ఆర్టీసీ పుష్కర సేవలు భేష్‌! | APSRTC services are good | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ పుష్కర సేవలు భేష్‌!

Published Sun, Aug 14 2016 8:57 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

పుష్కర ఘాట్‌ను పరిశీలిస్తున్న ఆర్‌ఎం - Sakshi

పాత గుంటూరు: కృష్ణా పుష్కరాల మూడో రోజు ఏపీఎస్‌ఆర్టీసీ గుంటూరు రీజియన్‌ పరిధిలో పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉదయం నుంచే బస్సు సర్వీసులను పెంచి భక్తులను పుష్కర ఘాట్‌లకు చేరవేశారు. వరుస సెలవు దినాలు, ఆదివారం కావడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు, భక్తులు, పాఠశాలల విద్యార్థులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు స్టాఫ్‌లు కిటకిటలాడాయి. ప్రముఖ ఘాట్‌లు అమరావతి, సీతానగరంలకు వెళ్లేందుకు యాత్రికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచినట్లు రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. అవసరమైన చోట బస్సుల సంఖ్యను పెంచి యాత్రీకులకు అందుబాటులో ఉంచారు. ఆదివారం మొత్తం 1105 బస్సులతో 9338 ట్రిప్పులను నడిపి 3,26,376 మంది యాత్రికులను జిల్లాలోని వివిధ పుష్కర స్నాన ఘాట్‌లకు చేరవేసినట్లు తెలిపారు. వీటిలో మొత్తం 4791 ట్రిప్పులు ఉచితంగా నడిపి 1,63,520 మంది యాత్రికులను అమరావతిలోని పుష్కర ఘాట్‌లకు, ఎయిమ్స్‌ నుంచి సీతానగరం, మహానాడు స్నానఘట్టాలకు చేరవేసినట్లు వెల్లడించారు. యాత్రికులు ప్రై వేటు వాహనాలను ఆదరించకుండా  ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోభివృద్ధికి చేయూతనందించాలని ఆయన కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement