ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం | engineering student suicide in kurnool district | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం

Published Wed, Aug 19 2015 1:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కర్నూలు జిల్లాలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కర్నూలు: ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కర్నూలు జిల్లాలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈఈఈ చదువుతున్న జీవన్ కుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణానికి చెందిన జీవన్ స్థానిక ఆర్జీఎం కాలేజ్ లో ఈఈఈ చదువుతున్నాడు. అయితే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్లిన జీవన్ బుధవారం ఉదయం పట్టణ సమీపంలోని కోట్ల రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థి తండ్రి సంపత్  వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement