
రాజధానిలో రియల్ దందాపై సీబీఐతో విచారించాలి
పవిత్ర స్థలాల నుంచి మట్టి తెచ్చి చంద్రబాబు రాజధాని పేరిట హడావుడి చేశారే తప్ప ఎలాంటి...
రాజధాని పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తొలి నుంచి చెబుతోందని, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటల ద్వారా రుజువైంద న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారెవరూ గతంలో ఇలాంటి ఆరోపణలు ముఖ్యమంత్రులపై చేయలే దన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు పని చేసి న చిన్న ఉద్యోగి మొదలు ఉన్నతోద్యోగి వరకూ ఆయన నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టలేద న్నారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో న్యాయస్థానాలు నేరుగా స్పందించాయని అలాగే రాజధాని విషయంలో కూడా కోర్టులు సుమొటోగా కేసు స్వీకరించాలని కోరారు.