డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి పదవీ కాలంపు పొడిగింపుపై గురువారం క్యాట్లో విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా దినేష్ రెడ్డి పదవీ కాలంపు పొడిగింపుపై గురువారం క్యాట్లో విచారణ కొనసాగుతోంది. డిజిపిగా తన పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2014 వరకూ పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై దినేష్ రెడ్డిని కొనసాగించాలా.... వద్దా అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాట్కు నివేదిక ఇవ్వనుంది.
'ప్రకాష్ సింగ్ తదితరులు - భారత ప్రభుత్వం తదితరుల' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డిజిపిగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ళపాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.