వరంగల్ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. శ్యాంపేట మండలం సాధన పల్లిలో ఎడ్లబండి చెరువులో తిరగబడింది. ఎడ్లబండిలో వెళ్తున్న భార్యాభర్తలు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.