హైదరాబాద్/కొవ్వూరు: పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. సోమవారం పలుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 8 వేల నగదు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటరాయుళ్ల ఆట కట్టు
Published Tue, Nov 11 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement