర్వహిస్తున్నారని పటాన్చెరు పోలీస్ డివిజనల్ అధికారి(డీఎస్పీ) భీమ్రెడ్డి తెలిపారు. చింతమనేనితో పాటు అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల శ్రీను నిర్వాహకులని చెప్పారు. సతీష్, బర్ల శ్రీనును అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులకు 22 మంది దొరకగా.. 25 వాహనాలు, 24 సెల్ఫోన్లు, రూ.13,12,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. 31 కోళ్లు, 31 చిన్న కత్తులు లభించాయి. పోలీసుల అదుపులో పందెం రాయుళ్లు -
ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం: అబ్బయ్యచౌదరి
దెందులూరు: పినకడిమి, ప్రత్తికోళ్లలంకలో హత్యలు చేయించింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. 18 నెలలు ప్రత్తికోళ్లలంకలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడానికి సూత్రధారి, పాత్రధారి ఎవరో కూడా అందరికీ తెలుసని చెప్పారు. పినకడిమిలో బలవంతంగా బంగారం లాక్కోవడం, దౌర్జన్యాలు ఇలా చెప్పుకొంటూపోతే తాను ప్రతీదీ చెప్పగలనని ఆయన తెలిపారు. గురువారం వైఎస్సార్సీపీ దెందులూరు మండల కన్వీనర్ కామిరెడ్డి నాని నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే సీఎంగా చంద్రబాబునాయుడు ఉండగానే చింతమనేనిపై రౌడీషీట్ తెరిచారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 84 కేసులు అన్ని పోలీస్స్టేషన్లలో నమోదయ్యాయని, 24 కేసులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు. చింతమనేని హయాం అంతా ప్రజలు, ఉద్యోగులు, పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, దూషణలు లాంటి ఘటనలే అధికమన్నారు. పూర్తి నేర చరిత్ర కలిగిన చింతమనేని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చదవండి: (Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్లో నారా లోకేష్కు ఝలక్) మూడేళ్ల పాటు ప్రశాంత వాతావరణంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రూ.470 కోట్ల మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టినట్టు చెప్పారు. సంక్షేమ పథకాలు కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందించామన్నారు. తాము మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తుంటే 10 రోజుల్లో నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ, గ్రామగ్రామానా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలకే నియోజకవర్గంలో ప్రశాంతతను భగ్నం చేసేందుకు చింతమనేని కుట్రకు తెరలేపారన్నారు. చంద్రబాబు స్క్రీన్ప్లే చేస్తుంటే.. పప్పు లోకేష్ ప్రోత్సహిస్తున్నాడని, చింతమనేని ఈ కుట్రలన్నీ అమలు చేస్తున్నాడని చెప్పారు. ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం... ఏ నియోజకవర్గంలోనూ, ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఆడకూతుళ్లను సైతం సోషల్ మీడియాలో ప్రచారసాధనాల్లో లాగి కించపరిచేలా పోస్టులు పెడితే ఇకపై తమ తడఖా చూపిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చింతమనేని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పక్క నియోజకవర్గం వెతుక్కుంటున్న చింతమనేని నాకు పోటీయా.. గత ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో తన చేతిలో ఓడిపోయి పోలీస్స్టేషన్లో కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపి, ఓటమి భయం పట్టుకుని మూడేళ్లుగా ఇంటికే పరిమితమై పక్క నియోజకవర్గాల్లో ఏదోకచోట కర్ఛీఫ్ వేద్దామని, ప్రతి నియోజకవర్గానికీ తిరుగుతున్న చింతమనేని నాకు పోటీయా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంపై ఏ గ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు తేరా ఆనంద్, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అపవిత్ర పొత్తు: సైకిల్ గుర్తు.. లేదంటే గ్లాస్ గుర్తు..!
సాక్షి, పశ్చిమగోదావరి: మరోసారి టీడీపీ - జనసేన లోపాయికారి ఒప్పందం బయటపడింది. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థులు విత్డ్రా అయిన చోట జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేపట్టారు. ఏలూరు కార్పొరేషన్లో టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రచారం చేస్తున్నాయి. జనసేన అభ్యర్థులను గెలిపించాలంటూ చింతమనేని ప్రచారం చేస్తున్నారు. ఏలూరు 25వ డివిజన్లో జనసేన అభ్యర్థి తరఫున చింతమనేని ప్రచారం చేపట్టారు. సైకిల్ గుర్తు లేకుంటే గ్యాస్ గుర్తుకు ఓటేయాలన్న చింతమనేని ప్రచారంపై విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, జిల్లాలోని నరసాపురం మునిసిపాలిటీలో టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తులు పెట్టుకున్నాయి. పలు వార్డుల్లో ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టాయి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు అపవిత్ర పొత్తుకు తెరలేపాయి. 2014లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019లో ఒంటరిపోరు చేసి చావుదెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం లోపాయికారీ పొత్తులకు తెరలేపింది. ఏకంగా రెండు జెండాలను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. చదవండి: చంద్రబాబు ఆ దమ్ముందా.. కొడాలి నాని సవాల్ ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు -
త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. జిల్లాల పర్యటనల్లో ఆయన తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అయిదేళ్లు మోసం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు రౌడీ షీటర్లను, మాఫియాను వెనకేసుకు వస్తున్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తప్పులు చేశారు కనుకే కేసులు పెడుతున్నారు. అయిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తనకు తాను కరకట్ట బాబా అనుకుంటున్నారేమో...?. ఇక చింతమనేని ప్రభాకర్పై 18 కేసులు ఉన్నాయి. ఆయనేమైనా దెందులూరు బాబానా?. చట్టం ముందు అందరూ సమానమే. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకు కనిపించడం లేదా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మతానికి ముడిపెట్టడం సరైనదా?. కేసులకు భయపడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజకీయ అవసరాల కోసం గతంలో సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది. త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు అవుతుంది. చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్, ఇక నారా లోకేష్ అప్డేట్ కాని లీడర్. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నిప్పు అయితే ఆయన తనపై ఉన్న స్టేలను వెనక్కి తీసుకోవాలి. స్టేలను వెనక్కి తీసుకుంటే చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు ఉండరు’ అని వ్యాఖ్యలు చేశారు. -
చింతమనేని ఆదర్శప్రాయుడా.. సిగ్గుపడాలి
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఆదర్శంగా తీసుకోవాలని తమ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్బోధించడంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. రౌడీషీట్తో పాటు 62 కేసులున్న చింతమనేనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అధినేత చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని, చింతమనేని బాధితులకు ఆవేదన ఎందుకు వినడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చింతమనేనిని ఆదర్శంగా తీసుకోండి.. టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో చింతమనేనిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ది దుర్మార్గ పాలన అని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. జగన్ టాక్సు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మాధ్యమం, ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. పవన్కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలు కొందరికే వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. తన దగ్గరకు వస్తే వర్షాకాలంలో సైతం ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పిస్తానన్నారు. రౌడీషీటర్ను ఆదర్శంగా తీసుకోవాలా? చంద్రబాబుపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం దెందులూరు: రౌడీషీట్తో పాటు 62 కేసులున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకు స్ఫూర్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతమనేనిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు అంటున్నారని.. ఆయనపై కేసులు టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసినవే అని చెప్పారు. ఇసుక, మట్టి కొల్లగొట్టిన డబ్బును చింతమనేని అప్పజెప్పటం వల్లే ఆయనకు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. చింతమనేని బాధితులనూ చంద్రబాబు కలుసుకుని ఆవేదన వినాలని సూచించారు. -
‘నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైంది’
సాక్షి, పెదపాడు/పెదవేగి: జైలు నుంచి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల్లో విజయం సాధించిన చందంగా ప్రెస్మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నా రు. పెదవేగి మండలంలోని జానంపేట ఇసుక డంపింగ్యార్డు వద్ద ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చింతమనేని న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాల వల్లించినట్లుందన్నారు. అతను మీడియా సోదరులను ఏవిధంగా గౌరవించారో తెలియదా? ఆనాడు మీడియా గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు. ‘దమ్ముంటే జగన్, పవన్ తనపై గెలవాలని చింతమనేని సవాల్ విసిరాడు.. నేను ఆనాడే చెప్పాను.. నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైందని.. చెప్పినట్లే ఓడించి అత్యధిక మెజార్టీతో గెలిచాను’ అని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. ఈవీఎంలలో మోసాలతో ఓడిపోయానని చింతమనేని చెప్పడం చూస్తుంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందన్నారు. ఆయన వెనుక ఎస్సీ సోదరులే ఉంటారని చెబుతున్న చింతమనేని కూచింపూడి గ్రామంలో ఎస్సీ సోదరులపై దాడి చేయలేదా? వారిపై కేసులు పెట్టించలేదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. 66 రోజులు జైలులో ఉన్నా చింతమనేనిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఆయన చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరా రు. ఆయనపై కేసులు పెట్టింది, రౌడీషీట్ ఓపెన్ చేయించింది టీడీపీలోనే కదా.. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం, దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు అని చింతమనేనికి సలహా ఇచ్చారు. తోక బ్యాచ్ను వేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దెందులూరుకు అభివృద్ధిలో ప్రత్యేక స్థానం తీసుకువస్తామని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. చేసిన మంచి పనులను అభినందించు చేతకాకపోతే ఏ ఫామ్హౌస్లోనో, ఇంట్లోనో ప్రశాంతంగా కూర్చో.. తోక జాడిస్తే కట్ చేస్తామని హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది జగనన్న మిత్రుడు, సైనికుడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన గేదెలు 500లో 600లో ఉన్నాయి కదా? అవి కాసుకుంటూ జీవనం సాగించు.. పుణ్యమైనా కాస్త దక్కుతుందన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించం కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ చింతమనేని తన స్థాయిని మరిచి సీఎం జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. టీడీపీ హయాంలో అనుకూలురైన పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో మంది మహిళలను చింతమనేని పోలీస్స్టేషన్లో పెట్టించలేదా? తహసీల్దార్ లీలాప్రసాద్ను సీఈఓ ముందు చెంప మీద కొట్టలేదా? మంత్రి వట్టి వసంతకుమార్పై దాడిచేయలేదా? అంటూ ప్రశ్నించారు. అక్రమాస్తులు లేవని సెంట్ కూడా ఆక్రమించలేదని చింతమనేని చెబుతున్నారని, 3.50 ఎకరాల ఉన్న చింతమనేని తండ్రికి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చా యని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా మంత్రదండం ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను రుజువు చేస్తామని చెప్పారు. -
చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు
సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా ద్వారా నారా లోకేష్కు ముడుపులు చెల్లించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం జానంపేట వద్ద ఇసుక స్టాక్ యార్డ్ను ఆదివారం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో కలిసి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించామన్నారు. గత పాలనలో ఇసుకను దోచుకొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్న పార్టీ దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇసుక దీక్ష చేసిందని దుయ్యబట్టారు. ప్రజలు మీరు చేసిన దొంగ దీక్షను గమనించి తిప్పికొట్టారని ఎద్దేవా చేశారు. చింతమనేని వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చింతమనేనిపై నమోదయిన కేసులు అన్నీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నమోదైన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వాటి దర్యాప్తు ఆధారంగానే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారే తప్ప కొత్తగా మేము ఏ కేసులు పెట్టలేదని తెలిపారు. చింతమనేని తన కేసులకు సంబంధించి అన్ని విషయాలు చంద్రబాబును అడిగితే బాగుంటుందని వెల్లడించారు. అలాగే మీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న వనజాక్షిపై దాడి జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెటిల్ చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో అడ్డగోలుగా ఇసుక రవాణా జరిగినా నోరు మెదపని పవన్ కల్యాణ్ వైజాగ్లో లాంగ్ మార్చ్ నిర్వహించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చంద్రబాబుతో కలిసి అడ్డుకోవద్దని ఆయన హితవు పలికారు. ఈ మేరకు భవిష్యత్తులో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చింతమనేనిని వదలని కోర్టు కేసులు
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కోర్టు కేసులు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయి .ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై ఏలూరు సబ్ జైలులో ఉన్న చింతమనేనిపై 2011లో కోడి పందాల కేసులో విజయవాడ స్పెషల్ కోర్టు పిటి వారెంట్ జారీ చేసింది. అందులో భాగంగా బుధవారం చింతమనేనిని ఏలూరు సబ్ జైలు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టులో హజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి గతంలో వాయిదాలకు హజరు కాకా పోవడంతో పీటీ వారెంట్ జారీ చేసిన విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ పిటీషన్ను రేపటికి వాయిదా వేసింది. చింతమనేనిపై 2011లో యానిమల్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. -
మూడోసారి చింతమనేని అరెస్ట్
ఏలూరు టౌన్: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడోసారి అరెస్టయ్యారు. జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్పై అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 11న న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ బుధవారంతో ముగియనుంది. దీంతోపాటు మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్పై పోలీసులు న్యాయస్థానం ముందు చింతమనేనిని హాజరుపరిచారు. దీంతో ఆయన కోర్టు ఆవరణలోనూ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఈ కేసుల్లో న్యాయమూర్తి.. చింతమనేనికి అక్టోబర్ 9వరకు, మరో కేసులో అక్టోబర్ 10వరకు రిమాండ్ విధించారు. -
ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్
సాక్షి, ఏలూరు: దళితులను దూషించి.. దౌర్జన్యం చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు న్యాయస్థానం ఈ నెల 25 వరకూ రిమాండ్ విధించింది. అంతకు ముందు ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అనంతరం చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్ విధించారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన నివాసానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి పది కేసులు నమోదు చేశారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. -
చింతమనేని ప్రభాకర్ అరెస్టు..
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండురోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, చింతమనేని ప్రభాకర్ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. -
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. గతంలో ఆయనపై నమోదైన కేసులను ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పరిశీలిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఇంకా పరారీలోనే టీడీపీ నేత చింతమనేని
-
చింతమనేని దాడి చేయలేదట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు తనపై ఉన్న కేసులు ఎత్తి వేయించుకున్న సంగతి తాజాగా వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ వనజాక్షిపై దాడి కేసు కూడా తప్పుడు కేసుగా తీసేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు కీలకమైన కేసులను తప్పుడు కేసులుగా చూపించి ఎత్తివేశారు. ఈ విషయాలన్నీ పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు చింతమనేని పరారీలో ఉండటంతో అతనిపై ఉన్న కేసులను పరిశీలిస్తున్న సమయంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారి ఈ కేసులను ఎత్తివేయించినట్లు సమాచారం. 2015 జూలై ఎనిమిదిన అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుక ర్యాంపు వద్ద తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. చింతమనేనినే వెనకేసుకు వచ్చారు. అయితే కనీసం ఫిర్యాదుదారునికి సమాచారం కూడా ఇవ్వకుండా కేసును తప్పుడు కేసు కింద చూపి ఈ ఏడాది ఫిబ్రవరి 15న తొలగించారు. డీఎస్పీ కేసును తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు కోర్టుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు బాధితునికి కూడా నోటీసులు పంపుతుంది. ఈ ప్రక్రియ చేయకుండా కేసులను ఎత్తివేశారు. ఎన్నికల ముందు పెదవేగి మండలం లక్ష్మీపురంలో అక్రమంగా మట్టి తోలడాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత మేడికొండ కృష్ణారావు కేసును, దళిత మహిళను దూషించిన కేసును, గుండుగొలను వద్ద ఏఎస్ఐపై దాడి చేసిన కేసును, ఏలూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యంగా ప్రవేశించి నిందితులను తీసుకువెళ్లిన కేసులను కూడా తప్పుడు కేసులుగా రిఫర్ చేశారు. ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్పై 49 కేసులు నమోదు కాగా, అందులో 23 కేసులు రిఫర్ చేసి తీసివేశారు. ఈ కేసులన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తొలగించడం విశేషం. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి: ఎస్పీ చింతమనేని అరాచకాలకు బలి అయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ కోరారు. శనివారం కూడా పలువురు బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాలలో తమ భూములను చింతమనేని, అతని అనుచరులు అక్రమించుకున్నారంటూ పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు చింతమనేని కేసులో సాక్షులు ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంపై ఎస్పీ స్పందించారు. చింతమనేనిపై ఫిర్యాదు చేసిన జోసఫ్ను విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతోందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చింతమనేనిపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, అన్ని ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పేర్కొన్నారు. -
ఎస్ఐ క్రాంతి ప్రియపై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాష్ట్రం దాటి బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. చింతమనేని కేసుల విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లో చింతమనేనికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసుల అధికారులు, సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో పెదవేగి మండలం భోగాపురంలో పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న చింతమనేని, అతని అనుచరులు అక్కడకు వచ్చి విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయటంతోపాటు, అర్థరాత్రి వరకూ నిర్బంధించారు. దీనిపై అప్పటి విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు ఆదేశాల మేరకు అధికారులు పెదవేగి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి పెదవేగి ఎస్సై క్రాంతిప్రియ నిర్లక్ష్యంగా కేసు నమోదు చేయకపోవటంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సై విధులను సక్రమంగా నిర్వర్తించలేదని నిర్థారణ కావటంతో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ఏ ఖాన్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చింతమనేనితో టచ్లో ఉన్న ఒక ఎస్సైపైనా వేటు పడే అవకాశాలున్నాయి. -
చింతమనేని ప్రభాకర్ అమాయకుడా?
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఇప్పటి వరకూ నమోదైన కేసులు 49. అందులో ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయి. అధికార బలంతో అప్పట్లో పలు కేసులను తప్పుడువని రిఫర్ చేయించుకుని ఆయన ఎత్తివేయించుకున్నాడు. ఆఖరికి పోలీసులపై దాడి చేసిన కేసులు కూడా తప్పుడు కేసులుగా అప్పటి పోలీసు అధికారులు ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా దాడులకు పాల్పడుతున్న చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయగానే అతనిపై అక్రమ కేసులు పెట్టారంటూ తెలుగుదేశం నేతలు కలెక్టర్ను కలిసి గగ్గోలు పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. 1995లో గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్పై దౌర్జన్యం చేయడం ద్వారా చింతమనేని నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. రౌడీ షీటు కూడా ఉంది 1995 నుంచి ఇప్పటి వరకూ 49 కేసులు చింతమనేనిపై నమోదు అయ్యాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఆయనపై రౌడీషీటు కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా ఇప్పటివరకూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు బాధితులు భయపడటంతో ఒక్క కేసు మినహాయిస్తే మిగిలిన వాటిలో శిక్షలు పడలేదు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై దాడి చేయడంతోపాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్కుమార్ గన్మేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 5 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేయగా విచారణ చేసిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా నమోదైన కేసులో కూడా పోలీసులే ఆయనకు ముందస్తుగా లీక్ ఇచ్చారని, పారిపోవాలని ఆయనకు సన్నిహితులైన పోలీసులు సంకేతాలు ఇచ్చారని నిర్ధారణైంది. ఒక ఎస్ఐ నిరంతరం ఆయనతో టచ్లో ఉన్నట్లు కాల్లిస్ట్ డేటాలో తేలింది. ఇతనిపైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితుల క్యూ చింతమనేని పరారు కావడంతో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తాము పెట్టిన కేసులను పోలీసులు చింతమనేనికి భయపడి ఫాల్స్ కేసులుగా రిఫర్ చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో వీటిపై పునర్విచారణ చేయనున్నట్లు ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డేలేకుండా..! తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం చింతమనేని ఆగడాలకు అడ్డం లేకుండా పోయింది. దళితులను ఉద్దేశించి మీకెందుకురా రాజకీయాలు అంటూ హేళనగా చింతమనేని మాట్లాడారు. అయితే దీనిపై పలువురు ఫిర్యాదు చేసినా అప్పట్లో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి కేసు నమోదు కాకుండా చూశారు. విజిలెన్స్ అధికారులను నిర్బంధించిన కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ఎస్సై కాంతిప్రియపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. గత ఏడాది హమాలీ కార్మికుడు రాచేటి జాన్పై చింతమనేని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించారు. దానిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి తీవ్ర జాప్యం చేశారు. కార్మికుల ఆందోళనతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినా అరెస్టు చేయలేదు. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. చింతమనేని ఇన్ని అకృత్యాలు చేసినా తెలుగుదేశం పార్టీ వారికి అమాయకుడిలానే ఆయన కనపడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడేమో అడ్డగోలుగా వ్యవహరించిన చింతమనేనిని అధిష్టానం ఏనాడు నియంత్రించలేదు. చింతమనేనిని లక్ష్యంగా చేసుకుని ఆయనపై ఆక్రమ కేసులు బనాయించారంటూ ఇప్పుడు జిల్లా తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చింతమనేని అరాచకాల చిట్టా కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయారు. అంగన్వాడీ కార్యకర్తలను దుర్భాషలాడారు పోలీస్ కానిస్టేబుల్ మధును చితక్కొట్టారు. అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపారు. కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే అంశంలో అప్పటి జిల్లా ఎస్పీపై నోరుపారేసుకున్నారు. 2017 మేలో గుండుగొలను జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడి చేశారు. దీంతో వారు దెందులూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ప్రభాకర్పై 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హనుమాన్జంక్షన్లో బస్ డ్రైవర్పై దాడి ఏలూరులో రాచేటి జాన్ అనే దళిత కార్మికునిపై దాడి పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు మేడికొండ కృష్ణారావుపై దాడి న్యాయం చేయాలని వెళ్లిన వికలాంగుడి కుటుంబంపై దాడి ఎన్నికల్లో ఓటమి తర్వాత జానంపేట వద్ద వేసిన పైపులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. తాజాగా గత నెల 29న దళితులను దూషించి దౌర్జన్యానికి దిగారు. ఆ కేసులోనే ఇప్పుడు పరారీలో ఉన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న చింతమనేని బాధితులు
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి గురైన బాధితులు చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తమపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్పై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చింతమనేనిపై ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న చింతమనేని ఆచూకి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా ఎస్పీ నవదీప్సింగ్ కేసును సీరియస్గా తీసుకోవడంతో చింతమనేనికి సహకరించిన కొందరు పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. -
పరారీలో చింతమనేని ప్రభాకర్!
-
ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేని తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు జిల్లా ఎస్పీ నవదీప్సింగ్కు వివరించారు. గతంలో తమ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు ఎస్పీకి తెలిపారు. ఆ కేసులపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితులపై ఫిర్యాదులపై నవదీప్సింగ్ మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని బాధితులు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. వారి ఫిర్యాదులపై చట్టప్రకారం రీ ఎంక్వయిరీ చేపడతామని అన్నారు. విచారణను వేగవంతం చేస్తామని వెల్లడించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చింతమనేనిపై 20 ఏళ్ల నుంచి 50 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిలో ఎక్కువగా పోలీసులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ కేసులే ఉన్నాయని వివరించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చింతమనేని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇదివరకే 50 కేసులు నమోదు అయిన వ్యక్తిపై ఎవరైనా తప్పుడు కేసులు పెడతారా అని ఎస్పీ ప్రశ్నించారు. -
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్!
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత ఆరు రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కేసు పెట్టిన యువకులకు బెదిరింపు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు పెట్టిన యువకుడికి బెదిరింపులు వస్తున్నాయి. చింతమనేనిపై కేసును విత్డ్రా చేసుకోవాలని, లేకుంటే నీ అంతుచూస్తామని జోసఫ్ను చింతమనేని ప్రభాకర్ అనుచరుల బెదిరించారు. చింతమనేనిపై జోసెఫ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జోసెఫ్ ఏలూరు డిఎస్పీకి తనకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. -
పరారీలోనే చింతమనేని?
-
పరారీలోనే చింతమనేని?
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యాన్ని నెలకొల్పి పదేళ్లుగా అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిన చింతమనేని ప్రభాకర్ పరారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దళిత యువతపై దాడికి యత్నించిన సంఘటనలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు కావడంతో శుక్రవారం పోలీసుల కళ్లు కప్పి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. ఐదుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. శనివారం చింతమనేని ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటి ముందు డీఎస్పీ ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు అతికించారు. గృహనిర్బంధంలో ఉన్న వ్యక్తి పోలీసుల ముందు నుంచే ఉడాయించడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. వంద మంది పోలీసులు ఇంటి ముందు ఉదయం నుంచి కాపలాకాసినా బయటకు రాని చింతమనేని పోలీసుల సంఖ్య తగ్గిన సమయం చూసుకుని వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసేందుకు వారెంట్ సిద్ధమవుతున్న తరుణంలో చింతమనేని ఇక్కడికే వెళ్లి వస్తానంటూ మెల్లగా జారుకున్నారు. ఇలా పరారీ కావడం వెనుక పోలీసుల సహకారం ఉన్నట్టు తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా చేతిలోని వ్యక్తిని వదిలేసిన పోలీసు అధికారులు తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసుకుంటూ లబోదిబోమంటూ చింతమనేని కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనను జిల్లా పోలీసు ఉన్నతాధికారి సీరియస్గా తీసుకోవటంతో కిందిస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకువెళుతున్న దళిత యువతపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడుతూ, దాడికి యత్నించారు. ఈ సంఘటనపై చింతమనేనితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేసేందుకు శుక్రవారం ఉదయం దుగ్గిరాల గ్రామంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఏలూరు నగరంలోని పోలీసు యంత్రాంగం భారీగా స్పెషల్ పోలీసులు చింతమనేని ఇంటి వద్ద మోహరించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తన ఇంటికి చేరుకోవడంతో చింతమనేని ప్రభాకర్ మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. విషయం తెలిసిన ఆయన అనుచురులు చింతమనేని ఇంటికి చేరుకుని హడావుడి చేశారు. బయటకు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో చింతమనేని రాకుండా తాత్సారం చేశారు. అయితే మధ్యాహ్నం తరువాత ఇంటినుంచి బయటకు వచ్చిన చింతమనేని మీడియాతో మాట్లాడి, ఇక్కడికే వెళ్లి వస్తా అంటూ పోలీసులకు చెప్పి చల్లగా జారుకున్నారు. అయితే ప్రభాకర్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు అతడు కారులో వెళ్లిపోతున్నా అలానే చూస్తూ ఉండిపోయారు. చింతమనేని ఇంటి గోడకు పోలీసులు అంటించిన నోటీసు పోలీసుల తీరుపై అనుమానం చింతమనేని ప్రభాకర్ కళ్ల ముందే దర్జాగా కారులో వెళ్లిపోయినా పోలీసులు కనీసం అతడిని అడ్డగించేందుకు కూడా ప్రయత్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనకు పరిచయం ఉన్న పోలీసుల సహకారంతోనే చింతమనేని పరారైనట్టు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటకు రెండు కారుల్లో వచ్చిన చింతమనేని ఏలూరు జాతీయ రహదారిపైకి వచ్చిన అనంతరం పోలీసుల కళ్లు కప్పేందుకు రెండు వైపులకు రెండు కార్లను పోనిచ్చి తికమక చేసి తప్పించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఎస్ఐలు సంఘటనా స్థలంలోనే ఉన్నట్టు సమాచారం. ఉదయం చింతమనేనిని అరెస్టు చేయాలని పో లీసుల ఆదేశాలు వచ్చిన్పటినుంచి ఇద్దరు, ముగ్గురు ఎస్ఐలు చింతమనేని ప్రభాకర్తో టచ్లో ఉన్నట్టు సమాచారం. పోలీసుల ప్రతి కదలికనూ వారే చేరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో ఆయన నియోజకవర్గంలో పని చేసిన అధికారులే ఈ పనిచేశారని నిఘా విభా గాలు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్టు సమాచారం. జిల్లా ఎస్పీ కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసే సమయంలో తగిన వ్యూహం లేకపోవడమే అతను తప్పించుకుపోవడానికి కారణంగా భావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ తెలంగాణలో తలదాచుకుని ఉండచ్చని అనుమానిస్తున్నారు. -
పరారీలో మాజీ విప్ చింతమనేని ప్రభాకర్
-
పరారీలో చింతమనేని ప్రభాకర్
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. (చదవండి : దళిత యువకులపై దాడికి యత్నం) -
చింతమనేనిని ఓడించినా బుద్ధి రాలేదు
-
దళిత యువకులపై చింతమనేని దాడి
-
మరోసారి రెచ్చిపోయిన చింతమనేని
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజలు ఛీ కొట్టినా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి బుద్ధి రాలేదు. మాజీగా మారినా తన రౌడీయిజాన్ని మానుకోవడం లేదు. గతంలో మాదిరిగానే మరో సారి చింతమనేని దళితులపై దాడి చేశాడు. పిన్నకడిమిలో దళితులకు చెందిన ప్రభుత్వ భూముల్లో చింతమనేని గత ఐదు సంవత్సరాలుగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కొందరు దళిత యువకులు ఇంటి నిర్మాణం కోసం ఎడ్ల బండి ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వారిపై దాడికి దిగాడు. తన అనుచరులు తప్ప వేరే వారు ఎవరూ ఇసుక తరలించడానికి వీలులేదన్నాడు. అంతటితో ఊరుకోక దళిత యువకులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చింతమనేనికి దళితులపై దాడులు కొత్తకాదని తెలిపారు. పిన్నకడిమిలో దళిత యువకులను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించిన చింతమనేనిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. చంద్రబాబు రాజ్యంలో దళితులపై దాడులకు పాల్పడినప్పటికి చింతమనేనిపై చర్యలు శూన్యమన్నారు. కానీ జగనన్న రాజ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దళితులు వైఎస్సార్ పార్టీకి వెన్నెముక అన్నారు. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించమని హెచ్చరించారు. -
చింతమనేని అక్రమాలు బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై విమర్శల వర్షం కురిపించారు. పశుసంవర్ధక శాఖ లబ్దిదారుల జాబితాలో చింతమనేని అవకతవకలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మొన్న పైపుల దొంగతనం కేసులో నిందితునిగా ఉన్న చింతమనేని నేడు గొర్రెల ఎక్స్గ్రేషియాను స్వాహా చేశారని అన్నారు. చింతమనేని ఆయన భార్య, తండ్రి పేర్లమీద అక్రమంగా లబ్ది పొందారని ఆరోపించారు. గొర్రెల నష్టపరిహారం అక్రమంగా కాజేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని ) డీడీఆర్సీ మీటింగ్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చింతమనేని అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్దిదారులకి గేదెలు అందలేదని, బినామీ పేర్లతో చింతమనేని తీసుకున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా... పోలవరం భూసేకరణలో జరిగిన అక్రమాలను ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, వీఆర్ ఎలీజా సభ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం భూసేకరణలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరపాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కలెక్టర్ను ఆదేశించారు.’’’’’’’’’’’’’’’’ -
చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
-
చింతమనేనిపై కేసు నమోదు
పెదవేగి రూరల్: పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పైపులను ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. పెదవేగి మండలంలోని గ్రామాలతోపాటు దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లోని గ్రామాల్లో సాగుకు ఈ పైపుల ద్వారా నీరందిస్తున్నారు. ఈ పైపులను అప్పట్లో ఆనాటి ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన రైతులు వేయించారు. నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున రైతుల నుంచి చింతమనేని వసూలు చేస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి పైపులను చింతమనేని అనుచరులు తరలించుకుపోయారు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారంతా రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఏటా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున తాము చెల్లించామని, ఈ లెక్కన పైపుల ధర కంటే ఎక్కువే ఇచ్చామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పైపులను తీసుకెళ్లిపోవడం దారుణమని, ఎన్నికల్లో ఓడిపోవడంతో చింతమనేని ఇలాంటి దారుణమైన చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. పైపులు తీసుకెళ్లిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు డిమాండ్ చేశారు. పోలీసులకు ఘటన గురించి వివరించారు. దీంతో కేసిన సత్యనారాయణ అనే రైతు అందించిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు చింతమనేని ప్రభాకర్తోపాటు మరో ఐదుగురు దిరుసు సత్యనారాయణ, చిలకలపూడి నరేంద్ర, కమ్మ పకిరియ్య, గద్దే కిషోర్పై కేసు నమోదు చేశారు. చింతమనేనిని ఏ1గా చూపించారు. 420, 384, 431, రెడ్విత్ 34 ఐపీసీ, పీడీపీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని
పెదవేగి రూరల్, పెదపాడు: మొన్నటి వరకు అధికారదర్పంతో దౌర్జన్యాలకు తెగబడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా ఎన్నికల్లో తనను ఓడించిన ఓటర్లపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వపై రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులను చింతమనేని ప్రభాకర్ మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు పెదపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పైపులను తన సొంత ఖర్చులతో వేయించానని కొద్దిరోజుల క్రితమే చింతమనేని పట్టుకుపోయే ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. సోమవారం రాత్రి తన అనుచరులతో వచ్చి వాటిని తీసుకుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం రైతుల పొలాలకు నీరందించేందుకు పెదవేగి మండలం జానంపేట అక్విడెట్కు సమీపంలో పోలవరం కుడికాలువ ఎడమ గట్టు వద్ద పైపులను ఏర్పాటు చేశారు. సుమారు 260 పైపులు ఏర్పాటు చేసి వాటి నుంచి నీటిని దిగువన ఉన్న పొలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. దీని కోసం స్థానిక రైతులు ఎకరానికి వెయ్యి నుంచి రూ.1500ల వరకూ చందాలు వేసుకుని ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో తనను ఓడించారన్న కక్షతో ఈ పైపులను అనుచరులతో తొలగించి తన తోటల్లో వేయించుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరిస్థితిని సమీక్షించారు. చింతమనేనిని అరెస్టు చేసి పైపులు రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. -
చింతమనేనికి చుక్కెదురు..
సాక్షి, ఏలూరు (టూటౌన్) : అసెంబ్లీ ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ సుడిగాలికి ప్రభుత్వ విప్ చింతమేని ప్రభాకర్ కొట్టుకుపోయారు. ఇంతకాలం ఒక నియంతలా తనకు ఎదురులేదని విర్రవీగిన చింతమనేనికి నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుథంతో గట్టిగా బుద్ధి చెప్పారు. రాజకీయాలకు కొత్త అయిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని ఆదరించారు. రాజకీయాలకు కొత్త అయినా విద్యావంతుడు కావడం, ఆయన మాట తీరు, వ్యవహార శైలి నచ్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పట్ల ప్రజలు చూపిన ఆదరణ వెరసి ఈ ఎన్నికల్లో విప్ చింతమనేని ప్రభాకర్కు తగిన గుణపాఠం చెప్పాయంటూ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తిట్ల దండకం అందుకోవడం, చేయి చేసుకోవడం, అధికారులను వేధింపులకు గురిచేయడం వంటి అనేక కారణాలతో చింతమనేనిని ప్రజలు వ్యతిరేకించారు. గత పదేళ్లుగా చింతమనేని వ్యవహార శైలితో విసుగు చెందిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గంలోని ఓట్లను 18 రౌండ్లలో లెక్కించగా 9, 18వ రౌండ్లలో మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టమైన మెజార్టీ సాధించారు. 9వ రౌండులో టీడీపీకి 5,834, వైసీపీకి 4,779 ఓట్లు రావడంతో ఈ రౌండులో టీడీపీ 1,055 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండు అయిన 18వ రౌండ్లో టీడీపీ 2,140 ఓట్లు సాధించగా వైసీపీ 1,928 ఓట్లు సాధించింది. దీంతో ఆఖరి రౌండులో టీడీపీకి 212 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఈ రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్ల వరకూ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరకు మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ౖవైసీపీ అభ్యర్థి కొఠారు అబ్యయ్య చౌదరి 17,559 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో దెందులూరులో చింతమనేని అడ్డాలో కొఠారు అబ్బయ్య చౌదరి పాగా వేశారు. -
‘జనాలు చింతమనేని పాలనపై విసిగిపోయారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై రికార్డు విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరిని అభినందించేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. తన గెలపుకు కారణమైన దెందులూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని పదేళ్ల పాలనపై విసుగెత్తి పోయిన దెందులూరు ప్రజలు ఓటు రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు. దెందులూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. -
చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని
సాక్షి, ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టిన నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనికి తగిన బుద్ధి చెప్పారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన చింతమనేని ప్రభాకర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి బరిలోకి చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు కౌంటింగ్కు ముందే స్పష్టమైంది. -
తొడ కొట్టిన చింతమనేనికి షాక్ తప్పదా?
సాక్షి, దెందులూరు: తన గెలుపు నల్లేరుపై నడక అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికిన చింతమనేనికి ఓటమి భయం పట్టుకుందా? దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగలబోతుందా? హాట్రిక్ సాధించాలని కలలు కన్న ఆయన ఓటమిని ఎదుర్కోబోతున్నారా? వైఎస్సార్సీపీ నుంచి గట్టి పోటీ ఉండటంతో చింతమనేనికి ఇంక చింతే మిగలనుందా? పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనం.. రాష్ట్రంలోని దెందులూరు నియోజకవర్గ ఎన్నికలపై అందరి చూపు ఉంది. ఇక్కడ నుంచి బరిలోకి దిగిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. దీంతో ఇపుడు దెందులూరు ఎన్నికలలో చింతమనేని గెలుస్తారా లేదా ...హాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎంపిపిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు తెలుస్తోంది. తనకి చాలా గట్టిపోటీ ఎదురైందని...గెలుపుపై చింతమనేనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చింతమనేని సామాజిక వర్గానికే చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉండటం.. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండటం ఈ ఎన్నికల్లో ప్లస్ పాయింట్గా మారింది. కొఠారు అబ్బయ్య చౌదరి ఈ ప్రాంత వాసులకు కొత్త కాకపోయినా రాజకీయాలకు కొత్త. 2017 వరకు లండన్లో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్న కొఠారు అబ్బయ్య చౌదరికి రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. నేరుగా తండ్రి రాజకీయ వారసత్వంతోపాటు స్వదేశంలో సొంతగడ్డపై ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షకు తోడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్గా నియమితులైన కొఠారు అబ్బయ్య చౌదరి చింతమనేని అక్రమాలపై గట్టిగానే పోరాటం చేశారు. రెండేళ్లుగా గడప గడపకు వైఎస్సార్, రావాలి జగన్ కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో అబ్బయ్య చౌదరి ప్రజలలో మమేకమయ్యారు. ఇదే సమయంలో సొంత సామాజిక వర్గం నుంచి కూడా చింతమనేని కంటే కొఠారుకే ఎక్కువ మద్దతు లభించిందని తెలుస్తోంది. చింతమనేని తీరుతో విసిగెత్తిపోయిన దెందులూరు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మార్పు కోరుతూ చింతమనేనికి చెక్ పెట్టారనే ప్రచారం సాగుతోంది. -
చింతమనేని ‘గప్చుప్’
ఏలూరు టౌన్ : సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. ఆరు వారాల (42 రోజుల) నిరీక్షణ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇవన్నీ ఇకవైపు ఉంటే పోలింగ్ రోజు రాజకీయపార్టీలు విజయానికి వూహ్యాలు రచిస్తూ వాటిని అమలు చేసేందుకు కష్టపడ్డాయి. జిల్లాలోనే వివాదాలకు పెట్టింది పేరైన దెందులూరు నియోజకవర్గంలో గొడవలు, దాడులు, అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండానే సాఫీగా సాగిపోగా.. అనూహ్యరీతిలో ఏలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాలపై దాడులకు తెగబడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోవటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే ఇద్దరు టీడీపీ నేతలు ఇలా వ్యవహరించారా? ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇలా తమ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించారా? అనే అంశాలపై ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోల్ మేనేజ్మెంట్లో దిట్టలుగా చెప్పుకునే టీడీపీ నేతలు ఇలా మారిపోవటం వెనుక అసలు కథ ఏంటనే అంశాలు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుపై టీడీపీ కేడర్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బడేటి ‘బరితెగింపు’ పోలింగ్ రోజు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారశైలి వివాదాస్పదంగా మా రింది. గురువారం ఉదయం 7.30 గంటల నుంచే ఆయా పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణలు, దాడులు, గొడవలు సృష్టిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఎ మ్మెల్యే బడేటి బుజ్జి తన వ్యవహారశైలికి భిన్నంగా ఎన్నికల్లో గొడవలు పెట్టుకోవటం చర్చనీయాం శంగా మారింది. ఏలూరులోని పలు పోలింగ్ బూత్ల వద్ద తన అనుచరులతో కలిసి దాడులకు తెగబడటం వెనుక కారణాలేమై ఉంటాయోనం టూ పలువురు చర్చిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రశాంతంగా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. ప్రతి స్థానిక నాయకుడినీ కలుస్తూ వారి మద్దతు కూడగడుతూ విజయం సాధించే దిశగా అడుగులు వేసిన బడేటి.. ఇప్పుడు భిన్నంగా వ్య వహరించటాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనా యుడు పోటీలో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీ నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బడేటి దుందుడుకు చర్యలకు పాల్పడటంపై కేడర్లోనే భిన్నస్వరాలు విని పిస్తున్నాయి. బడేటి దాడుల కారణంగా సొంత పార్టీలోని దళిత వర్గాలు, ఆర్యవైశ్యులు, ఇలా పలు సామాజికవర్గాల ఓట్లు గణనీయంగా చీలి పోయాయనీ, గెలిచే స్థితిలో నుంచి ఆత్మరక్షణలో పడ్దామంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యా ఖ్యానిస్తున్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా.. గత ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడు, ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ వంటి వారు కొండంత అండగా ఉంటూ నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులను సమన్వయం చేస్తూ టీడీపీ విజయానికి బాటలు వేసిన నేతలు ఇప్పు డు బడేటికి దూరం కావటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, పలువురు టీడీపీ స్థానిక నేతలు సైతం తనకు వ్యతిరేకంగా చాపకిందనీరులా పనిచేయటం, పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా చేతి వాటాన్ని ప్రదర్శించటం ఎమ్మెల్యే బడేటికి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. తనకు అడ్డువస్తే సహించలేని బడేటి ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నేతలే టార్గెట్గా దాడులు చేశారనే అభిప్రాయమూ ఉంది. ఓటమి భయంతోనే.. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుందని ఆరోపణలు చేసే టీడీపీ నేతలు.. బడేటి బుజ్జి చేసిన దౌర్జన్యాలు, దాడులు, రౌడీయిజాన్ని ఏమంటారంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేళ్లుగా ఏలూరు నియోజకవర్గంలో బడేటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, మరోసారి తన నిజస్వరూపాన్ని పోలింగ్రోజు బయటపెట్టుకున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఓట్లు వేసేందుకు వెళ్లకుండా భయపెట్టడానికే ఇలా బడేటి బుజ్జి దాడులకు పాల్పడ్డారని, అయినా వైఎస్సార్ సీపీ నేతలు, కేడర్ వారి వ్యూహానికి కళ్లెం వేస్తూ ఎదురుదాడులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తపడ్డామని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు గొడవలు చేస్తూ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుటిల యత్నాలు చేశారని అయినా అవేమి ఫలించలేదంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల నాని గెలుస్తారనే విశ్వాసం ఉందని.. బడేటి దాడులు, దౌర్జన్యాలతో తమ మెజారిటీని భారీగా పెంచేశారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొడవలు వద్దంటూ హితవు ఏలూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి శనివారపుపేటలో దాడులు చేసిన సందర్భంలో అక్కడికి చింతమనేనిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా చింతమనేని తాను రానంటూ చెప్పటం, పట్టుబట్టి బడేటి అక్కడికి తీసుకువెళ్లినా.. తన శైలికి భిన్నంగా హడావుడి చేయకుండానే చింతమనేని వెనుదిరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. టీడీపీ కేడర్కు సైతం ఏమీ గొడవలు పెట్టుకోవద్దనీ.. ప్రజలు తమపై వ్యతిరేకతతో ఉన్నారంటూ స్వయంగా చింతమనేని హితబోధలు చేయటం గమనార్హం. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే ఇలా నటిస్తున్నారనీ.. అధికారం వస్తే రెచ్చిపోవటం ఆయనకు కొత్తేమీ కాదనే అభిప్రాయం ని యోజకవర్గ ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. మొత్తానికి చింతమనేనిలో మార్పు ఓట్లు కోస మో.. భయమో.. ఆందోళనో.. ఏదైనా కానీ.. చింతమనేని గమ్ముగా ఉంటూ ప్రజల ముందు సైలెంట్గా ఉన్నా ప్రజలెవరూ విశ్వసించలేదనేది బహిరంగ రహస్యం. చింతమనేని ‘గప్చుప్’ ఆంతర్యమేంటీ చింతమనేని.. ఈ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. గొడవలు, దౌర్జన్యాలు, దాడులు, వివాదాలే. పోలీసు అధికారులు, రెవెన్యూ, దళితులు, సామాన్యులు, వికలాంగులు, రాజకీయ నేతలు ఇలా ఒక్కరేమిటీ అన్నివర్గాల వారూ చింతమనేని చేతుల్లో దాడికి గురైనవారే. దెందులూరు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోవటం, కొట్టటం, తీవ్ర పదజాలంతో దూషణలకు దిగటం పరిపాటిగా మారింది. అయితే ఆయనకు ఏమయ్యిందో ఏమో గానీ తన స్వభావానికి భిన్నంగా మారిపోయారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే రెండో కాలిపై.. అంతెత్తునలేస్తూ గొడవలు చేసే చింతమనేని.. ఓడిపోతాననే ‘చింత’తో సతమతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజు సైతం చింతమనేని నియోజకవర్గంలో నోరెత్తిన పాపానపోలేదంటున్నారు. ఆఖరికి తమకు అనుకూలంగా ఉండే ఒక వర్గంపై దాడి జరిగిందని తెలిసినా ఏమాత్రం రెచ్చిపోకుండా తన వ్యవహారశైలికి భిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. చింతమనేనిపై 2010 నుంచి దెందులూరు, పెదవేగి, పెదపాడు, హనుమాన్జంక్షన్, ఏలూరు, గన్నవరం, భీమడోలు తదితర ప్రాంతాల్లో ఏకంగా 26 కేసులు ఉండగా, ఒక కేసుల్లో రెండేళ్ల జైలు కూడా పడింది. ఇలా వివాదాలకు ఆద్యుడుగా పేరొందిన చింతమనేని ఈనెల 11న పోలింగ్ రోజు గప్చుప్గా మారిపోవటం, హల్చల్ చేయకుండా బుద్ధిమంతుడిలా వ్యవహరించటంపై చర్చసాగుతోంది. పతనానికి పలు కారణాలు నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గం సైతం ఎన్నికల్లో మద్దతుకు ససేమిరా అంటూ తెగేసి చెప్పేయటం, ప్రధానంగా పట్టున్న గ్రామాల్లో కూడా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా మద్దతు తెలపటం చింతమనేనికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని పోటీ చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు చివరి దశలో పోటీకి వచ్చారు. అప్పటివరకూ సొంత సామాజికవర్గంలోని అసంతృప్తి ఉన్నా.. ఎన్నికల నాటికి తమవాడే కదా అనే ధోరణిలో చింతమనేని వైపే మొగ్గుచూపారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవటం, సొంత సామాజికవర్గంలోని స్థానిక నేతలు, ఆయా గ్రామాల్లో బాగా పట్టున్న నాయకులు, దళితులు, బీసీలు వైఎస్సార్ సీపీకి జై కొట్టటం చింతమనేని వ్యవహారశైలిలో మార్పులు తెచ్చాయి. కొప్పాక సొసైటీ అధ్యక్షుడు చల్లగొళ్ల వెంకటేశ్వరరావు (భూస్వామి), పర్వతనేని జగన్మోహనరావు, మోరు రామరాజు, పోకల రాంబాబు, దోసపాడు టీడీపీ ఎంపీటీసీ ఎస్.సుధాకర్, దెందులూరు మండల కాపు సంఘం అధ్యక్షులు కొండేటి గంగాధరబాబు వంటి నేతలు చింతమనేనితో విసిగిపోయి మరీ కొఠారు పక్షాన నిలవటం చింతమనేనికి ఓటమి కళ్లముందే కనిపించింది. చింతమనేని పేరు చెబితేనే బయటకు రావటానికి సాహసం చేయని నియోజకవర్గ ప్రజలు దెందులూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి నామినేషన్కు వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావడం, పలు సందర్భంగా యువత, ప్రజలు పెద్దెత్తున ఆయన వెంట కదలిరావడం చింతమనేని పతనానికి నిదర్శనాలుగా మారాయి. -
మీ అంతు చూస్తా.. జైల్లో పెట్టిస్తా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలంలో ప్రభుత్వ ఉద్యోగులపై చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నా కొడకల్లారా మీ అంతు చూస్తా..తేడా వచ్చిందో కేసుల్లో ఇరికించి జైలులో పెట్టిస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు జనాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఓ మహిళ చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన అధికారులను బండ బూతులు తిట్టారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చింతమనేనిపై ఏకంగా 26 కేసులు ఇప్పటికీ నడుస్తుండగా, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్పై దౌర్జన్యం చేసిన కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష కూడా విధించింది. ఆయనపై ఏలూరు పట్టణ 3వ టౌన్ పీఎస్లో నేటికీ రౌడీషీటు ఉంది. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రజాప్రతినిధిగా కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలున్నాయి. కృష్జాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం, ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీశాఖ అధికారిపై దాడి, ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు, ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్పై దాడిచేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలను దుర్బాషలాడటం, పోలీస్ కానిస్టేబుల్ మధును చితక్కొట్టడం, అటవీశాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపడం, ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్లే అంశంలో జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం, గుండుగొలను జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీవోలపై దాడి, ఇళ్ల స్థలాలు, పొలాలు గొడవల పేరుతో దాడులు చేయడం పరిపాటిగా మారింది. సీఎం అండతోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అండతోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, తదితరులపై సెక్షన్ 341, 323, 506 కింద అక్రమ కేసులు బనాయించారు. అలాగే ఇసుక అక్రమంగా తరలింపును అడ్డుకున్న కృష్జాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి పక్కకిలాగి పడేశాడు. ఉద్యోగ సంఘాలు సైతం వనజాక్షికి మద్దతు తెలపడంతో ఏకంగా చంద్రబాబు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. హమాలీ కూలీల ముఠా నాయకుడు రాచీటి జాన్పైనా దాడి చేశాడు. పెదవేగి మాజీ సర్పంచిని ఎంఎల్ఎ నివాసంలో గన్మెన్లు చేతులు వెనక్కి విరగదీసి పట్టుకోగా ఎమ్మెల్యే ప్రభాకర్ బూటుకాలుతో పొట్టలో, తలపై తన్నడంతో కృష్ణారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల అక్రమ మైనింగ్ను అడ్డుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులను బెదిరించడం చర్చనీయాంశమయ్యింది. -
నూజీవీడులో అవినీతి ముద్దర
సాక్షి, కృష్ణా : అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే ఈయన, అనుచరులు రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా ఏమిటో అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ఏమీ లేకపోగా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. చింతమనేని హవా.. ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే ట్రాక్టర్లను సీజ్చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట, బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్కు లోడింగ్ ఖర్చు కింద క్యూబిక్ మీటర్కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం. చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు. పోలవరం మట్టి మాఫియా పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,హనుమాన్జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే 8.30లక్షల క్యూబిక్మీటర్ల మట్టి రాగా అందులో దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నారు. ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు. పనుల్లో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్లో పనిచేసే పంచాయతీరాజ్ డీఈని నూజివీడు డివిజన్కు ఇన్చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. -
తొక్కతీస్తా...ఈడ్చి పారేస్తా..బడేటి బుజ్జి వీరంగం
సాక్షి, ఏలూరు : దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిందులు తొక్కారు. తమ సమస్యలపై నిలదీసిన వారిపై నోరు పారేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోణంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోణంగి వెళ్లిన బడేటి బుజ్జిని... అయిదేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై హరిజనపేటకు చెందిన కొందరు యువకులు నిలదీశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ఇళ్లు ఇస్తామని టీడీపీలో చేర్చుకుని... మోసం చేశారని యువకులు ప్రశ్నలు సంధించారు. దళిత యువకులు తనను ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే బుజ్జి...’ నా సంగతి మీకు తెలియదు...తొక్క తీస్తా.. ఈడ్చి అవతల పారేస్తా’ అంటూ బెదిరించారు. కాగా చంద్రబాబు నాయుడు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానం జరుగుతోంది. ఎన్నికల సమయంలోనూ దళితులపై టీడీపీ అభ్యర్థులు నోరుపారేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం దళితులు రాజకీయాలకు పనికిరారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇటీవలే ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలో దళితులపై దాడి జరిగింది. టీడీపీ నేతల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ వద్ద చింతమనేని మాజీ గన్మెన్ హల్చల్
-
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
-
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో రౌడీయిజం ప్రదర్శించడం ఆయనకు అలవాటు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే ఆయన ఎందుకు అలా కూర్చున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. మళ్లీ చింతమనేని ఎం ఘనకార్యం చేశారంటే.. శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కావడంతో చింతమనేని రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారు వట్లూరు సీఆర్ రెడ్డి కళాశాలలో దెందులూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి తన అనుచరులతో కలిసి చేరుకున్న చింతమనేని ప్రలోభాలకు తెరతీశారు. టీడీపీ నేతల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో చింతమనేని తన రౌడీయిజం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలపై పలువురు టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ శ్రీధర్పై చింతమనేని దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరి దాడికి పాల్పడ్డారు. అయితే చింతమనేని చర్యలతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసకున్న వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతున్నప్పుడే చింతమనేని ఈ రకంగా వ్యవహరిస్తే.. ఇంకా ఏప్రిల్ 11వ తేదీన పరిస్థితి ఎంటని ప్రజలు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
చింతమనేని గన్మెన్ హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్మెన్లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్మాన్ లక్ష్మణ్ హల్చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్ష్మణ్పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. లక్ష్మణ్ దెందులూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికి.. చింతమనేని సేవలోనే తరిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కార్యక్రమల్లో పార్టీ కార్యకర్తగా సేవలు కూడా అందిస్తున్నారు. చింతమనేని అండదండలుండటంతో ఉద్యోగానికి హాజరు కానప్పటికి చర్యలు శూన్యం. ఈ క్రమంలో కానిస్టేబుల్గా ఉంటూ అధికారులను సైతం పేరు పెట్టి పిలుస్తూ.. వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే లక్ష్మణ్ ఎన్ని వేషాలేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
నాపైనే దాడి జరిగితే సామాన్యులకేది రక్షణ..?
స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనా బాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది?మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై వెలుగు చూడని అకృత్యాలెన్నో.. మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో మన రాష్ట్రం టాప్లో ఉందని పలు నివేదికల్లో వెల్లడైంది.. ఇసుక దోపిడిని అడ్డుకునేందుకు వచ్చినతహశీల్దార్పై దాడి... ఈ రాష్ట్ర రైతన్నలపై..ఈ రాష్ట్ర పంటలపై.. ఈ రాష్ట్ర జలవనరులపై..ఈ రాష్ట్ర పర్యావరణంపై.. ఈ రాష్ట్ర భావితరాలపైదాడి! ఇసుక దోపిడీతో రాష్ట్రంలోని కొందరులక్షలు, కోట్లు కొల్లగొట్టుకుంటూరాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.భావితరాలకు తప్పనిసరైననీటి వనరులు ఎండిపోతే.. పంటలుపండకపోతే.. పర్యావరణ సమతుల్యతదెబ్బతింటే.. 70 శాతం వ్యవసాయంపైఆధారపడి జీవిస్తున్న రైతన్నలు ఏం కావాలి?కరవు కాటకాలతో ఏటేటా అల్లాడుతున్నఆంధ్రప్రదేశ్ ఏమవ్వాలి..? అనేది పాలకులు,ఇసుక దోపిడీదారులు ఒక్క క్షణమైనాఆలోచిస్తున్నారా? అన్నదే ఈనాటి సూటి ప్రశ్న . ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే.. వారినిసరిదిద్దలేని ముఖ్యులు అయిదుకోట్ల మంది రక్షణ బాధ్యతకుఏం భరోసా ఇవ్వగలరు?ఈ కోణంలో ప్రజలుఆలోచించరని అనుకుంటేఎలా? తప్పులు చేసిన వారిపైనచర్యలు తీసుకుంటే..మరొకరు అలా దురుసుగా,బాధ్యతారహితంగాప్రవర్తించగలరా? నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి:ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ రోజు ఫోన్ వచ్చింది. విజయవాడలో కలెక్టరుగారి మీటింగ్లో ఉన్నా. అడ్డుకుని పోలీస్ స్టేషన్కు అప్పగించాలని ఆర్ఐ, వీఆర్వోకు సూచించా. వారిపై దాడి జరిగిందని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకెళ్లగానే.. మీరు వెళ్లి ఆపేయండన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తీసుకెళ్లొద్దని, హద్దుల తేడాలుంటే.. సర్వేయర్ల ద్వారా నిర్ధారించుకున్న తరువాత నిర్ణయానికి వద్దామని కోరా. వాదనలు జరుగుతున్నప్పుడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్వాక్రా మహిళలతో సహా మందీ మార్బలంతో వచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇసుకతో నింపిన ట్రాక్టర్లు కదిలాయి. అక్కడే వాటికి అడ్డంగా కూర్చోవడంతో పరుష పదజాలంతో దాన్ని ఈడ్చిపారేయండిరా అంటూ.. మహిళలను ఎమ్మెల్యే గారు ఉసిగొల్పారు. అన్నింటికన్నా అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే.. ఆ రోజంతా అక్కడ ఎస్ఐ ఉన్నారు. ప్రేక్షకపాత్ర పోషించారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు కొత్తేమీ కాదు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు ఆ రోజు కొత్తేమీ కాదు. అర్ధరాత్రి వేళల్లో కూడా పదులసార్లు వెళ్లి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను స్టేషన్కు చేర్చి రెండన్నర లక్షల రూపాయలు ఫైన్ వేసి రాబట్టా. ఇసుక విషయంలో అంత గట్టిగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో 11 గ్రామాలు డార్క్ ఏరియాలోకి చేరాయి. 800 నుంచి 1000 అడుగులు లోతు బోర్లు వేస్తేగాని భూగర్భ జలాలు అందని పరిస్థితి. తమ్మిలేరు హద్దుగా మండలం ఉందనేగాని నీటి జాడ తక్కువ. నీళ్లు లేక నష్టపోయామనే రైతుల కన్నీటి ఆవేదన దాదాపు ప్రతిరోజూ వినాల్సి వచ్చేది. తమ్మిలేరుతో సహా పరిసరాల్లోని జలవనరుల్లో నీటి చెమ్మ కనిపించేది కాదు. ఇసుక ఇంకా ఇంకా తోడేస్తుంటే.. చివరకు తాగడానికి కూడా ఆ ప్రాంత ప్రజలకు నీళ్లుండవని గ్రహించా. సాధ్యమైనంత వరకు ఇసుక రవాణాను నియంత్రించాలనేది నా ఆలోచన. మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో రాష్ట్రం టాప్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి గురించి నేను చెప్పేది, చెప్పాల్సింది ఏముంది?ఒక రిషితేశ్వరి, ఒక వనజాక్షి... కాల్మనీ కేసులు... ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. 2018 మార్చి2వ తేదీ ఐక్యరాజ్య సమితి కమిటీ విడుదల చేసిన నివేదికప్రకారం–మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం–మహిళలపై నేరాలకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం టాప్లో ఉందని చూశాను. ఇతర నివేదికలు ఇంతకన్నా ఎక్కువ గణాంకాలతోనే వివరిస్తున్నాయి. నా సంగతి అలా ఉంచండి. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహారశైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అధికారిని విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు బెదిరిస్తే, గన్మెన్పై చేయిచేసుకుంటే.. పరిస్థితి ఏంటో మీడియాలో చూశాం. ఇక మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై ఎన్నెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో.. వాటిలో అసలు ఎన్ని వెలుగుచూస్తున్నాయి? బాధితుల పట్ల బాధ్యత తీసుకుని వాటిని వెలుగులోకి తీసుకొచ్చి న్యాయం జరిగేంత వరకు కృషి చేయాల్సిన మీడియా.. ఎంతవరకు ఆ పని చేస్తుందనేది వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి సరిపోతోంది. నాలుగున్నరేళ్లలో 5 బదిలీలు గడచిన నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు అయ్యాయి.ముసునూరు తహశీల్దారుగా 2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు పనిచేశా. ఈ సమయంలోనే తమ్మిలేరు వద్ద ఇసుక రగడ జరిగింది. ఆ తర్వాత నూజివీడు తహశీల్దారుగా బదిలీ చేశారు. తరువాతనూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయానికి మార్చారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహశీల్దారుగా బదిలీ అయ్యా. అక్కడ కేవలం 11 రోజులే పనిచేశా. ఎన్నికల సమయంలో మాకు ఈ తహశీల్దారు వద్దని అధికారపార్టీ నాయకుడు చెప్పడంతో.. కాకినాడ కలెక్టరేట్కు బదిలీ అయింది. నూజివీడులో ఉన్నప్పుడు ఏసీబీ దాడులు చేయించడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. ఫలించక మౌనం వహించారు. ఇతరులతో ఫిర్యాదులు చేయించారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు యోచించారు కూడా. తమ్ముడు వేలేరులో ఇల్లు కట్టుకుంటే.. అభ్యంతరం చెప్పారట. ఇసుక దోపిడీని అడ్డుకోవడమంటే అది ప్రభుత్వ వ్యతిరేక చర్యనా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా? నేను ఒక్కదాన్ని అడ్డుకుంటేనే ఇసుక అక్రమ రవాణా ఆగిపోదు. కానీ ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి కదా. నాది తహశీల్దారు స్థాయే. కానీ రాష్ట్రంలో నా కన్నా పై స్థాయిలో ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందనేది నా ఆలోచన. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార.. ఇలా రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు అన్నింటి నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతుంటే జలవనరులు ఏమవ్వాలి? భూగర్భ జలాలు ఎంత లోతుకు పడిపోతాయి? ఈ విషయాలను ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా? ఇంకెన్ని ఆపాదించేవారో ప్రజలకు సేవ చేయాలని రెవెన్యూ సర్వీస్కు వచ్చా. వచ్చే సంపాదనతో హాయిగా గడిపేద్దామనేఆలోచన నాకు లేదు. నాకు సబ్రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్... తదితర విభాగాలకు కూడా ఆప్షన్ ఉన్నా ఆలా చూడలేదు. మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామం. ముగ్గురం ఆడపిల్లల్లో నేనే పెద్దదాన్ని. ఒక తమ్ముడు. నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలని అమ్మ కోరుకునేది. కానీ పదో తరగతితోనే చదువు చాలని నాన్న కట్టడి చేశారు. పెళ్లయ్యాక చాలా కాలానికి చదువు ఆరంభించి ఉద్యోగం సంపాదించుకున్నా. ఇక్కడో విషయం స్పష్టం చేయాలి.. నేను మరేదైనా సామాజికవర్గానికి చెందిన అధికారిణై ఉంటే ఇంకెన్ని ఆపాదించేవారో! ఎన్నో బెదిరింపులు,హెచ్చరికలు వచ్చాయి. ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. పార్టీపై పిచ్చి అభిమానంతో కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో ఏవేవో కామెంట్లు. మీ కామెంట్లకు మీరు నిలబడతారా? అని నా తరఫు వాళ్లు ప్రశ్నించడంతో.. ఆ తరువాత వెనక్కు తగ్గారు. నేనేమీ పెద్దఆఫీసర్ను కాదు. నాయకురాలిని కూడా కాదు. ఒకవేళ నాకు పలుకుబడి ఉంటే.. నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు కావు కదా? నేనేమైనా సంపాదించానా? కోట్లుకూడపెట్టుకున్నానా? కుటుంబంఅండగా నిలిచింది ఇదంతా చూసి ఒక్క క్షణం బాధ అనిపించింది. నేనేం తప్పు చేశానని భయపడాలి. ఎందుకు ఆందోళన చెందాలి? నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని, కాసే చెట్టుకే రాళ్లు పడతాయని నాకు నేను సర్దిచెప్పుకున్నా. నా భర్త, కుటుంబం ధైర్యం చెప్పారు. ముఖ్యంగాఖరగ్పూర్ ఐఐటీలో చదువుకుంటున్న నా ఒకే ఒక్క కుమారుడు సంఘటన గురించి తెలియగానేనా వద్దకు వచ్చేశాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏం ఫర్వాలేదమ్మా. ఇలాగే పనిచెయ్. నిజాయితీగా ఉండు. ఏమైతే అదే కానీయ్ చూద్దాం.. అంటూ ధైర్యం చెప్పాడు. నాతోనే ఉన్నాడు. కుటుంబసభ్యులు అందరు, కొందరు సహచర ఉద్యోగులు నాకు అండగా నిలిచారు. చట్టం ప్రకారం వెళదామన్నారు. భావితరాల భవిష్యత్తేంటి? ఎక్కువగా ఇసుక తోడేయడం వలన, నీటిలభ్యత తగ్గుతుంది.భూగర్భ జలాలు అడుగంటుతాయి. ముసునూరు మండల రైతులకన్నీళ్లను, వారి బాధలను నేరుగా చూశా. నేను ఒక రైతు బిడ్డను. ప్రకృతి ప్రేమికురాలిని. పర్యావరణం బాగుండాలని కోరుకునేదాన్ని. మనం అన్నీ సంపాదించుకోవచ్చు. పర్యావరణం పాడైపోతే భవిష్యత్తు ఏమవుతుంది? భావితరాల భవిష్యత్తేంటి? అంతెందుకు సీఎం గారి నివాసం పక్కన కృష్ణా నదిలో ఇసుకను దారుణంగా తోడేస్తున్నారని, ఇది పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, ఇసుక రవాణాను నిలిపేయాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ డిమాండ్ చేశారు. ఆమె అక్కడ నేరుగా చూసిన తరువాతే.. రాబోయే ప్రమాదాన్ని గుర్తించే చెప్పారు. అదేవిధంగా నీటివనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణఉద్యమకారులు రాజేంద్రసింగ్ రాజధాని ప్రాంతంలో, కృష్ణా,గోదావరి నదులను చూశారు. ఇసుకను ఇష్టానుసారం తోడేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని ఇతర నదులు, వాగులు, వంకలు..అన్ని చోట్లా జరుగుతున్న ఇసుక దందా అంతా ఇంతా కాదు. రూల్ ప్రకారం వెళితే ఏమీ కాదుఉద్యోగస్తులు ఎవరికీ అనుకూలం,ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఏదో ఒకవైపు పనిచేస్తున్నామని రూఢీ అయితే ఎదుటి పక్షం నుంచి తిప్పలు తప్పవు. రూల్ ప్రకారం వెళితే ఏమీ కాదు. మహా అయితే బదిలీలు. ప్రజల నుంచి మన్ననలు. మహిళలు ఏ విషయాల్లోనూ, ఏ పరిస్థితుల్లోనూ దేనికీ లొంగవద్దు. కుంగిపోవద్దు.ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రతితల్లి తన బిడ్డకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాలి. తనను రక్షించుకునే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. సమాజం మనల్ని గౌరవించే స్థితిలోకి చేరుకోవాలి. వృద్ధాశ్రమంప్రారంభించాలని ఉంది రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కాని వాటికి ఇప్పుడు ఓ నమస్కారం. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు ప్రకృతి ఒడిలో సేదతీరేలా మంచి వృద్ధాశ్రమం నిర్మించి నిర్వహించాలనే ఆశ ఉంది. ఇప్పటికి మాత్రం నాకు చేతనైనంతలో అయిదుగురు ఆడబిడ్డల చదువుకు సహకరిస్తున్నా. ఇద్దరు జీవితంలో సెటిల్ అయ్యేలా చదువు, శిక్షణ ఇప్పించా. ఒకరిని దత్తత తీసుకున్నా... ఏది ఏమైనా మనం సంపాదించింది మనం మాత్రమే తినకూడదు. ఎంతో కొంత అవసరమైన వారికి ఉపయోగపడేలా.. అలా ముందుకు.. మున్ముందుకు.. అంతే. ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే రాజ్యాంగ వ్యవస్థలో ఒకబాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం బాధ్యత. ఇక్కడ హోదా, కులం, మతం... అవన్నీ అప్రస్తుతం. నేను మహిళను. ఉద్యోగిని. చట్టం అమలుకు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చానా? లేదా? అన్నది చూడాలి. అందులో తప్పులుంటే చర్యలు తీసుకోవాలి. లేదంటే బాధ్యులను సరిదిద్దాలి. ప్రజాప్రతినిధులే ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే.. వారిని సరిదిద్దలేని ముఖ్యులు అయిదు కోట్ల మంది రక్షణ బాధ్యతకు ఏం భరోసాఇవ్వగలరు? ఈ కోణంలో ప్రజలు ఆలోచించరని అనుకుంటే ఎలా? తప్పులు చేసిన వారిపైన చర్యలు తీసుకుంటే.. మరొకరు అలాదురుసుగా, బాధ్యతారహితంగాప్రవర్తించగలరా? అన్ని కోణాల్లో ఆలోచించాల్సింది, చూడాల్సింది మాత్రం పెద్దలే. ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనాబాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం?! -
దెందులూరులో చింతమనేని అధ్వర్యంలో మైనింగ్ మాఫియా
-
‘చింతమనేని చూసి నేర్చుకోవాలట’
సాక్షి, పశ్చిమగోదావరి : ఎస్సీలపై దాడులు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని చూసి నేర్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ పందుల రవీంద్ర బాబు. శనివారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. చింతమనేని ప్రభాకర్ ఎస్సీలపై దాడి చేసిన వ్యవహారం పార్లమెంట్లోనూ చర్చకు వచ్చిందని తెలిపారు. ప్రశాంత దెందులూరు నియోజకవర్గాన్ని కులాలు, కుమ్ములాటలతో వివాదాస్పదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాలు, దోపిడీ, అవినీతి ఆరాచకాల్లో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టం చేశారు. జగనన్నను ముఖ్యమంత్రిగా.. అబ్బయ్య చౌదరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. -
వాళ్లకి చట్టాలు చుట్టాలురా...
సాక్షి, కైకలూరు : కుప్పుస్వామి : ఒరే.. నాగరాజు ఏంట్రా.. అంత తదేకంగా పేపరు చదువుతున్నావు.. ఏమైనా విశేషముందా.. ఉంటే.. కాస్త చెప్పరా.. నాగరాజు : స్వామి.. నాకు తెలియక అడుగుతా.. ఎప్పుడూ, ప్రజల పక్షాననిలిచి, ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. పేపర్లో రోజూ ఎక్కడో ఓ చోట ఇవే వార్తలు.. ఇదెక్కడి పోలీసు న్యాయమో.. అర్థం కావడం లేదు.. స్వామి : నాగరాజు.. నాకు చదువు అబ్బక పోయినా.. కాస్త లోకజ్ఞానం ఉందిరా.. ఆ అనుభవంతో చెబుతున్నా.. విను.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాట చెల్లుబాటు ఆవుతుంది.. ఇదేమి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు.. నేరం చేసిన వారి ఆర్థిక స్థోమత, సామాజిక నేపథ్యం, రాజకీయ విధేయతలను అనుసరించే పోలీసుల వైఖరి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదురా.. చట్టాలు వాళ్లకి చుట్టాలే. మనం వాళ్లను నిందించకూడదు.. పాలకులను నిందించాలి.. నాగరాజు : స్వామీ.. ఎక్కడో ఎందుకు.. మన దగ్గర్లో చింతపాడు గ్రామానికి వచ్చిన చింతమనేని అటవీశాఖ అధికారిని ఏమన్నాడు.. దమ్ముంటే రారా.. అంటూ పత్రికల్లో రాయలేని పచ్చి బూతులు తిట్టాడు.. అటవీశాఖ అభయారణ్యంలో ఏకంగా తారురోడ్డు వేయించాడు.. ఇప్పటి వరకు ఆయనపై యాక్షన్ లేదు.. స్వామి : ఓరేయ్.. పిచ్చోడా.. చింతమనేని ఎవరూ.. ప్రభుత్వ చీఫ్విప్.. టీడీపీ ఎమ్మెల్యే.. సంపన్నుడు.. అలాంటి వారిపై కేసులు నమోదైనా శిక్షలు పడవని ఖాకీలకు ముందే తెలుసురా... నాగరాజు : నిజమే స్వామి.. చింతమనేనిపై అటవీ శాఖాధికారులు మౌనం వహించారు. కేసు విచారణ కూడా లేదు.. అదే సమయంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీపై సివిల్ వివాదంలో కేసు నమోదైంది.. బందరులో ఎక్సైజ్ అధికారుల విధులకు ఆటంకం మరో నేతపై కలిగించారని కేసులు పెట్టారు. ఇదేంటి.. అధికార పక్షానికి ఓ చట్టం.. ప్రతిపక్షానికి ఓ చట్టమా.. చెప్పు.. కృపావరం : స్వామీ.. మీరిన్ని చెబుతున్నారు.. కానీ అసలు ఖాకీలకే రక్షణ లేదు.. అధికారం అండతో వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి.. కుప్పు స్వామి : ఇదేక్కడి వింత.. మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసుకే రక్షణ లేదంటావేంటి కృపావరం.. వివరంగా చెప్పు.. కృపావరం : చెబుతాను.. వినండి.. మన ప్రాంతంలో జరిగిన సంఘటలే ఇవి.. గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకోడానికి వెళితే ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వాహనాలను లోపలకి అనుమతించడం లేదని గ్రామపెద్ద ఏకంగా కానిస్టేబుల్ చొక్కానే చింపేశాడు. పులపర్రులో కులాలు వేరైన ఇద్దరు ప్రేమికులకు రక్షణ కల్పించడానికి వెళ్లిన పోలీసులను అధికార అండ కలిగిన పెద్దలు వారినే నిర్భందించారు.. ఇవే కాదు.. అనేక సంఘటనలు ఉన్నాయి.. బుజ్జిబాబు : (పక్కనే కూర్చుని అంతా వింటున్న వ్యక్తి) పెద్దలందరికీ ఓ నమస్కారం.. అధికారం ఎంత బరి తెగించిందో నేనూ.. ఓ మాట చెబుతా.. కృపావరం : బుజ్జిబాబు.. అరే.. నేను నిన్ను చూడలేదు.. చెప్పు.. చెప్పు.. బుజ్జిబాబు : చింతమనేని సంగతి కాస్త పక్కన పెడదాం.. మన టీడీపీ అభ్యర్థి ఏం చేశారో తెలుసా.. మొన్నీమధ్య అటవీశాఖాధికారులు కొల్లేరు అభయారణ్యంలోకి ట్రాక్టరుపై తరలిస్తున్న ఆక్వా పరికరాలను సీజ్ చేసి కైకలూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.. అంతే ఆయనకు కోపం వచ్చింది. ఓ 60 మందితో వెళ్లి డాక్టరు, డ్రైవర్ను విడిపించుకుని వెళ్లిపోయారు.. కేసు పెట్టినప్పటికీ ఆయనను అడిగే వాడే లేడు.. ఇదేనండి అధికారం అంటే.. శంకరరావు : నిజమే నబ్బా.. పోలీసులు తీరు ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది.. మొన్న విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. పాపం.. రక్తం కారుతూ బాధతో జగన్ హైదరాబాదు వెళ్లారు.. ఇంతలోనే టీవీల్లో కత్తి దాడి ఆయన అభిమానే చేశాడని ప్రకటన... ఏ పార్టీ అభిమానైనా కత్తితో దాడి చేస్తాడా.. గుండెళ్లో పెట్టుకుని పూజిస్తాడు కాని.. జానీ : అవునండీ.. రాష్ట్రంలో మరీ దాడులు పెరిగాయి.. శ్యాంబాబు : (నాగరాజు కొడుకు) : నాన్నో ఓట్లు అడగడానికి ఎవరో వచ్చారు... నీ గురించి అడుగుతున్నారు. బేగా రా.. అంటూ పిలవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానీ నివాసంలో విషాదం నెలకొంది. నానీకి వరసకు సోదరుడైన ఆదిత్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారంటూ కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం అతడు బెయిల్పై విడుదల అయ్యాడు. అయితే సోదరుడి అరెస్ట్ను నిరసిస్తూ ఆదిత్య నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేపట్టాడు. (కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు) (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్) మరోవైపు కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు కావడంతో ఆదిత్య తన బంధువులను ఇంటి వద్ద దించేందుకు కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారు వద్ద ఆదిత్య ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే మరణించగా, మరో వృద్ధురాలు గాయపడగా...ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆదిత్య మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కామిరెడ్డి పరామర్శించిన నేతలు వారికి మనోధైర్యం చెప్పారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కామిరెడ్డి నాని నివాసంలో విషాదం..
-
కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు
-
కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు
సాక్షి, ఏలూరు : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన వీడియో షేర్ చేశారంటూ అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కామిరెడ్డి నానికి బెయిల్ లభించింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ... బెదిరింపులు, కేసులకు తాను భయపడేది లేదని, ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్) కాగా కామిరెడ్డి నానికి శుక్రవారం వివాహం జరగగా, శనివారం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్ జరిగింది. ఆ తర్వత అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు త్రీ టౌన్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన నానీని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ నేతలు, గ్రామస్తులు, మహిళలు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దళితులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన చింతమనేనిపై కేసులు పెట్టకుండా, అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. -
చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దళితులను కించపరుస్తూ మాట్లా డితే అందులో ఎలాంటి తప్పు లేదని రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతోంది. కానీ, దాన్ని బయటపెట్టిన వారికి మాత్రం శిక్ష తప్పదని హెచ్చరి స్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (టీడీపీ) ప్రసంగ వీడియోలను షేర్ చేసిన వారిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చింతమనేని మాట్లాడిన వీడియోను మరొకరికి పంపించాడంటూ కామిరెడ్డి వెంకట నరసింహారావు(నానీ) అనే యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నానీకి శుక్రవారం రాత్రి పెళ్లి జరగ్గా, శనివారం మధ్యాహ్నం తన స్వగ్రామం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్ ముగిసి అత్తగారింటికి వెళ్లిన నానీని పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్ ఒత్తిడి మేరకే నానీ అరెస్టు చేసినట్లు సమాచారం. చింతమనేని శనివారం ఉదయం ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారితో గంటసేపు సమాలోచనలు జరిపిన తర్వాత ఈ అరెస్టు జరగడం గమనార్హం. వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు అక్కసు రెండు నెలల క్రితం శ్రీరామపురంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి.. మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చముం..కొడకల్లారా..’’ అంటూ దూషించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసుస్టేషన్లలో చింతమనేనిపై ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేశారు. అయితే, పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్టులో ఎక్కడా మార్ఫింగ్ అన్న పదాన్ని వాడలేదు. ఆ వీడియోను వెబ్లో పోస్టు చేసిన కత్తుల రవికుమార్పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వీడియోను కత్తుల రవికి పంపించాడంటూ శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి నానీని ఈ కేసులో ఎ–2గా చేర్చారు. త్రీటౌన్ పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత కామిరెడ్డి నానీకి ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి 12.16 గంటలకు పెళ్లయ్యింది. 23వ తేదీ మధ్యాహ్నం తన స్వగృహంలో రిసెప్షన్ ముగించుకుని, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురంలోని అత్తగారింటికి వెళ్లాడు. ఏలూరు త్రీటౌన్ పోలీసులు శనివారం మూడు కార్లలో వచ్చి నానీని బలవంతంగా అరెస్టు చేసి తొలుత ద్వారకాతిరుమల స్టేషన్కు, ఆ తర్వాత త్రీటౌన్ స్టేషన్కు తరలించారు. జీపులో అతడిపై చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. నానీ అరెస్టు వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రీటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. నానీని అరెస్టు చేసి తీసుకొచ్చిన జీపును చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ అక్కడికి చేరుకున్న దెందులూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో కూడా పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్ విమర్శలకు దారితీస్తోంది. వివాహమై 12 గంటలు కాకముందే.. వివాహమై 12 గంటలైనా కాకముందే తన కుమారుడిని అరెస్టు చేయడం పట్ల నానీ తండ్రి ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను బూతులు తిట్టిన వారిని వదిలేసి, తన కుమారుడిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని కక్షగట్టి తన కుమారుడిని అరెస్టు చేయించారని ఆనంద్బాబు ఆరోపించారు. -
ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
చంద్రబాబు వీధి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు
-
పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు..
సాక్షి, ఏలూరు : ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని కత్తుల రవికుమార్ జైన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేవలం ఒక దళితుడిగా స్పందిస్తూ చింతమనేని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలో దళితుల మనోభాలను కించపరిచే వ్యాఖ్యలను మాత్రమే కట్ చేసి పోస్టు చేశానని విలేకరులకు చెప్పారు. దళితులను అవమానపరుస్తూ చింతమనేని మాట్లాడితే దానిపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం, పోలీసులు తనపై కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. చింతమనేనిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తానేమీ చదువురాని వ్యక్తిని కాదని, ఉన్నతభావాలు కలిగిన వ్యక్తిగా, దళితుల మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో ఇది సమాజానికి తెలి యజేసేందుకు పోస్టు చేశానని చెప్పారు. మరోవైపు వీడియో షేర్ చేసిన రవికుమార్ జైన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు...దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసుల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు. -
‘పశ్చిమ’ పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటకి పోలీసులు మాత్రం స్పందించడం లేదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వదిలేసి.. వీడియోను షేర్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కత్తుల రవికుమార్ని అరెస్ట్ చేయడం పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చింతమనేని విషయంలో చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ.. ఈ వ్యవహారాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు. అంతేకాక ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పశ్చిమ పోలీసులు నడుచుకుంటున్నారని.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. వినతి పత్రం సమర్పించాలని దళిత సంఘాల నేతలు నిర్ణయించారు. -
చింతమనేనిని తీవ్రంగా హెచ్చరించిన ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎంపీ పండుల రవీంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు. దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావ్. అంబేద్కర్ భిక్ష వల్లే నువ్ ఎమ్మెల్యేగా తిరుగుతున్నావ్. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధికాక తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం’ అని రవీంద్రబాబు చెప్పారు. (చింతమనేని వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ..) -
‘నేను ఏ తప్పూ చేయలేదు’
-
టీడీపీలో కులపిచ్చి పెరిగిపోతుంది
-
చింతమనేని వీడియో షేర్ చేశారంటూ..
-
చింతమనేని ఎఫెక్ట్: కత్తుల రవి జైన్ అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కనీసం కేసు కూడా నమోదు చేయని పశ్చిమ పోలీసులు.. ఆయన తీరును నిరసించినందుకు దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్ను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవిని వెంటనే విడిచి పెట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) కాగా ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. ఆయన వీడియోను షేర్ చేశారంటూ రవిని అరెస్టు చేశారు. పోలీసుల పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ల అండ చూసుకుని రెచ్చిపోతున్న చింతమనేనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) జూపూడి, కారెం శివాజీలపై దళితుల ఆగ్రహం చింతమనేని ప్రభాకర్ వైఖరిని నిరసిస్తూ దళిత సంఘాలు తణుకులో ఆందోళన చేపట్టాయి. చింతమనేని అరెస్టు చేయాలంటూ తణుకు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించని జూపూడి, కారెం శివాజీలపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ధర్నాకు వైఎస్సార్ సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.(చింతమనేనిపై భగ్గుమన్న దళితులు) -
చింతమనేనికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, అమరావతి : మొన్న తహసిల్దార్ వనజాక్షిపై దాడి, నిన్న దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ పుష్కలంగా ఉందనేది మరోసారి రుజువు అయింది. ఎమ్మెల్యే తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా...ముఖ్యమంత్రికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే చింతమనేనిని చంద్రబాబు కనీసం మందలించడం కూడా జరగలేదు. పైపెచ్చు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో దళితులు పదవులకు పనికిరారన్న చింతమనేనని సీఎం సమర్థించడం గమనార్హం. అంతేకాకుండా చింతమనేని వ్యాఖ్యలు కూడా ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారమే అంటూ నిసిగ్గుగా ఎప్పటిలాగానే ఎదురు దాడికి దిగారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ఉన్న చింతమనేని బహిరంగంగానే దళితులను కించపర్చేవిధంగా మాట్లాడినా ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడటం లేదు. గతంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఎమ్మెల్యే చింతమనేని ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరోవైపు చంద్రబాబు అండతోనే చింతమనేని మరింత రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. -
‘మీ పబ్లిసిటీ స్టంట్ వల్ల 30 మంది చనిపోయారు’
సాక్షి, తిరుపతి : దళితుల గురించి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వారిని చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను అనుసరిస్తున్నారంటూ విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని అన్నారు. అలా వచ్చే ప్రతీ ఒక్కరు తమ పదవులకు రాజీనామా చేయడం వైఎస్ జగన్ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీ నుంచి కొన్న వారి చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) తనకు ఓ నీతి.. ఇంకొకరికి వేరే నీతి పుల్వామా ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదుల చర్యకు ఇప్పుడు ప్రధాని మోదీని రాజీనామా చేయమంటున్న బాబు... ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొని తానెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని..(కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?) కనీసం ఇప్పుడైనా ఎందుకు రాజీనామా చేయడం లేదని ధ్వజమెత్తారు. ద్వంద్వ విధానాలు ఉన్న చంద్రబాబుకు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టుగా వ్యవహరించడం అలవాటేనని ఎద్దేవా చేశారు.(మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?) -
చింతమనేని దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనం
-
దురహంకారంతో పేట్రేగిపోతున్నారు
పట్నంబజారు (గుంటూరు)/విజయపురం(చిత్తూరు జిల్లా): టీడీపీ నేతలంతా దురహంకారంతో పేట్రేగిపోతున్నారని వారికి రాజ్యాంగమన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలన్నా గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం గుంటూరు లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేయటంతో పాటు, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేని వ్యాఖ్యలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..దళితులను కించపరుస్తున్న నాయకులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అధికార దురంహాకారానికి ఓటుతో బుధ్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నిరసనలో పార్టీ నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవా, జగన్ కోటి, మేరిగ విజయలక్ష్మీ, అంబేద్కర్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, బోడపాటి కిషోర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన అమృతలూరులో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో తెనాలి– చెరుకుపల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి చింతమనేని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నగరంపాలెం పీఎస్లో ఫిర్యాదు.. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో ఎస్హెచ్ఓ కె. వెంకటరెడ్డికి ఫిర్యాదును అందజేశారు. చంద్రబాబు అండతోనే చింతమనేని అరాచకాలు: ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. అసెంబ్లీలో మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించారు’అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు సబ్స్టేషన్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పాలాభిషేకం చేశారు. రోజా మాట్లాడుతూ..గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేశారని గుర్తుచేశారు. అటవీ శాఖ అధికారులను కొట్టి, అంగన్వాడీ కార్యకర్తలను అసభ్యకరంగా మాట్లాడిన నాడే చింతమనేనిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందన్నారు. అలా చేసుంటే ఈ రోజు దళితులపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసేవారు కాదన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలను కేవలం ఓటర్లగానే చూస్తున్నానరే తప్ప మనుషులుగా చూడడం లేదని, వారి మనోభావాలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, చింతమనేనిని పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. -
భగ్గుమన్న దళితులు
సాక్షి,నెట్వర్క్: ‘మీరు దళితులు.. మీకెందుకు రా.. రాజకీయాలు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దళిత, ప్రజా సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయితో మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాయి. చింతమనేని దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిత్తూరు బంగారుపాళ్యం రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు. విజయపురం మండలం పన్నూరు సబ్స్టేషన్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేని కేçశవులు ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. బి.కొత్తకోటలో చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ అంబేడ్కర్ సేవ (బాస్) కార్యకర్తలు రాస్తారోకో చేశారు. పుంగనూరులోని అంబేడ్కర్ కూడలిలో చింతమనేనికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర చేస్తున్న దళిత, బీసీ, ఎస్టీ సంఘాల నాయకులు ఏయూలో చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర.. ఆంధ్ర యూనివర్సిటీలో దళిత, బీసీ సంఘాలు నిరసన తెలిపాయి. ఏయూలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నాయకులు ధర్నా చేసి చింతమనేని దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. చింతమనేనిని తక్షణం అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దిష్టిబొమ్మతో నిరసన తెలపడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిశోధకులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో ఆరేటి మహేష్, డాక్టర్ మోహన్ బాబు, మండే సురేష్, కోటి రవికుమార్, కుమారస్వామి పాల్గొన్నారు. చింతమనేనిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పదవుల నుంచి తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చింతమనేని ప్రభాకర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. అశోక్కుమార్ మాట్లాడుతూ.. చింతమనేని ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని మండిపడ్డారు. చింతమనేనిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు.. ఎస్సీ సామాజిక వర్గాన్ని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దూషించడంపై జాతీయ ఎస్సీ కమిషన్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బుధవారం ఫిర్యాదు చేసింది. ఎస్సీ కమిషన్ సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.అనిల్కుమార్ ఈ ఫిర్యాదు అందజేశారు. చింతమనేనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏలూరులో ఉద్రిక్తత సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతమనేని వ్యాఖ్యలపై పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో దళితులు ఆందోళనలు నిర్వహించారు. ఏలూరులో చింతమనేని ప్రభాకర్ వర్గం నేతలు కూడా పోటీ నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలను అరెస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి కొద్దిగా మాత్రమే చూపిస్తున్నారని, సోషల్ మీడియాలో వైరల్ చేసి తన పరువుకు నష్టం కలిగించిన వారిని అరెస్ట్ చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి చింతమనేని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి వినతిపత్రమిచ్చారు. ‘సాక్షి’పై చింతమనేని అక్కసు... చింతమనేని వ్యాఖ్యలపై ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంతో ఆయన బుధవారం ఉదయం ఏలూరులోని సాక్షి జిల్లా కార్యాలయానికి వచ్చారు. ‘నా గురించి పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారు...ఆ వార్త రాసిన విలేకరి ఏడీ’ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంకా రాలేదని చెప్పడంతో వస్తే నన్ను కలవమని చెప్పండంటూ అక్కడి నుంచి ఫైర్స్టేషన్ సెంటర్కు వెళ్లారు. కొద్దిసేపట్లో అక్కడ వైఎస్సార్సీపీ దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తాయని సమాచారం అందుకుని పోటీ ధర్నా చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సోషల్ మీడియాలో తన వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ, అదనపు ఎస్పీలకు వినతిపత్రమిచ్చారు. ఈలోగా ఫైర్స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. అక్కడ చింతమనేని అనుచరులు పోటీ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టూటౌన్ పోలీసు స్టేషన్ ముందు వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ వీరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఇరువర్గాలను పోలీసులు విడిచిపెట్టారు. చింతమనేని తన అనుచరులతో పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నాకు దిగారు. తన మాటలను వక్రీకరించారని, తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. హౌస్ అరెస్టులపై అభ్యంతరం.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం వివాదానికి దారి తీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరుకు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దీనికి మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల అరుణ్కుమార్ ఆధ్వర్యంలో మాలమహానాడు, వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు టి.శేఖర్ ఆధ్వర్యంలో ఆందళోన చేశారు. చింతమనేని వ్యాఖ్యలను ఖండిస్తూ మార్టేరు సెంటర్లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. చింతలపూడి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వీఆర్.ఎలిజా, గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. -
చింతమనేనిపై చర్యలు తీసుకోని పక్షంలో..
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. పీవీ రావు మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు గుమ్మారపు సూర్యవరప్రసాద్ ఆధ్వర్యంలో పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో బుధవారం రాస్తారోకో చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చింతమనేనిపై కేసు నమోదు చేయాలని సీఐ ఆదిప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.. దళిత వ్యతిరేకి, కుల అహంకారి అయిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలి. దళిత జాతిని కించపరస్తూ.. మీకు పదవులు ఎందుకు రా.. అని ఎమ్మెల్యే మాట్లాడటం చాలా హేయమైన చర్య. చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం’ అని దళిత నాయకులు హెచ్చరించారు. ‘ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ దళితులపట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించక పోవడం చాలా సిగ్గు చేటు. మాపై నిజమైన ప్రేమ ఉంటే కారెం శివాజీ, జూపూడి లిద్దరూ కూడా తక్షణమే తమ పదవులకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీని వీడి బయటకు రావాలి’ అని సూర్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. -
‘సీఎం ప్రోత్సాహంతోనే దళితులపై అనుచిత వ్యాఖ్యలు’
సాక్షి, కదిరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు దళిత సంఘాలు, ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పోత్సాహం వల్లనే చింతమనేని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కదిరిలో బుధవారం ఆమె అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) ‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చింతమనేనికి ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితుల గురించి అవహేళనగా మాట్లాడారు. స్వయానా సీఎం చంద్రబాబు కూడా దళిత వర్గాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’ అని రోజా హెచ్చరించారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి చింతమనేని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని మాట్లాడుతూ.. ‘రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా’ అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. -
నువ్వు మనిషివా.. పశువువా?
సాక్షి, విజయవాడ : చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీ షీటర్ను మంత్రి లోకేష్ పెంచి పోషిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త నందిగం సురేష్ అన్నారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని, నోరు అదుపులో పెట్టుకోవాలని చింతమనేనిని హెచ్చరించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఆయన మీద జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) మనిషివా, పశువువా? ‘చంద్రబాబు, చింతమనేని మీకు దళితులంటే ఎందుకు అంత చులకన. చింతమనేని నీ ఆటలు సాగనివ్వం.. నువ్వు మనిషిగా పుట్టావా, పశువుగా పుట్టావా.. నీ వీడియో అంతా నిజం. నీకు తగిన బుద్ధి చెబుతాం. టీడీపీలో ఉన్న దళిత నేతలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు.. చింతమనేని లాంటి నీచుడిని ఇంకా భరిస్తారా.. ఇది రౌడీ షీటర్ల ప్రభుత్వమా’ అంటూ అధికార పార్టీ తీరుపై సురేష్ నిప్పులు చెరిగారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
చింతమనేనిపై భగ్గుమన్న దళితులు
సాక్షి, విజయవాడ: 'మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు' అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దళితుల్ని ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో దూషించిన వీడియాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. టీడీపీ హయాంలో దళితులను అడుగడుగునా కించపరుస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పలు చోట్ల చింతమనేని దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. చింతమనేని వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కాలే పుల్లారావు, పల్లి విజయ రాజు, చందా కిరణ్ తేజ, లెలపుడి లాజరు, పోలిమెట్ల శరత్, పార్టీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (‘సాక్షి’ కథనంపై చింతమనేని ఆగ్రహం) ఇక మరో కార్యక్రమంలో దళితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అధ్వర్యంలో దళితసంఘాల నాయకులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, తుమ్మల ప్రభాకర్, మర్కపుడి గాంధీ, మాతంగి వెంకటేశ్వర్లు, పగిదిపల్లి సునీల్, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెంటనే అరెస్టు చేయాలని జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. -
చింతమనేని వ్యాఖ్యల పై దళిత వర్గాల ఆగ్రహం
-
వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్భందం
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వారి కార్యకలాపాలకు అడ్డుపడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సరైన కారణం లేకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని అరెస్ట్ చేయకుండా.. తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చింతమనేని వ్యాఖ్యలపై తాము ఎటువంటి నిరసనలకు పిలువునివ్వకపోయినప్పటికీ.. ఏదో ఊహించుకుని ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
‘సాక్షి’ కథనంపై చింతమనేని ఆగ్రహం
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) మరోసారి రెచ్చిపోయారు. దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో కథనం రావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి ఏలూరులోని సాక్షి కార్యాలయానికి చేరుకున్న ఆయన.. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో విలేకరులు లేరని చెప్పడంతో మళ్లీ వస్తానంటూ వెనుదిగారు. దళిత సంఘాలు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు.. ఫైర్ స్టేషన్ సెంటర్ : తమను అవమానపరిచిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్పై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్లో దళితులు ధర్నా చేసేందుకు ఉపక్రమించారు. దీంతో అప్రమత్తమైన చింతమనేని అనుచరులు వీరిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలను భారీగా మోహరించారు. దీంతో ఫైర్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. -
దళితులపై ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు
-
రాజకీయాలు మాకు మీకెందుకురా..
-
దళితులు.. మీకెందుకురా రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్య, అభ్యంతరకర పదజాలంతో దళితులపై విరుచుకుపడ్డాడు. ‘మొన్న జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్ అడుగుతున్నాడంటూ చింతమనేని మండిపడ్డారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట..’ అంటూ చింతమనేని దళితులను ఇష్టారీతిన దూషించి అవమానించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తామంటే టీడీపీ నాయకులకు ఇంత చిన్నచూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంత నీచంగా కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ.. వాళ్ల అధినేతే అలా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు అంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులు శుభ్రంగా ఉండరంటూ అవమానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయని, రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ముందు చింతమనేనని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. తమను హీనంగా చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకో.. చింతమనేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. పదవులెందుకంటూ దళితులను అవమానిస్తున్నావ్.. ఈ రోజు నువ్వు అనుభవించే పదవి.. దళిత మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పెట్టిన భిక్ష అనే విషయం మర్చిపోవద్దు. ఈ దేశంలో వేల సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీలకుంది. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్న వాస్తవం తెలుసుకో. ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతే నీకు తగిన బుద్ధి చెబుతాం. – డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం అంత అంటరానివాళ్లమా.. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలను అవమానించేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. దళితులు అంత అంటరాని వాళ్లా? మీకెందుకు పదవులు.. మేం పదవులెక్కి పెత్తనం చేస్తామంటూ చింతమనేని అహంకారంగా మాట్లాడటం దుర్మార్గం. గతంలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం దుర్బాషలాడాడు. దళిత కార్మికుడు జాన్ను అకారణంగా కొట్టాడు. ఆయన ఎమ్మెల్యేనా లేదా రౌడీనా అనేది అర్థం కావడం లేదు. తనపై మూడు కేసులున్నాయని బహిరంగంగా ప్రకటిస్తున్నా చింతమనేని ప్రభాకర్ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి. – ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళితులను నీచంగా చూస్తారా.. దళితుల మనోభావాల్ని దెబ్బతీసిన చింతమనేని ఎమ్మెల్యే పదవిని స్పీకర్ రద్దు చేయాలి. లేదంటే గవర్నర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ఉండి ఒక బహిరంగ సభలో దళితులను కించపర్చడం దారుణం. దళితులను ఇంత నీచంగా చూస్తారా? రాష్ట్రంలో ఒక పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయి. దళితులను రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రపతిగా ఒక దళితుడు ఉన్న దేశంలో ఓ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. చింతమనేని ఎమ్మెల్యేగా ఉంటే అధికారులెవరూ కేసులు పెట్టరు.. విచారణ చేయరు. అందుకే వెంటనే ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నాడు. రేపట్నుంచి జిల్లా వ్యాప్తంగా చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం. – కొయ్యె మోషెన్రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు దళితులను కించపర్చడం వల్లే ఇదంతా.. ముఖ్యమంత్రి చంద్రబాబే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అనటం వల్లే టీడీపీ నేతలు కూడా దళితులను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డేమో దళితులు శుభ్రంగా ఉండరని అంటాడు. చింతమనేని ఏమో దళితులకు రాజకీయాలెందుకంటూ అవమానిస్తాడు. దళితులు టీడీపీ నేతల దగ్గర జెండాలు మోస్తూ బానిసలుగా బతకాలా? రాజ్యాధికా>రం అక్కర్లేదా? వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతాం. – నూకపెయ్యి సుధీర్బాబు, ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతమనేని తీరే అంత.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ప్రజాప్రతినిధిలా కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. బహిరంగసభల్లో కూడా వందలాది ముందే.. పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా ప్రజల్ని హీనంగా తిడుతుంటాడు. తన మాట వినలేదని గతంలో పెదవేగి ఎస్ఐపైనే దాడి చేశాడు. అటవీ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారులపైనా దాడులకు పాల్పడ్డాడు. తన ఇసుక దందాను అడ్డుకున్నందుకు అప్పట్లో మహిళా తహసీల్దార్ వనజాక్షిని జట్టుపట్టుకుని మరీ ఈడ్చేయడానికీ చింతమనేనే కారకుడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చింతమనేనినే వెనకేసుకువచ్చారు. దీంతో ఆయన ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గుండుగొలను సెంటర్లో బందోబస్తు చేస్తున్న ఏఎస్సై, సీపీవోలపై దాడికి పాల్పడ్డాడు. తమ సమస్యలపై వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన అంగన్వాడీ ఉద్యోగులను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. దళిత కార్మికుడు జాన్ను అకారణంగా కొట్టాడు. ఇళ్ల స్థలాలు, పొలాల గొడవల పేరుతో ప్రతిరోజూ ఎవరోఒకరిని కొడుతూ, తిడుతూ రౌడీలా చెలామణి అవుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు అండ ఉండటంతో పోలీసులు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. దెందులూరు నియోజకవర్గంలో ఓ మాఫియా కింగ్లా వ్యవహరిస్తున్నాడు. ఇసుక, మట్టి, చెరువులు, భూములు ఇలా అన్నింటినీ దోచేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. రౌడీషీటర్ ప్రజాప్రతినిధి అవడం, ఆయనకు ముఖ్యమంత్రి వత్తాసు పలకడం ప్రజల దౌర్భాగ్యమంటూ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
దళితులను తీవ్రంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమగోదావరి : దళితుల పట్ల టీడీపీ వివక్షాపూరిత ధోరణి మరోసారి బయటపడింది. మొదటి నుంచీ వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రంగా అవమానించారు. దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...‘రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా’ అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. (మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని) దీంతో చింతమనేనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ప్రజాప్రతినిధి కాదని.. ప్రజా గూండా అని, ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలకింద కేసులు పెడుతామని ప్రకటించాయి. గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేత మోషేన్రాజు తెలిపారు. చింతమనేని అనుచిత వ్యాఖ్యలు దళితులను మాత్రమే అవమాన పరచలేదని, రాజ్యాంగాన్ని కూడా కించపరిచేవిగా ఉన్నాయని ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యుడు బత్తుల భీమారావు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే మాట్లాడిన ప్రభాకర్కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత జాతి ఆదరాభిమానాలతో అధికారం చెలాయిస్తున్న నాయకులకు గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న దళిత నాయకులు చింతమనేని వ్యాఖ్యలను ఖండించకపోవడం విచారకరమన్నారు. -
అక్కాచెల్లెళ్లలో ఒకరి ఆచూకి లభ్యం
గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ సమస్యల రీత్యా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఓ సోదరి మంగళవారం విజయవాడకు చేరుకుంది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతానికి చెందిన కోట గాయత్రి, కోట సోనియా ఇద్దరు ఈ నెల 4న చింతమనేనిని కలిసేందుకు వెళ్లారు. అప్పటి నుంచి వారిరువురి ఆచూకీ తెలియక పోవడంతో వారి తల్లి మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె సోనియా మంగళవారం నగరానికి చేరుకుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరులో తాను చదువుకున్న పాఠశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు తెలిపింది. తన అమ్మమ్మ అయిన భాగ్యలక్ష్మి ఇంటివద్దే ఉన్నట్లు చెప్పింది. తన అక్క గాయత్రి ఈ నెల 5నే ఏలూరు నుంచి విజయవాడ చేరుకున్నట్లు పోలీసుల వద్ద ఒప్పుకుంది. అనంతరం పోలీసులు సోనియాను ఆమె తల్లికి అప్పగించారు. గాయత్రి కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తామని వారు తెలిపారు. తన పెద్ద కుమార్తెను తనకు అప్పజెప్పాలని తల్లి మీడియా వద్ద వేడుకుంది. -
‘చింతమనేని’ ఇంటికని వెళ్లి యువతుల అదృశ్యం
సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమకు సహాయం చేస్తాడంటూ వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వారం రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో విషయం నగరవ్యాప్తంగా సంచలనమైంది. బాధితురాలైన తల్లి కోట జ్యోతి తెలిపిన వివరాల మేరకు.. గుణదల గంగిరెద్దుల దిబ్బకొండ ప్రాంతానికి చెందిన కోట జ్యోతి కొన్ని నెలలుగా ఇక్కడి ఓ ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త కోట రాము(42) పదేళ్ల క్రితమే మనస్పర్థల కారణంగా కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె కోట గాయత్రి (19) ఎనికేపాడులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లమో మూడో సంవత్సరం చదువుతోంది. రెండవ కుమార్తె కోట సోనియా (18) గూడవల్లిలోని మరో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. జ్యోతి కూలి పని చేసుకుని పిల్లల్ని చదివిస్తుంది. కొంతకాలంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తల్లికి సాయం చేసే దిశగా వీరిద్దరూ పనులకు వెళుతున్నారు. ఈ యువతుల బంధువులు పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో ఉండటంతో వారి సహాయంతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లిన యువతులు ఇప్పటి వరకూ తిరిరాలేదు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత ఆరా తీసినా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో జ్యోతి ఆదివారం రాత్రి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొండా ఉమ అనుచరులపై అనుమానం.. గతేడాదిలో ఈ కుటుంబం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్నగర్ ప్రాంతంలో ఉండేది. ఆ సమయంలో తమ పరిస్థితి చెప్పుకునే నిమిత్తం ఇద్దరు యువతులు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును కలిశారు. అదే సమయంలో కొంత మంది అనుచరులు చిన్న కుమార్తె సోనియాపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం బెయిల్పై విడుదలై నగరంలో తిరుగుతున్నారు. ఈ యువతులపై కక్ష సాధింపు చర్యగా కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
‘చింతమనేని’ని కలిసేందుకు వెళ్లి.. ఆదృశ్యం!
-
చింతమనేని కలవడానికి వెళ్లిన అమ్మాయిలు అదృశ్యం
-
చింతమనేని కలవడానికి వెళ్లిన అమ్మాయిలు అదృశ్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ గుణదలలో అమ్మాయిల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. అదృశ్యమైన వారిలో ఒకరు మైనర్గా ఉన్నట్టు సమాచారం. ఈ నెల 4న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కలవడానికి వెళ్లినప్పటి నుంచి తమ పిల్లలు కనిపించడం లేదని ఆ అమ్మాయిల తల్లి కోటా జ్యోతి మాచవరం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లినవారు ఇంకా తిరిగిరాలేదని, వారి నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన బిడ్డల ఆచూకీ చెప్పాలని జ్యోతీ పోలీసులను వేడుకున్నారు. గతంలో వీరిపైనై అత్యాచారాయత్నం అదృశ్యమైన ఈ అమ్మాయిలపైనే గతంలో ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు అత్యాచారయత్నం చేశారు. పక్కాగృహం ఇప్పిస్తామని నమ్మించి ఎమ్మెల్యే ఆఫీస్కు తీసుకెళ్లి మరీ ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ కేసులో అప్పట్లోనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
సహనం కోల్పోతున్న తెలుగు తమ్ముళ్లు
-
మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీడీపీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో జనాలపై నోరుపారేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అంటూ దుర్భాషలాడుతున్నారు. పథకాల కింద ప్రజలకు ఇచ్చే డబ్బును తమ సొంత జేబుల నుంచి ఇస్తున్నట్లు పచ్చనేతలు ఫీలైపోతున్నారు. వారం రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద బూతు పురాణం విప్పగా.. నిన్న ప్రభుత్వ విప్, వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వృద్ధుడైన పింఛన్ దారుడిపై చిందులు తొక్కారు. గతంలో చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కూడా టీడీపీకి ఓటు వేయకపోతే.. తామేసిన రోడ్లపై నడవద్దని, తామిచ్చే ఫించన్లు, రేషన్ తీసుకోవద్దని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుంటున్నావ్.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది. మీ అమ్మ మూడు వేలు తీసుకుంటుంది. రుణమాఫీ వస్తే అది దొబ్బావ్.. ఇవన్నీ దొబ్బి మళ్లీ ఓటేయ్యవా’ అని ప్రజలను నిలదీయాలంటూ తన అనుచరుల వద్ద అచ్చెన్నాయుడు బూతుపురాణం విప్పారు. ఈ వ్యాఖ్యలతో అవాక్కైన ప్రజలు మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇస్తున్నారా.. మమ్మల్ని అవమానించేలా ఎలా మాట్లాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిపై ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని విరుచుకుపడటం హాట్టాపిక్ అయింది. అంటే ప్రభుత్వ పథకాలు కేవలం టీడీపీ వారికేనా.. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు వర్తించవా? అంటూ ఆ వృద్ధుడి కొడుకులు నిలదీయడంతో చింతమనేని మరింత దౌర్జన్యానికి దిగారు. ప్రమాణం చేయకపోతే చెక్కు లేదు.. సరిగ్గా ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల కోసం పసుపు-కుంకుమ చెక్కులంటూ కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబునాయుడు తెరలేపగా.. ఆయన అనుచరవర్గం ఈ చెక్కులను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీకి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తేనే చెక్కులిస్తామని హుకుం జారీ చేస్తోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయడానికి నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం, ప్రమాణం చేయకపోతే చెక్కులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం
సాక్షి, దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు. -
వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై చింతమనేని అనుచరుల దాడి
-
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని వర్గీయులు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పత్తికోళ్ల లంక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టారనే నెపంతో పార్టీ సానుభూతిపరులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం దాడికి దిగింది. వివరాల్లోకి వెళితే.. గత మూడేళ్లుగా గ్రామానికి చెందిన దాదాపు 900 ఎకరాల భూమి సాగుచేసుకుంటున్న చింతమనేని.. సుమారు 15 కోట్ల రూపాయలు గ్రామానికి బాకీ పడ్డారు. ఈ నేపథ్యంలో చింతమనేని తీరును ప్రశ్నిస్తూ ఓ వర్గం పత్తికోళ్ల లంకలో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీంతో ఆగ్రహించిన చింతమనేని వర్గం వారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాక్షస పాలన కొనసాగుతోంది.. చింతమనేని వర్గం చేతిలో దాడికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దెందులూరు నియోజవర్గంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. పత్తికోళ్ల లంకలో చింతమనేని ప్రభాకర్ భయానక వాతావరణం సృష్టించారని అబ్బాయి చౌదరి విమర్శించారు. ఓవైపు గ్రామంలో ఇటువంటి పరిస్థితులు నెలకొంటే చింతమనేని మాత్రం కోడి పందేల పేరిట డబ్బు సంపాదించడంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి దెందులూరు నియోజకవర్గ ప్రజలను చింతమనేని బారి నుంచి కాపాడాలన్నారు. చింతమనేనికి ప్రజలు మరో మూడు నెలల్లో తప్పక బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. -
కోఢీ అంటే ఢీ
సాక్షి, అమరావతి: కత్తులు కట్టిన కోళ్లు బరిలోకి దిగాయి. మొదటిరోజే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.350కోట్లకు పైగా చేతులు మారాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నే రీతిలో కృష్ణా జిల్లాల్లోనూ వందలాది బరుల్లో వేల సంఖ్యలో పందేలు సాగాయి. ఆడా..మగా, చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా కోడి పందేలు చూసేందుకు జనం ఎగబడ్డారు. కత్తి కట్టి పందేలు వేయవద్దని, డింకీ పందేలు వేసుకోవచ్చని పోలీసులు చేసిన సూచనలను బేఖాతరు చేస్తూ డింకీ పందేలే అంటూ టీడీపీ నేతల దన్నుతో కత్తులు కట్టి నిర్వహించారు. అమెరికాలోని లాస్ వేగాస్లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలను సైతం తలదన్నేలా రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటుచేసిన టీడీపీ నేతలు పందేల నిర్వాహకుల అవతారమెత్తారు. బెట్టింగ్లపై వచ్చే లక్షలాది రూపాయల కేవుల్ (నిర్వహణ వాటా) కోసం వారు కోడి పందేల నిర్వాహణకు క్యూకట్టారు. ఈసారి పోలీసులకు మామూళ్లు ఇచ్చే అవసరంలేకపోవడంతో మొత్తం మిగుల్చుకునేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. భీమవరం మండలంలోని ఓ గ్రామంలో గుండాట నిర్వహణకు బరి ఏర్పాటు చేసిన కోడిపందేల నిర్వాహకులకు రూ.72 లక్షలు ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారంటే జూదం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థంచేసుకోవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటుచేయగా.. వాటి పక్కనే పేకాట, కోతాట, గుండాట తదితర జూద కేంద్రాలనూ పెద్ద సంఖ్యలోనే ఏర్పాటు చేశారు. తూ.గో. జిల్లా అచ్చంపేట బరిలో తలపడుతున్న పందెం కోళ్లు పెదగరువులో క్యాసినో..: అమెరికాలోని లాస్వేగాస్లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా పెదగరువులో ప్రవేశపెట్టారు. దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన దీనిని ఈసారి మూడు బస్సుల్లో ఇక్కడ నిర్వహించారు. పైకి టూరిస్టు బస్సులా కన్పించే వీటిలో క్యాసినో నిర్వహణకు ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు విదేశీయులతోపాటు దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన జూదరులు అతిథులుగా వచ్చినట్టు తెలిసింది. ఒక్క సోమవారం నాడే ఈ ఆటలో సుమారు రూ.60 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. టీడీపీ నేతల కనుసన్నల్లో.. - పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని, ఉండి నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. - కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పందేలు ప్రారంభించారు. - పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు నేతృత్వంలోనూ, ఏఎంసీ మాజీ చైర్మన్ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ కోడిపందేలు జరిగాయి. - కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దగ్గరుండి మరీ నిర్వహించారు. - గుంటూరు జిల్లా తెనాలి వద్ద స్థానిక ఎస్ఐ కోడి పందేల టెంట్లను తొలగించడంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా అక్కడకు వెళ్లి పందేలు దగ్గరుండి మరీ నిర్వహించారు. పందేలకు తెలంగాణ ప్రముఖులు ఏటా రాష్ట్రంలో జరిగే కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఈసారీ పలువురు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరులో నిర్వహించిన కోడి పందేలకు హైదరాబాద్లోని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావులు హాజరు కాగా.. కృష్ణాజిల్లా కొత్తూరులో పందేలకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రకాష్గౌడ్, నాగేశ్వరరావులతోపాటు సినీనటులు శివారెడ్డి, జబర్దస్త్ నటులు వేణు, రాకేష్ తదితరులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల్లో 700కు పైగా బరులు ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 600 వరకు బరుల్లో పందేలు జరిగినట్లు సమాచారం. అలాగే, కృష్ణాలో ఈసారి రికార్డు స్థాయిలో 210కి పైగా బరుల్లో నిర్వహించారు. విజయవాడ భవానీపురంలో జరుగుతున్న కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించుకోవచ్చని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోను దాదాపు 150 బరుల్లో పందేలు జరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను కొనసాగాయి. కాగా, మొదటి రోజే కోడి పందేలు, జూదాల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. జిల్లాల్లో జోరుగా.. నిన్నటి వరకూ ఉక్కుపాదం మోపిన పోలీసులు.. వాటిని చూసీచూడనట్లు ఉండాలని సర్కారు నుంచి లోపాయికారిగా వచ్చిన సంకేతాలతో సోమవారం సైలెంట్ అయిపోయారు. దీంతో కోడి పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. - పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. వీటిని చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లోనూ పందేలు సాగించడానికి చాలా బరుల్లో ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేశారు. లక్ష్యణేశ్వరంలో యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ నటులతో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం పక్కనే బరి ఏర్పాటుచేశారు. ఈ జిల్లాలో తొలిరోజు రూ.120కోట్లకు పైగా పందేలు జరిగినట్లు సమాచారం. - ‘తూర్పు’లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పందేల సంఖ్య రెట్టింపయింది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మంగళ, బుధవారాలు సంక్రాంతి, కనుమ రోజున పందేలు ఎక్కువుగా జరగనున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 400కు పైగా బరిలు వెలిశాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురాల్లోనే పందేలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. - కృష్ణా జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.70–80 కోట్ల మేర కోడిపందేలు జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో పందేలు హోరెత్తాయి. ఇక్కడ ఒక్కచోటే రూ.15 కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. - గుంటూరు జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు. - విశాఖపట్నం జిల్లాలో సోమవారం అక్కడక్కడ జరిగాయి. మంగళ, బుధవారాల్లో విస్తృతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో ఏటా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. -
చింతమనేనిని అరెస్టు చేయాలి
ఏలూరు టౌన్: దెందులూరు నియోజకవర్గంలో పేదలు, దళితులపై నిరంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కఠిన చర్యలు తీసుకుని..వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. నాయుడుగూడెంలో దళితులపై అర్ధరాత్రి వేళ పోలీసులతో కలిసి టీడీపీ నేతలు చేసిన దాడుల్లో మహిళలు తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు, దళితులు ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు భారీసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, దళితులతో కలిసి ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ళ నాని మాట్లాడుతూ వందేళ్ల క్రితంనుంచి ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్న పేద దళితులను వెళ్లగొట్టి ..అక్కడ రోడ్డు వేయాలని నిర్ణయించడం.. దళితులపై చింతమనేనికి ఉన్న కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. అర్థరాత్రి వేళ పోలీసులు గ్రామంలో మోహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరిగిందని పేదలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. చింతమనేని అరాచకాలకు వత్తాసు పలికేందుకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. చింతమనేనిపై నమోదు చేసిన ఏ ఒక్క కేసులో అయినా పోలీసులు అరెస్టు చేశారా? పేదలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వట్లూరులో 300 ఎకరాల దళితుల భూములను ఓ టీడీపీ నేతకు కట్టబెట్టాలని చూస్తే..దళితులు తిరగబడితే నష్టపరిహారం ఇస్తామని స్వయానా కలెక్టర్ హామీ ఇచ్చినా.. అతీగతీ లేదని విమర్శించారు. నష్టపరిహారం అడిగిన దళితులను ఎమ్మెల్యే చింతమనేని దారుణంగా వేధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ..టీడీపీ నేతల అరాచకాలు ఇలానే కొనసాగితే ప్రజలు ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
వైఎస్సార్ సీపీ జెండా కట్టినందుకు..
సాక్షి, పెదపాడు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. వైఎస్సార్ సీపీ జెండాను ఇంటిపై కట్టినందుకు ఓ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగారు. ప్రభుత్వ భూమిగా సాకు చూపి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నారు. అడ్డుపడిన మహిళను పోలీసులు దౌర్జన్యంగా తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్కుమార్, పిట్టా స్టీఫెన్కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. వారు వైఎస్సార్ సీపీపై అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు. దీంతో భగ్గుమన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరవర్గం.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి రహదారి నిర్మించేందుకు పూనుకున్నారు. అందుకోసం అధికారులు ఇంటిని తొలగించేందుకు సిద్ధం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోతో చర్చలు జరిపారు. రెండురోజులు గడువు ఇచ్చిన అధికారులు గురువారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి ఇంటి తొలగింపునకు చర్యలు చేపట్టారు. తొలగింపు పనులను అడ్డుకున్న విజయకుమార్ భార్య విజయకుమారిని పోలీసులు నెట్టివేయడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి, అప్పనప్రసాద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మొండెం ఆనంద్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు పల్లెం ప్రసాద్ ఆమెను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. -
దళితులపై చింతమనేని కక్ష సాధింపు
-
రైతులపై చింతమనేని దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి : న్యాయం చేయాలంటూ వచ్చిన రైతుల పట్ల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ప్రవర్తించారు. వారిని బూతులు తిడుతూ.. అక్రమ కేసుల సైతం పెట్టడానికి సిద్ధపడ్డారు. వివరాలు.. గురువారం వట్లూరు జన్మభూమి మీటింగ్కు చింతమనేని ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై బూతు పురాణం ప్రారంభించారు. సహనం కోల్పోయిన అన్నదాతలు సమస్యను పరిష్కరించకుండా తమను తిట్టడం సరికాదంటూ వాదనకు దిగారు. దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి సదరు రైతులపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు రైతుల మీద 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కొఠారు రామచంద్ర రావు, కార్యకర్తలు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్కెళ్లి రైతులను పరామర్శించారు. -
దోపిడీ అంటే ఇదేరా..
రౌడీషీటర్ ఎమ్మెల్యే అయ్యారు.. నియోజకవర్గాన్ని తన సామ్రాజ్యమని భావించుకున్నారు.. 2014లో టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోడేస్తుంటే అడ్డొచ్చిన మహిళాధికారిని జుట్టు పట్టుకుని లాగి పడేసి.. పిడిగుద్దులు కురిపించిదుశ్శాసనుడిని మరిపించారు. ఈ దుశ్శాసనుడిని శిక్షించాల్సినప్రభుత్వ అధినేత దన్నుగా నిలవడమే కాదు.. విప్గా పదోన్నతి కల్పించి ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూప్రశంసించారు. అంతే.. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న ఆ ఎమ్మెల్యేఅరాచకాలకు.. ఆగడాలకు.. దోపిడీలకు..దౌర్జన్యాలకు నియోజకవర్గంలో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇంతకూఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా..మన దెందులూరు శాసనసభ్యుడు‘చింతమనేని ప్రభాకర్’. పశ్చిమగోదావరి, సాక్షి–టాస్క్ఫోర్స్ :పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన చింతమనేని ప్రభాకర్ రెండెకరాల రైతు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. సంఘ విద్రోహ పనులు చేస్తుండటంతో ఆయనపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన చింతమనేని ప్రభాకర్.. ఎవరూ ఊహించని రీతిలో పెదవేగి మండలాధ్యక్షుడిగా ఎన్నియ్యారు. ఈ రౌడీషీటర్కు 2009 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏరికోరి టీడీపీ టికెట్ ఇచ్చి దెందులూరు నుంచి బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో తన దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చింతమనేని 2014 వరకూ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండి కూడా పలు దాడులకు పాల్పడ్డారు. 2014 ఎన్నికల్లోనూ దెందులూరులో చింతమనేనికి మళ్లీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడి.. రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన టీడీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పంచభూతాలను దోపిడీ చేసి కేవలం నాలుగున్నరేళ్లలో రూ.2,000 కోట్లకుపైగా కొల్లగొట్టారని ఆ నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. చింతమనేని అరాచకాలకు జిల్లా ఉన్నతాధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయన ఆగడాలపై కేసులు పెట్టడానికి పోలీస్స్టేషన్లకు వెళ్తే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదని బాధితులు చెబుతున్న వ్యాఖ్యలే అందుకు తార్కాణం. పోలవరం కుడి కాలువలో మట్టి స్వాహా దెందులూరు నియోజకవర్గం పరిధిలో పోలవరం కుడి కాలువ 16 కిలోమీటర్ల పొడవునా తవ్వారు. కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని ఇరు వెపులా అటు వంద, ఇటు వంద మీటర్లు వెడల్పు, దాదాపు 30 అడుగుల ఎత్తున గుట్టలుగా పోశారు. ఈ మట్టి విక్రయానికి పోలవరం అధికారులు టెండర్లు పిలుస్తారు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతి లేకుండానే పోలవరం కుడి కాలువ నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించి.. క్యూబిక్ మీటర్ రూ.800 నుంచి రూ.900 చొప్పున విక్రయించి రూ.200 కోట్లకుపైగా దోచుకున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన పోలవరం కుడికాలువ పర్యవేక్షక ఇంజినీర్, ఆయన సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేనిపై కేసులు పెట్టే సాహసం చేయని ఈ అధికారులు.. ఆయన వ్యతిరేకులు, ఏదైనా సొంతఅవసరాలకు ఒకటో, రెండో ట్రాక్టర్లు గ్రావెల్ తరలిస్తే వారిపై కేసులు పెడుతున్నారు. చింతమనేని మట్టి దోపిడీపై పోలవరం కుడికాలువ అధికారులకు ఫిర్యాదు చేసిన గార్లమడుగు మాజీ సర్పంచ్ మేడికొండ వెంకట కృష్ణారావుపై చింతమనేని, అతని అనుచరులు దాడిచేసి, తీవ్రంగా గాయపరచడం ఆయన అరాచకాలకు పరాకాష్ట. ఈ వ్య వహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చింతమనేని నాలుగున్నరేళ్లుగా దోపిడీ చేయగా వదిలేసిన మట్టి.. అదీ కాలువ 85 కి.మీ. నుంచి 87 కి.మీ. వరకూ ఉన్న మట్టిని విక్రయించడం కోసం ఇటీవల టెండర్లు పిలవడం గమనార్హం. రిజర్వాయర్ పేరుతో భూములు కబ్జా చేసి గ్రావెల్ దోపిడీ పెదవేగి మండలం సూర్యారావుపేట తదితర 11 గ్రామాలకు చెందిన 60 మంది పేదలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్ర భుత్వం పంపిణీ చేసింది. ఈ అసైన్డు భూమిపై ఎమ్మెల్యే చింతమనేని కన్నుపడింది. ఆ భూమిలో రిజర్వాయర్ తవ్వి స్తానని, దీని వల్ల సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ ప్రాంత ప్రజలను నమ్మించారు. ఈ రిజర్వాయర్కు పోలవరం కుడికాలువ నుంచి నీటిని ఎత్తిపోయిస్తామని న మ్మబలికారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ తానే పరిహారంగా ఇచ్చి లాక్కున్నారు. ఆ ప్రాంతంలో రిజర్వాయర్ తవ్వుతామని నమ్మించేందుకు జిల్లా ఉన్నతాధికారి ఒకరిని ఆ ప్రాంతానికి రప్పించారు. ఆ తర్వాత తన అనుచరగణంతో ఆ భూమిలో గ్రావెల్ తవ్వించి.. యూనిట్ రూ.500 చొప్పున ట్యాక్స్ కట్టించుకుని విక్రయిస్తూ రసీదులు ఇస్తున్నారు. ఈ ట్యాక్స్ చింతమనేని జేబులోకి వెళ్తుంది. ఈ ట్యాక్స్ రూపంలో 2015 నుంచి రూ.150 కోట్ల మేర కొల్లగొట్టారని అంచనా. పారిశ్రామికవాడ పేరుతో 350 ఎకరాలు ఆక్రమణ పారిశ్రామికవాడ పేరుతో తాము సాగు చేస్తున్న అటవీ భూములను ఎమ్మెల్యే చింతమనేని కబ్జా చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదపాడు మండలం వట్లూరు పెద చెరువులోని 350 ఎకరాలను ఎమ్మెల్యే చింతమనేని స్వాధీనం చేసుకుని వేం టెక్నాలజీ సంస్థకు అప్పగించారు. ఇప్పటికీ అక్కడి రైతులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించలేదు. తాజాగా 2014లో పేదలకు çపంపిణీ చేసిన భూములను మధ్యలోనే రద్దు చేయించి.. వాటిని సాగు చేసుకుంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ భూముల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న 3 ఇళ్లను కూడా స్వయంగా చింతమనేని కూల్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమిని ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కు బదలాయించి.. భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు చింతమనేని కుట్ర పన్నారు. చింతమనేనికి జిల్లా ఉన్నతాధికారి ఒకరు పూర్తిగా వత్తాసు పలుకుతుండటం గమనార్హం. భారీ ఎత్తున భూముల కబ్జా ఎమ్మెల్యే చింతమనేని నియోజకవర్గంలో భారీ ఎత్తున భూములను కబ్జా చేశారు. గార్లమడుగు పంచాయతీ వెంకటకృష్ణాపురంలోని గుమిడిగుంటలో చోటుచేసుకున్న ఉదంతం వాటికి పరాకాష్ట. పొనమాటి సర్వేశ్వరరావు, లక్ష్మణరావు అన్నదమ్ములు. వీరికి ఆరు ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండెకరాలు పోలవరం కుడికాలువ కోసం సర్కార్ సేకరించింది. మిగిలిన నాలుగెకరాల భూమిలో ఒక పక్కన ఇళ్లు కట్టుకుని ఎప్పటి నుంచో జీవనం సాగిస్తున్నారు. కానీ.. ఆ పొలాన్ని వారి సోదరి అనసూయ గుడికి దానంగా రాసి ఇచ్చిందని.. కాబట్టి పొలాన్ని, ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే చింతమనేని తన అనుచరులతో బెదిరించారు. దీనికి వారు ఎదురుతిరిగారు. దాంతో రంగంలోకి దిగిన చింతమనేని స్వయంగా పొక్లెయిన్ రప్పించి ఇంటిని కూలగొట్టాడు. కూల్చిన ఇంటి నుంచి కిటికీలు, గుమ్మాలు సైతం తీసుకుపోయారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి లోపలకు వస్తే మీ అంతు చూస్తానంటూ ఆ అన్నదమ్ములను భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఈ భూమి విలువ రూ.2 కోట్లకుపైగా ఉంటుంది. ఇసుక, మట్టి దోపిడీ కోసం 500 టిప్పర్ల కొనుగోలు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. నియోజకవర్గంలో మట్టి, ఇసుక దోపిడీపై ఎమ్మెల్యే చింతమనేని కన్నేశారు. బినామీ పేర్లతో 500 టిప్పర్లను ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుని కొనుగోలు చేశారు. పెదవేగి మండలం నడిపల్లి, విజయరాయి, జానంపేట, తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో 2009 నుంచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమంగా ఇసుకను తవ్వేసి విక్రయిస్తూ అక్రమార్జన సాగించేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెలరేగిపోయారు. తమ్మిలేరులో భారీ ఎత్తున పొక్లయిన్ల ద్వారా ఇసుకను తవ్వేసి.. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ యూనిట్ ఇసుకను రూ.800 చొప్పున హైదరాబాద్, విజయవాడ, విశాఖçకు తరలిస్తూ సహజ సంపదను కొల్లగొట్టారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అనుమతి లేకుండా ఇసుకను తవ్వేస్తుండటంతో ముసునూరు తహసీల్దార్ వనజాక్షి అడ్డుకునేందుకు యత్నించారు. తన అక్రమార్జనకు అడ్డొచ్చిన వనజాక్షి జుట్టు పట్టుకుని.. ఈడ్చీపారేసి పిడిగుద్దులు కురిపించిన అభినవ దుశ్శాసనుడిగా చింతమనేని గుర్తింపు పొందారు. ప్రభుత్వ అధికారిపై దాడికి దిగిన చింతమనేనిని కఠినంగా శిక్షించాల్సిన సీఎం చంద్రబాబు.. దుప్పటి పంచా యతీ చేసి వనజాక్షిని మందలించి.. చింతమనేనికి విప్ పదవి ఇచ్చి సత్కరించడంతో ఆయన అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నాలుగున్నరేళ్లలో ఒక్క తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా విక్రయించడం ద్వారానే రూ.250 కోట్లకుపైగా చింతమనేని ప్రభాకర్ కొల్లగొట్టినట్లు అంచనా. పోలవరం అధికారులు చేతులు దులుపుకున్నారు కాదేది కబ్జాకు అనర్హం అన్న చందంగా ఎమ్మెల్యే చింతమనేని వ్యవహరిస్తున్నారు. పోలవరం కుడికాలువ నుంచి మట్టిని తరలించిన తర్వాత.. ఖాళీగా ఉన్న కాలువ భూమిని చదును చేసి, దర్జాగా పశుగ్రాసం పెంచుతూ తన వద్ద ఉన్న పాడి పశువులకు మేతగా తరలిస్తున్నారు. సమీపంలోని పాడి పశువుల పెంపకందారులకూ విక్రయిస్తున్నారు. ఏకంగా పోలవరం కాలువ గట్లను చదునుచేసి చింతమనేని సాగు చేస్తున్నా.. ఆ విషయం తమ దృష్టికి రాలేదంటూ పోలవరం అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పెదవేగి మండలంలో లక్ష్మీపురంలో సర్వే నంబర్ 31/1లో 2.40 ఎకరాల్లో వలసకుంట చెరువు ఉండేది. దీనిని జమిందార్ల చెరువుగా పిలిచేవారు. రాత్రికి రాత్రి చింతమనేని తన అనుచరులతో పోలవరం కుడి కాలువ నుంచి మట్టిని తరలించి పూడ్చేయించారు. ఈ చెరువును పూడ్చివేసిన స్థలం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చింతమనేని చెప్పినా ఇప్పటివరకూ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా కేటాయించకపోవడం గమనార్హం. పూడ్చిన ఈ చెరువులో కాసరనేని పృధ్వీ పేరు మీద ఒక బోరు తవ్వించారు. ఈ బోరు నుంచి పైపుల ద్వారా దూరంగా ఉన్న పొలాలకు నీటిని తరలిస్తున్నారు. బినామీలతో కొల్లేరు భూములపై కన్ను దెందులూరు నియోజవకర్గం పరిధిలో మొండికోడు, పైడిచింతపాడు, పెదయాగనిమిల్లి, కోమటిలంక తదితర 14 కొల్లేరు గ్రామాల ప్రజలు అభయారణ్యం పరిధిలో గతంలో సాగు చేసిన వెయ్యి ఎకరాల సొసైటీ చెరువులను సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ధ్వంసం చేసింది. కానీ.. ఎమ్మెల్యే చింతమనేని వాటిని మళ్లీ తవ్వించారు. 2016–17 మే నెలలో తవ్విన ఈ చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేపట్టారు. దీనిపై సొసైటీ సభ్యులు నిలదీస్తే నామమాత్రం లీజు డబ్బు చెల్లిస్తానంటూ నమ్మబలికారని.. రెండేళ్లుగా ఒక్కపైసా కూడా చెల్లించడం లేదని బాధితులు చెబుతున్నారు. దీనిపై బాధితులు ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రెండు నెలల క్రితం రిలే నిరాహార దీక్ష చేశారు. దాంతో వారిపై ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును చింతమనేని బనాయించారని అంటున్నారు. దోపిడీ అంటే ఇదేరా.. ♦ నియోజకవర్గంలో పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి పంచాయతీ రాజ్ శాఖ చేపట్టే రోడ్ల పనుల వరకూ ఏ పనిలోనైనా పది శాతం చొప్పున చింతమనేనికి ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కట్టకుంటే పనులు చేయకుండా అడ్డుకుంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ♦ ఉపాధిహామీ, నీరు–చెట్టు కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టి (గ్రావెల్)ని విక్రయిస్తూ వందల కోట్ల రూపాయలను అనుచరులతో కలిసి చింతమనేని దోచుకుంటున్నారు. ఇదే గ్రావెల్తో పంచాయతీరాజ్ శాఖ చేపట్టే రహదారులను నిర్మించి.. బిల్లులు చేసుకున్నారు. ♦ నియోజవకర్గంలో మద్యం దుకాణాల లైసెన్సులను ఎవరినీ దరఖాస్తుచేయకుండా అడ్డుకుని.. తన బినామీలతో వాటిని దక్కించుకుని.. ♦ కమీషన్లు తీసుకుని ఇతరులకు కట్టబెట్టారు. వాటికి అనుబంధంగాఊరూరా బెల్ట్షాపులు ఏర్పాటు చేయించి.. అధిక ధరలకు మద్యాన్నివిక్రయిస్తూ దోచుకుంటున్నారు. ♦ నియోజకవర్గంలో ఏ మండలంలోనైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే ఎకరాకు రూ.2 లక్షల చొప్పున చింతమనేని ట్యాక్స్ చెల్లించాలని ప్రజలు చెబుతున్నారు. ట్యాక్స్ కట్టిన తర్వాత ఎమ్మెల్యే అనుమతి ఇస్తేనే తహసీల్దార్లు భూమిని బదలాయించే ప్రక్రియను ప్రారంభిస్తారు. ♦ ఏ గ్రామంలోనైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రూ.50 వేలు, బోరు బావి తవ్వుకోవాలంటే రూ.లక్షను చింతమనేని ట్యాక్స్గా చెల్లించాల్సిందే. పెదపాడు మండలం నాయుడుగూడెం నుంచి వడ్డిగూడెంకు విద్యుత్ లైన్ ఏర్పాటుకు ఎకరాకు రూ.2 వేలు చొప్పున చింతమనేని ట్యాక్స్ వసూలు చేసినట్టు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ♦ ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో చింతలపూడి నియోజకవర్గంలో నామవరం పంచాయతీ పట్టాయిగూడెంలో రిజర్వ్ ఫారెస్ట్ భూమి 125 ఎకరాలు ఎమ్మెల్యే చింతమనేని బినామీ పేరిట కొనుగోలు చేశారని టీడీపీ నేతలే చెబుతుండటం గమనార్హం. -
టీడీపీ నేతలు ప్రశాంతంగా ఉండనీయట్లేదు: అపూర్వ
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు సరిచూసుకోకుండా తనకు సంబంధించి ఓ అభ్యంతరకరమైన ఇంటర్వ్యూను నెట్లో ఉంచిన ఓ యూట్యూబ్ చానల్పై చర్యలు తీసుకోవాలని సినీనటి అపూర్వ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు చేశా రు. వివరాలు.. అపూర్వకు భర్త సత్యనారాయణకు మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా కేసులు నడుస్తున్నాయి. సత్యనారాయణ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అనుచరుడిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్వస్థలంలోని ఆమె భర్తకు సంబంధించిన ఆస్తి దగ్ధమైంది. ఈ పని తన భార్య అపూర్వ చేసిందని ఆరోపిస్తూ సత్యనారాయణ ఓ యూట్యూబ్ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మరికొన్ని అభ్యంతరకర అంశాలూ పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన అపూర్వ తనకు సంబంధించిన ఆరోపణల విషయంలో తన వివరణ తీసుకోకుండా, ఏకపక్షంగా నెట్లో వీడియోను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రశాంతంగా ఉండనీయట్లేదు.. ‘దెందులూరులో మా ఇంటి ముందు టీడీపీ దిమ్మె కడుతుంటే నేను అడ్డుకున్నాను. దీంతో చింతమనేని అనుచరులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా భర్త కూడా చింతమనేని అనుచరుడే. టీడీపీ నేతలు నన్ను ప్రశాంతంగా ఉండనీయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని అపూర్వ కోరారు. -
నన్ను వేధిస్తున్నారు: నటి అపూర్వ ఫిర్యాదు
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ సినీ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని అనుచరులు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వదంతులు సృష్టించడంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న చింతమనేని అనుచరులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. అపూర్వ గతంలో ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి ముందు టీడీపీ దిమ్మ కడుతుంటే అడ్డుకున్నందుకే కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనను చింతమనేని తీవ్రంగా వేధించాడని.. ఆయన వల్లే గ్రామంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. -
టోల్గేట్ సిబ్బందిపై చింతమనేని చిందులు..
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేని మరోసారి తన మార్కు ఓవరాక్షన్ చేశారు. మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద తన వాహనాన్ని ఆపిన సిబ్బందిపై చింతమనేని దూషణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే పాస్ లేకుండా టోల్గేట్ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్గేట్ సిబ్బందిని దూషించారు. అయిన కూడా సిబ్బంది వెనక్కి తగ్గకపోవడంతో.. చింతమనేని కారు అక్కడే వదిలివేసి బస్సులో వెళ్లిపోయారు. టోల్గేట్ వద్ద వీఐపీ వాహనాలు వెళ్లే మార్గంలో వాహనాన్ని విడిచి వెళ్లారు. చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ లేకుండా, కారు పాస్ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చింతమనేనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తన కారును అక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలుసంటూ చింతమనేని వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. -
చింతమనేని చట్టాలకు అతీతుడా?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు చట్టాలు వర్తించవా? వరుసగా ప్రజలు, అధికారులు, విపక్ష నేతలు, అధికార పార్టీ నేతలపై దాడులు చేస్తున్నా మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం తప్ప వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో చింతమనేని ప్రభాకర్ పెట్రేగిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు నెలల క్రితం దెందులూరుకు చెందిన దివ్యాంగుడు, అతని తల్లితండ్రులపై దాడి చేయగా కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. రెండున్నర నెలల క్రితం దళిత కార్మికుడు జాన్పై దాడి చేయగా, కేసు నమోదుచేయడానికి కూడా పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ ఆ కేసు ముందుకు కదలడం లేదు. ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఉన్నా కేసు అతనికి అప్పగించకపోవడంపై అఖిలపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీ నుంచి సీఐ స్థాయి వరకూ అందరికీ నోటీసులు జారీ చేసింది. అయినా పోలీసుల్లో కదలిక రాలేదు. తాజాగా రెండురోజుల క్రితం వైఎస్సార్ సీపీకి చెందిన గార్లమడుగు మాజీ సర్పంచ్ మేడికొండ కృష్ణారావుపై కిడ్నాప్, హత్యాయత్నం కేసుల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఏ–2గా పెట్టారు. నమోదు అయిన సెక్షన్లు నాన్బెయిలబుల్ అయినా ఇప్పటివరకూ చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్లలేదు. ఏకంగా నాన్బెయిలబుల్ సెక్షన్లు నమోదు అయినా ఆయన ఎస్పీ ఆఫీసుకు వచ్చి దర్జాగా వెళ్లిపోయారు. కనీసం చింతమనేని అనుచరులను కూడా అరెస్టు చేయలేదు. ఈ కేసులో చింతమనేని గన్మేన్ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇప్పటివరకూ అతడిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. తొత్తులుగా ఇరిగేషన్ అధికారులు చాలాకాలం నుంచి పోలవరం కుడికాలువను యథేచ్ఛగా చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు తవ్వుకు పోతున్నా, దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావా ల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. లక్ష్మీపురం వద్ద పోలవరం మట్టిని తవ్వుకుంటున్నారని గార్లమడుగు మాజీ సర్పంచ్ కృష్ణారావు స్వయంగా పోలవరం కుడికాలువ సూపరింటెండింగ్ ఇంజినీర్కు ఫిర్యాదు చేస్తే మట్టితవ్వుకుపోతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి ఎమ్మెల్యేకు సమాచారం అందించడం విమర్శలకు దారితీసింది. ఇరిగేషన్ అధికారుల సమాచారంతో అక్కడికి వచ్చిన చింతమనేని అనుచరులు కృష్ణారావును కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకువెళ్లి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ అబ్బయ్యచౌదరి ఎస్ఈని కలిసి బాధితునికి రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. సీఎం అక్షింతలు? వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఎల్లోమీడియాలో లీకులు ఇచ్చారు. గార్లమడుగు మాజీ సర్పంచ్ మీద దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని చింతమనేనిపై మండిపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పునకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని, ఆ విషయం చింతమనేనికి చెప్పాలని, ఒకటి రెండు రోజుల్లో చింతమనేనిని అమరావతికి పిలిపించి మాట్లాడతానని చంద్రబాబు అన్నట్టు సమాచారం. చట్టంలోని నిబంధల ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికైనా పోలీసులు చింతమనేనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి. -
సొంత పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ చింతమనేని
-
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు, పెదవేగి రూరల్: అధికార టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సర్పంచ్ను అపహరించి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డాడు. వైఎస్సార్సీపీ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత మేడికొండ వెంకట సాంబశివ కృష్ణారావు గురువారం ఉదయం 11 గంటలకు ఏలూరు నుంచి స్వగ్రామం గార్లమడుగు వెళుతున్నాడు. మార్గంమధ్యలో పోలవరం కుడికాలువ గట్టుపై ఎమ్మెల్యే చింతమనేని వాహనాలు, ప్రొక్లెయిన్, టిప్పర్లు ఉండటాన్ని గమనించాడు. కాలువ గట్టుపై మట్టిని తవ్వి తరలిస్తున్నారని గుర్తించి, పోలవరం ఇరిగేషన్ ఎస్ఈకి ఫోన్లో ఫిర్యాదు చేశాడు. మట్టి తవ్వకాల వద్దకు ఇరిగేషన్ అధికారి చేరుకున్నారు. చింతమనేని ప్రభాకర్ అనుచరులు గద్దే కిశోర్, ఏలియా, మరో పది మంది పైగా టీడీపీ నేతలు వచ్చి తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ అక్కడే ఉన్న కృష్ణారావుపై దాడి చేశారు. అతడిని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే చింతమనేనితోపాటు ఆయన గన్మెన్లు బూటుకాలుతో పొట్టలో, తలపై తన్నడంతో కృష్ణారావు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కృష్ణారావుపై కేసు బనాయించేందుకు పెదవేగి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా మాజీ సర్పంచ్ కృష్ణారావుపై హత్యాయత్నం గురించి తెలుసుకున్న దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటరీ కో–ఆర్డినేటర్ కోటగిరి శ్రీధర్, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన పెదవేగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు, గన్మెన్లపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు పెదవేగి పోలీస్ స్టేషన్కు చేరుకుని కొఠారు అబ్బయ్య చౌదరితో చర్చించారు. ఎమ్మెల్యే చింతమనేనితోపాటు టీడీపీ నేతలు, గన్మెన్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితులపై పెదవేగి ఎస్సై వి.కాంతిప్రియ సెక్షన్ 341, 363, 323, 324, 379 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యాయత్నం కేసులో ఏ2గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ1గా చింతమనేని ప్రధాన అనుచరుడు గద్దే కిశోర్, ఏ3గా ఎమ్మెల్యే గన్మెన్ల పేర్లను చేర్చారు. తీవ్రంగా గాయపడిన మేడికొండ కృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
‘వారం లోగా చింతమనేనిని అరెస్ట్ చేయాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అరెస్ట్ చేయాలంటూ కమ్యూనిస్ట్ నేతలు డీజీపీని కలిశారు. కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేస్లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్, డేగా ప్రసాద్లు డీజీపీని కలిసి.. చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారంటూ ఆరోపించారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు -
చింతమనేని దూషణలు..హేయమైన చర్య
తాడేపల్లిగూడెం: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను చింతమనేని బండబూతులు తిడుతూ దూషించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట ఏరియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో దూసనపూడి విలేకరులతో మాట్లాడారు. చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారహీనంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన్ని కంట్రోల్ చేసే విధానం ప్రభుత్వానికి కనిపిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంటే శాసనాలు చేసి ప్రజల్ని పరిరక్షించాలి కానీ ఇలా జనాలపై దాడులు చేస్తూ, బాధ్యతా రాహిత్యంగా ఉన్న వ్యక్తికి శాసనసభకు వెళ్లే అర్హత లేదని స్పష్టం చేశారు. చింతమనేని వ్యవహారంలో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులను దూషించడం, వారిపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రాంతాలకతీతంగా జర్నలిస్టులంతా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. -
చింతమనేనిపై చర్యలు తీసుకోవాలి :జర్నలిస్టుల ధర్నా
-
చింతమనేనిపై జర్నలిస్టుల ఫిర్యాదు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులను అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యానికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం అదనపు ఎస్పీ ఈశ్వరరావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న కారణంగా చింతమనేని అనుచరుల వాహనాలను విజిలెన్స్ అధికారులు సంఘటనాస్థలంలోనే సీజ్ చేశారు. ఈ విషయం తెలిసి చింతమనేని, ఆయన అనుచరులు సుమారు 100 మంది సంఘటనాస్థలానికి చేరుకుని బలవంతంగా సీజ్ చేసిన వాహనాలను తీసుకుపోవడం, ఈ విషయమై విజిలెన్స్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. మీడియాపైనా చిందులు!
సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. తాను నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమను భయభ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం కొప్పాక వద్ద సాగుతున్న అక్రమ మైనింగ్పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి.. నాలుగు టిప్పర్లు, ప్రొక్లైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు దాడులు చేసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న చింతమనేని విజిలెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా టిప్పర్లనే సీజ్ చేస్తారా? మా వాళ్లపైనే కేసులా?’ అంటూ ఆయన దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదలాలంటూ అధికారులను బెదిరించారు. అయినా వాహనాలను వదలకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని వెనుదిరగగా.. ఆయన ప్రోద్బలంతో కొద్దిసేపటికి చింతమనేని సోదరుడు, దుగ్గిరాల మాజీ సర్పంచ్ చింతమనేని సతీష్ ఆధ్వర్యంలో వందమంది టీడీపీ కార్యకర్తలు విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. విజిలెన్స్ బృందాన్ని భయభ్రాంతులకు గురిచేసి.. సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు విజిలెన్స్ డీజీ దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. మీడియాపైనా రౌడీయిజం! ఈ ఘటన నేపథ్యంలో విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ అచ్యుతరావుని కలిసిన చింతమనేని ప్రభాకర్ .. అనంతరం మీడియాతోను దురుసుగా ప్రవర్తించారు. వివరణ కోరేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళుతూ.. చింతమనేని బూతుపురాణం విపారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా కోడక్కల్లారా’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కెమారామెన్లు, మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు. కాగా, అక్రమ మైనింగ్ చేస్తున్న నాలుగు టిప్పర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. వాటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని, ఈ ఘటనపై పెదవేగి పోలీసులకి ఫిర్యాదు చేశామని విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు మీడియాతో తెలిపారు. -
‘చింతమనేని అరాచకాలు ఎక్కువయ్యాయ్!’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు! చింతమనేనిని చూసి ఎందుకు భయపడుతున్నారని, చింతమనేనికి చట్టాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చెయ్యాలని, లేకపోతే అమరావతిలో ఆందోళన చేస్తామన్నారు. వారం రోజులకుపైగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్రభుత్వం కార్మికుల సమ్మెలను పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరువు వల్ల రైతులు అప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 29వ తేదీన అనంతపురంలో కరువుపై కవాతు నిర్వహిస్తామని తెలిపారు. తుఫాన్ వల్ల మరణించిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. నాలుగేళ్లు అయినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు.