ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన సోమవారం అన్ని జిల్లాల పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.