పత్తికొండలో రాజీవ్ యువకిరణాల శిక్షణ కేంద్రంపై దాడి | Samaikyandhra people attack on Rajiv Yuva Kiranalu center in Pattikonda | Sakshi
Sakshi News home page

పత్తికొండలో రాజీవ్ యువకిరణాల శిక్షణ కేంద్రంపై దాడి

Published Sat, Oct 5 2013 11:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Samaikyandhra people attack on Rajiv Yuva Kiranalu center in Pattikonda

నంద్యాల పట్టణంలో టీ నోట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పత్తికొండలోని రాజీవ్ యువకిరణాలు శిక్షణ కేంద్రంపై సమైక్యవాదులు దాడి చేశారు. దాంతో కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసమైంది. సమైక్య ఉద్యమంలో భాగంగా కోడుమూరులోని ఉపాధ్యాయ జేఏసీ నాయకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆగ్రహించిన ఉద్యోగులు, సమైక్యవాదులు పోలీసు స్టేషన్ను ముట్టడించారు.రాష్ట్ర విభజనను నిరసిస్తూ శ్రీశైలం దేవస్థానం ఉద్యోగస్థులు శనివారం శ్రీశైలంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు నగరంలోని జిల్లా వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగస్థులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement