వాహనం ఢీకొని మహిళ మృతి | road accident wife died husband hospatalised | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని మహిళ మృతి

Oct 21 2015 8:20 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. నందవరం గ్రామానికి చెందిన బడేబూ, రఫీ స్కూటర్‌పై ఎమ్మిగనూరుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ఈ ప్రమాదంలో బడేబూ అక్కడికక్కడే మృతిచెందింది. రఫీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఎమ్మిగనూరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement