సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12796) వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12796) వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మారిన వేళల ప్రకారం ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ తరువాత గుంటూరు నుంచి బయలుదేరి ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.