deal
-
రూ.1400 కోట్ల డీల్.. డెల్హివరీ చేతికి ఈకామ్ ఎక్స్ప్రెస్
ముంబై: లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్ డెల్హివరీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈకామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు సుమారు రూ.1400 కోట్లు వెచ్చించనుంది. పూర్తి నగదు రూపంలోనే చెల్లింపు చేసేలా ఒప్పందం ఖరారు చేసుకుంది. ‘‘ఈకామ్ ఎక్స్ప్రెస్లో మెజారిటీ వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. 99.4 శాతం వాటాను రూ.1407 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’’ అని డెల్హివరీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.గురుగ్రామ్కు చెందిన ఈకామర్స్ ఎక్స్ప్రైస్ 2012 ఆగస్టులో ప్రారంభమైంది. అప్పటి నుంచి 200 కోట్ల షిప్మెంట్లు డెలివరీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,607.3 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,548.1 కోట్లుగా ఉంది. విలీన ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది.ఈ డీల్ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని డెల్హివరీ అంచనా వేస్తోంది. ఈ విలీనంతో కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ సాహిల్ బారువా తెలిపారు. డెల్హివరీతో భాగస్వామ్యం వల్ల మరింత వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని ఈకామ్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకులు కే సత్యనారాయణ పేర్కొన్నారు. -
TCS చేతికి హ్యాపీ హోమ్స్.. రూ. 2,250 కోట్ల డీల్
దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్.. కమర్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది. -
ఎయిర్టెల్ టీవీ, టాటా ప్లే విలీనం!
ముంబై: ప్రయివేట్ రంగ కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, భారతీ ఎయిర్టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారమిచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీసుల భారతీ టెలీమీడియా, టాటా ప్లే(గతంలో టాటా స్కై) విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఇటీవల కొంతకాలంగా దేశీ వినియోగదారుల అభిరుచి కేబుళ్ల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్వైపు మళ్లుతోంది. ఓటీటీల కారణంగా డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజులుగా లైసెన్స్ ఫీజు తగ్గింపునకు డీటీహెచ్ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రస్తుత 8 శాతం ఫీజును ఏజీఆర్లో 3 శాతానికి తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2027 చివరికల్లా ఫీజును ఎత్తివేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. డీటీహెచ్ యూజర్లు @ 6 కోట్లుతాజా డీల్ నేపథ్యంలో టాటా ప్లేకున్న 1.9 కోట్ల గృహాలతో ఎయిర్టెల్ కనెక్ట్ అయ్యేందుకు వీలు చిక్కనుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సైతం 1.58 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉంది. దీంతో టెలికం, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ సర్వీసులను కలిపి ట్రిపుల్ ప్లే వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశముంటుంది. ఓవైపు రిలయన్స్ జియో టెలికం, బ్రాడ్బ్యాండ్, కంటెంట్లతో ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ సమీకృత సేవలవైపు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ప్రస్తుతం డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు. ట్రాయ్ వివరాల ప్రకారం 2024 జూన్లో ఈ సంఖ్య 6.22 కోట్లుగా నమోదైంది. మొబైలేతర విభాగ ఆదాయాన్ని పెంచుకునే బాటలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్వర్జెన్స్పై దృష్టి పెట్టింది. దేశీయంగా డీటీహెచ్ సేవలలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న టాటా ప్లే గతంలో గ్లోబల్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ న్యూస్ కార్ప్తో భాగస్వామ్య సంస్థ(టాటా స్కై)ను ఏర్పాటు చేసింది. అయితే 2019లో మర్డోక్ సంస్థ ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేయడంతో భాగస్వామ్య వాటా చేతులు మారింది. ఇతర డీల్స్...ఎయిర్టెల్, టాటా ప్లే మధ్య డీల్ కుదిరితే డీటీహెచ్ రంగంలో రెండో అతిపెద్ద ఒప్పందంగా నిలవవచ్చు. ఇంతక్రితం 2016లో డిష్ టీవీ, వీడియోకాన్ డీ2హెచ్ విలీనమైన విషయం విదితమే. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనమయ్యాయి. ఫలితంగా జియోస్టార్ బ్రాండుతో దేశీయంగా అతిపెద్ద మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆవిర్భవించింది. వీటి సంయుక్త ఆదాయం 2024లో రూ. 26,000 కోట్లుగా నమోదుకావడం గమనార్హం! 2023–24లో భారతీ టెలీమీడియా రూ. 3,045 కోట్ల టర్నోవర్, రూ. 76 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే సమయంలో టాటా ప్లే నిర్వహణ ఆదాయం రూ. 4,305 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ నష్టం రూ. 354 కోట్లకు చేరింది. కాగా.. ఇంతక్రితం ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే సమాచార శాఖ కంపెనీ ఈక్విటీ నిర్మాణంలో సవరణలకు ఆదేశించడంతో లిస్టింగ్ కార్యాచరణను ఆలస్యం చేసింది. కంపెనీ ఆర్వోసీకి దాఖలు చేసిన తాజా సమాచారం ప్రకారం టాటా సన్స్ తదుపరి నెట్వర్క్ డిజిటల్ డి్రస్టిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ, టీఎస్ ఇన్వెస్ట్మెంట్స్.. విడిగా 20 శాతం వాటాలతో రెండో పెద్ద వాటాదారులుగా నిలుస్తున్నాయి. టాటా ప్లేలో బేట్రీ ఇన్వెస్ట్మెంట్స్(మారిషస్) పీటీఈ సైతం 10 శాతం వాటా కలిగి ఉంది. -
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్కు చెందిన పెట్రోబ్రాస్తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్ (UPM)తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు.ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది. -
'ది డీల్' తెలుగు సినిమా రివ్యూ
ది డీల్ తెలుగు సినిమా రివ్యూప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం నటుడు 'హను కోట్ల'. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం 'ది డీల్'.. అయితే, ఈ మూవీకి ఆయనే దర్శకుడు కావడం విశేషం. హను కోట్ల ఇప్పటికే బుల్లితెరలో ప్రసారం అయ్యే మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేయడమే కాకుండా పలు యాడ్స్ చేశారు. ఈ మూవీతో ఆయన వెండితెరకు దర్శకుడి పరిచయం కావడం విశేషం. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఇందులో చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నేడు శుక్రవారం (అక్టోబర్ 18) న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..? భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్కి గురై కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత నెమ్మదిగా ఆ కోమా నుంచి బయట పడుతాడు. కానీ తను గతం మర్చిపోతాడు. కోమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మి(ధరణి ప్రియా)ని తలుచుకుంటాడు. ఆమె తన భార్య అని, ఆమెని చూడాలని, కలవాలని అంటుంటాడు. తానెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ విలన్ ఇందు(సాయి చందన)ని చంపేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీని వెనకాల మాదవ్(రవి ప్రకాష్) ఉంటాడు. ఇందు ఎవరూ లేని ఒంటరి మహిళ. తను బ్యాంక్ లో ఎంప్లాయ్గా పని చేస్తుంటుంది. ఇందుని కాపాడి ఆమెకి దగ్గరవుతాడు భైరవ. తనని ఎందుకు చంపాలనుకుంటున్నారనేది, అదే సమయంలో తాను ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇందుని ఆసుపత్రిలో కలవడానికి మాదవ్, లక్ష్మి వస్తారు. అక్కడ లక్ష్మిని చూసి ఆమెని కలిసేందుకు భైరవ వెళ్లగా, ఎవరో తెలియనట్టుగా వెళ్లిపోతుంది. మరోసారి తను నా భార్య అంటూ ఆసుపత్రిలో గొడవ చేస్తారు. తమ ప్లాన్స్ కి అడ్డుగా వస్తున్న భైరవని కూడా చంపేయాలనుకుంటారు మాధవ్, లక్ష్మి. మరి భైరవ భార్య అయిన లక్ష్మి మాదవ్ని భైరవగా ఎందుకు చెబుతుంది..? ఆయనతో ఎందుకు తిరుగుతుంది..? ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు..? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె).. ఇందుకి ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు..? ఈ మొత్తం కథకి ఇందుకి ఉన్న సంబంధమేంటి..? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే 'ది డీల్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..టాలీవుడ్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ కథని అల్లుతూ సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలకు చాలా వరకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లో రీచ్ తక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న మేకర్స్ చేసే ఇలాంటి ప్రయోగాలు అభినందనీయంగా ఉండటం విశేషం. స్క్రీన్ప్లేలో చేసే మ్యాజిక్లు హైలైట్గా నిలుస్తుంటాయి. ది డీల్ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఆద్యంతం ట్విస్ట్ లతో సినిమాని నడిపించడం మరో హైలైట్ పాయింట్. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్ సుఫారీ తీసుకుని ఆమె హత్యకు చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్, అనంతరం ట్విస్ట్ లు ఆకట్టుకునే అంశాలు. ఫస్టాఫ్ అంతా హీరో యాక్సిడెంట్ తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మి మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతున్నాయి. ఇంటర్వెల్లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.సెకండాఫ్ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. సినిమా స్క్రీన్ప్లే పరంగా, ట్విస్ట్ల పరంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు. సినిమాని నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్ మిస్ అయ్యింది. ప్రారంభం నుంచి స్లోగా, సాగదీసినట్టుగా సాగుతుంది. ఎక్కడా వేగం కనిపించదు. కానీ ట్విస్ట్లు కొంత రిలీఫ్ ఇస్తాయి. అమ్మ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. అయితే కథ రొటీన్గానే ఉంది. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. ఇంకోవైపు సెకండాఫ్లో భైరవ ఎవరు అని తెలిసే సీన్లు, దీనికితోడు ఇందుని చంపే సీన్లు కూడా తేలిపోయేలా ఉన్నాయి. అవి కాస్త రొటీన్గానే ప్లాన్ చేశారు. సినిమాని వేగంగా పరిగెత్తించేలా తీసి ఉంటే బాగుండేది. స్లోగా సాగడంతో కొన్ని చోట్ల సీరియల్ని తలపిస్తుంది. మరోవైపు ఆర్టిస్ట్ల నటన కూడా చాలా వరకు అసహజంగానే అనిపిస్తాయి. అనుభవ లేమి కనిపిస్తుంది. మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. దీంతో ఓ మంచి సినిమా యావరేజ్గా మారిపోయింది.టెక్నీషియన్లుసినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం ఓకే అనిపించేలా ఉంది. బీజీఎం మైనస్గా చెప్పొచ్చు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కూడా ఇంకా బాగా ఎడిటింగ్ చేయాల్సింది. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బెటర్గా చేయోచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే అనిపించాయి. ఇక దర్శకుడు కథ రెగ్యూలర్గానే తీసుకున్నా, తాను ట్విస్ట్ లతో రాసుకున్న తీరు బాగుంది. అయితే దర్శకుడిగా కొంత అనుభవ లేమి కనిపించినా, ట్విస్ట్ లు సినిమాకి రిలీఫ్నిచ్చే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్ పార్ట్ని పోషిస్తుంది. -
పాక్ సంక్షోభం: లక్షల ఉద్యోగాల కోత.. మంత్రిత్వశాఖల రద్దు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.అమెరికా నుంచి తిరిగి వచ్చిన పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మీడియాతో మాట్లాడుతూ ఐఎంఎఫ్తో రుణ ఒప్పందం ఖరారయ్యిదని, ఇందుకోసం తాము కొన్ని విధానాలు అమలు చేయాల్సివుంటుందన్నారు. అలాగే జీ 20లో చేరాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయాల్సివస్తుందన్నారు. మంత్రిత్వ శాఖల పరిధిలో రైట్ సైజింగ్ పనులు జరుగుతున్నాయని, ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం త్వరలో అమలులోకి వస్తుందని, రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలలో 1,50,000 పోస్టులు రద్దు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.పెరుగుతున్న పన్నుల రాబడి గురించి ఆయన మాట్లాడుతూ గత ఏడాది మూడు లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరరని, ఈ ఏడాది ఇప్పటివరకు 7,32,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుండి 3.2 మిలియన్లకు చేరుకుందన్నారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి -
మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు.. కుదిరిన డ్రోన్ డీల్
న్యూయార్క్: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెలావెర్లో విల్లింగ్టన్లోని అధ్యక్షుడు జో బైడెన్ నివాసానికి చేరుకొని భేటీ అయ్యారు. ఇరునేతలు తొలి రోజు సమావేశంలో భారతదేశం, అమెరికా మధ్య బిలియన్ డాలర్ల డ్రోన్ ఒప్పందంపై సంతకం చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఇక.. డ్రోన్ డీల్పై కూడా ఇరువురు నేతలు పూర్తిస్తాయిలో చర్చించుకున్నారు.President Biden welcomes progress on India's procurement of MQ-9B aircraft; lauds effort to advance cooperation in space, cyberRead @ANI Story | https://t.co/ZD0J1mpVfi#PMModi #JoeBiden #Delaware #US pic.twitter.com/ZGJPsHBQ83— ANI Digital (@ani_digital) September 21, 2024 భారతదేశం అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ఈ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చు దాదాపు 3 బిలియన్ డాలర్లు ఉండనుంది. ముఖ్యంగా చైనా సరిహద్దు వెంబడి సాయుధ బలగాల నిఘా యంత్రాంగాన్ని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.#PMModiInUS | India and the US today firmed up multi-billion dollar drone deal as PM Modi met Joe Biden on the first day of his three-day visit to the US. @VishnuNDTV's big takeaways from PM Modi, President Biden bilateral meeting pic.twitter.com/Nl0YqEBtgN— NDTV (@ndtv) September 22, 2024క్రెడిట్స్: NDTV (@ndtv)ఇక.. ఈ ఒప్పందానికి సంబంధించి దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది(2023) జూన్లో రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా నుంచి ప్రభుత్వం నుంచి MQ-9B స్కై గార్డియన్ , సీ గార్డియన్ సాయుధ డ్రోన్ల సేకరణ ఫ్రెమ్ వర్క్కు ఆమోదం తెలిపింది. డ్రోన్ల కొనుగోలుతో పాటు, భారత నావికాదళం ఈ ఏడాదిలో మరో రెండు ప్రధాన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మరో 3 స్కార్పెన్ జలాంతర్గాములు, 26 రాఫెల్-ఎమ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది.చదవండి: ఉక్రెయిన్పై ఏం చేద్దాం? -
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్తో ఎంటర్టైన్మెంట్ చానల్తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూవీని 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు.మొదటి నుంచే బజ్ ఉన్న మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తి కాలేదు.కాగా.. ఈ చిత్రంలో రామ్కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. -
మరో భారీ డీల్ను దక్కించుకున్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్ను దక్కించుకుంది. హెచ్సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్లో పేర్కొంది. -
సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్ ఆధిపత్యానికి ఎసరు!
యూనైటెడ్ స్టేట్స్తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ 9తో ముగిసింది. ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది.1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకార శకానికి నాంది పలికింది. ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్, ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూప్రింట్ గా భావించారు.సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. పెట్రోడాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ప్రత్యామ్నాయ కరెన్సీలకు తలుపులు తెరుస్తుంది. పెట్రోడాలర్ ఒప్పందం ముగింపు ప్రభావాలు ఇవే..యూఎస్ డాలర్ కాకుండా చైనీస్ ఆర్ఎంబీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడోలార్ వ్యవస్థ నుంచి దూరంగా వెళుతోంది. 1972లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది. ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతాయి.పెట్రోడాలర్ వ్యవస్థ చాలాకాలంగా యూఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యూఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యం, నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తుంది. సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గవచ్చు. ఇది దాని మారకం రేటు, ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుందిసౌదీ అరేబియా "పెట్రోయువాన్" వైపు అడుగులు వేస్తే, అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది.సౌదీ అరేబియా బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం చెల్లింపు పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది. ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది. -
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత్ ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు.కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభించింది. 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి.నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో చెప్పారు. -
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
టీసీఎస్కు కువైట్ బ్యాంక్ డీల్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్ బ్యాంకు డీల్ను దక్కించుకుంది. కువైట్లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్ కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.ఈ డీల్లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్ సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్వర్క్తో కువైట్లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్లను నిర్వహించడానికి, ఆటోమేషన్ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ వెంకటేశ్వరన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
చిన్న పార్టీనే.. కానీ చుక్కలు చూపించింది!
జైపూర్: రాజస్థాన్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్ను దాఖలు చేసిన కాంగ్రెస్కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గిరిజనుల్లో గట్టి పట్టు గుజరాత్లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్గఢ్, బన్స్వారా దుంగార్పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. -
ఐడీబీఐపై ఫెయిర్ఫాక్స్ కన్ను
ముంబై: పీఎస్యూ.. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి కెనడియన్ పీఈ దిగ్గజం ఫెయిర్ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్ఫాక్స్ అధినేత బిలియనీర్ ప్రేమ్ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది. రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్ఫాక్స్ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్ఫాక్స్ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్బీ విలీనం దేశీయంగా సీఎస్బీ బ్యాంక్కు ఫెయిర్ఫాక్స్ ప్రమోటర్గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్బీ ప్రమోటర్గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్ రెండు బ్యాంకులకు ప్రమోటర్గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే. కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్ఫాక్స్ ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది. ఐడీబీఐ బ్యాంకులో సీఎస్బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. సవరించిన ఆఫర్ ద్వారా ఫెయిర్ఫాక్స్కు చెక్ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది. ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించనుంది. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి! -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్స్టార్నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్ల కంటెంట్ను ఒకే యాప్లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలో టెన్షన్ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!
బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్ మనీ డీల్' చేయబోతోంది. ఏంటీ బ్లడ్ మనీ డీల్..? ఏంటా ఆ తల్లి గాథ అంటే.. నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్పోర్ట్ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్కి మత్తు మందులను ఇంజెక్ట్ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు. అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్ ట్రయల్ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్ మనీ డీల్' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు. అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది. దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్ మనీ డీల్" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 'బ్లడ్ మనీ డీల్' అంటే.. యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్ మనీ డీల్" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
టీనేజ్ పిల్లలను ఇలా హ్యాండిల్ చేస్తే.. దెబ్బకు మాట వింటారు
‘మా అమ్మాయి నిన్నమొన్నటి వరకూ చెప్పినట్లు వినేది. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలుసులే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పిల్లతో వేగేదెట్లా’ ఓ తల్లి కలవరం. ‘నేనేం చెప్పినా మావాడు ఎదురు మాట్లాడుతున్నాడు. కొంచెం గొంతు పెంచితే చేతిలో ఉన్నది పగలకొట్టేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడంలేదు’ ఓ తండ్రి బాధ. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇదే స్థితి. మొన్నటివరకు పిల్లిపిల్లల్లా తమ వెనుకే తిరిగిన బిడ్డలు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే భరించలేరు. బాధపడుతుంటారు. టీనేజ్ గురించి, ఆ వయసులో వారి తీరు గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ వయసు పిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకుంటే వారిని అదుపు చేయడం, సరైన మార్గంలో నడిపించడం చాలా సులువైన విషయం. ఇదో విప్లవాత్మక దశ.. టీనేజ్ లేదా కౌమార దశ అనేది చాలా విప్లవాత్మకమైన దశ. హర్మోన్ల పని తీరు ఉధృతమవుతుంది. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు.. కోరికలు పుడుతుంటాయి. సమాజాన్ని మార్చేయాలని.. ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం ఈ వయసులో అత్యంత సహజం. బాల్యం నుంచి వయోజనుడిగా మారే క్రమంలో తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్తుంటారు. అది తమ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కాదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వారి విమర్శలను సీరియస్గా తీసుకుని బాధపడకుండా లేదా గొడవ పడకుండా వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. స్నేహితుడిలా మాట్లాడాలి.. వయసుకు వచ్చిన పిల్లల్ని మనతో సమానంగా చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ మాట పాటిస్తే చాలు బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయి. చిన్నపిల్లలను తిట్టినట్టు తిట్టకుండా, కొట్టకుండా.. స్నేహితులతో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ మేరకు కమ్యూనికేషన్ను మార్చుకోవాలి. వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నారని, సొంతగా నిర్ణయించుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తించాలి, గౌరవించాలి. తమ జనరేషన్కు, పిల్లల జనరేషన్కు అభిప్రాయాలు, అభిరుచుల్లో తేడాలుంటాయని గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే వారితో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయగలం. సవాళ్లు విసరొద్దు.. ఇంట్లో టీనేజ్ పిల్లలున్నప్పుడు వాదోపవాదాలు సహజం. అయితే ఆ సమయంలో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. టీనేజర్ మన పెంపకాన్ని విమర్శిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. అయినా సరే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. ‘నాకు చేతనైంది నేను చేశా, నువ్వేం చేస్తావో చేసి చూపించు’ లాంటి సవాళ్లు విసరకూడదు. దానికన్నా ఏమీ మాట్లాడకపోవడం మంచిది. పిల్లలపై మాటల్లో గెలవడం కంటే, వాళ్ల మనసుల్లో నిలవడం ముఖ్యమని గుర్తించాలి. ఇలాంటి మాటలన్నీ తాత్కాలికమని అర్థం చేసుకోవాలి. ‘మేం పేరెంట్స్మి, మా మాట వినాలి’ అనే అహాన్ని లేదా అధికారాన్ని వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం. టీనేజర్ మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు.. 1. నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంకా బెటర్గా ఉండేందుకు ప్రయత్నిస్తా. 2. ఐయామ్ సారీ, ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది. 3. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు. 4. నువ్వు బాధపడేలా చేసినందుకు సారీ. 5. మన మధ్య విషయాలు కష్టంగా ఉన్నాయని తెలుసు. దీన్ని బెటర్ చేసేందుకు ఇద్దరం కలసి పనిచేద్దాం. 6. ఏం జరిగినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో. మన మధ్య బంధం బలంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నా. మీ టీనేజర్ కష్టపడుతున్నప్పుడు.. 1. నేను నీకు ఎలా హెల్ప్ చేయగలనో చెప్పు. 2. నీకు నేనున్నాను. 3. నేను నిన్ను, నీ సామర్థ్యాన్ని నమ్ముతాను. 4. అవును, అది చాలా కష్టంగా ఉంది. 5. అవును, అది కష్టమని నువ్వు అనుకోవడం కరెక్టే. 6. తప్పులు చేయడం ఓకే. అందరం చేస్తాం. టీనేజర్ పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి.. 1. ఐ లవ్ యూ ఫర్ హూ యూ ఆర్. 2. నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. 3. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. 4. నువ్వు సాధించిన దాని గురించి కాదు.. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ హూ యు ఆర్. 5. మనిద్దరం కలసి మంచి జ్ఞాపకాలను సృష్టించడం నాకు చాలా ఇష్టం. 6. నువ్వు నా దగ్గరకు రావడం, నాతో ఉండటం నాకు చాలా ఇష్టం. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
నిలిచిన బందీల విడుదల!
జెరుసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
హమాస్తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మంది బందీలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కేబినెట్ తీర్మాణాన్ని ఆమోదించింది. హమాస్తో యుద్ధం ప్రారంభమైన నాటినుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో మహిళలు, పిల్లలను కాపాడుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రతి రోజూ 12 మంది చొప్పున విడుదల చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. గాజాకు అధిక మొత్తంలో ఇంధన, మానవతా సాయం అందడానికి కూడా అనుమతించింది. అటు.. హమాస్ చెరలో దాదాపు 240 మంది ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం గాజాపై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ను అంతమొందించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎడతెరిపిలేని యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను పూర్తిగా ఖాలీ చేయించింది. ప్రస్తుతం దక్షిణ గాజాపై యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: బందీలకు ఇక విముక్తి! -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్లను ఒకే డ్యాష్బోర్డ్లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
అంతర్జాతీయ విస్తరణలో ఎయిర్ ఇండియా.. అమెరికన్ ఎయిర్లైన్స్తో ఒప్పందం
దేశీయ దిగ్గజం 'టాటా' యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) 'అలాస్కా ఎయిర్లైన్స్'తో ఇంటర్లైన్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ ఇండియా న్యూయార్క్ JFK, నెవార్క్-న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్ గేట్వేల నుంచి అమెరికా, మెక్సికో, కెనడాలోని 32 గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ద్వైపాక్షిక ఇంటర్లైనింగ్ ద్వారా రెండు విమానయాన సంస్థలు ఒక నెట్వర్క్లో టిక్కెట్లను విక్రయించనున్నాయి. అంతే కాకుండా రెండు ఎయిర్లైన్స్ స్పెషల్ ప్రోరేట్ ఒప్పందాన్ని కూడా నమోదు చేసుకోవడం వల్ల అలస్కా ఎయిర్లైన్స్ కవర్ చేసే మార్గాలలో ఎయిర్ ఇండియాను అనుమతిస్తుందని ఎయిర్లైన్ ప్రతినిధి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ 'నిపున్ అగర్వాల్' మాట్లాడుతూ.. అలాస్కా ఎయిర్తో ఏర్పరచుకున్న ఒప్పందం అమెరికా, కెనడాలో విస్తృత సేవలను అందించడానికి మాత్రమే కాకుండా.. నెట్వర్క్ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. -
శభాష్ కిషన్: ఒక్క డీల్తో వందల కోట్లు..అంతేనా..!
అసోంలోని డిబ్రూఘర్కు చెందిన యువకుడు కిషన్ బగారియా బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. కిషన్ రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను టెక్ట్స్డాట్కామ్ను అమెరికా పాపులర్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈడీల్ విలువ ఏకంగా రూ.416 కోట్లు. అంతేకాదు వర్డ్ ప్రెస్డాట్కామ్, ఆటోమాటిక్ ఇంక్ వ్యవస్థాపకుడు మాట్ ముల్లెన్వెగ్ కిషన్ బగారియాపై ‘టెక్ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీంతో టెక్నాలజీ రంగంలో భారతీయ యువత ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. చారియాలీ ప్రాంతానికి చెందిన మహేంద్ర బగారియా, నమితా బగారియా దంపతలు కుమారుడు కిషన్ బగారియా మెసేజింగ్ యాప్ టెక్ట్స్ డాట్కామ్ను డెవలప్ చేశాడు. ఇటీవల అమెరికా వెళ్లిన కిషన్ ఆన్లైన్ ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ టెక్ట్స్డాట్కామ్ను రూపొందించాడు. వాట్సాప్, మెసెంజర్, లింక్డిన్, సిగ్నల్, ఇన్స్ట్రాగ్రామ్, ట్విటర్ తో సహా మీ అన్ని మెసేజింగ్ యాప్లను ఒకే డ్యాష్బోర్డ్లో తీసుకువస్తుందీ యాప్. భిన్న వేదికల్లో మెసేజ్ చేసేందుకు ఆల్ ఇన్ వన్ యాప్ ద్వారా మెసేజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని వాటి కోసం ప్లాన్లు ఉన్నాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. తాజా కొనుగోలుతో కిషన్ బగారియా, తన యాప్ బృందంలోని మిగిలిన వారితో పాటు మెసేజింగ్ కొత్త హెడ్గా కంపెనీలో చేరనున్నారు. ప్రస్తుతమున్న తమ యాప్ యూజర్ల సేవల్లో ఏమీ మార్పు ఉండదు. మరిన్ని ఫీచర్లు, మొబైల్ యాప్స్ అందుబాటులోకి రానున్నాయి అంటూ ట్విటర్లో వెల్లడించాడు కిషన్. కిషన్ బగారియా ప్రాథమిక విద్యను డిబ్రూఘర్లోనే పూర్తి చేసిన కిషన్ ఎపుడూ కాలేజీకి కూడా వెళ్లలేదట. తన విజ్ఞానం అంతా ఇంటర్నెట్నుంచి నేర్చుకున్నదే అంటాడు. అయితే అధునిక టెక్నాలజీలో మరిన్ని వెళకువలు నేర్చుకునేందుకు గత ఏడాది శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాడు. పన్నెండేళ్ల వయసులో స్మాల్ విండోస్ యాప్ తయారీపై దృష్టిపెట్టాడు. కిషన్ సోదరుడుకూడా అమెరికాలో యాప్ తయారీలో బిజీగా ఉన్నాడట. దీంతో బగారియా బ్రదర్స్ యాప్ ప్రపంచాన్ని రాక్ చేయనున్నారంటూ సన్నిహితులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. -
‘స్కిల్’లో చంద్రబాబు దోపిడీ
నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్లపై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని జైల్లో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నాడని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమాలపై కోర్టులకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్కు కూడా అర్థమైందని తెలుస్తోందన్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. -
అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్?
దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీర్లను కలుస్తారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కలవడం వెనుక తన ఇమేజ్ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్ ఇస్లామాబాద్కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. పాక్ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు! -
దూసుకుపోతున్న అనన్య బిర్లా: కోట్ల డీల్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమారమంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మ రుణాల సంస్థ ’స్వతంత్ర’ తాజాగా చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,479 కోట్లు వెచ్చించనుంది ఈ లావాదేవీ 2023 చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్కార్ట్ సహ–వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్కి చెందిన నవీ గ్రూప్లో చైతన్య ఇండియా భాగంగా ఉంది. చైతన్య కొనుగోలు ద్వారా 36 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు, 20 రాష్ట్రాల్లో 1,517 శాఖలు, రూ. 12,409 కోట్ల అసెట్స్ (ఏయూఎం)తో స్వతంత్ర దేశీయంగా రెండో అతి పెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థగా ఆవిర్భవించనుంది. 2013లో అనన్య బిర్లా ప్రారంభించిన స్వతంత్రలో రూ. 7,499 కోట్ల ఏయూఎం, 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు, 22 లక్షల గ్రామీణ కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్కు రూ. 4,900 కోట్ల ఏయూఎం, 6,000 మంది ఉద్యోగులు, 14 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా, దాని మాతృ సంస్థ నవీ ఫిన్సర్వ్ను 2019లో బన్సల్ కేవలం రూ. 150 కోట్లకు కొనుగోలు చేశారు. గత నాలుగేళ్లలో చైతన్య ఆరు రెట్లు వృద్ధి చెందినట్లు బన్సల్ తెలిపారు. ఈ కొనుగోలుతో తమ సంస్థ విస్తృతి మరింత పెరగగలదని అనన్య బిర్లా తెలిపారు. -
ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్తో భారీ డీల్!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్యూఎల్ లాంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్తో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
తుది దశలో టాటా-విస్ట్రాన్ డీల్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా టాటా గ్రూప్ ఈ డీల్ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్ ఉత్పత్తులను కూడా అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్కు చెందిన విస్ట్రాన్తో పాటు ఫాక్స్కాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
ఇన్ఫోసిస్ జాక్పాట్! రూ. 3,722 కోట్ల భారీ డీల్ కైవసం..
ఇన్ఫోసిస్ జాక్పాట్ కొట్టేసింది. డెన్మార్క్ దేశానికి చెందిన డాన్స్కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ను దక్కించుకుంది. ఇందు కోసం 454 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 3,722 కోట్లు) డీల్ దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా తెలిపింది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ 900 మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, మరో మూడు సంవత్సరాల వరకు పునరుద్ధరించరించే ఆస్కారం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. యూకేకి చెందిన నేషనల్ ఎంప్లాయిమెంట్ సేవింగ్స్ ట్రస్ట్ (NEST) నుంచి 1.1 బిలియన్ డాలర్ల డీల్ను టీసీఎస్ దక్కించుకున్న కొన్ని రోజులకే ఇన్ఫోసిస్కు ఇంత పెద్ద డీల్ దక్కడం గమనార్హం. తమ మెరుగైన డిజిటల్, క్లౌడ్, డేటా సామర్థ్యాలతో డాన్స్కే బ్యాంకు కోర్ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ సహకరిస్తుందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డాన్స్కే బ్యాంకుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. యాక్సెంచర్పై గెలిచి.. పోటీలో ఉన్న యాక్సెంచర్ కంపెనీపై గెలిచి డాన్స్కే బ్యాంకు డీల్ను ఇన్ఫోసిస్ సాధించింది. ఈ డీల్లో భాగంగా భారత్లోని బెంగళూరులో ఉన్న డాన్స్కే బ్యాంక్ ఐటీ కేంద్రం కూడా ఇన్ఫోసిస్ నిర్వహణలోకి రానుంది. ఈ కేంద్రంలో సుమారు 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా గత మేలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ‘బీపీ’ నుంచి 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను దక్కించుకోవడం తెలిసిందే. 2020 సంవత్సరం చివరిలో జరిగిన డైమ్లర్ ఒప్పందం తర్వాత ఇదే అతిపెద్ద డీల్. ఇదీ చదవండి: అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు -
మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా?
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై వేటు వేస్తున్న సంస్థల జాబితాలో చేరి పోయింది. ఇషా అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది చాలదన్నట్టు మరో 9 వేలమందిని తొలగించేందుకు యోచిస్తోందట. ఇటీవల చేసుకున్న 28 వేల కోట్ల డీల్ తరువాత ఈనిర్ణయం తీసుకుందని అంచనా. (Meta Layoffs ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్లకు షాక్!) తాజా నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ 15వేల మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగాఇప్పటికే వెయ్యిమందిని తొలగించింది. వీరిలో 500 మంది కార్పొరేట్ ఉద్యోగులే. ఇక మలిరౌండ్లో మరో 9000 మందిని రిజైన్ చేయాల్సిందిగా కోరనుంది. అంతేకాదు వేలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల పథకం (పిఐపి) కిందికి తీసుకు రానుంది. మొత్తం సేల్స్, మార్కెటింగ్ టీమ్ సాలరీ స్ట్రక్చర్ని వేరియబుల్ పే స్ట్రక్చర్కు మార్చి వేసిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. తన ఖర్చులను తగ్గించడం ద్వారా తన లాభాలను ఏకీకృతం చేయాలనుకుంటోంది. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు 3500 మంది ఉద్యోగులను కూడా తీసుకుంది. రిలయన్స్ రిటైల్ 2022-2023 నాలుగో త్రైమాసికంలో రూ. 2415 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.9 శాతం పుంజుకుంది. ఇలాంటి బిజినెస్ న్యూస్ అప్డేట్స్, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
అంబానీ Vs టాటా: కొత్త వ్యాపారంలోకి అంబానీ, నటి సారా సందడి!
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో ఇటీవలి కాలంలో రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త వ్యాపారాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా రిలయన్స్ బ్రిటిష్ కాఫీ షాప్ ప్రెట్ ఎ మ్యాంగర్ను దేశానికి తీసుకురావడం ద్వారా టాటాతో పోటీకి సౌ అంటోంది. దీనికి సంబంధించి బ్రిటీష్ శాండ్విచ్ అండ్ కాఫీ చైన్ 'ప్రెట్ ఎ మాంగర్' తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ బ్రిటిష్ కాఫీ భాగస్వామ్యంలో ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో మేకర్ మ్యాక్సిటీలో ప్రీట్ ఎ మ్యాంగర్ తన తొలి అవుట్లెట్ ప్రారంభమైంది. ప్రెట్ ఎ మేంగర్ షాప్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పాల్గొన్నారు. ముంబై షాప్ 2,567 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద డైనింగ్ స్పేస్తో ఉన్న ప్రెట్ ఐకానిక్ స్టోర్ లాంచింగ్పై సారా కాఫీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. కాఫీ అంటే చాలా ఇష్టమని నాన్నతో కలిసి లండన్లోని ప్రెట్ స్టోర్ని చాలాసార్లు సందర్శించాను ఇపుడిది మన దేశానికి రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. (లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం) రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యం కోసం గత ఏడాది బ్రిటిష్ యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 ప్రీట్ ఎ మాంగర్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. తొలి ఏడాదిలోనే పది 'ప్రెట్ ఎ మ్యాంగర్' స్టోర్లను ప్రారంభించనున్నామని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రిలయన్స్ బ్రాండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దర్శన్ మెహతా, యూకే బ్రాండ్ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రాధాన్యతలు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రెట్ బ్రాండ్ను రిలయన్స్ ద్వారా లాంచ్ చేయడం ఆనందమని బృందంతో ప్రెట్ ఎ మాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తెలిపారు. చాలా కాలంగా ఇండియాకు రావాలనేది లక్ష్యం. ముంబైలో తొలి స్టోర్ను లాంచ్ చేయడం తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలలో ఒక మైలురాయని చెప్పారు. యుఎస్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ దేశంలో తన తొలి రెండు స్టోర్లను ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ప్రెట్ ఎ మ్యాంగర్స్ ఇండియన్ స్టోర్ను ప్రారంభించడం విశేషం. టిమ్ కుక్ ఇండియా టూర్లో భాగంగా ముంబైలోని ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల ఆంటిలియాని ఇంటిని కూడా సందర్శించారు. కాగా 1986లో లండన్లో ప్రారంభమైన ప్రెట్ ఎ మాంగర్ యూఏ, అమెరికా హాంకాంగ్, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, సింగపూర్ జర్మనీతో సహా దేశాల్లో దాదాపు 550 దుకాణాలను నిర్వహిస్తోంది. అలాగే టాటా స్టార్బక్స్కు 30 నగరాల్లో 275 స్టోర్లున్నాయి. 50 శాతం వాటాతో అమెరికన్ కాఫీ చైన్నునిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటాలు కొత్తగా రికార్డు స్థాయిలో 50 స్టోర్లను ప్రారంభించారు. 2025 నాటికి దేశీయ కాఫీ మార్కెట్ 4.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. -
ఫ్లాగ్స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు
న్యూయార్క్: గత వారం మూతపడిన సిగ్నేచర్ బ్యాంకు మెజారిటీ ఆస్తుల కొనుగోలుకి న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అంగీకరించింది. డీల్ విలువ 2.7 బిలియన్ డాలర్లు (రూ. 22,300 కోట్లు)గా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ (ఎఫ్డీఐసీ) వెల్లడించింది. ఇదీ చదవండి: రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్లో ఓయో, షాక్లో పేటీఎమ్ ఒప్పందంలో భాగంగా అనుబంధ సంస్థలలో ఒకటైన ఫ్లాగ్స్టార్ బ్యాంక్ ద్వారా సిగ్నేచర్ బ్యాంకుకు చెందిన 38.4 బిలియన్ డాలర్ల ఆస్తులను న్యూయార్క్ కమ్యూనిటీ కొనుగోలు చేయనుంది. ఇవి సిగ్నేచర్ ఆస్తులలో ముప్పావు వంతుకాగా.. సోమవారం(20) నుంచి సిగ్నేచర్కు చెందిన 40 బ్రాంచీలు ఫ్లాగ్స్టార్ నిర్వహణలోకి వస్తాయి. సిగ్నేచర్కు చెందిన 60 బిలియన్ డాలర్ల రుణాలు రిసీవర్షిప్ (కస్టోడియన్) కింద ఉన్నట్లు ఎఫ్డీఐసీ పేర్కొంది. -
రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్లోని తన హోల్సేల్ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్లో సీసీఐ ప్రకటించింది. ఇవీ చదవండి: ఇషా ట్విన్స్కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు -
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని కొనుగోలు చేసేందుకు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అసలైన శివసేన ఎక్నాథ్ షిండేదే అని ఎన్నికల సింగం నిర్ణయం తీసుకోవడం ఓ ఒప్పందంలో భాగంగానే జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో రూ.2,000 కోట్ల లావాదేవి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. ఈ లావాదేవి గురించి అధికార పార్టీతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనకు చెప్పారని రౌత్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఒక ఎమ్మెల్యేను కొనడానికి రూ.50 కోట్లు, ఒక ఎంపీని కొనడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మా కౌన్సిలర్ని, శాఖా ప్రముఖ్ని కొనడానికి రూ.కోటి వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వం, నాయకుడు, నీతిలేని వ్యక్తుల సమూహం, మా పార్టీ గుర్తును, పేరును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయగలరో నేను ఊహించగలను. నా అంచనా ప్రకారం అది రూ.2,000 కోట్లు' అని రౌత్ ఆరోపించారు. #WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr — ANI_HindiNews (@AHindinews) February 19, 2023 చదవండి: ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం.. -
అదానీ పవర్-డీబీ పవర్ డీల్ వెనక్కి.. సంతకాలు చేయకుండానే..!
న్యూఢిల్లీ: డీబీ పవర్కి చెందిన బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లను అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్ కొనుగోలు చేయడానికి సంబంధించిన రూ. 7,017 కోట్ల డీల్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఒప్పందంపై సంతకాలు చేయకుండానే.. లావాదేవీకి నిర్దేశించుకున్న గడువు తీరిపోవడం ఇందుకు కారణం. 2022 ఆగస్టు 18 నాటి అవగాహన ఒప్పందం గడువు తీరిపోయిందని స్టాక్ ఎక్స్ఛేంచంజీలకు అదానీ పవర్ తెలిపింది. తేదీలను పొడిగించారా లేక ఒప్పందంపై మళ్లీ చర్చలు జరుపుతున్నారా వంటి వివరాలేమీ వెల్లడించలేదు. గడువు తేదీ ముగియడంతో ప్రస్తుతానికి ఈ డీల్ను పక్కన పెట్టినట్లే భావించాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా గతేడాది ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత తుది గడువు నాలుగు సార్లు పొడిగించారు. నాలుగో గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. ఖాతాలు, షేర్ల ధరల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, పరిణామాలు దీనికి నేపథ్యం. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చేతికి సొనాటా, ఎన్ని కోట్ల డీల్ అంటే!
ముంబై: సూక్ష్మ రుణాల సంస్థ సొనాటా ఫైనాన్స్ను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ మహీంద్ర బ్యాంక్ (కేఎంబీ) వెల్లడించింది. ఇది పూర్తి నగదు రూపంలోనే జరిగిందని సంస్థ వివరించింది. 2017లో బీఎస్ఎస్ మైక్రోఫైనాన్స్ను దక్కించుకున్న తర్వాత ఈ తరహా డీల్స్లో కేఎంబీకి ఇది రెండోది. దీనితో 9 లక్షల మంది పైచిలుకు మహిళా కస్టమర్లు, 10 రాష్ట్రాల్లో 502 శాఖలు లభిస్తాయని సంస్థ తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సొనాటా .. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ-మైక్రోఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐ)గా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థ నిర్వహణలో రూ. 1,903 కోట్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని కేఎంబీ కమర్షియల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ మనీష్ కొఠారీ చెప్పారు. -
ఫీనిక్స్ గ్రూప్తో టీసీఎస్ భారీ డీల్.. రూ. 5,986 కోట్లు
ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ తాజాగా బ్రిటన్కు చెందిన ఫీనిక్స్ గ్రూప్నకు వ్యాపార డిజిటలీకరణ సర్వీసులు అందించనుంది. ఇందులో భాగంగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సేవలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 600 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 5,986 కోట్లు). ఆర్థిక సర్వీసుల సంస్థ ఫీనిక్స్ గ్రూప్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొనసాగింపని టీసీఎస్ తెలిపింది. -
సుందరం ఫాస్టనర్స్: 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో అతిపెద్ద డీల్!
చెన్నై: వాహన పరిశ్రమకు కావాల్సిన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం ఫాస్టనర్స్ రూ.2,044 కోట్ల భారీ కాంట్రాక్ట్ను ఓ విదేశీ ఆటో కంపెనీ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన సబ్ అసెంబ్లీస్, డ్రైవ్ గేర్ సబ్ అసెంబ్లీస్ను సుందరం ఫాస్టనర్స్ సరఫరా చేయనుంది. 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో అతిపెద్ద ఈవీ కాంట్రాక్ట్ అని సంస్థ బుధవారం తెలిపింది. నూతన ఆర్డర్ను అనుసరించి తయారీ కోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సుందరం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ, తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద ఉన్న మహీంద్రా వరల్డ్ సిటీలో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. డీల్లో భాగంగా 2026 నాటికి ఏటా 15 లక్షల యూనిట్ల ట్రాన్స్మిషన్ సబ్–అసెంబ్లీస్ సరఫరా చేసే అవకాశం ఉందని సుందరం అంచనా వేస్తోంది. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
క్యాపిటాల్యాండ్ చేతికి ఐటీ పార్క్
న్యూఢిల్లీ: సొంత అనుబంధ సంస్థ ద్వారా పుణేలోని ఐటీ పార్క్ను కొనుగోలు చేయనున్నట్లు క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ తాజాగా పేర్కొంది. ఎకో స్పేస్ ఐటీ పార్క్ ప్రయివేట్ లిమిటె ద్వారా ఇందుకు అసెండస్ ఐటీ పార్క్(పుణే)తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ ఐటీ సెజ్లో 100 శాతం వాటా కొనుగోలుకి రూ. 1,350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ సెజ్ నాలుగు భవంతులతో మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్న ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ ఆస్తిలో దాదాపు 100 శాతం ఐటీ, ఐటీ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలకు లీజ్కిచ్చారు. వీటిలో ఇన్ఫోసిస్, సినెక్రాన్ టెక్నాలజీస్ తదితర కంపెనీలున్నాయి. కాగా.. అసెండస్ ఐటీ పార్క్ లో క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్ 78.5 శాతం వాటా, భాగస్వామి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 21.5 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకోనున్నాయి. చదవండి: ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ! -
దాల్మియా డీల్: సిమెంట్ బిజినెస్ నుంచి ‘జేపీ’ ఔట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్), సహచర సంస్థ నుంచి సిమెంట్, సంబంధ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు దాల్మియా భారత్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్(డీసీబీఎల్) ద్వారా క్లింకర్, సిమెంట్, పవర్ ప్లాంట్ల కొనుగోలుకి జేపీ గ్రూప్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా 9.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల(ఎంటీపీఏ) సిమెంట్ ప్లాంట్లతోపాటు.. 6.7 ఎంటీపీఏ క్లింకర్, 280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో విస్తరించి ఉన్నట్లు దాల్మియా పేర్కొంది. ఈ కొనుగోలుతో మధ్యభారతంలోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇదే సమయంలో తమ వద్ద మిగిలిన సిమెంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. ఇందుకు దాల్మియా భారత్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. విస్తరణ లక్ష్యంతో..: 2027కల్లా దేశవ్యాప్త సిమెంట్ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా జేపీ ఆస్తుల కొనుగోలుతో దాల్మియా భారత్ ముందడుగు వేసింది. 2027కల్లా 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. ఈ బాటలో 2031కల్లా 110-130 ఎంఎన్టీకి చేరాలని ప్రణాళికలు వేసింది. జేపీ ఆస్తుల కొనుగోలు ద్వారా దాల్మియా భారత్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 45.3 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుత సామర్థ్యం 35.9 ఎంటీపీఏగా ఉంది. సిమెంట్ తయారీకి దాల్మియా ప్రస్తుతం దేశంలో నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. అల్ట్రాటెక్, అదానీ సిమెంట్(ఇటీవలే ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకుంది), శ్రీ సిమెంట్ తొలి మూడు ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి. -
బిస్లరీ చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూపు మరో బిగ్గెస్ట్ డీల్ను కుదుర్చుకోనుంది. భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ మేకర్ బిస్లెరీ ఇంటర్నేషనల్ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ. 7 వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ వ్యాఖ్యలని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. సంచలన బ్రాండ్ బిస్లరీ థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కా ఆవిష్కర్త రమేశ్ చౌహాన్ మూడు దశాబ్దాల క్రితం (1993) ఏరేటెడ్ డ్రింక్స్ బ్రాండ్లను కోకోకోలాకు విక్రయించారు. తాజాగా బిస్లరీని సైతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. టాటా కన్జూమర్స్ సంస్థ బిస్లరీ బ్రాండ్ ను రూ. 7వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. విక్రయ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత నిర్వహణ రెండేళ్ల పాటు కొనసాగనుంది. కుమార్తె జయంతి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 82 ఏళ్ల చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సెప్టెంబరులోనే బిస్లరీ అమ్మకానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సహా పలు కంపెనీలు టాటాతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ,టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజాతో సమావేశం తర్వాత రమేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధాకరమైన నిర్ణయమే..కానీ, బిస్లరీ విక్రయం ఇప్పటికీ బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ టాటా గ్రూప్ టాటా గ్రూపు మరింత అభివృద్ది చేసి, ఇంకా బాగా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ నిజాయితీ, జీవిత విలువలను గౌరవించే సంస్కృతి తనకిష్టమనీ, అందుకే ఆసక్తిగల కొనుగోలుదారుల దూకుడును పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ డీల్ కేవలం డబ్బుకు సంబంధించినది కాదని, ఎంతో ప్రేమ, అభిరుచితో నిర్మించుకున్న వ్యాపారం, ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉద్యోగులు నడుపుతున్నారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే కంపెనీలో మైనారిటీ వాటా కూడా ఉంచుకోకపోవడంపై చైర్మన్ చౌహాన్ మాట్లాడుతూ, కంపెనీలో చురుగ్గా తానేమీ చేయలేనపుడు దీని వలన పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు బిస్లరీ విక్రయం తర్వాత, చౌహాన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పేదలకు వైద్య సహాయం లాంటి పర్యావరణ, స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నారట. -
చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ
ఇండోనేషియా బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకి వీడియో సమావేశంలో హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధం ముగించేందుకు రష్యాతో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే మిన్స్క్ 3 ఒప్పందాన్ని కూడా తోసి పుచ్చారు. పైగా రష్యా ఒప్పందం అంటూనే ఉల్లంఘిస్తూ.. ఉంటుందన్నారు. ఇది తూర్పు డోన్బాస్ ప్రాంతంలో కీవ్ మాస్కోల మధ్య విఫలమైన ఒప్పందానికి ఒక ఉదాహరణ అని జెలెన్స్కీ అన్నారు. "రష్యా బలగాలు కీవ్లో దారుణమైన బీభత్సం సృష్టించాయి. ప్రపంచ అస్థిరతతో ఆటలాడింది, ఎన్ని విధాలుగా చెప్పిన వినలేదు అందువల్ల తాము రష్యాతో చర్చలకు ఇష్టపడటం లేదు. అయినా ఒప్పందం జరిగిన వెంటనే ఉల్లంఘించడం రష్యాకు ఒక అలవాటు అని విమర్శించారు." వాస్తవానికి రష్యా మద్దతుగల వేర్పాటువాదులు, కీవ్ మధ్య యుద్ధ విరమణ కోసం జర్మనీ, ఫ్రాన్స్ 2014, 2015లలో మొదటిసారిగా మిన్స్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అదీగాక ఇటీవలకాలంలో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తక్కువగానే సాగాయి. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చించేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే.. మదర్ హీరోయిన్ అవార్డు!) -
తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!
నెల్లూరు (క్రైమ్): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్కు చెందిన షేక్ షాహూల్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు రెక్కీ కావలి పట్టణం తుఫాన్నగర్కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు. తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి.. -
ఎలాన్ మస్క్కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్!
అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్విట్టర్లో ప్రకటనలు ఇవ్వబోమని శుక్రవారం వెల్లడించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే ట్విట్టర్లో తమ కస్టమర్లతో మాత్ర యథావిధిగా ఇంటరాక్ట్ అవుతామని జనరల్ మోటార్స్ స్పష్టం చేసింది. కొత్త యాజమాన్యంలో ట్విట్టర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసి ప్రకటనలు ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ప్రత్యర్థి సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో నెం.1గా ఉన్న టెస్లాకు జనరల్ మోటార్స్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ. ఎలాన్ మస్క్ తర్వాత విద్యుత్ వాహన రంగంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కూడా జనరల్ మోటార్సే కావడం గమనార్హం. టెస్లాకు మరో ప్రత్యర్థి అయిన ఫోర్డ్ మోటార్స్ కూడా ట్విట్టర్లో ప్రకటనలపై స్పందించింది. ఎలాన్ మస్క్-ట్విట్టర్ మధ్య డీల్కు ముందు కూడా తాము ఈ సామాజిక మాధ్యమంలో ప్రకటనలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త యాజమాన్యం తీరును బట్టి ప్రకటనలపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. అయితే కస్టమర్లతో మాత్రం ట్విట్టర్లో సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది. రివియాన్, స్టెలాంటిస్, ఆల్ఫబెట్కు చెందిన వేమో సంస్థలు మాత్రం ట్విట్టర్లో ప్రకటనల నిలిపివేతపై ఇంకా స్పందించలేదు. మరో సంస్థ నికోలా మాత్రం ట్విట్టర్లో యథావిధిగా ప్రకటనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 44 బిలయన్ డాలర్లు వెచ్చింది ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం అధికారికంగా పూర్తి చేశారు ఎలాన్ మస్క్. అనంతరం పక్షికి స్వేచ్ఛ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కూడా పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. చదవండి: ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్ -
ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరిగిన ట్విటర్ డీల్ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. దీంతో ట్విటర్ బర్డ్ మస్క్ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ మస్క్ ట్వీ ట్ చేశారు. అంటే నకిలీ ఖాతాలకు తావులేకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా యూజర్లకు అనుమతిస్తాననే సంకేతాలిచ్చారు. దీంతో ఈ ట్వీట్ లైక్లు, కమెంట్స్, రీట్వీట్లతో మోస్ట్ ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల రియాక్షన్లు విభిన్నంగా ఉండటం గమనార్హం. మరోవైపు ట్విటర్ బాస్గా మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్వీటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్,లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. This makes me so happy. It’s a great day for freedom. — Matthew Marsden (@matthewdmarsden) October 28, 2022 చదవండి:Twitter: మస్క్ ఎంట్రీ.. సీఈఓ ఔట్! the bird is freed — Elon Musk (@elonmusk) October 28, 2022 -
చీఫ్ ట్విట్ అట! సింక్తో హింట్! మస్క్ వీడియో వైరల్, పేలుతున్న సెటైర్లు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవోఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు డీల్ ఇక ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఈ శుక్రవారంతో డీల్ పూర్తి అవుతుందని కో ఇన్వెస్టర్లతో ప్రకటించిన మస్క్ శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా దర్శనమివ్వడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియోను స్వయంగా ‘లెట్ దట్ సింక్ ఇన్!’ అంటూ ట్విటర్లోపోస్ట్ చేశారు మస్క్. డీల్ డన్ అనేందుకు సింబాలిక్గా ‘సింక్’ తో ఎంట్రీ ఇచ్చిన మస్క్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో మిశ్రమంగా స్పందిస్తూ నెటిజన్లు మీమ్స్ సందడి చేస్తున్నారు. (Elon Musk ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!) అంతేకాదు చీఫ్ ట్విట్.. బయోలో ప్రకటించుకోవడం విశేషం. 44 బిలియన్ డాలర్లతో (సుమారురూ.3.56 లక్షల కోట్లు) ట్విటర్ను కొనుగోలు చేసేందుకు మస్క్ పావులు కదుపుతున్నారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత 75 శాతం ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన పలకనున్నారనే వార్తలపై అలాంటి ఆలోచన ఏదీ లేదని ట్విటర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గ్లోబల్గా భారీ ఆదాయాన్ని అందిస్తున్న యాక్టివ్ యూజర్లను ట్విటర్ కోల్పోతోందని అంతర్గత నివేదిక ఆధారంగా రాయిటర్స్ రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చిక్కుల్లో ట్విటర్: వారు గుడ్బై, ఆదాయం ఢమాల్..రీజన్?) Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7 — Elon Musk (@elonmusk) October 26, 2022 Congratulations!!! [CHIRPBIRDICON] [CHIRPBIRDICON] [CHIRPBIRDICON] pic.twitter.com/hACJgbZzky — 𝐁𝐨𝐠𝐮𝐬𝐓𝐡𝐨𝐮𝐠𝐡𝐭 - Tesla AI, Texas (@BogusThought) October 26, 2022 The current mood of all the woke employees at Twitter. pic.twitter.com/6eiwHayxVd — Nick Fad🇺🇸 (@NicAtNigh) October 26, 2022 -
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన
న్యూఢిల్లీ: బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తయితే సంస్థలో 75 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నారనే వార్తలు కలకలం రేపాయి. ట్విటర్ కొనుగోలుకు మరోసారి పావులు కదుపుతున్న తరుణంలో ఉద్యోగాల తొలగింపు అనే నివేదికలు ఆందోళన రేపాయి. ఇదీ చదవండి: JioBook: రూ.15 వేలకే ల్యాప్టాప్, వారికి బంపర్ ఆఫర్ ఒక వేళ మస్క్ ట్విటర్ బాస్ అయితే ఆ తరువాత భారీగా సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. కంపెనీలోని 7,500 మంది కార్మికులలో దాదాపు 75శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు, కొనుగోలు డీల్లో కాబోయే పెట్టుబడిదారులతో మస్క్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, ట్విటర్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అసలు అలాంటి ప్లాన్ ఏదీ లేదని గురువారం సిబ్బందికి సమాచారాన్ని అందించింది. ఈ మేరకు జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ గురువారం ఉద్యోగులకు ఇమెయిల్ పంపించారు. (JioBook: రూ.15 వేలకే ల్యాప్టాప్, వారికి బంపర్ ఆపర్) -
5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవల విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా నోకియాతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతోపాటు ఎరిక్సన్ కంపెనీతో కూడా మరో ముఖ్యమైన డీల్ కుదుర్చుకుంది. ఈ కంపెనీల ద్వారా 5G RAN (రేడియో యాక్సెస్ నెట్వర్క్) పరికరాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా సోమవారం ఒకప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ముఖ్యంగా నోకియాతో మల్టీ-ఇయర్ డీల్ చేసుకుంది. నోకియా, జియో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు బహుళ-సంవత్సరాల ఒప్పందం కాబట్టి, భారతీయ మార్కెట్లో నోకియాకు ఇది భారీ విజయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తద్వారా సాధారణ వినియోగదారులకు కూడా 5జీ స్టాండ్లోన్ నెట్వర్క్ను అందించే దేశీయ తొలి టెల్కోగా జియో అవతరించనుంది. నోకియా డీల్పై రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. నోకియాతో తమ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన 5జీ నెట్వర్క్ని అందించే సంస్థగా తాము నిలవనున్నట్టు చెప్పారు. నోకియా ప్రెసిడెంట్, సీఈవో పెక్కా లండ్మార్క్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్తో లక్షలాది మంది ప్రీమియం 5 జీ సేవలు ఆస్వాదించనున్నారని తెలిపారు. ఎరిక్సన్తో డీల్ దేశీయంగా 5జీ స్టాండ్లోన్ నెట్వర్క్ నిమిత్తం నోకియా ప్రధాన పోటీదారు ఎరిక్సన్తో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-ఎరిక్సన్ మధ్య కుదిరిన ఈ తొలి డీల్ దేశంలో రేడియో యాక్సెస్ నెట్వర్క్నుమరింత విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. జియో 5జీ సేవలు, ‘డిజిటల్ ఇండియా' విజన్ సాధనలో ఈడీల్ ఒక పునాదిగా ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ విశ్వాసాన్ని ప్రకటించారు. -
రూ.5 వేల కోట్ల డీల్: అదానీ చేతికి మరో సిమెంట్ కంపెనీ!
సాక్షి, ముంబై: బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు మరో సిమెంట్ కంపెనీనీ కొనుగోలు చేసినట్టు సమాచారం. సిమెంట్ పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా తాజా డీల్ చేసుకున్నారని మార్కట్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ యూనిట్ను కొనుగోలుకు ఎడ్వాన్స్డ్ చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. (ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో) రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ అనుబంధ సంస్థ జైప్రకాష్ సిమెంట్ గ్రౌండింగ్ ప్లాంట్ ఇతర ఆస్తులను కొనుగోలు చేయనుందట. సోమవారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో బోర్డు రుణాన్ని తగ్గించుకునే క్రమంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టు జైప్రకాష్ అసోసియేట్స్ వెల్లడించింది. జైప్రకాష్ పవర్ వెంచర్స్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్, అలాగే ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయానికి, కొనుగోలుదారులను అన్వేషిస్తోందని ప్రకటించడం ఈ వార్తలు బలాన్నిస్తోంది. అయితే తాజా నివేదికలపై వ్యాఖ్యానించేందుకు అదానీ గ్రూప్, జైప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. (WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్) సిమెంట్ వ్యాపారం పై దృష్టిపెట్టిన అదానీ గ్రూపు మేలో స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ , ఏసీసీ లిమిటెడ్లను కొనుగోలు చేసిన తరువాత ఏటా 67.5 మిలియన్ టన్నుల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించింది. సిమెంట్ పరిశ్రమలో 200 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాలని, రానున్న ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్క్ష్యంగా పెట్టుకున్నట్టు గత నెలలో అదానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇదీ చదవండి: బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు -
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
ఫారెక్స్ నిల్వలు పుష్కలం పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయంటూ నెలకొన్న ఆందోళనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తోసిపుచ్చారు. దీన్ని ‘మరీ ఎక్కువగా‘ చేసి చూపుతున్నారని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని సేఠ్ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం తగ్గడం, వాణిజ్య లోటు అధికంగా ఉండటం వల్ల మారక నిల్వలు తగ్గాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన చెప్పారు. వరుసగా ఏడో వారం ఫారెక్స్ నిల్వలు తగ్గిన నేపథ్యంలో సేథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 2.23 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81ని కూడా దాటేసి ఆల్టైం కనిష్టానికి పడింది. మరోవైపు, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, అంతర్జాతీయంగా డాలరు బలపడుతుండటమే రూపాయి క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
టొరంట్ ఫార్మా చేతికి క్యురేషియో: ఏకంగా 2వేలకోట్లు
న్యూఢిల్లీ: చర్మ పరిరక్షణ(డెర్మటాలజీ) విభాగంలో సేవలందిస్తున్న క్యురేషియో హెల్త్కేర్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను రూ. 2,000 కోట్లుగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున రూ. 115 కోట్లను నగదు రూపేణా చెల్లించనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,885 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఒప్పందం కుదిరినట్లు వివరించింది. కాగా.. క్యురేషియోను సొంతం చేసుకోవడం ద్వారా డెర్మటాలజీ పోర్ట్ఫోలియోను విభిన్నంగా విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు టొరంట్ ఫార్మా డైరెక్టర్ అమన్ మెహతా తెలియజేశారు. ఇది వ్యూహాత్మక కొనుగోలుగా పేర్కొన్నారు. 50 బ్రాండ్లకుపైగా: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురేషియో కాస్మెటిక్, పిడియాట్రిక్ డెర్మటాలజీ విభాగాలలో అధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. టెడిబార్, అటోగ్లా, స్పూ, బీ4 నప్పి, పెర్మైట్ తదితర 50 బ్రాండ్లకుపైగా పోర్ట్ఫోలియోను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. గతేడాది(2021–22)లో రూ. 224 కోట్ల టర్నోవర్ను సాధించింది. క్యురేషియో ప్రమోటర్లతోపాటు.. క్రిస్క్యాపిటల్, సీక్వోయా సైతం కంపెనీ నుంచి వైదొలగనున్నట్లు ప్రస్తావించింది. -
హౌసింగ్ ప్రాజెక్టులకు రూ. 350 కోట్లు: ఎల్డెకో, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో చేతులు కలిపినట్లు రియల్టీ సంస్థ ఎల్డెకో గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో హౌసింగ్ ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 350 కోట్లతో నిధి(ఫండ్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వెరసి అందుబాటు ధరల రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా హెచ్-కేర్3 పేరుతో రియల్టీ ఫండ్కు తెరతీసినట్లు ఎల్డెకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ తెలియజేసింది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రస్తుతం ఎల్డెకో గ్రూప్ ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో నాలుగు హౌసింగ్ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిపై రూ. 175 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. ఇంతక్రితం కూడా హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో భాగస్వామ్యంలో ఎల్డెకో గ్రూప్ హెచ్-కేర్1 పేరుతో రూ. 150 కోట్ల రియల్టీ ఫండ్ను ఏర్పాటు చేసింది. తద్వారా తక్కువ ఎత్తులో, ప్లాటెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. తొలిగా ఈ ఏడాది మార్చిలో ఎల్డెకో ప్యారడైజో పేరుతో పానిపట్లో 35 ఎకరాల ప్లాటెడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. (క్లిక్: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) -
ట్విటర్పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్పై మరో బాంబు వేశారు. తన 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్నుంచి బయటికి రావడాన్ని మరోసారి గట్టిగా సమర్ధించుకున్నారు. దీనికి సంబంధించిన కారణం చూపుతూ ట్విటర్కు ఒక లేఖ రాశారు. జూలైలో ట్విటర్ డీల్ను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆగస్టులో మరొక లేఖలో, పీటర్ జాట్కో కోర్టుకు హాజరు కావాలని మస్క్ డిమాండ్ చేశారు. తాజాగా మూడో లేఖ రాయడం గమనార్హం. ట్విటర్ మాజీ సెక్యూరిటీ హెడ్ , విజిల్బ్లోయర్ పీటర్ జాట్కోకు మిలియన్ డాలర్లను చెల్లించిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టిందని మండి పడ్డారు. దీనిపై ట్విటర్ మూడో లేఖను కూడా పంపించారు. ఈ మేరకు ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గాడేకు సెప్టెంబర్ 9న లేఖ రాశారు. జాట్కోకు నెలల తరబడి జీతం ఇవ్వకపోవడం, ఇతర పరిహారం కింద సుమారు 7 మిలియన్ల డాలర్లు సెవెరెన్స్ పేమెంట్ చేసిందట. మరోవైపు మస్క్ ఆరోపణలపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. (Dolo-650: వెయ్యికోట్ల ఫ్రీబీస్,ఐపీఏ సంచలన రిపోర్టు) కాగా ట్విటర్ నకిలీ ఖాతాలపై సమాచారం అందించలేదని ఆరోపించిన మస్క్ ట్విటర్ కొనుగోలు డీల్నుంచి జూలైలో వైదొలిగారు. దీన్ని వ్యతిరేకించిన ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై డెలావర్ కోర్టులో అక్టోబర్ 17న విచారణ ప్రారంభమవుతుంది. -
పెన్నార్కు రూ.511 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ తాజాగా రూ.511 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. పెన్నార్ అనుబంధ విభాగాలు రిలయన్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, యమహా, కోనే, ఐఎఫ్బీ, హిందాల్కో, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి వీటిని పొందినట్టు కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ, ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. జూలై, ఆగస్ట్లో ఈ ఆర్డర్లను చేజిక్కించుకున్నామని, వచ్చే రెండు త్రైమాసికాల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా! -
రిలయన్స్ భారీ పెట్టుబడులు: మరో విదేశీ కంపెనీతో డీల్
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో విదేశీ సంస్థతో భారీ డీల్ కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నరియాకు చెందిన చెందిన సెన్స్హాక్లో 79.4 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనికి విలు32 మిలియన్ డాలర్లు.సెన్స్హాక్ ఇంక్. (సెన్స్హాక్)తో కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ మంగళవారం ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెన్స్హాక్, 2018లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి ఉత్పత్తి పరిశ్రమకు సాఫ్ట్వేర్ బేస్డ్ మేనేజ్మెంట్ టూల్స్ను అందించే సంస్థ. ఆటోమేషన్ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టు ఉత్పత్తిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, ఎండ్-టు-ఎండ్ సోలార్ అసెట్ లైఫ్సైకిల్ను నిర్వహించేలా నిరంతరమైన సేవలందించే సోలార్ డిజిటల్ ప్లాట్ఫారమ్ను అందిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాయని రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 GW సౌరశక్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. సెన్స్హాక్ సహకారంతో ఖర్చులను తగ్గించుకుని ఉత్పాదకతను పెంచుతామన్నారు. అలాగే రిలయన్స్ మద్దతుతోసెన్స్హాక్ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ డీల్పై సెన్స్హాక్ ఫౌండర్ సీఈవో స్వరూప్ మావనూర్, ప్రెసిడెంట్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ సాంఖే సంతోషం వ్యక్తం చేశారు. -
ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!
వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్ ట్రంప్.. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ సొంతంగా కొత్త మీడియా కంపెనీతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ను లాంచ్ చేశారు. ప్రసుతం ఆయా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు ముందుగా లీక్ అయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ, బ్లాక్ చెక్ ఎంటిటీ మధ్య పెండింగ్లో ఉన్న విలీన ఒప్పందం గురించి మియామీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలోని ఉద్యోగులు ముందుగానే తెలుసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రాకెట్ వన్ క్యాపిటల్ సంస్థ అధికారులు బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్లో పెట్టుబడుల పెట్టడం ద్వారా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలీజీ పొందే లాభాల తోపాటు ప్రకటించనున్న లావాదేవీల గురించి వెల్లడించారని తెలిపింది. అంటే ఇంకా పెండింగ్లో ఉన్న ఈ విలీన ఒప్పంద గురించి కీలక విషయాలు బయటకు రావడాన్నిబట్టి చూస్తే ముందుగానే ఈ విషయాలు బయటకు పొక్కినట్లు తెలుస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అదీగాక ఇప్పుడూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, రెగ్యులేటర్లు ఈ విషయమై కూలంకషంగా దర్యాప్తు చేయడమే కాకుండా పెండింగ్లో ఉన్న విలీన ఒప్పందం విషయాలను ముందుగానే బహిర్గతం చేసిన వ్యక్తులతో సహా విచారణ చేయడం మొదలు పెట్టింది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్ సృష్టికర్త అక్టోబర్ 20న డిజిటల్ వరల్డ్తో విలీనానికి అంగీకరించారు. పైగా ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ ఒప్పందం ముగుస్తుంది. ఈ డీల్ గురిచి ప్రకటించిన తదనంతరం డిజిటల్ వరల్డ్ షేర్లు అనుహ్యంగా 350 శాతం వరకు పెరిగాయి. ఐతే ఈ విషయమై ట్రంప్ మీడియా గానీ, రాకెట్ వన్ క్యాపిటల్ గానీ స్పందించలేదు. (చదవండి: ఫైటర్ జెట్లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్!) -
సీఈఎల్ఎల్కు 70వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ అనుబంధ కంపెనీ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎల్ఎల్) 70,000 ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈ–వెహికిల్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్న త్రీ వీల్స్ యునైటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వాహనాలు వచ్చే అయిదేళ్లలో దశలవారీగా వివిధ నగరాల్లో రంగ ప్రవేశం చేస్తాయి. సగటున ఒక్కో త్రిచక్ర వాహన ధర ప్యాసింజర్ వేరియంట్ రూ.3 లక్షలు, కార్గో రకం రూ.3.5 లక్షలు ఉంటుంది. త్రీ వీల్స్ యునైటెడ్ ఒక్కో లాట్లో 100 నుంచి 20,000 యూనిట్లు కొనుగోలు చేయనుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల డిమాండ్ను పెంచడానికి సీఈఎస్ఎల్ ద్వారా నిర్వహించనున్న 1,00,000 వాహనాల టెండర్కు అనుగుణంగా ఈ ఏర్పాటు జరిగింది. -
చైనాకు చెక్ పెట్టేలా... భారత్కి అమెరికా అండ
US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను యూఎస్ ప్రతినిధులు సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్బ్లాక్ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్కి యూఎస్ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది. దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్కి అసాథ్యం అని యూఎస్ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్కి కాస్త ఊరట లభించింది. There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7 — Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022 (చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం) -
ట్విటర్ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ డీల్ ప్రకటించినప్పటి నుంచి రోజుకో కొత్త పరిణామం వెలుగులోకి వస్తుంది. 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్ను సొంతం చేసుకోవాలనుకున్న మస్క్ ఆ తరువాత, ఆ డీల్ను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు ప్రకటించారు. నకిలీ ఖాతాల సమాచారాన్ని అందించడంలో ట్విటర్ వైఫల్యం నేపథ్యంలో కొనుగోలు విరమించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ట్విటర్ డీల్ రద్దుపై ట్విటర్ దావా వేయనుందన్న వార్తలపై తాజాగా మస్క్ స్పందించారు. వరుస ట్వీట్స్తో ట్విటర్పై సెటైర్లు వేశారు. మొదట నేను అసలు ట్విటర్ను కొనుగోలు చేయలేను అన్నారు. డీల్ ప్రకటించిన తరువాత నకిలీ ఖాతాల సమాచారాన్ని వెల్లడించలేదు. ఇపుడు ట్విటర్ను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ ఎగతాళిగా కమెంట్ చేశారు. అంతేకాదు ఇపుడిక వారు కోర్టులో నకిలీ ఖాతాల సమాచారాన్ని బహిర్గతం చేయాలంటూ ట్వీట్ చేశారు. కాగా మల్టీ బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ రద్దు చేసుకున్న బిలియనీర్పై దావా వేసేందుకు ట్విటర్ ప్రముఖ లా ఏజెన్సీతో సంప్రదింపులు చేస్తోంది. అమెరికా ఆధారిత న్యాయ సంస్థ వాచెల్, లిప్టన్, రోసెన్ కాట్జ్ ఎల్ఎల్పీని ఇందుకోసం నియమించుకుంది. ఈ వారం ప్రారంభంలో డెలావేర్లో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. మరోవైపు ఇదే ఏజెన్సీ 2018లో టెస్లాను తీసుకోవాలనే మస్క్కు సలహాదారుగా ఉండటం విశేషం. pic.twitter.com/JcLMee61wj — Elon Musk (@elonmusk) July 11, 2022 -
దేనికైనా రె‘ఢీ’.. ట్విటర్కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్!
వాషింగ్టన్: టెస్లా సంస్థ సీఈవో ఎలన్ మస్క్కు ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంది. అంతేనా కొన్ని సార్లు ఆ వార్తలే సంచలనంగా కూడా మారుతాయి. తాజాగా ఈ ప్రపంచ కుబేరుడు ట్విటర్ సంస్థకు భారీ షాక్నే ఇచ్చారు. సుమారు 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ట్విట్టర్ స్పందించింది. మస్క్పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తాము గతంలో ఒప్పందం కుదుర్చుకున్న ధరకు, నిబంధనలకు లోబడే కట్టుబడి ఉన్నట్లు ట్విటర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు. ఒప్పందం మొదలు ఇదే రచ్చ.. ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా ట్విటర్తో కుదుర్చుకున్నారు మస్క్. ఇక్కడ వరకు సీన్ అంతా సాఫీగానే జరిగింది. మే నెల మొదలుకొని.. ట్విటర్లో ఫేక్ అకౌంట్ల (స్పామ్ అకౌంట్లు) గురించిన సమాచారం ఒప్పంద సమయంలో సరిగా ఇవ్వలేదని ట్విట్టర్పై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం యూజర్లలో ఫేక్ లేదా స్పామ్ యూజర్లు కేవలం 5 శాతం లోపు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని ట్విటర్ నిరూపించాలని మస్క్ కండీషన్ పెట్టారు. మొత్తంగా స్పామ్ అకౌంట్ల విషయంలో ట్విట్టర్ సంస్థ సరైన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైందని అందుకే తాను ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కాగా డీల్ నిబంధనల ప్రకారం మస్క్ లావాదేవీని పూర్తి చేయకపోతే $1 బిలియన్ బ్రేక్-అప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరో వైపు ట్విటర్ కూడా మస్క్పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య యుద్ధం ఎలా కొనసాగుతుందో చూడాలి. చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్! -
వేదాంతా చేతికి ఎథేనా చత్తీస్గఢ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఎథేనా చత్తీస్గఢ్ పవర్ లిమిటెడ్ను సొంతం చేసుకోనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 565 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. నగదు రూపేణా చేపట్టనున్న ఈ డీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో పూర్తయ్యే వీలున్నట్లు వేదాంతా తెలియజేసింది. ఎథేనా చత్తీస్గఢ్ పవర్ లిక్విడేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. కంపెనీలో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. ఈ కొనుగోలుతో అల్యూమినియం బిజినెస్ విద్యుత్ అవసరాలు తీరనున్నట్లు తెలియజేసింది. ఏథేనా పవర్.. చత్తీస్గఢ్లోని ఝాంజ్గిర్ చంపా జిల్లాలో 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును కలిగి ఉంది. 2019 మే 15న కంపెనీపై కార్పొరేట్ దివాలా రుణపరిష్కార ప్రాసెస్ ప్రారంభమైంది. గతేడాది మే 13న ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ లిక్విడేషన్ ప్రాసెస్కు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి గల రెండు యూనిట్లలలో 80 శాతం, 30 శాతం చొప్పున పనులు పూర్తయ్యాయి. దీంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లకు విద్యుత్ ప్లాంటు అనుసంధానమై ఉండటం గమనార్హం! -
ఇబ్బందుల్లో ట్విటర్ డీల్, ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా?
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విటర్ డీల్కు సంబంధించి టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. టెక్ బిలియనీర్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు డీల్ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్ దాని స్పామ్ ఖాతా డేటా, బాట్లను ఎదుర్కొనే టెక్నాలజీ బాగానే ఉన్నాయనీ, రోజుకు 10 లక్షల నకిలీ ఖాతాలను బ్లాక్ చేశానని ట్విటర ప్రకటించిన తరువాత ఇలాంటి వార్తలు రావడం గమనార్హం. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ట్విటర్ కొనుగోలుకు సంబంధించిన చర్చలు మస్క్ నిలిపివేశారు. దీంతో ఈ డీల్ ఇప్పట్లో పూర్తవుతుందా అని సందేహాలు నెల కొన్నాయి. లారీ ఎల్లిసన్, వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, ఫిడిలిటీ, క్రిప్టోఎక్స్ఛేంజ్ బినాన్స్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఖతార్తో కలిసి సంయుక్తంగా ట్విటర్ డీల్ను చేసుకోవాలని మస్క్ ప్రయత్నించారు. కాగా ట్విటర్లో నకిలీ ఖాతాల విషయంలో ట్విటర్ డేటాతో విబేధిస్తున్న మస్క్ తాత్కాలికంగా ఈ డీల్ను నిలిపిస్తున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్లింకిట్ డీల్: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్ను కొనుగోలు ఒప్పందం ప్రకటించిన తరువాత దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. ఈ డీల్పై పెట్టుబడిదారులు ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో జొమాటో లిమిటెడ్ షేర్లు వరుసగా రెండవ రోజు నష్టపోయి మంగళవారం 8.2 శాతం వరకు పతమైంది. మొత్తం రెండు రోజుల్లో 14.07 శాతం నష్టపోయింది. కాగా యాంట్ గ్రూప్-ఆధారిత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ. 4,447 కోట్ల (568.16 మిలియన్ డాలర్లు) డీల్ను శుక్రవారం వెల్లడించింది. షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. తీవ్రమైన పోటీలో నిలదొక్కుకుని, మార్కెట్లో పట్టు సాధించే ప్రక్రియలో ఈ డీల్ కుదుర్చుకుంది. ఇది కూడా చదవండి: Indian Rupee Vs US Dollar: రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో అడుగు ముందుకు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్, మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్కు ట్విటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సంగతి తెలిసింది. తాజాగా డీల్కు ట్విటర్ బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేయడంతో మెర్జర్ డీల్కు మరో అడుగు ముందుకు పడింది. ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. ప్రత్యేక స్టాక్హోల్డర్ల సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించాలా అనేదానిపై ఇన్వెస్టర్లు ఓటు వేయ నున్నారు. షేర్హోల్డర్లు తమ స్టాక్లోని ప్రతి షేరుకు 54.20డాలర్ల నగదుకు అర్హులు. ఇది మస్క్ తన తొమ్మిది శాతం వాటా కొనుగోలుకు చివరి రోజు ట్రేడింగ్ విలువను పరగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ట్విటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ సమాచారాన్ని టెక్ క్రంచ్ వెల్లడించింది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉన్నాయని వాదిస్తున్న మస్క్ ఇటీవల ఖతార్ ఎకనామిక్ ఫోరమ్లో ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ డీల్కు సంబంధించి మరో ప్రధాన అడ్డంకి వాటాదారుల ఆమోదం కూడా ఒకటని అన్నారు. అయితే గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీల్ విషయంలో ముందుకు సాగాలనే భావిస్తున్నట్టు మస్క్ పేర్కొన్నారు. -
జియో-ఫేస్బుక్ డీల్: రిలయన్స్కు ఝలక్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు భారీ షాక్ తగిలింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించి ఫెయిర్ డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో ఇద్దరు అధికారులపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝుళిపించింది. రిలయన్స్, సావిత్రి పరేఖ్, కె సేతురామన్కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా సంయుక్తంగా, లేదా వేర్వేరుగా చెల్లించాలని ఆదేశించింది. జియో-ఫేస్బుక్ డీల్కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో మీడియాలో వెలువడ్డాయని, 9.99 శాతం వాటా కొనుగోలుకు ఫేస్బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేసిన తరువాత కూడా ఇవ్వలేదనీ, రెగ్యులేటరీ సెబీకి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని రిలయన్స్పై ఉందని సెబీ పేర్కొంది. అయితే ఆలస్యంగా 2020 ఏప్రిల్22న ఎక్స్ఛేంజీలకు అందించిందనీ తెలిపింది. ఈ 28 రోజుల ఆలస్యానికి జరిమానా విధించామని సెబీ అధికారి బర్నాలీ ముఖర్జీ తన ఉత్తర్వులో తెలిపారు. ఈ వార్తలతో రిలయన్స్ షేరు మంగళవారం మార్కెట్ ఆరంభంలో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. మరోవైపు సెబీ జరిమానాపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్క్రాప్ట్ డీల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. ఈ మేరకు క్యారియర్ ఎయిర్బస్ A320neo ఫ్యామిలీ జెట్లు లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ లేక రెండింటిని మిక్స్ చేసి సరికొత్త మోడల్స్ని ఆర్డర్ చేయవచ్చునని అధికారులు అంటున్నారు. దేశంలో ఎయిర్బస్ ఆధిపత్యం చెలాయిస్తున్నందున భారత్ ఈ నారోబాడీ జెట్ ఆర్డర్ని గెలుచుకోవడం బోయింగ్ విమానాలను తిరుగుబాటుగా అయ్యింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో అత్యధికంగా అమ్ముడై నారోబాడీల కోసం యూరోపియన్ తయారీదారులకు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్గా మారింది. పైగా సుమారు 700 నారోబాడీలను ఆర్డర్ చేస్తోంది. గో ఎయిర్లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ఏషియా ఇండియా లిమిటెడ్తో సహా ఇతర సంస్థలు ఒకేతరహా విమానాలను నడుపుతున్నాయి. సుమారు 300 విమానాల ఉత్పత్తికి, డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునని అధికారుల చెబుతున్నారు. ఎయిర్బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్లను నిర్మిస్తుంది, 2023 కల్లా వాటిని 65కి, 2025 నాటికి 75కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా ఎయిర్లైన్ను కొనుగోలు చేసింది. ఇది నాలుగు ఎయిర్లైన్ బ్రాండ్లతో సహా దాని విమానయాన వ్యాపారాలను ఏకీకృతం చేయాలని భావిస్తోంది. కొత్త విమానాల కోసం చేస్తున్న ఆర్డర్ డీల్ ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు చాలా చౌక ధరల్లో కొనుగోలు చేసి..ప్రత్యర్థులతో మెరుగ్గా పోటీ పడడంలో సహాయపడుతుంది. (చదవండి: అగ్నివీరులకు స్వాగతమంటున్న ఆనంద్ మహీంద్రా) -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో బాంబు
సాక్షి, న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఈలాన్ మస్క్ మరోసారి ట్విటర్కు హెచ్చరిక జారీ చేశాడు. స్పామ్, నకిలీ ఖాతాలపై డేటా అందించకపోతే ట్విటర్ కొనుగోలు డీల్ను విరమించుకుంటానంటూ తాజాగా హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ట్విటర్కు సోమవారం ఒక లేఖ రాశాడు. విలీన ఒప్పందం ప్రకారం ట్విటర్ వివరాలను వెల్లడించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని, దీంతో తామడిగిన డేటాను అడ్డుకుంటోందనే అనుమానం మరింత కలుగుతోందని లేఖలో మస్క్ వ్యాఖ్యానించాడు. తాము కోరిన డేటాను నిలిపివేయడం సంస్థ తన సమాచార హక్కులను తీవ్రంగా ప్రతిఘటిస్తోందని, అడ్డుకుంటోందని మస్క్ భావిస్తున్నారని మస్క్ లాయర్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన అని ఈనేపథ్యంలో డీల్ రద్దు చేయడంసహా అన్ని హక్కులు తమకున్నాయని పేర్కొన్నారు. కాబోయే యజమానిగా కంపెనీ వ్యాపార స్వాధీనం, లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ట్విటర్ యాక్టివ్ యూజర్ల బేస్ గురించి పూర్తి, ఖచ్చితమైన అవగాహన ఉండాలని లేఖ స్పష్టం చేసింది. ట్విటర్ కొనుగోలు కోసం హెచ్ఎస్ఆర్ చట్టం కింద నిరీక్షణ వ్యవధి ముగిసిందని ట్విటర్ తెలిపిన దాదాపు వారం తర్వాత టెస్లా సీఈవో ఈ లేఖను రాయడం గమనార్హం. మరోవైపు ఈ మస్క్ లేఖపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. కాగా ట్విటర్లో నకిలీ ఖాతాలు మొత్తం యూజర్బేస్లో 5 శాతం కంటే తక్కువ ఉన్నారో లేదో నిర్ధారించుకునేదాకా 44 బిలియన్ డాలర్ల డీల్ను "తాత్కాలికంగా హోల్డ్"లో ఉంచుతున్నట్లు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విటర్ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ ఖాతాలున్నాయా? లేదా? అనేది ధృవీకరించుకునేందుకు స్వతంత్ర విశ్లేషణను కోరింది. కంపెనీ చట్టాలు, టెస్టింగ్ మెథడాలజీలు సరిపోతాయని నమ్మడం లేదు కాబట్టి తాను తప్పనిసరిగా ఉండాలనేది మస్క్ డిమాండ్. తాజా లేఖ నేపథ్యంలో ట్రేడింగ్లో ట్విటర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. -
ట్విటర్ డీల్కు మస్క్ బ్రేకులు
లండన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ట్విటర్ చూపుతున్న స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్యపై మస్క్ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీల్ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో స్పామ్, నకిలీ ఖాతాలు అయిదు శాతం కన్నా తక్కువే ఉంటాయంటూ మార్చి త్రైమాసిక ఫలితాల్లో ట్విటర్ వెల్లడించిన వార్తను తన ట్వీట్కు ఆయన జత చేశారు. ‘మొత్తం యూజర్లలో నకిలీ ఖాతాల సంఖ్య నిజంగానే అయిదు శాతం కన్నా తక్కువే ఉందని «ధ్రువీకరించే వివరాలు అందేవరకూ ట్విటర్ డీల్ను తాత్కాలికంగా ఆపుతున్నాం‘ అని మస్క్ వెల్లడించారు. అయితే, ఈ ఒక్క అంశం వల్ల ట్విటర్ టేకోవర్ ఒప్పందానికి విఘాతమేదైనా కలుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అటు ట్విటర్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇద్దరు టాప్ మేనేజర్లను తొలగించిన ట్విటర్.. కీలక స్థానాలకు మినహా ఇతరత్రా నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని పేర్కొంది. డీల్ నుంచి బైయటపడేందుకు సాకు.. డీల్ నుంచి బైటపడటానికి మస్క్.. నకిలీ ఖాతాల సాకును చూపుతున్నట్లుగా అనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా టేకోవర్ కోసం 44 బిలియన్ డాలర్లు వెచ్చించే బదులు పరిహారం కింద గరిష్టంగా 1 బిలియన్ డాలర్లు కట్టి మస్క్ తప్పించుకునే యోచనలో ఉండొచ్చని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల అభిమతానికి విరుద్ధంగా ట్విటర్పై దృష్టి పెట్టడం వల్ల టెస్లా వ్యాపారం గాడి తప్పే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని వివరించాయి. మరోవైపు, కంపెనీ షేరు కుదేలయ్యే రకంగా చేసి, మరింత చవకగా దక్కించుకోవాలని మస్క్ భావిస్తుండవచ్చని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ట్విటర్ షేరు కుదేల్.. టేకోవర్ డీల్కు బ్రేకులు పడ్డాయన్న వార్తలతో ట్విటర్ షేరు శుక్రవారం ఒక దశలో ఏకంగా 10 శాతం పైగా పతనమై 40.01 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అటు టెస్లా ఆరు శాతం పైగా ఎగిసి 775 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇస్తానంటూ మస్క్ ఆఫర్ ఇచ్చిన రోజున ట్విటర్ షేరు సుమారు 45 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఆ తర్వాత డీల్ వార్తలతో 50 డాలర్ల పైకి ఎగిసింది. కానీ తాజా పరిస్థితులతో 40 డాలర్ల స్థాయికి పడిపోయింది. -
ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఎలన్ మస్క్
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ డీల్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లోనే ఓ పోస్ట్ చేశారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్ డీల్ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn — Elon Musk (@elonmusk) May 13, 2022 ఈ ప్రకటనతో మార్కెట్ ట్రేడింగ్లో ట్విటర్ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్ నిలిపివేతపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్లో పెట్టగా.. ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్ మస్క్ ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది. -
Elon Musk: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్లో ట్విస్ట్
డెలావేర్: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్పీఎఫ్. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం. మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్, ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చదవండి: ట్విటర్.. టెస్లా ఒక్కటి కాదు - బిల్గేట్స్ -
ట్విటర్ డీల్.. చైనా పరపతితో ఎలన్ మస్క్కు పంచ్
ట్విటర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. ఈ అంశం ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛా గొంతుక(పోస్టులు) వినిపించే అవకాశం యూజర్లకు కల్పిస్తానంటూ ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భారీ డీల్పై ఎలన్ మస్క్ వ్యాపార ప్రత్యర్థి జెఫ్ బెజోస్ స్పందించారు. అమెజాన్ బాస్, ప్రపంచంలో రెండో ధనికుడు జెఫ్ బెజోస్.. ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన అంశంపై స్పందించారు. చరకలు అంటిస్తూనే.. ఆ వెంటనే మస్క్ను అభినందించినట్లు బెజోస్ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ తరుణంలో తెరపైకి ఆయన చైనా ప్రస్తావన తీసుకొచ్చారు. ► ఇకపై టెస్లాతో పాటు ట్విటర్లోనూ చైనా కీలక పాత్ర పోషించబోతుందంటూ అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారాయన. ‘‘చైనీస్ ప్రభుత్వం ‘టౌన్ స్క్వేర్’తో.. ఇప్పుడు పరపతి పొందుతుందా? ఆసక్తికరమైన ప్రశ్న..’’ అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారాయన. Interesting question. Did the Chinese government just gain a bit of leverage over the town square? https://t.co/jTiEnabP6T — Jeff Bezos (@JeffBezos) April 25, 2022 ► విషయం ఏంటంటే.. ఆటోమేకింగ్ దిగ్గజం టెస్లా.. చైనాలోనే తొలి ఓవర్సీస్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. తద్వారా అతిపెద్ద మార్కెట్ ఆసియా మీద దృష్టిసారించింది. ఇప్పుడు ట్విటర్తోనూ మస్క్.. చైనా పరపతిని పెంచుతాడేమో అంటూ పరోక్షంగా విసుర్లు విసిరాడు బెజోస్. ► స్వేచ్ఛా ప్రకటనకు ట్విటర్ అనేది డిజిటల్ టౌన్ స్క్వేర్ లాంటిదని ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెజోస్.. టౌన్స్క్వేర్ అంటూ సెటైర్ వేశాడు. అయితే ప్రశ్న సంధించినట్లే సంధించి.. దానికి సమాధానం ఏమో పాజిటివ్గా ఇచ్చాడు బెజోస్. ► నా ఉద్దేశంలో అలా జరగకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. చైనా-టెస్లాలో ఉన్న సంక్లిష్టత, ట్విటర్కు ఉన్న సెన్సార్షిప్ అడ్డంకులు ఒకటి కాకపోవచ్చంటూ కామెంట్ చేశాడు. ఆ వెంటనే.. మస్క్ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను డీల్ చేయడంలో దిట్ట అంటూ ప్రశంసలు గుప్పించాడు జెఫ్ బెజోస్. మొత్తానికి తన అక్కసును వెల్లగక్కినట్లే కక్కి.. మస్క్పై ప్రశంసలు గుప్పించాడు బెజోస్. దీనిపై మస్క్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. My own answer to this question is probably not. The more likely outcome in this regard is complexity in China for Tesla, rather than censorship at Twitter. — Jeff Bezos (@JeffBezos) April 26, 2022 But we’ll see. Musk is extremely good at navigating this kind of complexity. — Jeff Bezos (@JeffBezos) April 26, 2022 చదవండి: మస్క్ చేతికి ట్విటర్! అనిశ్చితిలోకి అడుగు అంటూ.. -
ట్విటర్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
Twitter CEO Parag Agrawal: ట్విటర్ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ డీల్కు ట్విటర్ ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ చేతికి వెళ్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా దీనిపై ప్రకటన సైతం వెలువడింది. ఈ తరుణంలో.. సీఈవో పరాగ్ అగర్వాల్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సోమవారం.. కంపెనీ ఉద్యోగులు, కీలక ప్రతినిధులతో ఆయన భేటీ (ఆల్ హ్యాండ్స్ మీటింగ్) అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటెరాక్షన్ సందర్భంగా ఆయన ట్విటర్ భవితవ్యంపై వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో.. సోషల్ మీడియా కంపెనీలో అనిశ్చితి నెలకొనడయం ఖామని వ్యాఖ్యానించాడు. ఎలన్ మస్క్ చేతికి పగ్గాలు అప్పిగించాక.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్పై విధించిన ట్విటర్ నిషేధం ఎత్తేస్తారా? అనే ప్రశ్నకు పరాగ్ బదులిస్తూ.. ‘ఒకసారి డీల్ ముగిశాక.. ప్లాట్ఫామ్ పయనం ఎటువైపు ఉంటోదో మేం చెప్పలేం. కానీ, ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి వెళ్తే.. అనిశ్చితి నెలకొనడం మాత్రం ఖాయం. ఒకవేళ ఎలన్తో మాట్లాడేటప్పుడు దీనికంటూ(ట్రంప్పై నిషేధం ఎత్తివేత) ఓ సమాధానం దొరకవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే.. ఈ కీలక సమయంలో లేఆఫ్లు ఉండబోవని ఉద్యోగులకు గ్యారెంటీ ఇచ్చాడాయన. ఇక భేటీకి కొత్త ఓనర్ ఎలన్ మస్క్ సైతం హాజరు కావాల్సి ఉండగా.. ఎందుకనో గైర్హాజరయ్యాడు. అలాగే సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే, ఇతర కీ సభ్యులు సైతం హాజరు కాలేదు. చైర్మన్ బ్రెట్ టేలర్ మాత్రమే హాజరయ్యాడు. ఇక ట్విటర్, ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లడానికి ఇంకా ఆరు నెలల సమయం పట్టనుందని బ్రెట్, పరాగ్లు ఉద్యోగులకు స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ట్విటర్ను ఎలన్ మస్క్ చేజిక్కిచుకునే ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి.. ఉద్యోగుల్లో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరైతే ట్విటర్లోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదిఏమైనా మార్పు తప్పదని సోమవారం ఉదయం ఈ డీల్కు సంబంధించి ఉద్యోగులకు మెయిల్ పెట్టాడు సీఈవో పరాగ్ అగర్వాల్. చదవండి: ట్విటర్-ఎలన్ మస్క్ ఒప్పందం ఎంతంటే.. -
జాక్ పాట్ కొట్టేసిన సిగ్నిటీ టెక్నాలజీస్!
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ తాజాగా 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 76 కోట్లు) ఆర్డరు దక్కించుకుంది. అమెరికాకు చెందిన అతి పెద్ద ఆర్థిక సేవల సంస్థల్లో ఒక దాన్నుంచి ఈ వార్షిక కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సంస్థ సీఈవో శ్రీకాంత్ చక్కిలం వెల్లడించారు. భారీ డీల్స్ దక్కించుకోవడంలో తమ సామర్థ్యాలకు ఇది నిదర్శనమని ఆయన వివరించారు. తమ ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా మరింత పెరిగేందుకు ఈ డీల్ తోడ్పడగలదని శ్రీకాంత్ చెప్పారు. -
అరబిందో చేతికి వెరిటాజ్ దేశీ ఫార్ములేషన్స్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తాజాగా వెరిటాజ్ హెల్త్కేర్కి చెందిన దేశీ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ. 171 కోట్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. దేశీ మార్కెట్లో విస్తరించడానికి ఈ డీల్ తోడ్పడగలదని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను నిర్మించడంలో అరబిందోకి ఉన్న సామర్థ్యాలు, విస్తృతమైన వెరిటాజ్ నెట్వర్క్ తోడ్పాటుతో రాబోయే రోజుల్లో దేశీ ఫార్మా మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా బయోసిమిలర్లు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్రిటికల్ కేర్ చికిత్స విభాగంలో వెరిటాజ్కు 40 పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఫెపానిల్, మెరోగ్రామ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. 50,000 మంది పైచిలుకు రిటైలర్లు సంస్థ నెట్వర్క్లో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 127 కోట్ల టర్నోవరు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ. 133 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సోమవారం అరబిందో షేరు బీఎస్ఈలో సుమారు ఒకటిన్నర శాతం క్షీణించి దాదాపు రూ. 707 వద్ద క్లోజయ్యింది. -
టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుంది . ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులకు సిద్దమైంది టాటా గ్రూప్స్. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్స్తో యూరప్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్బస్ భారీ డీల్ను కుదుర్చుకునేందుకు ఊవిళ్లురుతుంది. టాటాతో పాటుగా..! ఎయిర్బస్ తయారుచేస్తోన్న A350XWB విమానాల సేకరణకు సంబంధించిన డీల్ కోసం టాటా గ్రూప్స్తో పాటుగా పలు భారతీయ విమానయాన సంస్థలతో చర్చలను కంపెనీ జరుపుతోందని ఎయిర్బస్ ఇండియా & సౌత్ ఏషియా అధ్యక్షుడు రెమి మైలార్డ్ సోమవారం పేర్కొన్నారు. టాటా గ్రూప్స్తో దీర్ఘకాలిక, విశ్వసనీయమైన సంబంధాలను ఇరు కంపెనీల మధ్య నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ డీల్తో భారత విమాన రంగంలో కొత్త రికార్డులు నమోదుచేసే అవకాశం ఉందని రెమి మైలార్డ్ అభిప్రాయపడ్డారు. భారత డొమెస్టిక్ విమాన ప్రయాణాల్లో ఎయిర్ ట్రాఫిక్ వార్షిక సగటు వృద్ధి 6.2 శాతంగా, ప్రపంచ ఎయిర్ ట్రాఫిక్ సగటు వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక టాటా గ్రూప్స్ ఇటీవలే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా స్పెసిఫిక్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా అనే నాలుగు ఇండియన్ క్యారియర్లను నడుపుతోంది. A350XWB భారీ సైజులో..! ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్బస్ రూపొందించిన A350XWB ఎయిర్క్రాఫ్ట్ అత్యంత ఆదరణను పొందాయి. ఇవి అధిక ఫ్యుయల్ ట్యాంక్లను కల్గి ఉన్నాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్ A320NEO ఎయిర్క్రాఫ్ట్లతో పోల్చితే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ విమానాలు ఏకధాటిగా 18 గంటలపాటు ప్రయాణిస్తాయి. చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ! -
భీమ్లా నాయక్కు ఓటీటీల పోటీ, భారీ డీల్కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టిస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంతో భీమ్లా నాయక్కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అనంతరం ప్రతి కొత్త సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ చిత్రాలు పోస్ట్ రిలీజ్కు కళ్లు చెదిరే డీల్కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో పుష్ప, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే రిలీజ్కు ముందే భీమ్లా నాయక్ డిజిటల్ రిలీజ్కు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. మేకర్స్ కళ్లు చెదిరే డీల్కు భీమ్లా నాయక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయట. ఫైనల్గా ఈ సినిమాను ఆహాతో కలిసి డిస్నీప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని చెబుతున్నారు. రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ రైట్స్ను దక్కించుకున్నాయనే వార్త ఆసక్తిని సంతరించుకుంది. దీంతో ఈ మూవీ మేకర్స్తో భారీగా ఓప్పందం కుదుర్చుకున్నాయని, కళ్లు చేదిరే డీల్కు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ థియేటర్లో విడుదలైన 50 లేదా 30 రోజుల తర్వాత ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. కాగా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్తి మీనన్లుఏ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాని సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. -
Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?
ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ, ఓ టీనేజర్తో ఒప్పందం కోసం ముందడుగు మాత్రం వేయలేకపోయాడు. 37 లక్షల రూపాయల(50వేల డాలర్లు)కు వెనకడుగు వేసి.. ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఇది ఇంతటితోనే అయిపోలేదు. మస్క్ని ఏకంగా పిచ్చోడు అంటున్నాడు ఆ కుర్రాడు. అది ఎందుకో అ కుర్రాడి మాటల్లోనే చూద్దాం.. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ట్విటర్ అకౌంట్ ‘ఎలన్జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన స్కూల్ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని.. ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడట. కానీ, మస్క్, స్వీన్ ప్రతిపాదనలో దేనికీ ఓకే చెప్పలేదు. సరికదా.. ఆ కుర్రాడి అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ‘ఎలన్ మస్క్ జెట్ బోట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు.. అనే వివరాలన్నింటిని బయటపెడుతుంది. భద్రతా కోణంలో దాని వల్ల అతనికి జరిగే నష్టం ఎక్కువ. లీగల్-ఇల్లీగల్ అనే అంశాలను పక్కనపెడితే.. సాధారణంగా కొన్ని కంపెనీలు ఫ్లైట్ ట్రాకింగ్ ద్వారానే మిలియన్ల ఆదాయం సంపాదిస్తుంటాయి. అందుకు తగ్గట్లే మిలియనీర్లు, బిలియనీర్లు కూడా ముట్టజెప్పుతుంటారు. కానీ, నేను ఏదో కొద్ది మొత్తంలోనే ఆశించా. మా ఇద్దరి మధ్య ట్విటర్ సంభాషణల తర్వాత మస్క్ తిరిగి వస్తాడేమో అనుకున్నా. కానీ, అది జరగలేదు. పైగా ఈ డీల్ వార్తలు బయటకు రాగానే ఆదివారం రాత్రి.. మస్క్ మొత్తం స్వీనీకి చెందిన అకౌంట్లన్నింటిని బ్లాక్ చేసేశాడట. ఇది చాలా వింతగా ఉంది. నిజంగానే మస్క్ ఒక పిచ్చోడు. ఆయన బుర్రలో నిజంగా గుజ్జు ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక మీదట ఆయన జెట్ను ట్రేస్ చేసేది లేదు. ఇక ఆపేస్తున్నా.. అంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు ఆ టీనేజర్. అంతేకాదు భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం వచ్చినా.. చచ్చినా చేయనంటూ తేల్చేశాడు కూడా. మరి ఈ కుర్రాడి అసహనంపై ఎలన్ మస్క్ స్పందిస్తాడా? అన్నది చూడాలి. ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను జాక్ స్వీన్ రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. -
అపర కుబేరుడు.. రూ. 37 లక్షలు ఓ లెక్కా?!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నెంబర్ వన్. అలాంటి వ్యక్తికి 37 లక్షలు ఒక లెక్కా? అనే సందేహం చాలామందికే కలుగుతోంది ఇప్పుడు. ఓ కాలేజీ స్టూడెంట్తో ఒప్పందం కోసం ప్రయత్నించిన ఎలన్ మస్క్.. తీరా ఆ కుర్రాడు ఎక్కువ డిమాండ్ చేసేసరికి మౌనంగా ఉండిపోయాడట. ఇంతకీ ఏమా కథ తెలుసుకోవాలని ఉందా? వ్యక్తిగత భద్రత దృష్ట్యా తన ప్రైవేట్ జెట్ను ట్రాక్ చేయడం ఆపాలంటూ ఓ టీనేజర్తో ఎలన్ మస్క్ ఒప్పందం కోసం ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కింది. 19 ఏళ్ల జాక్ స్వీన్ అనే స్టూడెంట్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు. ‘ఎలన్ మస్క్స్ జెట్’ పేరుతో నిర్వహించే ట్విటర్ అకౌంట్కు స్వయంగా ఎలన్ మస్క్ సందేశాలు పంపాడు. కిందటి ఏడాది ఈ ట్విటర్ ఎక్స్ఛేంజ్ జరిగినట్లు తెలుస్తోంది.తన ప్రైవేట్ జెట్ను ట్రాక్ చేయడం ఆపేస్తే 5 వేల డాలర్లను ఇస్తానని (మన కరెన్సీలో 3 లక్షల 75 వేల రూపాయలకు పైనే) ఎలన్ మస్క్, స్వీన్కు ఆఫర్ చేశాడట. అయితే అది తక్కువని, బదులులుగా 50 వేల డాలర్లు ఇవ్వమని(37 లక్షల 55 వేలు) స్వీన్ మస్క్తో అన్నాడట. తద్వారా తన స్కూల్ ఫీజులతో పాటు టెస్లా కారు కొనాలన్న (టెస్లా మోడల్ 3) కూడా నెరవేరుతుందని స్వీనే ఎలన్ మస్క్కి బదులిచ్చాడట. కానీ, అది పెద్ద మొత్తం అని చెబుతూ ఎలన్ మస్క్ ఆ బేరాన్ని అక్కడితోనే ఆపేసి.. మళ్లీ మెసేజ్ చేయలేదట. ట్విటర్లో ఈ ఎలన్ మస్క్తో జరిగిన సంభాషణను ఓ ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ ద్వారా బయటపెట్టాడు స్వీన్. దీంతో భద్రత కన్నా డబ్బులు ముఖ్యమా? అని ఎలన్ మస్క్కు తిట్టిపోస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు ‘ఎలన్జెట్’(ట్విటర్ హ్యాండిల్)సహా మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ అకౌంట్లను ఆ కుర్రాడు రన్ చేస్తున్నాడు. వీళ్లలో బిల్గేట్స్, జెఫ్బెజోస్లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్ అకౌంట్కే ఎక్కుమంది ఫాలోవర్స్ ఉన్నారు. మస్క్ తనతో బేరానికి రావడం సంతోషంగా, కొంచెం ఎగ్జయిటింగ్గా ఉందని, భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్ఎక్స్తోగానీ పని చేసే అవకాశం ఆశిస్తున్నట్లు చెప్తున్నాడు 19 ఏళ్ల స్వీనే. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
ఫ్యూచర్ వివాదంపై ఎన్సీఎల్ఏటీకి అమెజాన్
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేస్రి ఈ విషయం తెలిపారు. అయితే, సత్య ఎంత ఇన్వెస్ట్ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. స్టాక్స్, ఫండ్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడే గ్రో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్లో 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో 251 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,885 కోట్లు) సమీకరించింది. తాజా విడతలో అల్కియోన్, లోన్ పైన్ క్యాపిటల్, స్టెడ్ఫాస్ట్ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సెకోయా క్యాపిటల్, రిబిట్ క్యాపిటల్, వైసీ కంటిన్యుటీ, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ మొదలైనవి కూడా పెట్టుబడులు పెట్టాయి. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
ఫిలిప్పీన్స్కు భారత్ బ్రహ్మోస్
న్యూఢిల్లీ: భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్ నేవీకి బ్రహ్మోస్ను అందించే ఈ డీల్పై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్– ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్శాఖ ఇటీవల రెండు ఎస్ఏఆర్ఓ(స్పెషల్ అలాట్మెంట్ రిలీజ్ ఆర్డర్స్)ను విడుదల చేసింది. వచ్చే కొన్ని వారాల్లో కొనుగోలు విషయమై అధికారిక ప్రకటన వెలువడచ్చని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్కు అందజేయబోయే క్షిపణుల రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది. భారత్, ఫిలిప్పీన్స్ గత ఆగస్టులో దక్షిణ చైనా సముద్రంలో నౌకా విన్యాసాలు జరిపాయి. ఈ ప్రాంతంలో ఫిలిప్పీన్స్కు చైనాతో వివాదాలున్నాయి. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్లో భాగంగా బ్రహ్మోస్ను అభివృద్ధి చేశారు. -
టాటాల గూటికి ‘మహారాజా’ చేరేది అప్పుడే
న్యూఢిల్లీ: వేలంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం.. టాటా గ్రూప్నకు అప్పగించడంలో జాప్యం జరగనుంది. నిర్దిష్ట ప్రక్రియలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టేస్తుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అప్పగింత ప్రక్రియ జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. రూ.18,000 కోట్ల డీల్ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను వేలంలో టాటా గ్రూప్ సంస్థ టాలేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది సుమారు రూ. 18,000 కోట్ల డీల్. ఇందులో రూ. 2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. కొనుగోలు ఒప్పందం ప్రకారం 8 వారాల్లోగా (డిసెంబర్ ఆఖరులోగా) అప్పగింత ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇరు పక్షాల అంగీకారం మేరకు దీన్ని మరికాస్త పొడిగించుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో ఇదే జరుగుతోందని సంబంధిత అధికారి వివరించారు. రుణభారం రూ.61,562 కోట్లు హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయితే టాటా గ్రూప్.. నగదు భాగాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2007–08లో ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీని గట్టెక్కించడానికి గత దశాబ్ద కాలంలో రూ. 1.10 లక్షల కోట్లపైగా నగదు, రుణాల గ్యారంటీల రూపంలో ప్రభుత్వం అందించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్నకు కంపెనీని అప్పగించడానికి ముందు ఇందులో 75 శాతాన్ని (దాదాపు రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్ఎల్కు బదలాయిస్తారు. టాటాలకు 141 ఎయిరిండియా విమానాలు దక్కుతాయి. అయితే, ప్రధాన వ్యాపారేతర అసెట్స్ మాత్రం లభించవు. చదవండి: ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు -
ఈడీని కోర్టుకు లాగిన అమెజాన్!
Amazon Files Writ Petition Against ED In Delhi HC: విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దర్యాప్తు పరిధిపై వివరణ కోరుతూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టులో బుధవారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం విషయంలో ‘విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు జరిగాయని’ అమెజాన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఈ– రిటైలర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్తో డీల్కు సంబంధించి అమెజాన్కు గత నెల్లో ఈడీ నుంచి సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని గత నెల్లో అమెజాన్ స్వయంగా వెల్లడించింది. రిట్ దాఖలుకు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం తన విచారణా పరిధిని మించి ఈడీ వ్యవహరిస్తోందన్నది అమెజాన్ ఆరోపణ. ఫ్యూచర్–అమెజాన్ లావాదేవీలతో సంబంధం లేని లేదా వాటి గురించి అవగాహన లేని తన ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి ఈడీ సమన్లు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధతను రిట్ పిటిషన్లో అమెజాన్ ప్రశ్నించింది. కాగా, ఈ రిట్పై అడిగిన ప్రశ్నలకు అమెజాన్ నుంచి ఎటువంటి ప్రతి స్పందనా లభించలేదు. అమెజాన్–ఫ్యూచర్ గ్రూప్ మధ్య ప్రస్తుతం రూ.24,500 కోట్ల రిలయన్స్ రిటైల్ (ఫ్యూచర్ గ్రూప్ ఆ సంస్థలో చేసుకున్న) ఒప్పందపై న్యాయపోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
చెన్నై ‘రామ్చరణ్’ కంపెనీలోకి భారీ పెట్టుబడులు
ముంబై: దేశ కెమికల్స్ రంగంలోనే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల ఒప్పందం చోటుచేసుకుంది. చెన్నైకు చెందిన కెమికల్స్ డిస్ట్రిబ్యూటర్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ‘రామ్చరణ్ కో’లో న్యూయార్క్కు చెందిన టీఎఫ్సీసీ ఇంటర్నేషనల్ 46% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 4.14 బిలియన్ డాలర్లను (రూ.31,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయ నుంది. దీంతో రామచరణ్ కో 9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకున్నట్టు అయింది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ, నూనతతరం ఇంధన స్టోరేజ్ పరికరాలను రామచరణ్ కంపెనీ తయారు చేస్తోంది. భారత్లో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనాలు, తక్కువ వ్యయాలతో కూడిన ఇళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు టీఎఫ్సీసీ ప్రకటించింది. -
ఆస్ట్రేలియా సంస్థను టేకోవర్ చేసిన ఇండియన్ కంపెనీ
ముంబై: ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) కంపెనీ అప్గ్రాడ్ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ స్టడీ పార్ట్నర్స్ (జీఎస్పీ)ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 16 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంటుందని (సుమారు రూ. 85 కోట్లు), మరో 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 53.5 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. 2015లో ఏర్పాటైన జీఎస్పీకి ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికాలో దాదాపు 600 పైగా కేంద్రాల నెట్వర్క్ ఉంది. 1,300 మంది రిక్రూట్మెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇదే ప్రథమం ఒక అంతర్జాతీయ సంస్థను అప్గ్రేడ్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. సమగ్ర ఎడ్టెక్ దిగ్గజం గా 18–50 ఏళ్ల మధ్య వయస్సు గల వారి అభ్యాసకుల విద్యావసరాలను తీరుస్తున్నామని, విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడానికి జీఎస్పీ కొనుగోలు తోడ్పడగలదని అప్గ్రేడ్ వ్యవస్థాపకుడు చైర్మన్ రోనీ స్క్రూవాలా తెలిపారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించిన సర్వీసులు అందించే విభాగం ద్వారా వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు అప్గ్రేడ్ ప్రెసిడెంట్ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: అప్గ్రేడ్ సంస్థకు యూనికార్న్ హోదా -
ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
ముంబై: ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్ అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్ఖాన్ మేనేజర్ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. గట్టి జవాబు ఇస్తాం: సమీర్ ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్ను ఎన్సీబీ డైరెక్టర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్ ఆర్యన్ఖాన్ విడుదలకు ఎన్సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్గా ఉన్నాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్తో పాటుగా సంజయ్ రౌత్ ఒక వీడియో క్లిప్పింగ్ షేర్ చేశారు. ఆ వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్ చేతిలో పట్టుకొని (స్పీకర్ ఆన్ చేసి) ఉండగా... ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్ డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేపై సిట్తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది. నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ ఈ అంశాన్ని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు. -
నెట్ఫ్లిక్స్, కరన్జోహార్ బంధానికి ఎండ్కార్డ్
Karan Johar Ended His Deal With Netflix: నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన లస్ట్ స్టోరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. లస్ట్ స్టోరీస్తో మొదలైన బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ కరణ్ జోహార్ , నెట్ఫ్లిక్స్ బంధానికి తెరపడింది. 2019 నుంచి ఇండియాలో మార్కెట్ విస్తరణలో భాగంగా నెట్ఫ్లిక్స్ సంస్థ ఒరిజనల్ కంటెంట్ అందించేందుకు కరణ్ జోహార్కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్తో 2019లో జత కట్టింది. దీని ప్రకారం ధర్మా ప్రొడక్షన్ హౌజ్కి చెందిన ధర్మాన్ నుంచి వచ్చే అన్ని వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్లోనే ప్రసారం చేయాల్సి ఉంటుంది. లస్ట్ స్టోరీస్ కరణ్ జోహార్, నెట్ఫ్లిక్స్ ఒప్పందంలో భాగంగా వచ్చిన లస్ట్ స్టోరీస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా నెట్ఫ్లిక్స్కి చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. మొత్తంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ రెండు సంస్థలు రెండేళ్ల పాటు పని చేశాయి. ఇక చాలు రెండేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత దాన్ని పొడిగించేందుకు కరణ్ జోహార్ ఆసక్తి చూపించలేదు. తమ ధర్మ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చె వెబ్ సిరస్లను ఒకే ఓటీటీ ప్లాట్ఫారమ్కే పరిమితం చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో రెండేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణానికి పులిస్టాప్ పెట్టేశారు. మరోవైపు ధర్మా ప్రొడక్షన్ హౌజ్కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్వీడియోస్, డిస్నీ హాట్స్టార్లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. విస్తరిస్తున్న ఓటీటీ ఇండియాలో ఓటీటీ మార్కెట్ శర వేగంగా విస్తరిస్తోంది. లీడింగ్లో ఉన్న అమెజాన్ ప్రైమ్కి ప్రస్తుతం 1.80 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి 2.10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2021 డిసెంబరు నాటికి 46 లక్షల మంది చందాదారులున్న నెట్ఫ్లిక్స్ సంస్థ దాన్ని 55 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హాట్స్టార్, జీ 5, సోనీ, వూట్, ఆల్ట్ బాలాజీలు సరైతం చందాదారులను ఆకట్టుకునేందుకు వెబ్ సిరీస్, కొత్త సినిమా రిలీజ్పై దృష్టి పెట్టాయి. లాభసాటి వ్యవహారం ఓటీటీలకు యూత్ మహారాజ పోషకులుగా ఉన్నారు. దీంతో యూత్ను ఆకట్టుకునే వెబ్ సిరీస్లు నిర్మించే సంస్థలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఒక్కో వెబ్ సిరీస్ని ఒక్కో ఓటీటీ ప్లాట్ఫార్మ్పై రిలీజ్ చేయడం ద్వారా ఇటు ఆర్థికంగా లాభసాటిగా ఉండటంతో పాటు బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందనే యోచనలో కరణ్ జోహార్ ఉన్నారు. అందువల్లే నెట్ఫ్లిక్స్కి బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చదవండి : సమంతకు నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్.. వైరల్ అవుతోన్న రెమ్యునరేషన్! -
జియోఫోన్కు పోటీగా...ఎయిర్టెల్ కొత్త ప్లాన్...!
ముంబై: టెలికాం రంగంలో జియో రాకతో పలు సంస్థలకు కంటిమీద కునుకులేకుండాపోయింది. జియో మొబైల్ టారిఫ్ చార్జీలను గణనీయంగా తగ్గించడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా టారిఫ్ ఛార్జీలను తగ్గించాల్సి వచ్చింది. భారత టెలికాం రంగంలో తనదైన ముద్రను వేయడం కోసం జియో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్ కొరతతో జియోఫోన్ నెక్ట్స్ లాంచ్కు బ్రేకులు పడింది. జియోఫోన్ నెక్ట్స్ను దీపావళికి రిలీజ్ చేస్తోందని రిలయన్స్ ప్రకటించింది. చదవండి: రష్యాలో ఏమైంది..! దిగ్గజ టెక్ కంపెనీలపై వరుసగా... కొత్త ప్లాన్తో ఎయిర్టెల్...! జియోఫోన్ నెక్ట్స్ను ఎదుర్కొనేందుకుగాను ఎయిర్టెల్ కొత్తప్లాన్తో ముందుకు వస్తోంది. పలు స్మార్ట్ఫోన్ కంపెనీలతో ఎయిర్టెల్ ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్ఫోన్ కొనుగోలుపై బండిల్ డేటా ప్యాక్లను, వాయిస్ ఆఫర్లను అందించాలని ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికతో ఎయిర్టెల్కు చెందిన 2జీ సబ్స్రైబర్స్ బేస్ను రక్షించుకోవాలనే లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది. పలు స్మార్ట్ఫోన్ కంపెనీలతో చర్చలను జరిపేందుకు ప్రతిపాదనలను ఎయిర్టెల్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. లావా, కార్బాన్, హెచ్ఎమ్డీ గ్లోబల్ స్మార్ట్ఫోన్ కంపెనీలతో ఎయిర్టెల్ చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్టెల్ పలు కంపెనీల హ్యాండ్సెట్ బ్రాండ్లతో పొత్తుతో పలు స్మార్ట్ఫోన్ మోడళ్లపై ఎయిర్టెల్ పలు ఆఫర్లను అందించాలని భావిస్తోంది. చదవండి: Paytm : మొబైల్ బిల్స్ పేమెంట్స్పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...! -
ఇండియా వర్సెస్ కెయిర్న్,.. కుదిరిన డీల్ ?
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను తిరిగి చెల్లించే విషయమై భారత ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ పట్ల బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ సానుకూలంగా స్పందించింది. రెట్రోస్పెక్టివ్ చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు గత నెలలో పార్లమెంట్ ఆమోదం తెలుపడం తెలిసిందే. దీంతో గతంలో ముక్కు పిండి వసూలు చేసిన బిలియన్ డాలర్లకు పైన (రూ.7,900 కోట్లు సుమారు) కెయిర్న్ ఎనర్జీకి భారత ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. దీనికంటే ముందు కెయిర్న్ ఎనర్జీ భారత సర్కారు ఆస్తుల స్వాధీనానికి పలు దేశాల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమ్మతమే భారత్ ఇచ్చిన ఆఫర్ తమకు ఆమోదనీయమేనని కెయిర్న్ ఎనర్జీ సీఈవో సైమన్ థామ్సన్ లండన్లో ప్రకటించారు. తమకు భారత సర్కారు నుంచి చెల్లింపులు అందిన రోజుల వ్యవధిలోనే.. ప్యారిస్లోని భారత రాయబార కార్యాలయ అపార్ట్మెంట్లు, అమెరికాలో ఎయిర్ ఇండియా విమానం జప్తునకు సంబంధించి దావాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ‘‘మా వాటాదారులైన బ్లాక్రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇందుకు అంగీకరించాయి. మా కీలకమైన వాటాదారుల మద్దతు ఆధారంగానే మా అభిప్రాయం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతికూలంగా నడుస్తున్న దాన్ని ముగించి, ఇచ్చిన ఆఫర్ను ఆమోదించడం మంచిది, ఆచరణాత్మకం అన్నది అభిప్రాయం’’ అని థామ్సన్ పేర్కొన్నారు. సరైన అవకాశం ఉంటే..: భారత్కు కెయిర్న్ ఎనర్జీ తిరిగొస్తుందా? అన్న ప్రశ్నకు.. సమస్య తొలగిపోతే సరైన పెట్టుబడి వేదిక కాగలదని సైమన్ థామ్సన్ చెప్పారు. సరైన అవకాశం ఉంటే ఎందుకు రాబోమని అన్నారు. 2012 నాటి రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టం కింద 50 ఏళ్ల క్రితం నమోదైన లావాదేవీలపైనా ప్రభుత్వం పన్ను వేయగలదు. భారత్లోని ఆస్తుల యాజమాన్యాలు విదేశీ ఇన్వెస్టర్ల మధ్య చేతులు మారితే లాభాలపై పన్నును ఈ చట్టం కింద రాబట్టుకోవచ్చు. చదవండి: వోస్తోక్ ప్రాజెక్ట్పై ఓవీఎల్ దృష్టి -
హెచ్డీఎఫ్సీ లైఫ్ చేతికి ఎక్సైడ్ లైఫ్
ముంబై: ప్రైవేట్ బీమా రంగంలో సరికొత్త డీల్కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తెరతీసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి బీమా అనుబంధ సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.6,687 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్కు అటు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇటు ఎక్సైడ్ లైఫ్ కంపెనీల బోర్డులు తాజాగా ఆమోదముద్ర వేశాయి. ఒప్పందంలో భాగంగా ఎక్సైడ్ లైఫ్లో 100% వాటాను సొంతం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ వెల్లడించింది. షేరుకి రూ.685 ధరలో 8.7 కోట్లకుపైగా హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లను ఎక్సైడ్ ఇండస్ట్రీస్కు జారీ చేయనుంది. తద్వారా కొనుగోలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా మరో రూ. 726 కోట్లను నగదు రూపంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్కు చెల్లించనున్నట్లు వివరించింది. లావాదేవీ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్కు 4.1% వాటాను పొందనుంది. విలీనంవైపు..: పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఎక్సైడ్ లైఫ్ను విలీనం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏతోపాటు, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. వీటితోపాటు రెండు కంపెనీల వాటాదారుల నుంచి గ్రీన్సిగ్నల్ లభించాక కొనుగోలు లావాదేవీని పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. దేశీ బీమా రంగంలో ఈ డీల్ ల్యాండ్మార్క్ వంటిదని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. దీంతో మరింత మందికి బీమా రక్షణ లభించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్సైడ్ బ్రాండు వినియోగానికి రెండేళ్ల కాలపరిమితి లభించనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో విభా పడల్కర్ వెల్లడించారు. ఎక్సైడ్ లైఫ్ తీరిదీ..: 2001–02లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎక్సైడ్ లైఫ్ 2021 జూన్కల్లా రూ.2,711 కోట్ల అసలు విలువను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో మొత్తం రూ. 3,325 కోట్ల విలువైన ప్రీమియంను అందుకుంది. జూన్కల్లా రూ. 18,780 కోట్ల విలువైన ఏయూఎంను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం పతనమై రూ. 734 వద్ద ముగిసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 189 వద్ద ముగిసింది. -
అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీంను కోరిన ఎఫ్ఆర్ఎల్
ఆస్తులు అమ్ముకునేందుకు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మరోసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీల్కు అనుమతి ఇవ్వండి ఫ్యూచర్, రిలయన్స్ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఫ్యూచర్ గ్రూపు మరోసారి ఆశ్రయించింది. ఈ ఒప్పందం ఆలస్యం అవడం వల్ల సంస్థలో పని చేసే 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. గతంలో ఇలాంటి కేసుల్లో వచ్చిన తీర్పులను ఉదహరిస్తూ తమ డీల్పై అమెజాన్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కొట్టి వేయాలని ఫ్యూచర్ గ్రూప్ కోరింది. మొత్తం ఆరు వేల పేజీలతో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరింది. వివాదానికి నేపథ్యం ఇది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) అమెజాన్కి వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా అమెజాన్కి దఖలు పడ్డాయి. అయితే అమెజాన్ని సంప్రదించకుండా తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్టు 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించింది. చదవండి : Elon Musk: ‘బెజోస్ దావాలు వేయడానికే తప్పుకున్నాడేమో! హహహా..’ -
జియో వర్సెస్ ఎయిర్టెల్ ! గూగుల్ షాకింగ్ నిర్ణయం ?
భారత టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇండియాను వేదికగా చేసుకుని వ్యాపార దిగ్గజ సంస్థలు పోటీకి దిగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానమే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోంది. దీన్ని నిజం చేస్తూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు సైతం వెలువడుతున్నాయి. ఇండియా టెలికాం సెక్టార్లోకి గూగుల్? టెక్ దిగ్గజం, నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇండియాలోని టెలికాం సెక్టార్పై గురి పెట్టింది, టెలికాం పరంగా ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్గా గుర్తింపు పొందిన ఇండియాలో పాగా వేసేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఇప్పటికే జియో నెట్వర్క్లో రూ. 34,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారీ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఎయిర్టెల్తో చర్చలు టెలికాం సెక్టార్లో జియో నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న ఎయిర్టెల్లో భారీ స్థాయిలో పెట్టబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నాయని, చాలా అంశాలపై స్పష్టత వచ్చిందని, త్వరలోనే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ఈ డీల్ ఇండియాలోనే అతి పెద్ద డీల్ అయ్యే అవకాశం ఉందని కూడా టైమ్స్ పేర్కొంది. గూగుల్ వస్తే.. ఎయిర్టెల్, గూగుల్ల మధ్య ఒప్పందం కుదిరితే టెలికాం రంగంలో మరోసారి ప్రైస్వార్ తప్పదని, దాని వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే మొబైల్ నెట్వర్క్ సేవలు అందుతాయనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో టాటా డొకోమో రాకతో కాల్ పల్స్ రేట్లు తగ్గిపోగా జియో రాకతో డేటా, కాల్ ఛార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎయిర్టెల్, జియోల మధ్య ఒప్పందం ఫైనల్ అయితే టెలికాం రంగంలో ప్రైస్వార్ తప్పదు. టెలికాంలో గట్టిపోటీ అమెరికా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ అయిన ఇండియాపై టెక్ దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో గూగుల్కి చెందిన ఆండ్రాయిడ్దే అగ్రస్థానం. దేశంలో ఉన్న ఫోన్లలో నూటికి డెబ్బై శాతం ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫారమ్ మీదే పని చేస్తున్నాయి. మరోవైపు జియోతో భాగస్వామ్యంలో భాగంగా జియో నెక్ట్స్ పేరుతో బడ్జెట్ ఫోన్ను గూగుల్ ఇండియాలో ప్రవేశ పెడుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఎయిర్టెల్ నెట్వర్క్లో కీలక భాగస్వామి కానుంది. చదవండి : Google-Apple Deal: గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం లక్షా పదివేల కోట్లు! అంతకంతకు పెరుగుతూ.. -
ఐఫోన్లలో గూగుల్.. కళ్లు చెదిరే డీల్!
బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ‘డిఫాల్ట్’గా ఉంటుందని తెలిసిందే. ఇందుకోసం కొన్ని కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటుంది గూగుల్. తాజాగా ఈ ఇంటర్నెట్ బ్రౌజింగ్ దిగ్గజం.. యాపిల్తో ఈ ఏడాది కోసం లక్షా పదివేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. 2021లో తయారైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం 15 బిలియన్ల డాలర్ల(లక్షా పదివేల కోట్లకు పైనే) ఒప్పందం చేసుకుంది గూగుల్. తద్వారా సఫారీ బ్రౌజర్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్గా పని చేయనుంది. మైక్రోసాఫ్ట్-బింగ్ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది ఇలా భారీ ఒప్పందాలు చేసుకుంటూ పోతోంది గూగుల్. కిందటి ఏడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా.. 2019లో 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని(18-20 బిలియన్ డాలర్ల మధ్య) అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. ఇక ఐవోస్ డివైజ్లపై యాపిల్-గూగుల్ డీల్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్ ప్లాట్ఫామ్స్కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ అభిప్రాయపడింది. హాట్ న్యూస్: అలర్ట్- ఫోన్ నుంచి ఈ యాప్స్ తీసేయండి ఆఖరి రోజు:ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..! -
వివాదాస్పదంగా గూగుల్ భారీ డీల్
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది. 2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్ను మరోసారి తెర మీదకు తెచ్చింది. చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు, ఏపీకే ఇన్స్టాల్స్ యాప్స్ను సైతం ఇన్స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్ప్లేస్లో గూగుల్ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్తో గూగుల్కు వివాదం మొదలైంది. సీక్రెట్గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్. ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి. -
Zoom: లక్ష కోట్లతో జూమ్ భారీ డీల్...! అందుకోసమేనా..!
వీడియో కాన్ఫరెన్సింగ్ దిగ్గజం జూమ్ కీలక ఒప్పందాన్నికుదుర్చుకోనుంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఫైవ్9 ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. జూమ్ తన కస్టమర్లకు మరింత సేవలను అందించడం కోసం సుమారు 14.7 బిలియన్ డాలర్ల( సుమారు రూ. లక్ష కోట్ల)తో ఫైవ్9 ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైవ్9 క్లౌడింగ్ సాఫ్ట్వేర్ జూమ్కు ఆపరేటింగ్ యూనిట్గా మారనుంది. అంతేకాకుండా ఫైవ్9 కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం 2022 మొదటి అర్ధభాగంలో ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం..రెండు కంపెనీల బోర్డులచే ఆమోదం పొందిన తరువాత, ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఫైవ్ 9 షేర్లు శుక్రవారం 0.6 శాతం పెరిగి 177.60 డాలర్లకు చేరుకున్నాయి. జూమ్ 1.4 శాతం పెరిగి 361.97 డాలర్ల వద్ద స్థిర పడింది. జూమ్ కంపెనీ విలువ సుమారు 106 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,92,450 కోట్లు). ఈ భారీ డీల్ అందుకోసమేనా..! ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్-బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మేటి. దీని అత్యంత స్కేలబుల్ , సురక్షితమైన క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్ల నిర్వహణ, ఆప్టిమైజేషన్ను అనుమతించే సులభమైన యాప్. ఈ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్తో జూమ్ ఆన్లైన్ సమావేశాల్లో పంచుకునే వివిధ అంశాలకు చెందిన డాక్యుమెంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. -
శాంసంగ్, టెస్లా మధ్య కీలక ఒప్పందం..!
సియోల్: ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో సంచలనాన్ని సృష్టించింది. టెస్లా తన కంపెనీ నుంచి సైబర్ ట్రక్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయనుంది. కాగా తాజాగా టెస్లా, శాంసంగ్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సైబర్ ట్రక్ వాహనాల్లో కెమెరా మాడ్యూళ్లను అమర్చేందుకుగాను శాంసంగ్ కంపెనీతో సుమారు 436 మిలియన్ డాలర్ల(రూ. 3 వేల కోట్ల )తో టెస్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ మొబైల్ నివేదిక ప్రకారం.. టెస్లా కార్ల తయారీ సంస్థకు కెమెరా మాడ్యూళ్లను సరఫరా చేసేందుకు డీల్ కుదిరిందని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్, టెస్లా కంపెనీలు డీల్ను కుదుర్చుకోవడం కొత్తేమి కాదు. గతంతో టెస్లా కంపెనీకు ఎలక్ట్రిక్ వాహానాలకు సంబంధించిన బ్యాటరీలను సరఫరా చేయడంలో శాంసంగ్ పాత్ర ఉంది. అంతేకాకుండా శాంసంగ్ తయారుచేసిన పిక్స్సెల్ ఎల్ఈడీ ల్యాంప్లను టెస్లా ఉత్పత్తి చేస్తోన్న ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించనుంది. కాగా సైబర్ట్రక్ వాహానాలకోసం ఇప్పటివరకు పదిలక్షలమంది తమ పేరును నమోదు చేసుకున్నారని టెస్లా ఓ ప్రకటనలో తెలిపింది. -
100 రోజుల పైగా డ్రామా.. ఎట్టకేలకు కదిలిన ఎవర్ గివెన్ నౌక
suez canal vs ever given ship settled: ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? అదేనండి మార్చి నెలలో సరకు సూయాజ్ కాలువలో వెళ్తూ టైం బాలేక అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఆ షిప్, దాని యాజమాన్యానికి నష్టాలు, కష్టాలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం షిప్ యాజమాన్యానికి వీటి నుంచి ఊరట లభించింది. సూయాజ్లో ఇరుక్కుపోయిన ఆ భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజులు అష్టకష్టాలు పడి చివరకు దాన్ని మళ్లీ కదిలేలా చేశారు. హమ్మయ్యా కదిలింది కదా! అనుకుంటే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. అది వారం రోజులు బ్లాక్ కావడంతో ఇతర షిప్లు రాకకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టాన్ని చూశారు. అలానే షిప్ కదిలికకు చేసిన ఖర్చును కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేసినప్పటికీ తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు. ఈ నేపథ్యంలో నష్టం పరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ బుధవారం సూయాజ్ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. -
Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్
సాక్షి,ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఇటీవల రిలయన్స్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన అంతర్జాతీయీకరణ వ్యూహంలో తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా అబుదాబి ప్రభుత్వానికి చెందిన కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అబుదాబిలోని రువాయిస్లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ఏడ్నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం నిబంధనల ప్రకారం, ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లో ఏడాదికి 9.40లక్షల టన్నుల క్లోర్-ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఇథిలీన్ డైక్లోరైడ్, 3.60లక్షల టన్నుల పీవీసీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పీవీసీ ఉత్పత్తికి కీలకమైన బిల్డింగ్ బ్లాక్ అయిన ఇథిలీన్ డైక్లోరైడ్ను తయారు చేస్తుందనీ, తమ కార్యకలాపాలను ప్రపంచీకరించడంలో ఇదొక ముఖ్యమైన దశ అని రిలయన్స్ ఛైర్మన్ అండ్ ఎండీ, ముఖేశ్ అంబానీ అన్నారు. ఈ రసాయనాల మార్కెట్ డిమాండ్ అవసరాలకు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో స్థిరమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. ప్రతిపాదిత జాయింట్ వెంచర్ టాజిజ్ (TA’ZIZ)ఇండస్ట్రియల్ కెమికల్స్ జోన్లో నిర్మించబడుతుంది. వాటర్ ట్రీట్మెంట్, వస్త్రాలు , లోహాల తయారీలో క్లోర్-ఆల్కాలిని ఉపయోగిస్తారు. అల్యూమినియం ఉత్పత్తికి అవసరమైన కాస్టిక్ సోను ఉత్పత్తి చేయనుంది. గృహనిర్మాణం, ఇతర వినియోగ వస్తువుల్లో విరివిగా వినియోగిస్తున్నపీవీసీని ఉత్పత్తి చేయడానికి ఇథిలీన్ డైక్లోరైడ్ వినియోగిస్తారు. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ పెట్రో కెమికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 30వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని చమురు రంగ నిపుణులు భావిస్తున్నారు. చదవండి : రిలయన్స్కు... కొత్త ‘ఇంధనం’ -
Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..!
ముంబై: ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ ఏర్పాటుచేసే వార్షిక వాటాదారుల మీటింగ్(AGM)పైనే అందరీ దృష్టి. ఈ సమావేశం ఈ నెల 24 న జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ కంపెనీ భారీ ప్రకటనలను చేయనున్నట్లు తెలుస్తోంది. 4జీ రాకతో రిలయన్స్ దేశ వ్యాప్తంగా విప్లవత్మాకమైన మార్పులు తీసుకొని వచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం 4జీ టెక్నాలజీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమావేశంలో రిలయన్స్ అతి తక్కువ ధరకే 5జీ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఏజీఎం మీటింగ్లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల భావిస్తున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.లక్ష కోట్లు)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సౌదీకు చెందిన అరాంకో కంపెనీతో భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 24న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ఆరాంకో చైర్మన్, కింగ్డమ్ ఆఫ్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ ఈ సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే.. -
ఫ్యూచర్, రిలయన్స్ డీల్: మరో కీలక పరిణామం
-
ఫ్యూచర్, రిలయన్స్ డీల్: మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్తో వివాదం విషయంలో అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్లో ఫ్యూచర్ రిటైల్ ఈ విషయాన్ని తెలిపింది. కేసు వివరాల్లోకి వెళితే... ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసింది. ఎఫ్సీపీఎల్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను (ఫ్యూచర్ రిటైల్) స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ని ఆశ్రయించింది. అమెజాన్తో ఎఫ్సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్-ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తుది తీర్పుతో ఉత్కంఠ డీల్ విషయంలో ముందుకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై (అమెజాన్ వేసిన అప్పీల్) విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కేసులో తుది తీర్పును ఇచ్చింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్ గ్రూప్ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ తదుపరి విచారణ వరకూ స్టే ఇచ్చింది. తాజాగా ఈ స్టేపై అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
‘ఫ్యూచర్’ డీల్కు గడువు పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా ఫ్యూచర్ గ్రూప్తో కుదుర్చుకున్న డీల్ను పూర్తిచేసేందుకు వీలుగా గడువును పొడిగించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులు, హోల్సేల్ బిజినెస్ల కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2021 మార్చి31తో ముగియనుడంటంతో.. సెప్టెంబర్ 30వరకూ పొడిగించింది. ‘లాంగ్ స్టాప్ డేట్’లో భాగంగా ఆరు నెలల పాటు గడువును పొడిగించినట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. కిశోర్ బియానీ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ బిజినెస్ల కొనుగోలుకి 2020 ఆగస్ట్లో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విలీనాలు, కొనుగోళ్ల విషయంలో కంపెనీలు ఒప్పందాలను పూర్తిచేసుకునేందుకు వీలుగా లాంగ్ స్టాప్ను వినియోగిస్తుంటాయని విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించిందంటూ ఈ డీల్ విషయంలో ఫ్యూచర్ గ్రూప్నకు వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించిన విషయం విదితమే. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ డీలపై ఇప్పటికే సీసీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ.. అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ప్రత్యేక యూనిట్గా ఓటూసీ.. ఆయిల్ టు కెమికల్స్(ఓటూసీ) బిజినెస్ను ప్రత్యేక యూనిట్గా విడదీసేందుకు రుణదాతలు, వాటాదారులు అనుమతించినట్లు రిలయన్స్ తాజాగా పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) మార్గదర్శకాల ప్రకారం ఈ అంశంపై రుణదాతలు, వాటాదారుల సమా వేశాన్ని నిర్వహించింది. ఇందుకు అనుకూలంగా సెక్యూర్డ్ క్రెడిటార్లు, రుణదాతలు, వాటాదారుల నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాదాపు 100% ఓటింగ్ నమోదైనట్లు ఎక్సే్ఛంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ సమావేశాలకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షత వహించినట్లు పేర్కొంది. రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్, పెట్రోకెమ్ బిజినెస్లను ఓటూసీగా విడదీసేందుకు ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ ప్రణాళికలు వేయడం తెలిసిందే. స్వతంత్రంగా ఏర్పాటయ్యే ఈ యూనిట్కు మాతృసంస్థ 25 బిలియన్ డాలర్ల రుణాన్ని సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాగే సౌదీ అరామ్కో తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించనున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. -
బజాజ్ ఎలక్ట్రికల్స్, మహీంద్రా లాజిస్టిక్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవలను పొందేందుకుగాను మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్)తో బజాజ్ ఎలక్ట్రికల్స్ (బెల్), ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎండ్ టు ఎండ్ రీడిజైన్ సహా పూర్తిస్థాయి లాజిస్టిక్స్ సేవల కోసం ఔట్సోర్సింగ్ కాంట్రాక్టుపై రెండు కంపెనీలూ సంతకాలు చేశాయి. దేశీ పరిశ్రమలోనే అత్యున్నత లాజిస్టిక్స్ సర్వీసులను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ పేర్కొంది. (గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు) ఐదేళ్లలో డీల్ విలువ రూ. 1,000 కోట్లకుపైగా చేరవచ్చని అంచనా వేసింది. తద్వారా ఏడాదికి 25 శాతానికిపైగా రవాణా సంబంధ వ్యయాలను ఆదా చేయనున్నట్లు తెలియ జేసింది. డీల్లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ కోసం రీడిజైన్ చేసిన కన్సాలిడేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ను మహీంద్రా లాజిస్టిక్స్ అందించనుంది. తాజా డీల్ ద్వారా తమ లాజిస్టిక్స్ విభాగం భారీ మార్పులకు లోనుకానున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ పొద్దార్ పేర్కొన్నారు. దీంతో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు కస్టమర్లకు సేవలు, లాభదాయకత వంటివి మెరుగుపరచుకోనున్నట్లు తెలియజేశారు. (వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త) -
బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్తో ప్రముఖ గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యప్ టీవీ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం కొత్త సర్వీసును తన యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ చందాదారులకు తన ఓటీటీ సేవలను మరింత విస్తరించేందుకు ‘యప్టీవీ స్కోప్ ప్లాట్ఫాం’ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందించనుంది. సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ లాంటి ప్రీమియం ఓటీటీ సర్వీసులను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్ ఫాంల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ డివైస్లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సర్వీసులు ఎంజాయ్ చేయవచ్చు. ఏఐ, ఎంఎల్ సామర్థ్యాల వినియోగంతో యప్ టీవీ స్కోప్ అత్యంత క్యూరేటెడ్ అనుభవాన్ని అందిస్తుందనీ, మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. యప్టీవీ వెల్లడించింది. కంటెంట్కోసం పలు యాప్ల అవసరం లేకుండానే తమ క్రాస్-ప్లాట్ఫాం ద్వారా, స్మార్ట్ టీవీ, పీసీ, మొబైల్, టాబ్లెట్.. వివిధ పరికరాలకు యాక్సెస్ పొందవచ్చు. అలాగే వినియోగదారులు లైవ్ టీవీని చూస్తూనే ప్రత్యక్ష చాట్లను నిర్వహించవచ్చు, ప్రత్యక్ష పోల్స్లో పాల్గొనవచ్చు. నచ్చిన కంటెంట్ను కూడా కోరుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో సింగిల్ సబ్స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్ యుప్ టీవీ స్కోప్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని యప్టీవీ వ్యవస్థాపకుడు ,సీఈఓ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. అటు బీఎస్ఎనల్ఎల్ సీఎండీ సిఎండి శ్రీ పి.కె.పూర్వర్ కూడా ఈ సేవలపై సంతోషం వెలిబుచ్చారు. -
అమెజాన్ : కిషోర్ బియానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) -
మేఘా ఒలెక్ట్రా మెగా డీల్: మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశలో కేంద్ర ప్రభుత్వ ఫేమ్- 2 పథకంలో భాగంగా ఈ బస్సులను సరఫరా చేయనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) / ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈవీ ట్రాన్స్ ఈ 350 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుండి సేకరించనుంది. ఈ 350 బస్సులను ఏడు నెలల్లో ఒలెక్ట్రా సంస్థ అందించనుంది. అందిస్తుంది. కాంట్రాక్ట్ కాలంలో ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా ఎవీ ట్రాన్స్ పరిధిలోనే ఉంటుంది. మొత్తంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దాదాపు 1250 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనున్నది. బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా ఇక భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన గ్రీన్ సిటీ బెంగళూరులో సైతం 300 బస్సులను సరఫరా చేయడానికి పిలిచిన టెండర్లలో ఒలెక్ర్టా సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఫేమ్-2 పథకంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (బీఎంటీసీ) 300 విద్యుత్ బస్సులకు గాను నిర్వహించిన టెండర్ లో అతి తక్కువగా బిడ్డింగ్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది. ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ)/ఓపేక్స్ మాడల్ ప్రాతిపదికన 12 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఈవీ ట్రాన్స్ కి 300 బస్సుల సరఫరాకు అనుమతి లభించిన వెంటనే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 12 నెలల కాలంలో సేకరిస్తుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ నుండి 350 ఎలెక్ట్రిక్ బస్సుల ఆర్డర్ దక్కించుకున్నందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) సీఈఓ అండ్ సీఎఫ్ఓ శరత్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఇప్పటికే ఎవీ ట్రాన్స్ ఇప్పటికే పూణేలో 300 ఎలెక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని ఈ కొత్త బస్సుల రాకతో ఈ సంఖ్య 650 లకు చేరిందన్నారు. దేశంలోని ఒక రాష్ర్టంలో అత్యధికంగా బస్సులను సరఫరా చేసిన ఘనత ఒలెక్ర్టాకే చెందుతుందని తెలిపారు. ఒలెక్ర్టా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాలలో ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. దేశంలో మొట్టమొదటి సారిగా ఒలెక్ర్టా బస్సు 13,000 అడుగుల (3,962.4 మీ) ఎత్తు ఉన్న రోహ్తాంగ్ పాస్ వరకు ప్రయాణం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 33 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ను కూడా ఏర్పాటు చేశారు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 2 నుంచి 5 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది. -
టీఆర్పీ స్కాం: అర్నబ్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఛీప్ అర్నబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్గుప్తా పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. (టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్ ) ‘2004 నుంచే అర్ణబ్ నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తర్వాత 2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ పలు ప్రణాళికల గురించి నాతో అనేకసార్లు చర్చించేవాడు. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్ణబ్కు బాగా తెలుసు. ఇందుకు బదులుగా భవిష్యత్తులో నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్ టీవీకి నంబర్1 రేటింగ్ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశాను. 2017 నుంచి 2019 వరకు ఇది కొనసాగేది. ఇందుకుగానూ అర్నబ్ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నాను' అని దాస్గుప్తా తెలిపారు. టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్షీట్ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్ను కూడా పొందుపరిచారు. వీరిద్దరి మధ్యా 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
డీల్ ఓకే : అమెజాన్కు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఫ్యూచర్ గ్రూపు, అమెజాన్ మధ్య వివాదంలో అమెజాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ డీల్కు అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా ఆమోద ముద్ర వేసింది. అయితే అమెజాన్ అభ్యంతరాలపై వివరణ కోరింది. (అమెజాన్కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) అలాగే కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదం ఉన్నా ముందుగా తనతో పాటు,షేర్ హోల్డర్స్ కు కూడా సమాచారం అందించాలని సెబీ తెలిపింది. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకురావాలని కూడా స్పష్టం చేసింది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా యాజమాన్యం మార్పునకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు లేకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబీ ఆదేశించింది. ఆగస్టు 29, 2020న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ డీల్కు గత ఏడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం లభించగా, తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది. కాగా,ఈ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సింగపూర్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఫ్యూచర్ లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వకుండానే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించింది. దీనికి తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారమే ఈ డీల్ ఉందని, అమెజాన్కు పరిహారం చెల్లించే ప్రశ్నేలేదని ఫ్యూచర్ గ్రూపు తెగేసి చెప్పింది. అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రిలయన్స్, ఫ్యూచర్ డీల్కు సెబీ గ్రీన్ సిగ్నల్ లభించన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.46 శాతం లాభంతో రూ. 2105 వద్ద కొనసాగుతోంది. -
సీరం, కేంద్రం డీల్ : రూ. 200కే వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలకు దిగింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ టీకా డోసుల కొనుగోలు, అందుబాటులో ధరలో టీకాను అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డీల్కు సిద్ధపడుతోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న పుణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని సీరం తాజాగా ధృవీకరించినట్టు సమాచారం.ఈ డీల్ తరువాత వ్యాక్సిన్ ధర 200 రూపాయలుగా ఉంటుందని సీరం వర్గాలు ప్రకటించాయి. ప్రారంభ దశలో తొలి 100 మిలియన్ (కోటి ) మోతాదులను 200 రూపాయలకే అందించనున్నామని వెల్లడించాయి. మొత్తం 11 మిలియన్ల టీకాలను అందిస్తామన్నారు. అంతేకాదు ఈ రాత్రికి(సోమవారం) లేదా రేపు ఉదయానికి టీకాల రవాణా మొదలవుతుందని స్పష్టం చేశాయి. దీనిపై అధికారిక ప్రకటేన రావాల్సి ఉంది. కాగా కోవిషీల్డ్తో పాటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గతవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు, కోవిన్యాప్ తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం చర్చిస్తున్నారు. దాదాపు ప్రతీ జిల్లాలోనూ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ రన్ పూర్తి చేశామని ప్రధాని వెల్లడించారు. చదవండి: వ్యాక్సిన్పై సాధారణ సందేహాలు! టీకా పంపిణీలో ‘కోవిన్’ కీలకం -
రిలయన్స్ మరో డీల్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ మరో డీల్ కుదుర్చుకున్నారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సింగపూర్ కుచెందిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ జాయింట్ వెంచర్ ఐఎమ్జీ వరల్డ్వైడ్ ఎల్ఎల్సీలో మేజర్ వాటాను కొనుగోలు చేశారు. రూ .52.08 కోట్లకు 'ఐఎంజీ-ఆర్'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్ఐఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్ పూర్తికాగానే రిలయన్స్ ఐంఎంజీ ఆర్ను రీబ్రాండింగ్ చేయనుంది. భారత దేశంలో క్రీడలు,ఫ్యాషన్ వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్ చేయడం కోసం 2010లో రిలయన్స్-ఐఎంజీ వరల్డ్వైడ్ సంయుక్తంగా సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్ చేసింది. 'షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్ చేస్తామని వెల్లడించింది. ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్లు అవసరం లేదని కూడా రిలయన్స్ తెలిపింది. ప్రస్తుతం ఐఎంజీ-ఆర్ ఏటా రూ. 25.79 కోట్లు జీఎస్టీతో సహా రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వీటిల్లో నికర లాభం రూ.16.35 కోట్లుగా ఉంది. -
రిమోట్ వర్కింగ్ బిజినెస్లో అతిపెద్ద డీల్
న్యూయార్క్: వర్క్ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్ టెక్నాలజీస్ ఇంక్ను కొనుగోలు చేసేందుకు సేల్స్ఫోర్స్.కామ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 27.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 2.05 లక్షల కోట్లు). క్లౌడ్ కంప్యూటింగ్ సేవల దిగ్గజం సేల్స్ఫోర్స్ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇది. తద్వారా రిమోట్ వర్కింగ్ సేవలకు మరింత బూస్ట్నివ్వనుంది. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రత్యర్ధి సంస్థ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు పోటీనివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ డీల్ ద్వారా సేల్స్ఫోర్స్.. ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములతో బిజినెస్ల కనెక్టివిటీకి యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు కానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యాప్ల వినియోగం ద్వారా రెండువైపులా కనెక్టివిటీకి వీలు కలగనున్నట్లు తెలియజేశారు. టీమ్స్ జూమ్ కోవిడ్-19 కారణంగా తలెత్తిన రిమోట్ వర్కింగ్ పరిస్థితులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో పోటీలో స్లాక్ టెక్నాలజీస్ వెనుకబడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. రియల్ టైమ్ మెసేజింగ్ ద్వారా గ్రూప్ల మధ్య సంభాషణలకు వీలు కల్పిస్తూ స్లాక్ సర్వీసులను అందిస్తోంది. మరోపక్క మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్రొడక్ట్లో భాగంగా వీడియో, వాయిస్ కాలింగ్కు వీలు కల్పిస్తూ బిజినెస్ను భారీగా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆఫీస్ ప్యాకేజీలతోపాటు.. టీమ్స్ను అందించడం ద్వారా మైక్రోసాఫ్ట్ లబ్ది పొందినట్లు తెలియజేశారు. కాగా.. సేల్స్ఫోర్స్తో డీల్ కుదుర్చుకోవడం ద్వారా టెక్నాలజీయేతర కంపెనీలకూ స్లాక్ సర్వీసులు విస్తరించే వీలున్నట్లు వివరించారు. డీల్ తీరిలా స్లాక్తో సేల్స్ఫోర్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఎలాగంటే.. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మంగళవారం సేల్స్ఫోర్స్ షేరు 45.5 డాలర్ల వద్ద ముగిసింది. దీని ఆధారంగా స్లాక్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకి 26.79 డాలర్ల నగదు లభించనుంది. అంతేకాకుండా 0.0776 సేల్స్ఫోర్స్ షేర్లు సొంతంకానున్నాయి. గత వారం డీల్పై చర్చలు బయటపడ్డాక అంచనా వేసిన విలువతో పోలిస్తే ఈ ఆఫర్ను 54 శాతం ప్రీమియంగా నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ ముగిశాక డీల్ వివరాలు వెల్లడికావడంతో ఫ్యూచర్స్లో సేల్స్ఫోర్స్ షేరు 4 శాతం పతనంకాగా.. స్లాక్ షేరు నామమాత్ర నష్టంతో 43.73 డాలర్లకు చేరింది. కాగా.. ఈ ఏడాది మూడో క్వార్టర్లో సేల్స్ఫోర్స్ ఆదాయం అంచనాలను మించుతూ 5.42 బిలియన్ డాలర్లకు చేరింది. సీఎఫ్వో మార్క్ హాకిన్స్ జనవరిలో పదవీ విరమణ చేయనున్నట్లు సేల్స్ఫోర్స్ తాజాగా పేర్కొంది. సీఎఫ్వో బాధ్యతలను ప్రస్తుత చీఫ్ లీగల్ ఆఫీసర్ను అమీ వీవర్ చేపట్టనున్నట్లు తెలియజేసింది. -
రిలయన్స్ డీల్: అమెజాన్కు సమన్లు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. రిలయన్స్కు చెందిన రిలయన్స్ రీటైల్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్కు సంబంధించి అమెజాన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ మధ్యంతర ఉత్తర్వులతో ఈ ఒప్పందంలో అమెజాన్ జోక్యంపై ఫ్యూచర్స్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు మంగళవారం విచారించింది. దీనిపై స్పందించాల్సిందిగా అమెజాన్ను కోరింది. (అమెజాన్కు భారీ ఊరట : రిలయన్స్ డీల్కు బ్రేక్) ఒక రోజంతా ఎఫ్ఆర్ఎల్, ఎఫ్సిపిఎల్, రిలయన్స్, అమెజాన్ తరఫున రోజువారీ వాదనలు విన్న జస్టిస్ ముక్త గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎల్ దావాపై అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సిపిఎల్), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్) లకు సమన్లు జారీ చేసింది స్టేట్మెంట్లను దాఖలు చేయాలని కోరింది. అమెజాన్ లేవనెత్తిన దావా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా బహిరంగంగా ఉంచుతామని కోర్టు తెలిపింది. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. (రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్) కాగా రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ రీటైల్ డీల్ను వ్యతిరేకించిన అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు అక్టోబర్ 25 న అమెజాన్కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సౌదీ అరామ్ కో- ఆర్ఐఎల్ చర్చలు షురూ?
ముంబై: విదేశీ చమురు దిగ్గజం సౌదీ అరామ్ కోతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. చమురు- కెమికల్స్ బిజినెస్ లో 20 శాతం వాటా విక్రయానికి గతంలోనే సౌదీ అరామ్ కోతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ కుదుర్చుకునే బాటలో సాగింది. అయితే కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగించడం, చమురు ధరలు పతనంకావడం వంటి ప్రతికూలతలతో చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనే 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాను విక్రయించే అవకాశమున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా చమురు- కెమికల్స్ బిజినెస్ ఎంటర్ ప్రైజ్ విలువను 75 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ బాటలో ఇటీవల అనుబంధ విభాగాలైన రిలయన్స్ జియోప్లాట్ ఫామ్స్, రిటైల్ రిటైల్ లలో వాటాల విక్రయాన్ని ఆర్ఐఎల్ విజయవంతంగా చేపట్టిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరామ్ కోతోనూ చర్చలు తిరిగి ప్రారంభించినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన చమురు ఆస్తులను సౌదీ అరామ్ కో ఫిజికల్ గా పరిశీలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కోవిడ్-19 కారణంగా అరామ్ కోతో డీల్ ఆలస్యమవుతున్నట్లు పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ.. ఆర్ఐఎల్ వాటాదారుల సమావేశంలో ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. కాగా.. ధరకు సంబంధించి డీల్ పెండింగ్ లో ఉన్నట్లు మీడియా పేర్కొంది. నిజానికి డీల్ ను తొలుత ప్రకటించినప్పుడు 2020 మార్చిలోగా కుదుర్చుకోవాలని దిగ్గజ కంపెనీలు రెండూ భావించినట్లు పరిశ్రమవర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. -
సోనీమ్యూజిక్తో టిక్టాక్ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: నిషేధిత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ (ఎస్ఎంఇ) తో కొత్త లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త డీల్ ప్రకారం యాప్ లో సోనీ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్స్ ని క్రియేటర్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం విలువ వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. అయితే టిక్టాక్ యూజర్లు సోనీ మ్యూజిక్ కళాకారుల కంటెంట్ వాడుకోవచ్చని టిక్టాక్ ఒక ప్రకటనలో తెలిపింది తాజా ఒప్పందంతో సోనీ మ్యూజిక్ ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ లాంటివి టిక్టాక్ క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ మ్యూజిక్ క్లిప్లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలతోపాటు, యూజర్లకు మంచి మ్యూజిక్ అందుబాటులోకి వస్తుందని సోనీ మ్యూజిక్ ప్రతినిధి డెన్నిస్ కూకర్ తెలిపారు. సోనీ మ్యూజిక్తో ఒప్పందం చాలా ఆనందంగా ఉందనీ, తద్వారా అమెరికా సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోనీ కళాకారుల అద్భుతమైన కంటెంట్ను కొత్త ప్రేక్షకులతో అనుసంధానించడానికి, టిక్టాక్ శక్తిని ఉపయోగించుకోవాడినికి వీలవుతుందని టిక్టాక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ఓలే ఒబెర్మాన్ పేర్కొన్నారు. టిక్టాక్ ఇప్పటికే యూనివర్సల్, సోనీ వార్నర్లతో స్వల్పకాలిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. -
జెట్ ఎయిర్వేస్కు రెక్కలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇండియా టేకాఫ్కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజరీ అయిన కల్రాక్ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్ల కన్సార్షియం జెట్ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్ చేసిన బిడ్ను జెట్ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్–జలాన్ల కన్సార్షియం బిడ్లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జెట్ను దక్కించుకునే వేటలో ఎఫ్ఎస్టీసీ, బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ సైతం పోటీపడ్డాయి. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి, దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీ అప్పులు రూ.8,000 కోట్లకు ఎగబాకాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలతోసహా రూ.40,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఈ సంస్థలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కోల్కతాలో తమ కుటుంబ వ్యాపారమైన పేపర్ ట్రేడింగ్లో మురారీ లాల్ జలాన్ తన కెరీర్ను 1980లో ప్రారంభించారు. పేపర్ తయారీ, రియల్టీ, హెల్త్కేర్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రష్యా, యూఏఈ వంటి దేశాల్లో విస్తరించారు. జెట్ డీల్తో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది -
టాటా సూపర్ యాప్ : వాల్మార్ట్ భారీ డీల్
సాక్షి, ముంబై: సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా వ్యాపారరంగంలో ప్రత్యేకతను చాటుకున్నటాటా గ్రూపు ఈ కామర్స్ రంగంలోకి దూసుకొస్తోంది. దేశంలోనే అతి భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. టాటా ‘సూపర్ యాప్’ లో భారీ పెట్టుబడులకు అమెరికా రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ టాటా గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. రీటైల్ ఆధిపత్యం కోసం దేశీయంగా వ్యాపార దిగ్గజాలు పోటీపడుతోంటే.. ఆయా కంపెనీల్లో భారీ విదేశీ పెట్టుబడులు విశేషంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా సూపర్ యాప్ ప్లాట్ఫామ్ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడులకు వాల్మార్ట్ చర్చలు జరుపుతోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద డీల్ గా నిలుస్తుందని అంచనా. టాటా-వాల్మార్ట్ జాయింట్ వెంచర్గా ఈ యాప్ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇందులో పలు విదేశీ సంస్థలు కూడా భారీ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిపాదిత లావాదేవీ ఖరారు కోసం గోల్డ్మన్ సాచ్స్ను వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా నియమించినట్టు సమాచారం. టాటాతో ఒప్పందం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో కూడా విక్రయాలకు అదనపు బలం వస్తుందని కంపెనీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు ప్రత్యర్థిగా అవతరించినుందని భావిస్తున్నారు. ఒక కొత్త సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో సూపర్ యాప్ ద్వారా అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలని భావిస్తోంది. సుమారు 50-60 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబోయే సూపర్ యాప్ కింద వివిధ వ్యాపారాలను ఒకే ఛానల్ కిందకి తీసుకురానుంది. హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలు సేవలను అందించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న వాల్మార్ట్ చర్చల్లో ఉంది. మరోవైపు టాటా , వాల్మార్ట్, గోల్డ్మన్ సాచే ఈ అంచనాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
అదానీ–జీవీకే ఎయిర్పోర్ట్ ఒప్పందానికి సీఐఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్పోర్ట్లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్ చానెల్) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్
వాషింగ్టన్ : చైనా సంస్ధ బైట్ డ్యాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఒరాకిల్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో బ్రేకులు పడనున్నాయి. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్టాక్ అమెరికా వ్యాపారం కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ వెల్లడించారు. ప్రధానంగా బైట్డాన్స్కు మెజారిటీ వాటా, ఒరాకిల్ సంస్థకు మైనారిటీ వాటా ప్రకారం కుదరనున్న ఒప్పందానికి తాను వ్యతిరేకమని చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించినంతవరకు అది100 శాతం అమెరికా సంస్థదై ఉండాలి. ప్రతిపాదిత ఒప్పందంపై సంతకం చేయడానికి తాను సిద్ధంగా లేననీ, ఈ ఒప్పందాన్ని తాను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. తుది డీల్ ఇంకా కుదరలేదన్నారు. దీనిపై గురువారం అధికారులతో సమావేశం కానున్నట్లు ట్రంప్ చెప్పారు. భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల నేపథ్యంలో టిక్టాక్ ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేదంటే నిషేధిస్తామని ట్రంప్ బైట్డాన్స్కు గడువు విధించారు. ఈ డీల్ ద్వారా పెద్ద మొత్తం యుఎస్ ట్రెజరీకి వెళ్లాలని గతంలోనే ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు ఆసక్తిని చూపాయి. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. మొదట్లో ఒరాకిల్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించిన ట్రంప్, అద్భుతమైన వ్యక్తి అంటూ సంస్థ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ పై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. కానీ తాజా ఒప్పందంపై ట్రంప్ అసంతృప్తి బిడ్ విజయవంతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. టిక్ టాక్ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం ట్రంప్ చేతిలోనే. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు కట్టుబడి ఉన్నారు, అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. దీంతో అమెరికాలో టిక్టాక్ భవితవ్యం మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్బస్టర్ డీల్కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన 1,800లకుపైగా బిగ్బజార్, ఎఫ్బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్లో భాగంగా రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు ఆర్ఆర్వీఎల్కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్స్టైల్ లిమిటెడ్కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలు ఆర్ఆర్వీఎల్కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
రిలయన్స్ : "నెట్మెడ్స్" డీల్
సాక్షి, ముంబై: ఒప్పందాల దూకుడును ప్రదర్శిస్తున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్మెడ్స్ తో మరో డీల్ కుదుర్చుకుంది. 620 కోట్ల రూపాయల విలువైన మేజర్ వాటాను సొంతం చేసుకుంది. తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్) వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్లో 60 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అలాగే ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్ దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్కి ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (అంబానీ సంచలన నిర్ణయం) భారతదేశం అంతటా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల లభ్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఆర్ఆర్విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్రాంచైజీకి నిర్మాణంలో నెట్మెడ్స్ కృషి తమను ఆకట్టుకుందని, దీన్ని మరింత వేగవంతం చేస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగం. వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలమని ఆమె తెలిపారు. “నెట్మెడ్స్” రిలయన్స్ కుటుంబంలో చేరడం, ప్రతి భారతీయుడికి నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులను అందించే దిశలో కలిసి పనిచేయడం నిజంగా గర్వకారణమని నెట్మెడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రదీప్ దాదా సంతోషం వ్యక్తం చేశారు. ప్రదీప్ దాదా స్థాపించిన నెట్మెడ్స్ (వైటాలిక్ అనుబంధ సంస్థలు ‘నెట్మెడ్స్’ అని పిలుస్తారు)ఇ-ఫార్మా పోర్టల్. వెబ్సైట్, యాప్ ద్వారా ఫార్మా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. కాగా గత వారం అమెజాన్ ఇండియా బెంగళూరులో ఈ-ఫార్మసీ సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోటీలో రిలయన్స్ కూడా చేరడం విశేషం. -
‘చైనా, పాక్ రహస్య ఒప్పందాలు’
న్యూఢల్లీ: చైనా, పాకిస్తాన్ దేశాలు రహస్య బయోవార్(జీవ, రసయనక) ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ క్లాన్ అనే జర్నలిస్ట్ సంచలన కథనంతో విశ్లేషించారు. అయితే వూహాన్లో కరోనాను గుర్తించిన నేపథ్యంలో చైనా సరియైన సమాచారం ఇవ్వలేదని ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. క్లాన్ వెల్లడించిన కథనంలో వూహాన్(చైనా)ల్యాబ్, పాకిస్తాన్ సంయుక్తంగా ఆంత్రాక్స్ (బ్యాక్టీరియా) లాంటి పాథోజెన్స్(వ్యాధి కారకం)ను సృష్టించబోతున్నాయని ఆస్ట్రేలియా జర్నలిస్ట్ తెలిపారు. మరోవైపు బయో రీసెర్చ్ను పాక్లో రహస్యంగా పరిశోధించడానికి, చైనా ఆర్థికంగా సహకరిస్తుందని తెలిపారు. కాగా సమాజానికి మాత్రం అంటువ్యాధుల పరిశోధన అంటూ చైనా, పాక్ చెప్పబోతున్నట్లు తెలిపారు. అయితే వూహాన్ ల్యాబ్ నిపుణులు పాక్ శాస్త్రవేత్తలకు వైరస్ను ఎలా సృష్టించాలో శిక్షణ ఇవ్వనున్నారని ఆంథోనీ క్లాన్ పేర్కొన్నారు. -
అమెజాన్తో ప్రియాంక భారీ డీల్
న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెజాన్ ప్రైమ్తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే ఫస్ట్ లుక్ అనే టెలివిజన్ డీల్పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండేళ్లపాటు అమెజాన్తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక స్పందిస్తూ.. హిందీ, ఇంగ్లిష్ల్లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తానని ప్రియాంక స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని తెలిపారు. ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు. (చదవండి : పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్) ‘భాష, భౌగోళిక బేధాలు లేకుండా ప్రపంచలోని ప్రతిభ ఒక చోట చేరి మరింత గొప్ప కంటెంట్ సృష్టించాలని ఓ నటిగా, నిర్మాతగా నేను కోరుకుంటాను. నా ప్రొడక్షన్ హౌస్ పర్పుల్ పెబెల్ పిక్చర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అమెజాన్తో కలిసి పనిచేయడం కొత్తదనానికి పునాది లాంటింది. అలాగే కథకురాలిగా నిరంతరం కొత్త ఐడియాలును అన్వేషించాలనేదే నా తపన. అవి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ముఖ్యంగా ఒపెన్ మైండ్స్, నూతన దృక్పథం కలిగి ఉండాలి. నా 20 ఏళ్ల కేరీర్లో దాదాపు 60 సినిమాలు చేసిన తర్వాత.. ఇప్పుడు దానిని సాధించే బాటలో ఉన్నట్టు నమ్ముతున్నాను’ అని తెలిపారు. (చదవండి : ఇండియా నుంచి ఈ ఇద్దరూ..) -
కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్
వాష్టింగ్టన్ : కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమ్డిసివిర్ ఔషధాన్ని మొత్తం కొనుగోలు చేసింది. మూడునెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్న మొత్తం మందును అమెరికా సొంతం చేసుకుంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.(కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక) ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావాల్సిన రెమ్డిసివిర్ ఔషధాన్ని తమకే విక్రయించాల్సిందిగా డోనాల్డ్ ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రకటించారు. సుమారు 5లక్షలకు పైగా డోస్ల కొనుగోలుకు గిలియడ్తో డీల్ కుదిరినట్టు చెప్పారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో తయారయ్యే 90 శాతం రెమిడిసివిర్ ఔషధం అమెరికాకు దక్కనుందన్నారు. తద్వారా అమెరికాలో అవసరమైన ప్రతీ కరోనా రోగికి ఈ ఔషధం అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారినుంచి అమెరికా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆజార్ వెల్లడించారు. కాగా కోవిడ్-19 చికిత్సకు గాను అమెరికాలో లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన మొట్టమొదటి ఔషధం రెమ్డెసివిర్. చదవండి : కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు -
జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో డీల్
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వరుసగా ఆరోసారి మెగా డీల్ సాధించింది. జియో ప్లాట్ఫామ్స్లో మరో భారీ ఒప్పందాన్ని అధికారికంగా అంబానీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆరు వారాల్లో ఆరు దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సేకరించడం విశేషం. ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 9,093.6 కోట్లు. ఈక్విటీ విలువ, రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు చేరినట్టు ప్రకటించింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) కాగా జియో వాటాల అమ్మకాల ద్వారా రూ. 85వేల నుంచి రూ. 90 వేల కోట్లు సేకరించాలని ఆర్ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఏప్రిల్ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది. అనంతరం సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ , తాజాగా ముబదాలా లాంటి దిగ్గజ సంస్థలు ఈ వరుసలో నిలిచాయి. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి) జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి.. 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్బుక్ పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 1.15 శాతం వాటాతో సిల్వర్లేక్ పార్ట్నర్స్ రూ.5,656 కోట్లు 2.32 శాతం వాటాతో విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ రూ.11,367 కోట్లు 1.34 శాతం వాటాతో జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు 2.32 శాతం వాటాతో కేకేఆర్ రూ.11,367 కోట్లు తాజాగా 1.8 5శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు -
భారీ డీల్: ఫేస్బుక్ చేతికి ‘జిఫీ’
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో వాటా కొనుగోలుతో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను తన సొంతం చేసుకోనుంది. యానిమేటెడ్ ఇమేజెస్ లేదా జిఫ్లు రూపొందించే పాపులర్ వెబ్సైట్ జిఫీని కొనుగోలు చేస్తున్నామని శుక్రవారం ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్తో దీన్ని అనుసంధానం చేస్తున్నట్టు వెల్లడించింది. (గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్) ఈ డీల్ వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,035 కోట్లు).ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన జిఫీ భాగం అవుతుంది. ఇకపై జిఐఎఫ్ లైబ్రరీ ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇతర యాప్లలో విలీనం కానుంది. ట్విటర్, స్నాప్చాట్, బైట్ డాన్స్ టిక్టాక్ వంటి సామాజిక వేదికలతో గిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవు అని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగానే వైడర్ ఎకోసిస్టంలో జిపీ అందుబాటులో వుంటుందని జిఫి కూడా ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో గొప్ప కంటెంట్ను సృష్టించగలుగుతాని ఇన్స్టాగ్రామ్ ఉత్పత్తి ఉపాధ్యక్షుడు విశాల్ షా అన్నారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) యాంటీట్రస్ట్ ఆందోళనలు, రెగ్యులేటర్ల పరిశీలన ఉన్న సమయంలో ఫేస్బుక్ ఈ డీల్ను వెల్లడించడం విశేషం. కాగా న్యూస్ సైట్ టెక్ క్రంచ్ ప్రకారం, 2015లో, గిఫీ ఒక ఫేస్బుక్ ఆఫర్ను తిరస్కరించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అనుసంధానంతో స్వతంత్రగా కొనసాగాలని నిర్ణయించుకుంది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) -
మరో మెగా డీల్కు సిద్ధమవుతున్న అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో భారీ పెట్టుబడుల స్వీకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా ఒప్పందాల ప్రకటనతో హ్యాట్రిక్ కొట్టిన రిలయన్స్ నాలుగో ఒప్పందానికి చేరువలో వుందన్న నివేదికలు వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రోకెమికల్స్ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందున అంబానీ తాజాగా పెద్ద ఒప్పందాన్ని చేసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో ప్లాట్ఫామ్స్ యూనిట్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోందట. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్) మరోవైపు ఎయిర్ బిఎన్బీ, ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్లకు నిధులు సమకూర్చిన అమెరికా పెట్టుబడి సంస్థ జనరల్ అట్లాంటిక్, జియో ప్లాట్ఫామ్లో సుమారు 850- 950 మిలియన్ డాలర్ల పెట్టుబడుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధికారికంగా స్పందించాల్సి వుంది. అటు జనరల్ అట్లాంటిక్ ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. కాగా జియోలో 10 శాతం వాటా కొనుగోలు ద్వారా ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్ట్నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ నుంచి మొతం 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 60,600 కోట్లు) పెట్టుబడులను రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ దన్నుతో ఎగిసిన మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ,ఆటో కౌంటర్ల లాభాల దన్నుతో సెన్సెక్స్ ఇంట్రా-డేలో 31,471 గరిష్టాన్ని, నిఫ్టీ 9209 గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 743 పాయింట్లు లేదా 2.4 శాతం ఎగిసిన సెన్సెక్స్ 31,380 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు లేదా 2.2 శాతం పెరిగి 9,187 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం అనుబంధ సంస్థ రిలయన్స్ జియోలో ఫేస్బుక్ 9.9 శాతం వాటాను 5.7 బిలియన్ డాలర్లకు (రూ. 43,574 కోట్లు) కొనుగోలు చేసిన తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.2 శాతం పెరిగి రూ.1,364కు చేరుకుంది. ఒక టెక్ కంపెనీ మైనారిటీ వాటా కొనుగోలుకుసంబంధించి ఇదే అతిపెద్ద పెట్టుబడిగా నిలవడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనగోళ్లకు దారితీసింది. ఆటో షేర్లలో మారుతి సుజుకి, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్జీసీ 5 శాతం బలహీనపడి ఎక్కువగా నష్టపోయింది. ఇంకా పవర్గ్రిడ్, ఎల్అండ్టి, హెచ్డిఎఫ్సి ఒక్కొక్కటి 2 శాతం వరకు పతనమయ్యాయి. -
కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ
సాక్షి, ముంబై: భారతదేశంలో డిజిటల్ అవకాశాలను మెరుగు పర్చేందుకు ఫేస్బుక్ , రిలయన్స్ జియో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీలలో ఒకటిగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకు దీర్ఘకాలిక, గౌరవనీయ భాగస్వామిగా ఫేస్బుక్ను స్వాగతిస్తున్నందుకు ఆనందంగా, ఇంతటి ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి సంతోషంగా వుందని అంబానీ తెలిపారు. అలాగే డిజిటల్ టెక్నాలజీతో కొత్త ఉపాధి అవకాశాలను రాబోతున్నాయని అంబానీ ప్రకటించారు. ఫేస్బుక్-జియో అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు కలగనున్నాయని చెప్పారు. అలాగే రైతులు, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, అన్నింటికంటే మించి కొత్త భారతదేశానికి పునాది వేసే మహిళలు, యువకులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈజీ ఆఫ్ లివింగ్", "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లక్ష్యాలను సాకారం చేయడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని అంబానీ అన్నారు. వాట్సాప్ డిజిటల్ చెల్లింపు సేవను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఫేస్బుక్ను జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా మార్చే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన అనుమతితో జియోమార్ట్ ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టనున్నాయి. తద్వారా స్థానిక దుకాణాలనుండి రోజువారీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. పంపిణీ కూడా వేగవంతమవుతుంది. అదే సమయంలో, ఈ దుకాణాలు తమ వ్యాపారాలను పెంచుకోవచ్చు. అసోచామ్-పిడబ్ల్యుసి ఇండియా అధ్యయనం ప్రకారం 2023 లో 135.2 బిలియన్ డాలర్ల విలువతో అవతరించబోతున్న డిజిటల్ మార్కెట్ తో ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ, గూగుల్ పే , పేటిఎమ్ వంటి వాటితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో వాట్సాప్ 400 మిలియన్ల వినియోగదారులతో, దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చేరువైందని పేర్కొన్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మెన్ శాక్స్ సింగపూర్ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్) ప్రయివేటు రంగ దిగ్గజబ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ జోరుమీదుంది. గురువారం ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్ 8.47 శాతం పెరగడం విశేషం. ఓపెన్ మార్కెట్లో గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్టైమ్ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్ఇండ్ బ్యాంక్ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. -
ఓటింగ్కు బ్లాక్చైన్ టెక్నాలజీ
బనశంకరి (బెంగళూరు): దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీతో ఓటింగ్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక ఇంటర్నెట్ లైన్ల ద్వారా వెబ్ కెమెరా, ఓటరు వేలిముద్రలను ఉపయోగించుకొని ఓటరును నిర్ధారించుకుంటారు. అనంతరం టూ వే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ఓటును ఎన్క్రిప్ట్ చేస్తారు. అనంతరం తిరిగి ఎన్నికలప్పుడే డీక్రిప్ట్ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ–బాలెట్ పేపర్ జనరేట్ అవుతుందని చెప్పారు. -
రిలయన్స్కు డీల్ అనిశ్చితి సెగ
సాక్షి,ముంబై : ఇంధన దిగ్గజ సంస్థలు సౌదీ అరామ్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మధ్య జరిగిన మెగా డీల్కు బ్రేక్ పడనుందన్న వార్తలతో ఆర్ఐఎల్ స్టాక్మార్కెట్లో డీలా పడింది. 15 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్పై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం నాటి ట్రేడింగ్ లో ఆర్ఐఎల్ షేరు 3 శాతానికి పైగా నష్టపోయింది. పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ, ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్ బిజినెస్లో 20 శాతం వాటాను సౌదీ అరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్ఐఎల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిలయన్స్ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు. రిలయన్స్తోపాటు పెట్రో నెట్ ఎనర్జీ, గోవా కార్బన్ లాంటి ఎనర్జీ షేర్లు కూడా నష్టపోవడం గమనార్హం. -
ఖతార్ - అదానీ భారీ డీల్
సాక్షి, ముంబై: అదానీ గ్రూపునకు చెందిన సంస్థ ఖతార్ నుంచి భారీ పెట్టుబడులను సాధించింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (ఏటీఎల్), అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎమ్ఎల్) లో 25.1 శాతం వాటా ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ)కొనుగోలు చేయనుంది. తద్వారా రూ .3200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అదానీ ట్రాన్స్మిషన్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం అదానీ ట్రాన్స్మిషన్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ 2023 నాటికి ఏఈఎమ్ఎల్ సరఫరా చేసే 30శాతం విద్యుత్తును సౌర , పవన విద్యుత్ ప్లాంట్ల నుండి పొందేందుకు ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, క్యూఐఏ సీఈవో మన్సూర్ అల్-మహమూద్ సంతోషం వ్యక్తం చేశారు. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో ఈ భాగస్వామ్యం ద్వారా 3 మిలియన్లకు పైగా తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని అదానీ వెల్లడించారు. -
జొమాటో చేతికి ఉబెర్ఈట్స్..!
న్యూఢిల్లీ: ఆన్లైన్ రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ ఉబెర్ఈట్స్ను కైవసం చేసుకునే దిశగా పావులుకదుపుతోంది. ఉబెర్ఈట్స్ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ 500 మిలియన్ డాలర్లను ఆస్క్ ప్రైస్గా కోట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, జొమాటో ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో చైనా చెల్లింపుల సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులు ఉన్నాయి. ‘షేర్ల జారీ మార్గంలో కొనుగోలు పూర్తిచేసేందుకు జొమాటో చర్చలు కొనసాగిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనే విషయంలో కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ... చర్చల్లో పురోగతి ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఈ డీల్తో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఉబెర్ఈట్స్ మాతృసంస్థ, ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్... డీల్ పూర్తయిన తరువాత జొమాటోలో 500–600 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని ఉబెర్ పేర్కొంది. ఇక మరో సంస్థ స్విగ్గీ కూడా ఉబెర్ఈట్స్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2020లో రూ.1,451 కోట్ల నష్టాలు భారత్లో ఉబెర్ఈట్స్ 2020 అంచనా నష్టం రూ.1,451 కోట్ల వరకు ఉండవచ్చని ఉబెర్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈట్స్ కారణంగా ఐపీఓ లిస్టింగ్లో భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లిస్టింగ్ ధర నుంచి 33 శాతం పతనమైంది. ఇక్కడి మార్కెట్లో 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థను విక్రయించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేందుకు ఉబెర్ ప్రయత్నిస్తోంది. -
కిడ్జీపై యూరోకిడ్స్ కన్ను!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్ విద్యా రంగంలోమరింత బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. జీలెర్న్కు చెందిన కిడ్జీ విభాగం పట్ల యూరోకిడ్స్ ఆసక్తిగా ఉన్నది. కేకేఆర్ భాగస్వామిగా ఉన్న యూరోకిడ్స్ ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. కిడ్జీ అన్నది ప్రీస్కూల్స్ ప్లాట్ఫామ్. డీల్ విలువ రూ.1,000–1,200 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. డీల్ కుదిరితే వచ్చే నిధులతో సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ గ్రూపు తన రుణ భారాన్ని మరింత తగ్గించుకునేందుకు వీలు పడుతుంది. రుణాలు చెల్లించేందుకు జీ గ్రూపులో ముఖ్యమైన కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్లో ప్రమోటర్లు తమ వాటాలను గణనీయంగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. కేకేఆర్ నాన్ బైండింగ్ ఆఫర్ చేసిందని, దీనిపై జీలెర్న్ స్పందించాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. జీ లెర్న్ స్టాక్ ఎక్సేంజ్లలో లిస్ట్ అయిన సంస్థ. కిడ్జీని విక్రయించాలంటే ముందుగా జీలెర్న్ నుంచి దాన్ని వేరు చేసి, ఆ తర్వాతే ఆ పని చేయాల్సి ఉంటుంది. బలమైన బ్రాండ్... జీ గ్రూపునకు దేశవ్యాప్తంగా 750కు పైగా పట్టణాల్లో కిడ్జీ బ్రాండ్ కింద 1,900 ప్రీ స్కూళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ప్రీ స్కూళ్ల చైన్ ఇది. 2003లో ఆరంభం కాగా, నాటి నుంచి 9 లక్షల మంది చిన్నారులకు విద్యా సేవలు అందించింది. ప్రస్తుతం కిడ్జీ పరిధిలో దేశవ్యాప్తంగా లక్ష మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఇది కాకుండా కే12 స్థాయిలో ‘మౌంట్ లిటెరా జీ స్కూళ్ల’ను (ఎంఎల్జెడ్ఎస్) కూడా జీలెర్న్ నిర్వహిస్తోంది. స్కూళ్ల ఏర్పాటు, టీచర్లకు శిక్షణ, బోధనా పరికరాలు ఇతర వసతుల కల్పన సేవలను ఇది అందిస్తోంది. ‘‘యూరోకిడ్స్, కిడ్జీ కలయిక ఇరువురికీ ప్రయోజనకరం. మౌంట్ లిటెరాను కూడా ఈ చర్చల్లో భాగం చేస్తే మరింత సమయం తీసుకోవచ్చు’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. యూరోకిడ్స్ను ఇటీవలే రూ. 1,500 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. స్కూళ్ల నెట్వర్క్ను వేగంగా విస్తరించే ప్రణాళికతో ఉన్న ఈ సంస్థ కిడ్జీని సొంతం చేసుకునేందుకు చర్చలు చేపట్టినట్టు తెలుస్తోంది. ‘‘బడా ఇన్వెస్టర్లు జీ లెర్న్లో వాటా కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారి ఆఫర్లను సీరియస్గానే పరిశీలిస్తున్నాం’’ అంటూ ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయంకా ప్రకటించడం గమనార్హం. ప్రాథమిక విద్యకు ముందుగా పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని కలిగించేవే ప్రీ స్కూళ్లు. ఆటలతో పిల్లలను విద్య వైపు ఆకర్షించేలా ఇక్కడ బోధన ఉంటుంది. వీటినే ప్రీ ప్రైమరీ స్కూళ్లు, కిండర్గార్డెన్ స్కూళ్లు అని కూడా పిలుస్తారు. -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో తగ్గనున్న టాటా వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో టాటా గ్రూప్ ప్రతిపాదిత వాటా కొనుగోలు డీల్ను పునర్వ్యవస్థీకరించినట్టు సమాచారం. నియంత్రణ పరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్ నేతృత్వంలోని మూడు సంస్థలు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో 44.4 శాతం వాటాను రూ.8,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీఎంఆర్తో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో టాటా గ్రూప్ 19.7%, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ ప్రైవేట్ లిమిటెడ్ 14.8%, హాంకాంగ్కు చెందిన ఎస్ఎస్జీ క్యాపిటల్ 9.9% వాటాను దక్కించుకోవాలి. నూతన ప్రణాళిక ప్రకారం టాటాల వాటా 14.7%కి పరిమితం కానుంది. జీఐసీ వాటా 5 శాతం పెరిగి 19.8%కి చేరనుంది. ఎస్ఎస్జీ వాటాలో ఎటువంటి మార్పు లేకుండా 9.9% ఉండనుంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అనుబంధ కంపెనీ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో టాటా గ్రూప్ వాటా డీల్ పునర్వ్యవస్థీకరణ తర్వాత నికరంగా 10 శాతానికి చేరుతుంది. ఇదీ నేపథ్యం..: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో టాటా గ్రూప్ వాటా కొనుగోలు విషయమై న్యాయపర అంశాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. ఎయిర్పోర్ట్ ఆపరేటింగ్ కంపెనీల్లో దేశీయ ఎయిర్లైన్ సంస్థల వాటా 10 శాతంలోపే ఉండాలన్న పరిమితి ఉంది. టాటా గ్రూప్.. సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో పూర్తిస్థాయి సర్వీస్ క్యారియర్ ‘విస్తారా ఎయిర్లైన్స్’, మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా బెర్హడ్తో కలిసి బడ్జెట్ ఎయిర్లైన్ ‘ఎయిర్ఆసియా ఇండియా’ను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థల్లోనూ టాటా గ్రూప్నకు 51 శాతం వాటా ఉంది. కాగా, డీల్ తదనంతరం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల వాటా 53.5 శాతంగా ఉంటుంది. కంపెనీ ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్కు 2.1 శాతం వాటా ఉంది. ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యత జీఎంఆర్ చేతిలోనే ఉండనుంది. డీల్తో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణం రూ.12,000 కోట్లకు వచ్చి చేరుతుంది. -
అదానీ గ్యాస్తో ఫ్రెంచ్ దిగ్గజం డీల్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఎస్ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్ లిమిటెడ్ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది. 10శాతం లాభంతో 151 వద్ద ముగిసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్ ఎస్ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య, దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో నేచురల్ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే. -
టెక్ మహీంద్రాకు భారీ డీల్
పుణే: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా భారీ డీల్ను సాధించింది. అమెరికాకు చెందిన టెలికం కంపెనీ ఏటీ అండ్ టీ, నుంచి ఈ కాంట్రాక్ట్ను సాధంచామని టెక్ మహీంద్రా తెలిపింది. ఏటీ అండ్ టీ కంపెనీ తన ఐటీ నెట్వర్క్ను అధునికీకరించడం కోసం ఈ డీల్ను కుదుర్చుకుందని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మనోజ్ భట్ పేర్కొన్నారు. డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ఉంటుందని అంచనా. దాదాపు ఆరేళ్ల కాలంలో తాము సాధించిన అతి పెద్ద డీల్ ఇదేనని భట్ పేర్కొన్నారు. ఈ డీల్ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలని తెలిపారు. 2013లో ఈ కంపెనీ బ్రిటిష్ టెలికం కంపెనీ బీటీతో వంద కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మరింత మెరుగైన సేవలు.... టెక్ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామని ఏటీ అండ్ టీ సీఐఓ జాన్ సమ్మర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్కల్లా అమెరికా వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం సులభంగానే సాకారం కాగలదని వివరించారు.కాగా టెక్ మహీంద్రా కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్ల మేర ఉంటుంది. దీంట్లో 21 శాతం వరకూ ఏటీ అండ్ టీ, బీటీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచే వస్తోంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం వాటా 40 శాతానికి మించి ఉంటుంది. -
జీలో 11 శాతం వాటా విక్రయం
సాక్షి, ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రమోటర్ సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ వాటాను ఇన్వెస్కో ఒపెన్హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ విక్రయించారు. 11 శాతం వాటాను రూ .4,224 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. ఈ ఫండ్కు ఇప్పటికే కంపెనీలో 8 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలు తరువాత జీల్లో ఫండ్ మొత్తం వాటా 19 శాతానికి పెరిగింది. కాగా ప్రమోటర్ల వాటా 25 శాతానికి తగ్గుతుంది. ఈ వివరాలను మార్కెట్ ముగిసిన అనంతరం కంపెనీ వెల్లడించింది. జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయంకా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పెట్టుబడిదారుగా కంపెనీపై నమ్మకం వుంచినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రమోటర్లు జీల్లో తమ వాటాను సగం (ఆ సమయంలో 42 శాతం) వ్యూహాత్మక పెట్టుబడిదారులకు విక్రయించడానికి ఉద్దేశించినట్లు ఎస్సెల్ గ్రూప్ నవంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో, ఎస్సెల్ గ్రూప్ రుణదాతలు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టివి వంటి ఎస్సెల్ కంపెనీలలో వాటాలను అమ్మడం ప్రారంభించింది. సెప్టెంబరు 2019 నాటికి రుణదాతలందరికీ రూ.11వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలనేది ఎస్సెల్ గ్రూప్ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తాజా డీల్. కాగా ఈక్వీటీ షేరు సుమారు 400 చొప్పున కొనుగోలు చేయనుంది ఇన్వెస్కో. దీని ప్రభావం గురువారం నాటి ట్రేడింగ్లో కనిపించనుంది. -
వాట్సాప్ ‘పేమెంట్స్’కు లైన్ క్లియర్!
బెంగళూరు: మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినట్లుగా పేమెంట్ డేటాను భారత్లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రోజుల్లో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లతో పాటు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా జట్టు కట్టనున్నట్లు సమాచారం. ‘డేటా లోకలైజేషన్కి సంబంధించిన పనులన్నీ వాట్సాప్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ నడుస్తోంది. ఆడిటర్లు తమ నివేదికను రిజర్వ్ బ్యాంక్కు సమర్పించిన తర్వాత వాట్సాప్ తన పేమెంట్ సర్వీసులను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవకాశం ఉంటుంది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గతేడాదే పైలట్ ప్రాజెక్టు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్లో పేమెంట్స్ ఫీచర్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సాప్లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెనక్కి తగ్గని ఆర్బీఐ .. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. చెల్లింపుల సేవలు అందించే సంస్థలు ముందుగా భారత్లో డేటా స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడిట్ నివేదికను కూడా సమర్పించిన తర్వాతే సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్లోని సిస్టమ్స్లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డేటా లోకలైజేషన్ నిబంధనల ప్రకారం భారత్లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్తో జట్టు కట్టింది. తాజాగా వాట్సాప్ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. -
హువావేకు భారీ ఊరట : రష్యాతో కీలక ఒప్పందం
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువావే కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్వార్లో భాగంగా అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు కీలక డీల్ను కుదుర్చుకుంది. 2019-20 నాటికి 5జీ టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ వెల్లడించింది. రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందంటూ సంతోషం వ్యక్తం చేశారు హువావే అధినేత గువోపింగ్. కాగా అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హువావే పలు ఇబ్బందుల్లో పడిపోయింది. అమెరికా కనుసన్నల్లో నడిచే పాశ్చాత్య దేశాలు జాతీయ భద్రతా ప్రమాదం పేరుతో హువావేను బ్లాక్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం హువావేకుభారీ ఊరట నివ్వనుంది. -
ఐబీఎంతో వొడాఫోన్ ఐడియా భారీ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ టెక్ జెయింట్ ఐబీఎంతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం ఐఐఎం టెక్నాలర్తో ఐఐఎంతో ఐబీఎంతో ఐదేళ్లకుగాను మల్టీ డాలర్ ఐటీ ఔట్ సోర్సింగ్ ఒప్పందాన్ని చేసుకున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐబీఎం హైబ్రిడ్ మల్టీక్లౌడ్, ఎనలిటిక్స్, ఏఐ భద్రతా సామర్ధ్యాల వాడకంలో వొడాఫోన్ ఐడియా పురోగతిని ఈ డీల్ వేగవంతం చేస్తుందని ప్రకటించింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, థింగ్స్ ఇంటర్నెట్, ఫాస్ట్ ట్రాక్ లాంటి ఉమ్మడి కార్యక్రమాలు కోసం ఐదు-సంవత్సరాల ఒప్పందం తమకు నూతన అవకాశాలను కల్పిస్తుందని కంపనీ తెలిపింది. వోడాఫోన్- ఐడియా విలీనం లక్ష్యాల సాధనలో ఐటీ సంబంధిత ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఒప్పంద విలువను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 700 మిలియన్ల డాలర్లుగా ఉందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. కాగా 387 మిలియన్ల చందాదారులతో (డిసెంబరు 31, 2018 నాటికి)వొడాఫోన్ ఐడియా కంపెనీకి హైబ్రిడ్ క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్లో వ్యాపార సామర్థ్యత, చురుకుదనం, స్థాయితోపాటు వ్యాపార ప్రక్రియల సరళీకరణకు తోడ్పడనుంది. తద్వారా భారతదేశంలో లక్షలాది వినియోగదారులకు, వ్యాపారులకు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని కూడా అంంచనుంది. -
స్పెక్ట్రం డీల్ : అంబానీకి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కాం)కు సుప్రీంకోర్ టుభారీ ఊరట కల్పించింది. సోదరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. అయితే గ్యారంటీ నగదు చెల్లించిన తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందంటూ నిబంధన విధించింది. డాట్ వద్ద గ్యారంటీ నగదు చెల్లించిన అనంతరం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. సేల్కున్నఅడ్డంకులను తొలగిస్తూ సుప్రీం శుక్రారం కీలక తీర్పునిచ్చింది. రెండు రోజుల్లో 1400 కోట్ల రూపాయల కార్పొరేట్ గ్యారంటీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించిన అనంతరం వారం రోజుల్లో ఎన్వోసీ జారీ చేయాల్సిందిగా టెలికాం విభాగం (డాట్)ను సుప్రీం కోరింది. రూ.46వేల కోట్ల రుణభారం అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్కాం సిద్ధమైంది. సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో స్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్కాంకు చాలా ముఖ్యం. -
జెట్ డీల్కు రంగం సిద్ధం
సాక్షి, ముంబై: గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన టాటాసన్స్, జెట్డీల్కు రంగం సిద్ధమైంది. ఈ వార్తలను ధృవీకరించిన టాటా సన్స్ ఈ కొనుగోలు సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన టాటా సన్స్బోర్డు ఆమోదం తెలిపిందనీ అయితే ఇంతరవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బోర్డు సభ్యులందరూ సమావేశ ముగింపు తర్వాత విలేఖరులతో మాట్లాడడానికి నిరాకరించారు. తాజా పరిణామంతో జెట్ ఎయిర్వేస్ కొనుగోలు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తలు ఇటీవల మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఇరుక్కున్న జెట్ ఎయిర్వేస్ను కాపావాలని టాటా సన్స్ను ప్రభుత్వం కోరిందని బ్లూమ్బెర్గ్ వ్యాఖ్యానించింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా, జెట్కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన టాటా సన్స్ బోర్డు సమావేశం టాటా-జెట్ డీల్ పై అంచనాలను మరింత పెంచింది. మరోవైపు ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలని నిన్న (గురువారం) జెట్ ఎయిర్వేస్ కొట్టిపారేసింది. దీనిపై ఎలాంటి చర్చలూ,నిర్ణయాలు లేవని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. కాగా జెట్ ఎయిర్వెస్లో అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్లైన్స్ 24శాతం వాటా ఉండగా ఉండగా, వ్యవస్థాపకుడు గోయల్కు 51 శాతం వాటా ఉంది.