Puskaras
-
నట్టేట మునిగిన నాణ్యత
* ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలు * రోజుల వ్యవధిలోనే దెబ్బతింటున్న వైనం * రూ.కోట్ల నిధులు తారుమారు కృష్ణా పుష్కరాల్లో భాగంగా కొల్లూరు మండలంలో చేపట్టిన ఆర్అండ్బీ రహదారుల నిర్మాణంలో నాణ్యత నట్టేట కలిపేశారు. మండల వ్యాప్తంగా రూ.15.30 కోట్లతో చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఏ ఒక్క రహదారీ మన్నికగా లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకొని చేతులు దులుపేసుకున్నారు. కొల్లూరు: పవిత్ర కృష్ణా పుష్కరాల మాటున టీడీపీ నేతలు సాగించిన అక్రమాల డొంక రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. మండలంలో రూ. 15.30 కోట్లతో నిర్మించిన రహదారుల్లో నాణ్యతకు మంగళం పాడి కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకున్నారన్న విషయం రహదారుల దుస్థితి చూస్తే బహిర్గతమవుతుంది. రోజుల వ్యవధిలోనే రూ. 5.69 కోట్లతో నిర్మించిన కొల్లూరు–గాజుల్లంక, పెసర్లంక– కొత్తూరులంక రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా మరో రెండు రోడ్లు కాంట్రాక్టర్ల అవినీతికి ఛిద్రమై ఎందుకూ పనికిరా>కుండా పోతున్నాయి. ఏ ఒక్క రోడ్డూ నిర్మాణంలోనూ నాణ్యత పాటించకపోవడంతో రహదారులు నిర్మించి ప్రయోజనం లేకుండా పోయింది. రహదారులపై తారు లేయర్లు తొలగిపోవడం, అంచుల వెంబడి బీటలు వారడం, రహదారి కుంగిపోవడం వంటి లోపాలు బహిర్గతమయ్యాయి. రూ. 3.15 కోట్ల వ్యయంతో కొల్లూరు–కొల్లిపర మండలాల నడుమ 8.12 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రహదారి నిర్మాణం, మరమ్మతులు కాంట్రాక్టర్ల అక్రమాలకు వేదికగా మారాయి. నెలలోనే అధ్వానం.. ఈపూరు నుంచి చిలుమూరు మధ్య నూతనంగా నిర్మించిన రహదారి పొడవునా తారు తొలగిపోయి రోడ్డు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కనీసం 15 ఏళ్ల పాటు మన్నాల్సిన బీటీ రోడ్డు నెల రోజుల వ్యవధిలో అధ్వాన స్థితికి చేరడం పనుల్లో ఏమేరకు ప్రమాణాలు పాటించారో తేటతెల్లమవుతుంది. కొల్లూరు వద్ద చేపట్టిన రోడ్డు అంచుల పటిష్టత మట్టితో చేపట్టాల్సి ఉండగా ఇసుకతో తూతూ మంత్రంగా ముగించారు. దీంతో అంచులు కోతకు గురై రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ కక్కుర్తి... రూ. 3.15 కోట్లు వెచ్చించి నిర్మించిన గాజుల్లంక–చింతమోటు రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా రహదారి పాడై పాత రోడ్డులా తయారవుతుంది. పోతార్లంక సమీపంలో రోడ్డు పగుళ్ళిచ్చి కుంగిపోయింది. కిష్కిందపాలెం–తడికలపూడి మధ్యలో సైతం రోడ్డు అంచుల్లో తారు పొరలు తొలగిపోవడం, అంచులు పగిలిపోవడం పనుల జరిగిన తీరుకు అద్దం పడుతుంది. రూ. 3.31 వ్యయంతో 6 కిలోమీటర్ల నిర్మించిన తెనాలి–వెల్లటూరు మార్గంలో సైతం లోపాలు బహిర్గతమవుతున్నాయి. క్రాప అడ్డరోడ్డు రోడ్డు అంచులు కుంగి బీటలువారాయి. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అతుకులతో సరిపెట్టారు. పనులు పూర్తవ్యకముందే బిల్లులు చెల్లించి తమ వాటాలు అందుకున్న విశ్వాసాన్ని అధికారులు ప్రదర్శిస్తున్నారు. డీఈ దృష్టికి తీసుకెళ్ళండి.. రహదారుల దుస్థితి, నాణ్యతా ప్రమాణాలపై ఆర్ అండ్ బీ ఈఈ పకీర్బాబును సాక్షి వివరణ కోరగా డీఈ దృష్టికి తీసుకువెళితే అయన ఆ వ్యవహారం ఏమిటో చూస్తారని పేర్కొన్నారు. – పకీర్బాబు, ఈఈ -
రహదారులకూ ‘అవినీతి’ మరకలు
* జిల్లాలో దాదాపు రూ.300 కోట్లకు పైగా పనులు * అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో నిర్వహణ * కాంట్రాక్టుల కోసమే అన్నట్టు మంజూరు * పుష్కరాలు పూర్తయ్యేసరికి దెబ్బతిన్న రోడ్లు * నగరంలో అసంపూర్తిగా రోడ్ల పనులు సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో నిర్మించిన రోడ్ల పనుల్లో అవినీతి పగుళ్ల రూపంలో బట్టబయలవుతోంది. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటల య్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఘాట్ల అనుసంధానం కోసం లింక్ రోడ్లు, భవన నిర్మాణాలకు సంబంధించి దాదాపు 100 పనులను రూ.66.76 కోట్లతో చేపట్టారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో 83 పనులను రూ.170.37 కోట్లతో పనులు చేశారు. గుంటూరు కార్పొరేషన్లో 94 పనులను రూ.40.02 కోట్లతో, తాడేపల్లి మున్సిపాలిటిలో 42 పనులు రూ.18.25, రేపల్లెలో 7 పనులు రూ.కోటితో, మంగళగిరి మున్సిపాలిటీలో నాలుగు పనులు రూ.2 కోట్లతో చేపట్టారు. పనులు హడావుడిగా మంజూరు చేసి పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చింది. ఎక్కువ శాతం కాంట్రాక్టు పనులు పచ్చ నేతలే దక్కించుకోవటంతో వారు అందివచ్చిన అవకాశాన్ని సద్వినిమోగం చేసుకొన్నారు. నాణ్యతకు తూట్లు పొడిచి, కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ పనుల్లో సైతం చినబాబుకు వాటాలు ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. సిమెంటు పనులు నాసిరకంగా చేసి, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదు. మట్టి, మెటల్ రోడ్లు కనీసం కన్సాలిడేషన్ లేకుండా తూతూమంత్రంగా చేయడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు కొన్ని రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల రోడ్లపై కంకర తేలింది. కొన్ని రోడ్లు పగిలిపోయాయి. గుంటూరు నగరంలో డ్రెయిన్లు, కాలువలు, రోడ్లు అప్పుడే దెబ్బతింటున్నాయి. నగరంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కంకర వేసి వదిలి వేయడంతో నగర ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పుష్కరాల్లో రోడ్లు, డ్రెయిన్లు, సిమెంట్ రోడ్డు పనులకు దాదాపు రూ.300 కోట్ల పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యత డొల్లతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. లింక్ రోడ్ల పేరుతో... పల్నాడు ప్రాంతంలో కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు కోట్ల రూపాయల పనుల్లో తెలుగు తమ్ముళ్లు దోచుకున్నారు. దాచేపల్లి మండలంలోని రామాపురంలో రూ.1.05 కోట్లతో వేసిన సిమెంట్ రోడ్డు పగుళ్లు వచ్చింది. అద్దంకి హైవే నుంచి పొందుగలకు వేసిన రోడ్డు ప్రస్తుత వర్షాలకు కోతకు గురైంది. రూ.1.20 కోట్లలో నిర్మించిన చెన్నాయపాలెం రోడ్డు దుస్థితీ అంతే. గురజాల నుంచి దైదకు రూ.3.20 కోట్లతో వేసిన రోడ్డు అంతంతమాత్రంగానే ఉంది. అమరావతిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.4 కోట్లతో అప్రోచ్ రోడ్లను తూతూమంత్రంగా వేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధరణికోట నుంచి సత్తెనపల్లి ఆర్అండ్బీ రోడ్టును అనుసంధానం చేసేందుకు రూ.1.90 కోట్లతో వేశారు. అమరావతిలో పుష్కర ఘాట్లను అనుసంధానిస్తూ రూ.కోటితో, ధ్యానబుద్ధ ఘాట్ వద్ద రూ.50 లక్షలతో రోడ్లు వేశారు. కొల్లూరు, కొల్లిపర మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెనుమూడి–రేపల్లె రోడ్డు హడావుడిగా రూ.4 కోట్లతో చేశారు. పెనుమూడిలో వీఐపీ ఘాట్ రోడ్డు, మైనేనిపాలెం అప్రోచ్ రోడ్డు పనులు నాసిరకంగా చేశారు. ఇలా జిల్లాలో జరిగిన పుష్కర రోడ్డు పనులు అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొత్తం పనులపై విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. -
నాణ్యతకు కోత
* పుష్కరాలకు నాసిరకంగా రోడ్డు నిర్మాణం * ఒక్క వర్షంతోనే కోతకు గురైన మార్జిన్లు * వాహనాలు రోడ్డు అంచుకు వెళ్తే ముప్పే * రూ.2 కోట్ల పనుల తీరిదీ తమ్ముళ్ల జేబులు నింపడానికి ప్రభుత్వం పుష్కర పనుల పేరిట కోట్లాది రూపాయలు వెదజల్లింది. కాంట్రాక్టర్లు నాణ్యతకు పాతర వేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నెల రోజులు కూడా గడవక ముందే పనుల్లో డొల్లతనం బయట పడుతోంది. క్రోసూరు: కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. తమకు అధికారపార్టీ అండదండలుంటే చాలన్న చందంగా ఆర్అండ్బీశాఖ అధికారులు వ్యవహరిస్తుండటంతో రోడ్ల నిర్మాణాలు నాసిరకంగానే పూర్తవుతున్నాయి. పుష్కరాల పనుల్లో భాగంగా రూ.2 కోట్ల నిధులతో క్రోసూరు మండలంలోని బయ్యవరం నుంచి క్రోసూరు వరకు 10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయట పడింది. వర్షానికి విప్పర్ల చెక్డ్యాం వద్ద రోడ్డు మార్జిన్లు భారీగా కోత గురయ్యాయి. రోడ్డు మార్జిన్లో ఉన్న చౌడు మట్టి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మార్జిన్ వద్ద మట్టి అంచు కొంత మేర కూలిపోయింది. రోడ్డు మార్జిన్లో వేసిన రాళ్లను కనీసం రోలర్తో చదును చేయకుండా వదిలేయడంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. రోడ్డు మార్జిన్లు అల్పంగా ఉండటంతో ఏదైనా పెద ్దవాహనం వచ్చినా పక్కకు ఒరిగిపోయే ముప్పు కూడా పొంచి ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మళ్లీ మళ్లీ పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగచేస్తున్నారని ప్రజలంటున్నారు. బాగు చేయిస్తాం.. రోడ్డు పని పూర్తి కాలేదు. నార్మ్స్ ప్రకారం రోడ్డు షోల్డర్స్కు బలం కొరకు సైడు మట్టితోనే వేయాల్సి ఉంది. వర్షానికి కోతకు గురైన రోడ్డును కాంట్రాక్టరే బాగు చేయాలి. లేకుంటే బిల్లులు మంజూరు చేయం. రోడ్డు గట్టితనం కోసమే షోల్డర్స్కు మాత్రం రాళ్లు వేసాం. పెద్దసైజు రాళ్లు తొలగిస్తాం. దానిపై తిరిగి కంకర వేసి రోలర్తో చదును చేస్తాం. కొద్దిగా తెరపి ఇచ్చిన వెంటనే పనులు చేస్తాం. – అబ్బాస్ కెనడీ, ఆర్అండ్బీ ఏఈ -
పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు
* నాణ్యతా లోపంతో రహదారి నిర్మాణం * రోజుల వ్యవధిలోనే దెబ్బతిన్న వైనం * అతుకులతో కప్పిపెట్టే యత్నం పుష్కర పనులు పురిట్లోనే పనికిరాకుండా పోతున్నాయి. ఘాట్లు, అప్రోచ్రోడ్లు, తారు రోడ్లు, అంతర్గత రహదారులు నెలరోజులు కూడా గడవకముందే అధ్వానంగా మారాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి చేపట్టిన అనేక పనుల్లో నాణ్యత నాసిరకంగా ఉంది. కొల్లూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన అనేక పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నాణ్యతకు పాతరేశారు. ఏ మాత్రం ప్రమాణాలు పట్టించుకోకుండా పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. అడుగేస్తేనే బీటీ రోడ్డు బెతెకలు కాలి వెంట లేసి వచ్చేలా ఉన్నాయంటే ఎలా చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రూ. 3.3 కోట్లు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు జరగుతుండగానే తారు బెతెకలు ఊyì పోవడం, నాణ్యతా లోపాలు బహిర్గతమయిన చోట గుత్తేదారు తిరిగి అతుకులు వేసినా పలితం కనిపించడంలేదు. అతుకులు వేసిన ప్రాంతంతో తిరిగి రహదారి ఛిద్రమవుతుండటం రహదారి మన్నికకు ప్రశ్నార్థకంగా మారింది. చెక్కుచెదరకుండా లక్షణంగా ఉన్న పాత రోడ్డును పెకిలించి పుష్కర నిధులతో నిర్మిస్తున్న రోడ్డులో నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో కలసి ఉన్న పది లంక గ్రామాల ప్రజలకు కొత్తగా నిర్మించిన రహదారి కన్నీటిని మిగుల్చుతోంది. నాణ్యతకు తిలోదకాలు... 10.08 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారి పనులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక నుంచి జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గ గ్రామాలు, కృష్ణా జిల్లాలోని మరో రెండు గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే మార్గ నిర్మాణ పనులు నీటి పాలయ్యాయి. పుష్కరాలకు ముందు హడావిడిగా రోడ్డు పనులు జరుగుతుండగానే వేసిన రోడ్డు వేసినట్లు బీటలు వారి తారు బెతెకలు ఊడి మెటల్ బయట పడటం రహదారి నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల బాగోతం తేటతెల్లమైంది. కొల్లిపర మండలం అన్నవరపులంక, కృష్ణా జిల్లా కనిగిరిలంక వద్ద రహదారి నిర్మించి నాలుగు రోజులు గడకుండానే రోడ్డు అంచులు వెంబడి మొదలయ్యి రోడ్డు మొత్తం ఛిద్రమైపోవడం ఆరంభమైంది. చెక్కుచెదరని రోడ్డును పెకిలించారు.. గతంలో ఆరేళ్ళ కిందట నిర్మించిన రహదారి చింతర్లంక, చిలుమూరులంక, అన్నవరపులంక ప్రాంతాల్లో కిలోమీటరున్నర మినహా ఎక్కడా చెక్కుచెదరకుండా లక్షణంగా ఉంది. సవ్యంగా ఉన్న రోడ్డును నూతన రోడ్డు పేరుతో పెకిలించేసి తూతూ మంత్రంగా ముగించడంపై ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలకు నెలవైన ఈ ప్రాంతంలో ఈ మార్గం ద్వారా కంద, అరటి, పసుపు, వంటి వాణిజ్య పంటల తరలింపుకు అధిక బరువులతో వాహనాలు తిరగాల్సి ఉంది. సుమారు ఆరువేల మంది జనాభా నివసిస్తున్న లంక గ్రామాల్లో రవాణా సౌకర్యంకు ఏకైక ప్రధాన మార్గపు పనులు తీసికట్టుగా మారాయి. రెండు లేయర్లతో బీటీ రోడ్డు వేశాం.. రహదారి పనుల్లో ఎటువంటి లోపం తలెత్తకుండా పర్యవేక్షించాం. గ్రామాలున్నంత వరకూ రహదారి పాడవకుండా రెండులేయర్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒకే లేయర్తో రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో రహదారి పాడవడానికి అవకాశం లేదు. రహదారిని పరిశీలించి తక్షణం లోపాలను సవరిస్తాం. – మల్లికార్జునరావు, ఆర్ అండ్బీ డీఈ, తెనాలి -
ప్రచార ఆర్భాటానికి రూ.కోట్ల ఖర్చు
పుష్కర పనుల్లో అవినీతి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి ధ్వజం చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ గుంటూరు (పట్నంబజారు): కేవలం ప్రచారార్భాటాల కోసం పవిత్ర కృష్ణా పుష్కరాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఖర్ఛు చేసిన నిధులు, అభివృధ్ధి పనులపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేటలోని పార్టీ నగర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, 2 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి, పిండ ప్రదానాలు చేశారని, అంటే ఒక్కొక్క మనిషి కోసం రూ.1000 ప్రభుత్వం వెచ్చించిందా అని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే తాము కూడా హర్షించేవారమన్నారు. అవకతవకలు జరిగాయని మీడియాలో ఘోషిస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు సర్కార్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 మంది మృతికి కారణమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్లతో పుష్కరాలను నిర్వహిస్తే, ఇక్కడికంటే అధికంగా 5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, ఏ ఒక్క ప్రమాదం జరలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. పుష్కరాలను సైతం రాజకీయ వేదికగా మార్చుకుని గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. భక్తులను పోలీసులతో నిర్బంధించి, ఎటువైపు కదలనివ్వకుండా నిలువరించి ప్రసంగాలు చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) రేపల్లె నియోజకవర్గ గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, మైనారిటీ విభాగం గుంటూరు నగరాధ్యక్షుడు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. -
యాత్రికుల సేవలో ఆంధ్రాశ్రమం
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమం విజయవాడలో పుష్కర యాత్రికులకు ఇతోధికంగా సేవలందించింది. పుష్కరాలు జరిగిన 12 రోజులూ విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో యామిజాల రామం మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో సుమారు 50 వేల మంది యాత్రికులకు నిత్యాన్నదానం జరిపింది. ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందరశాస్త్రి, ఆయన కుటుంబీకులు, ఆశ్రమ వైస్ చైర్మన్ ముక్తేవి సీతారామయ్య, ట్రస్టీ పురాణం శ్రీనివాస్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పుష్కర యాత్రికుల సేవలో పాల్గొన్నారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం కృష్ణవేణికి ఘనంగా ముగింపు హారతి కార్యక్రమం కూడా నిర్వహించారు. -
పుష్కరాల ముసుగులో దోపిడీ
వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి అచ్చంపేట: గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు తన కార్యకర్తలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారని పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్యయకర్త కావటి శివనాగ మనోహరనాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.1300 కోట్లు వెచ్చించి వేసిన రోడ్లు, దేవాలయాల మరమ్మతులు, çపుష్కరఘాట్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. నియోజకవర్గంలో క్రోసూరు నుంచి అమరావతి, అచ్చంపేట నుంచి ఊటుకూరు వరకు, అచ్చంపేట నుంచి మాదిపాడు వరకు వేసిన రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లేదన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ముందుగా అంచనాలు తయారు చేయకుండా, టెండర్లు పిలవకుండా పైపై పూతలతో దోచుకోవాలని చూస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ ఘాట్కు ఎంత వెచ్చించారు, నాణ్యాతా పరమైన సమాచారాన్ని రాబడతామన్నారు. ఎంత వరకు ఖర్చు చేశారో అంతే బిల్లు చేసుకోవాలి తప్ప దోచుకోవాలని చూస్తే విజలెన్స్, క్యాలిటి కంట్రోల్కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు. -
ఆణిముత్యాలకు పుష్కర నివాళి
అమరావతి : దివికేగిన తెలుగుజాతి ఆణిముత్యాలకు మంగళవారం స్థానిక ధ్యానబుద్ధ పుష్కరఘాట్లో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ప్రతినిధులు పిండ ప్రదానం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పి.వి.నరసింహారావు, ఎన్టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, సినీ నటీనటులు సావిత్రి, ఎస్వి రంగారావులతో పాటు పలు రంగాల్లో ప్రముఖులైన తెలుగువారికి నివాళి అర్పించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పీఆర్టీయూ అధ్యక్షులు టీవీఎస్ మణి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర సందడి
-
రాత్రిళ్లూ బస్సు సర్వీసులు
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు, ఉచిత బస్సుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దానిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి శనివారం స్వయంగా పుష్కర్నగర్లోని బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రయాణీకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడుతోపాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులు అందుబాటులో ఉండటం లేదని వారు చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ల వద్ద అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్ఎం శ్రీహరి రాత్రి వేళల్లో 50 బస్సులు అదనంగా ఉంచి అవసరమైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ వద్ద కంట్రోలర్ను ఏర్పాటు చేశామన్నారు. -
సాంస్కృతిక సందడి
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కరఘాట్లో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా శనివారం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి చేరుకున్న కళాకారులు కూచిపూడి నృత్యాలు, భరత నాట్యం, కోలాటం, లఘునాటికలు ప్రదర్శించారు. కృష్ణమ్మ గొప్పదనాన్ని వర్ణిస్తూ కీర్తనలు, గేయాలు, పద్యాల రూపంలో కళాకారులు తమదైన శైలిలో తెలియజేస్తున్నారు. పుష్కర ఘాట్లో ప్రదర్శనలను భక్తులు తిలకించారు. కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి బెజ్జం విజయభాస్కర్, ఎంఈవో రాయల సుబ్బారావు, మునిసిపల్ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. -
‘బాల’కృష్ణం వందే జగద్గురుం..
-
స్మైల్ ప్లీజ్!
గుంటూరు రూరల్ (అమరావతి) : ‘పుష్కర స్నానం చేశాం. అద్భుతంగా ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగితే సూపర్గా ఉంటుంది. గుర్తుగా మిగిలిపోతుంది..’ అన్న మాటలు అమరావతిలోని పుష్కర ఘాట్ల వద్ద తరచూ వినిపిస్తున్నాయి. ఆ మాట వినపడగానే లోకల్ ఫొటోగ్రాఫర్లు వారిముందు ప్రత్యక్షమవుతున్నారు. ‘స్మైల్ ప్లీజ్..’ అంటూ ఫొటో తీసి చేతిలో పెట్టి రూ.35 నుంచి రూ.50 వరకు చార్జ్ చేస్తున్నారు. -
కృష్ణ తీరం.. జన సంద్రం
-
పుష్కరాలకు రూ. కోట్లు వృథా
వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున కొల్లూరు: పుష్కరాల పనుల్లో ప్రభుత్వం రూ. కోట్లు వృథా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం కొల్లూరు మండలంలోని పోతార్లంకలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 12 పుష్కర ఘాట్లలో రెండు మూడు మినహా మిగిలిన ఘాట్లు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధిని విస్మరించడం హేయమని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ వేల కోట్లు స్వాహా చేయడం బాధాకరమన్నారు. ప్రణాళికేతర వ్యయం కారణంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.80 వేలSకోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. పుష్కర పనుల్లో వందల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వ అవినీతిపై సరైన విచారణ జరిపితే టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి పరుల జాబితా బయటకి వస్తుందన్నారు. ఆయన వెంట కొల్లూరు ఉప సర్పంచి కఠెవరపు జేసుదాసు, దుగ్గిరాల మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్ బిట్రగుంట సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి కాలం రాజేంద్ర, స్థానిక నాయకులు పరిశ రంగారావు తదితరులున్నారు. -
పుష్కర ఉషోదయం
కొల్లిపర: కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండి పోతున్నాయి. సూర్యోదయం వేళ మాత్రం వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో భక్తులు ఉదయం వేళ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూర్యోదయాన భక్తుల రద్దీ నది వద్ద కొనసాగుతోంది. -
వయసులో చిన్న... సేవలో మిన్న
భక్తుల సేవలో తరిస్తున్న విద్యార్థులు వయసులో చిన్న అయినా... వారు సేవలో మిన్న... పుష్కరాలకు వచ్చిన భక్తులు... అందునా ముఖ్యంగా వృద్ధులకు వారు సొంత మనవళ్లు, మనవరాళ్లలా ఎంతో ఆప్యాయంగా సేవలందిస్తున్నారు. వికలాంగులకు ఊతకర్ర అవుతున్నారు. వ్యాధిగ్రస్తులకు నైటింగేళ్లవుతున్నారు. రెడ్క్రాస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలకు చెందిన విద్యార్థులకు వారి సేవాభావాన్ని నిరూపించుకునేందుకు 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల్లో ఈ 12 రోజులు ఒక అవకాశంగా మారాయి. పట్నంబజారు : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అనేక జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు చేస్తున్న సేవలు కృష్ణా పుష్కరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు రోహిణి కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్లో వీల్చైర్లలో సుమారు కిలో మీటరు దూరం నుంచి వృద్ధులు, వికలాంగులను ఘాట్ వద్దకు చేరుస్తూ..తిరిగి ఉచిత బస్సులు నిలిచే దుర్గా విలాస్ హోటల్ వరకు వదలిపెడుతున్నారు. ఘాట్లలో భక్తులకు సహాయ సహాకాలు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో గుంటూరులోని బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల (బీహెచ్)కు విద్యార్థినులు భక్తుల సేవల్లో పాలుపంచుకుంటున్నారు. రామకృష్ణ హిందూ హైస్కూల్లో 35 మంది విద్యార్థినులు నిత్యం వచ్చే వేలాది మంది ఉదయం సమయంలో అల్పాహార కార్యక్రమం నుంచి రాత్రి భోజన కార్యక్రమం వరకు వడ్డన చేయటంతో పాటు...ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అమరేశ్వరుని ఆలయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యం, తదితర సేవలు చేపడుతున్నారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పిల్ల పోలీసుల్లా అమరావతిలో భక్తుల నియంత్రణలో కీలకపాత్ర వహిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవలు అందించేందుకు వచ్చిన విద్యార్థులు వీపునకు నీటి డబ్బాను తగిలించుకుని పుష్కర ప్రాంగణంలో పాదచారులకు, భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు, ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమంలో విశేషంగా పాటుపడుతున్నారు. ఉచిత క్లోక్ రూం వద్ద కూడా వారు సేవలు అందిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మండుటెండల్లో సైతం సేవలు అందిస్తున్న విద్యార్థులను అభినందించి తీరాల్సిందే. -
పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం
రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ పొందుగల (దాచేపల్లి): కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ నాయక్ పోలీసులకు సూచించారు. మండలంలోని పొందుగల పుష్కరఘాట్ను బుధవారం ఆయన సందర్శించారు. ఘాట్లో భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఘాట్ల వద్ద ఏర్పాట్లు పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మరో ఆరురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని, సెలవు దినాల్లో, పుష్కరాల చివరి రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎస్పీ చెప్పారు. భక్తులు పుష్కరస్నానం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఆటంకాలు కలుగకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఇ. శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా ఆనంద్, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య తదితరులున్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కరాల్లోనూ ప్రచార ఆర్భాటం
* టీడీపీ నేతల ఫ్లెక్సీ విరిగి ఇద్దరికి గాయాలు * పూజా సామగ్రి బ్యాగులపైనా సీఎం ఫొటోలు * భక్తుల విమర్శలు అమరావతి (గుంటూరు రూరల్) : తెలుగుదేశం పార్టీ నాయకుల అత్యుత్సాహం అమరావతిలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు శాపంగా మారింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలికి పడిపోయి ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపిన సంఘటన సోమవారం అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పూసల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్లో పుణ్య స్నానం చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి దైవసన్నిధిలో దేవుని దర్శించుకుని ఇంటికి బయలుదేరారు. ఘాట్నుంచి బయటకు వచ్చిన తరువాత బస్ల కోసం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో గాలి తీవ్రంగా వీయటంతో ఒక్కసారిగా ఘాట్కు వెళ్లే మార్గంలో స్థానిక టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ముఖ ద్వారం ఫ్లెక్సీ విరిగి రోడ్డు పక్కేనే నిలబడి ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, ఆయన కుమారుడు నవీన్కు తలకు ఫ్లెక్సీ రేకులు గీసుకుని గాయాలయ్యాయి. అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు అప్రమత్తమై సమీపంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి బాధితులను తీసుకెళ్లారు. వైద్య చేయించి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. దీంతో బాధితుడు గ్రామశివారులోని పుష్కరనగర్లో బస్ఎక్కి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లినట్లు తెలిసింది. పిండ ప్రదానం, పూజా సామగ్రికీ పార్టీ రంగు... భక్తులు పితృదేవతలకు పెట్టే పిండ ప్రదాన సామాగ్రి నుంచి అమ్మవారికి పూజలు చేసుకునే పూజా సామాగ్రి వరకూ ప్రతి విషయానికి చంద్రబాబు స్తుతి సూక్తులతో కూడిన పార్టీ ప్రచార రంగును పులిమారు. చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన∙సంచుల్లో పిండ ప్రదాన వస్తువులను పెట్టి విక్రయిస్తున్నారు. చంద్రబాబు స్తుతి గీతాలు.... ఘాట్ల నిండా పార్టీ రంగులతో చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో బెలూన్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పుష్కరాలకు చెందిన ప్లెక్సీలను ఎక్కడా ఏర్పాటు చేయక పోగా టీడీపీ నాయకుల ప్లెక్సీలను మాత్రం వీధి వీధిలో ఏర్పాటు చేశారు. ప్రతి విద్యుత్ పోలుకు మైకులను ఏర్పాటు చేశారు. పవిత్ర పుష్కరాలలో దేవుని గీతాలను భక్తులకు వినిపించాల్సింది పోయి నిత్యం చంద్రబాబు స్తుతి గీతాలు, పార్టీ పాటలను వినిపిస్తూ భక్తులకు విసుగు తెప్పించారు. ఆలయాల్లో దేవుని గీతాలు వినిపిస్తారు కానీ పార్టీ గీతాలు ఏర్పాటు చేశారేంటని భక్తులు విస్మయం చెందారు. -
అమరావతికి భక్త వాహిని
* పెద్ద సంఖ్యలో అమరలింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు * క్రమంగా పెరుగుతున్న రద్దీ సాక్షి, అమరావతి: పంచారామాల్లో ప్రథమా రామం అమరావతి అమరలింగేశ్వర ఆలయం. దీనికితోడు చల్లని వాతావరణం, ఆహ్లాదపరిచే కృష్ణవేణి ప్రవాహం,శివయ్యకు ప్రీతిపాత్రమైన సోమవారం అన్నీ కలిసి రావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు కృష్ణమ్మకు పసువు, కుంకుమలు పెట్టి పూజలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. ఎండ వేడిమితో అల్లాడిన భక్తులకు, ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో కృష్ణమ్మ చెంతనే ఎక్కువ సేపు సేద తీరారు.ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గర పిల్లల ఆటలతో పాటు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. నమూనా ఆలయాల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు.. కృష్ణమ్మ ఒడిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, అమరలింగేశ్వరుని దర్శించుకొన్నారు. అమరేశ్వరుని వద్ద క్యూలైన్లు కిటకిటలాడాయి. పోస్టాఫీసు వరకు క్యూలైన్ ఏర్పాటు చేసినా, సగభాగం మాత్రమే షామియానాలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీఐపీ దర్శనానికి గంట, రూ.100 దర్శనం రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పుష్కరాల డ్యూటీలకు వచ్చిన ఉద్యోగులు, కొంతమంది పోలీసులు తమ కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి పంపడంతో ఉచిత దర్శనానికి ఆలస్యమవుతోంది. ఆలయ అధికారులు వీఐపీల సేవతో తరిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడ్డారు. -
పుష్కర భక్తులకు వడదెబ్బ
ఏడుగురు బాధితులకు వైద్యం నాలుగోరోజు శిబిరాల్లో 15,136 మందికి వైద్యం గుంటూరు మెడికల్: జిల్లాలో ఈ నెల 12 నుంచి జరుగుతున్న కృష్ణాపుష్కరాల్లో ఒక పక్క డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీనికితోడు సోమవారం వడదెబ్బ కేసులు కూడా నమోదవటంతో భక్తుల్లో భయం మరింత తీవ్రంగా పెరిగింది. పుణ్యస్నానమాచరించటానికి వస్తే వివిధ రకాల రోగాలు (అంటురోగాలు) వ్యాపిస్తూ ఉండటంతో వైద్యాధికారులు అప్రమత్తమై క్యాంపుల్లో వైద్యసేవలను అందించటంతోపాటుగా అప్రమత్తంగా ఉండాలని భక్తులకు కరపత్రాలు అందించటం, మైక్లలో ప్రచారం చేయటం ద్వారా ముందస్తు జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. సన్స్ట్రోక్( వడదెబ్బకు) గురైన ఏడుగురికి జిల్లా వైద్యాధికారులు ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో సేవలను అందించినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న 441 మందికి, వివిధ రకాల ఎలర్జీలతో బాధపడుతున్న 840 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 2107 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 271 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 488 మందికి, డయేరియాతో బాధపడుతున్న 97 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి వెల్లడించారు. -
పసి మొగ్గలకు కృష్ణమ్మ లాల!
-
వాళ్లకో రూల్.. వీళ్లకో రూల్!
* అడుగడుగునా భక్తులకు ఆంక్షలు * ఏం చేయాలో పాలుపోక భక్తుల పాట్లు * వీఐపీలు, పోలీసులకు మాత్రం నో రూల్స్ * ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు అమరావతి (గుంటూరు రూరల్/ పట్నంబజారు): ‘సారూ.. మేము దూరప్రాంతాల నుంచి అమరావతికి పుణ్య స్నానం చేద్దామని వచ్చామయ్యా... ఆ దారిలో వెళితే..ఆ పోలీసాయన ఇటు పొమ్మన్నడూ.. ఇక్కడకు వస్తే మీరేమో.. ఇటు కాదంటున్నారు.. ఇంతకీ మా దారేది.. ఎటు వెళ్లాలి...’ అంటూ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వాపోతున్నారు. అమరావతిలోని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఏ దారిన వెళితే.. ఏ ఘాటు వస్తుందో తెలియక భక్తులు సతమతమవుతున్నారు. అడుగడుగునా.. అడ్డంకులే... అమరలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేది ప్రధాన రహదారి కావడంతో 90 శాతం మంది భక్తులు ఈ దారినే వస్తున్నారు. ఈ దారిలో పోలీసులు మొత్తం.. అష్ట దిగ్బంధనం చేశారు. కేవలం ప్రధాన రహదారిలోనే ఐదు ప్రాంతాల్లో బారికేడ్లు, చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురవుతున్నారు. మండుటెండల్లో పోలీసుల ఆంక్షలు తప్పుకుని మూడు కిలోమీటర్లు నడుస్తూ వచ్చే భక్తులకు ఆలయానికి రాకముందే దేవుడు కనిపిస్తున్నాడు. యాత్రికులే కాకుండా అమరావతిలో నివాసం ఉన్న వారిని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ అవసరాల కోసం అమరావతి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు, స్థానికంగా నివాసం ఉండే వారిని కూడా పోలీసులు లేనిపోని ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసు వాహనాలు యథేచ్ఛగా... ప్రధాన రహదారిలో నడచి వెళుతున్న భక్తులను కూడా వెళ్లనివ్వని పోలీసులు..వారి వాహనాలను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతున్నారు. కనీసం వాహనాలపై డ్యూటీ పాసు కూడా ఉండడం లేదు. తీరా ఆరా తీస్తే.. ఆ వాహనాల్లో ఎస్ఐ స్థాయి నుంచి జిల్లా స్థాయి పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి సపరివారం, స్థానిక అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దర్జాగా వీఐపీ ఘాట్లకు వస్తున్నారు. ఈ విషయమై మీడియా శనివారం ఎస్పీ కె.నారాయణ్నాయక్ దృష్టికి తీసుకుని వెళ్లగా, భక్తులకు ఇబ్బందులు కలిగే ఆంక్షలు విధించరాదని, సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి చెప్పినా క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదనడం గమనార్హం. కనీసం కూర్చునేందుకు.. అనుమతివ్వరు.. పుష్కర స్నానం చేసిన అనంతరం ఓ వృద్ధురాలు అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయం వద్దకు వస్తుంటే.. అలుపు వచ్చి ఆలయం పక్కనే మెట్లపై కూర్చుంది. కనీసం వృద్ధురాలనే జాలి కూడా లేకుండా ఆమెను పోలీసులు పక్కకు పంపిన వైనాన్ని చూసి భక్తులు అయ్యో పాపం అనుకున్నారు. అధికారుల ఆదేశాలతోనే..? పుష్కర ట్రాఫిక్ బందోబస్తులో భాగంగా బారికేడ్ల వద్ద సీఐ స్థాయి అధికారికి విధులు అప్పజెప్పారు. సదరు అధికారి మాత్రం సిబ్బందికి స్పష్టంగా పోలీసు వాహనం మినహా ఎవరినీ లోపలికి వెళ్లనివ్వద్దని చెప్పడంతో సిబ్బంది రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యం బారికేడ్ల వద్ద భక్తులు, ఇతర శాఖల అధికారులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు. -
ఆర్టీసీ పుష్కర సేవలు భేష్!
పాత గుంటూరు: కృష్ణా పుష్కరాల మూడో రోజు ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ పరిధిలో పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉదయం నుంచే బస్సు సర్వీసులను పెంచి భక్తులను పుష్కర ఘాట్లకు చేరవేశారు. వరుస సెలవు దినాలు, ఆదివారం కావడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు, భక్తులు, పాఠశాలల విద్యార్థులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు స్టాఫ్లు కిటకిటలాడాయి. ప్రముఖ ఘాట్లు అమరావతి, సీతానగరంలకు వెళ్లేందుకు యాత్రికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచినట్లు రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. అవసరమైన చోట బస్సుల సంఖ్యను పెంచి యాత్రీకులకు అందుబాటులో ఉంచారు. ఆదివారం మొత్తం 1105 బస్సులతో 9338 ట్రిప్పులను నడిపి 3,26,376 మంది యాత్రికులను జిల్లాలోని వివిధ పుష్కర స్నాన ఘాట్లకు చేరవేసినట్లు తెలిపారు. వీటిలో మొత్తం 4791 ట్రిప్పులు ఉచితంగా నడిపి 1,63,520 మంది యాత్రికులను అమరావతిలోని పుష్కర ఘాట్లకు, ఎయిమ్స్ నుంచి సీతానగరం, మహానాడు స్నానఘట్టాలకు చేరవేసినట్లు వెల్లడించారు. యాత్రికులు ప్రై వేటు వాహనాలను ఆదరించకుండా ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోభివృద్ధికి చేయూతనందించాలని ఆయన కోరారు. -
పుష్కరాలకు ‘డయేరియా’ ముప్పు!
* మూడో రోజులు 604 కేసుల గుర్తింపు * రోజురోజుకు పెరుగుతున్న వైనం * అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్: మీరు కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు వెళ్తున్నారా... అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే పుణ్యం కోసం వెళ్లే పుష్కరాల్లో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా అందజేసిన పుష్కరాల వైద్యశిబిరాల్లో వైద్యం చేయించుకున్న రోగుల వివరాల్లో స్పష్టంగా ధ్రువీకరిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు ఏర్పాటుచేసినన వైద్యశిబిరాల్లో 12వ తేదీ నుంచి 14 వరకు 26,887 మంది వైద్యసేవలను వినియోగించుకున్నారు. నమోదవుతున్న కేసులు ఇవే.. జ్వరాలతో బాధపడుతున్నవారు తొలిరోజు 123 మంది రెండోరోజు 300 మంది, మూడోరోజు ఆదివారం 359 మంది వైద్యసేవలను పొందారు. వివిధ రకాల అలర్జీలతో బాధపడేవారు శుక్రవారం 342 మంది, శనివారం 745 మంది, ఆదివారం 985 మంది, ఆస్తమాతో బాధపడేవారు మూడు రోజులు వరుసగా 118 మంది, 177 మంది, 215 మంది వైద్యసేవలు వినియోగించుకున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొలిరోజు 943 మంది, రెండోరోజు 1774 మంది, మూడోరోజు 1478 మంది, చెవి, ముక్కు, గొంతు, కంటి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం 190 మంది, శనివారం 365 మంది, ఆదివారం 604 మంది చికిత్స చేయించుకున్నారు. పెరిగిన డయేరియా కేసులు.. డయేరియా కేసులు తొలిరోజు 52, రెండోరోజు 104 , మూడోరోజు 604 నమోదయ్యాయి. రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్లోరినేషన్ సక్రమంగా చేయకపోతే నీటి కాలుష్యంతో రోజురోజుకు డయేరియా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు త్వరితగతిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. పలు ఘాట్లలో నీటిని పరిశుభ్రం చేసేందుకు వినియోగించే క్లోరినేషన్ ప్రక్రియ నత్తనడకన జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా, భక్తులు అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు ప్రభలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫుడ్, వాటర్ శాంపిల్స్కు ఆదేశించాం... పుష్కరాల్లో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే భక్తులు తాగాలి. ఆహారం ఎక్కడపడితే అక్కడ తినకుండా నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాల్లోనే తినాలి. అన్ని రకాల వ్యాధులకు 24 గంటలు వైద్యసేవలను అందించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటుచేశాం. - డీఎంహెచ్వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి -
మొబైల్ వ్యాన్లో రైలు టిక్కెట్ల విక్రయం
సీతానగరం (తాడేపల్లి రూరల్): పుష్కరాల సందర్భంగా కృష్ణా తీరానికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా రైల్వేశాఖ మొబైల్ వాహనంలో టికెట్ల విక్రయాలు చేపట్టింది. సీతానగరం పుష్కరఘాట్ సమీపంలోని ఉండవల్లి నాలుగురోడ్ల కూడలి సెంటర్లో వ్యాన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు రైల్వే టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ వ్యాన్ వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు సమీపంలోని కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, మంగళగిరి రైల్వేస్టేషన్ల ద్వారా ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రైల్వేస్టేషన్కు వెళ్లి క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకునే అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉందని పలువురు తెలిపారు. -
ఏదీ ఆ తాకిడి!
* తొలిరోజు స్వల్పంగా భక్తుల రాక * తెల్లవారుజాము నుంచే స్నానాలు * వెలవెలబోయిన క్యూలైన్లు సాక్షి, అమరావతి : అమరావతిలో కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం ఉదయం 5.44 గంటలకు అమరేశ్వరుని ఘాట్లో పూజలు నిర్వహించి, అమరావతిలో పుష్కర స్నానాలను ప్రారంభించారు. ధ్యానబుద్ధ ఘాట్లో కృష్ణవేణి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు చేశారు.తెల్లవారుజామునే పుష్కర స్నానాలు చేయాలన్న ఆక్షాంక్షతో చేరుకున్న భక్తులు కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. మహిళలు కృష్ణమ్మకు సారె, చీరె, పసుపు, కుంకుమ సమర్పించి కృష్ణవేణి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేశారు. తొలిరోజే వెలవెల.. కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో ఘాట్లతో పాటు, ఏర్పాటు చేసిన క్యూలైన్లు వెలవెలబోయాయి. మధ్యాహ్న సమయానికి భక్తులు పూర్తిగా పలుచబడ్డారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు, వరలక్ష్మీ పూజలు నిర్వహిస్తారని అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి. గుంటూరు జిల్లాలోని ఘాట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు తప్ప, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంతంతమాత్రమే. అధికారులు తెల్లవారుజాము నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు ఘాట్ల వద్దనే ఉండి సమీక్షలు చేశారు. శివరాత్రి పర్వదినాల్లో వచ్చే భక్తుల స్థాయిలో కూడా తొలిరోజు భక్తులు కనిపించలేదు. నదిలో నీళ్లు తక్కువగా ఉండటం, ఘాట్ నిర్మాణాలు పూర్తికాకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాతల స్పందన... దారి వెంబడి గ్రామాల ప్రజలు ఉచిత అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు వేడి పాలు, పెద్దలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుష్కర నగర్లలో భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా భక్తులు రాలేదు. దీనికితోడు అమరావతిలో 8 ప్రాంతాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. -
బాల.. కృష్ణం.. కలయ సఖి సుందరం..
-
జలోత్సాహం..
-
ఈతకు వెళ్లి గల్లంతు..
సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు గజ ఈతగాళ్ళతో ఎన్నెస్పీ కాలువలో గాలింపు సత్తెనపల్లి: ఈతకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్కరాజుగార్లపాడ్డు రోడ్డులో నివశిస్తున్న ఆర్టీసీ డ్రై వర్ కె.భజంగరావు, పద్మావతి కుమారుడు కన్నెగంటి చక్రధర్ (27) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర కిందట వివాహమైంది. కృష్ణా పుష్కరాలకు బెంగళూరు నుంచి సత్తెనపల్లి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సమీపంలోని విద్యుత్ ప్లాంట్ వద్ద గల ఎన్నెస్పీ కాలువలో లాకుల వద్ద ఈత కొట్టేందుకు వెళ్లాడు. లాకుల వద్ద 20 అడుగుల పై నే లోతు ఉండే అవకాశం ఉందని భావించిన ఇద్దరు స్నేహితులు దిగేందుకు వెను కాడగా చక్రధర్ ఒక్క సారిగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో చక్రధర్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో హుటాహుటీన తండ్రి భుజంగరావు, బంధువులు, ఆర్టీసీ ఉద్యోగులు సమీప ప్రజలు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి సరఫరాను కొంత ఆపించారు. గజ ఈతగాళంల ద్వారా వెతుకులాటను ప్రారంభించారు. ఒక్కగానొక్క కుమారుడు...అల్లారు ముద్దుగా పెంచుకున్నాం... చేతికి వచ్చే తరణంలో మాకు దేవుడు తీరని వేదన పెట్టాడు అంటూ చక్రధర్ తల్లిదండ్రులు భుజంగరావు, పద్మావతి, భార్య సువర్ణ కన్నీరు మున్నీరయ్యారు. -
విశ్వశాంతి అఖండ బ్రహ్మయజ్ఞం
తంగెడ (దాచేపల్లి) : కృష్ణా నది ఒడ్డున లోక కల్యాణం కోసం,కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరగాలని కోరుతూ తంగెడ సమీపంలోని యాగశాలలో విశ్వశాంతి అఖండ బ్రహ్మ యజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. మహిమగాది గురుపీఠం ఆధ్వర్యంలో సాధు శ్రీధర్దాసు స్వామీజీ పర్యవేక్షణలో 12 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఒరిస్సాకు చెందిన 12 మంది సాధువులు బ్రహ్మ యజ్ఞం (ధుని), అఖండ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు కోగంటి శివన్నారాయణ, మందపాటి రమేష్రెడ్డి, బత్తుల వెంకయ్య, శానంపూడి కష్ణారెడ్డి, నెల్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
దుర్గమ్మ దర్శనానికి రెండు రకాల వీఐపీ పాస్లు
-
పుష్కర ఘాట్లకు అదనపు నీరు
సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి.. 22,500 క్యూసెక్కుల నీరు విడుదల మాచర్ల: కృష్ణా పుష్కరాల సందర్భంగా డెల్టా పరివాహక ప్రాంతంలోని అన్ని పుష్కరఘాట్లలో నీరు ఉంచేందుకుగానూ ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టాకు మరింత నీటిని విడుదల చేయాలని కోరింది. పుష్కరాలు పూర్తయ్యే వరకు మొత్తం 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాలని కోరగా స్పందించిన కృష్ణాబోర్డు డెల్టాకు నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం వరకు 7500 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విడుదల చేస్తుండగా గురువారం సాయంత్రం 4 గంటలకు 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్ఎల్బీసీకు 800, కుడికాలువకు మంచినీటి అవసరాల నిమిత్తం 7069 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్కు జూరాల నుంచి 1,39,291 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం నీటి మట్టం 870 అడుగులకు చేరుకుంది. అయితే పుష్కర సమయంలో సాగర్ రిజ ర్వాయర్ నుంచి, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం విడుదల అవుతున్న నీరు ఘాట్లకు పూర్తిగా లేవని గుర్తించిన ప్రభుత్వం అదనంగా నీటిని డెల్టాకు జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదల చేయాలని కోరడంతో 22504 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఏ ఒక్క పుష్కర ఘాట్కు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం సాగర్ రిజ ర్వాయర్కు శ్రీశైలం నుంచి 73850 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ప్రధాన జల విద్యుత్కేంద్రం, కుడికాలువ, ఎస్ఎల్బీసీలకు 30,373 క్యూసెక్కుల నీటిని ఔట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 507.70 అడుగులు ఉండగా ఇది సుమారు 128 టీఎంసీలకు సమానం. -
పుష్కర అమరావతి
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కర మహోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమరావతిలో ఉన్న రెండు భారీ ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఊహించి అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతి : స్థానిక ధ్యానబుద్ధ ఘాట్, అమరేశ్వరఘాట్లలో భక్తులకు క్యూలైన్లు, హైమాస్ట్ లైట్లు, కష్ణవేణి మాత విగ్రహం ఏర్పాటు చేశారు. ఘాట్లన్నీ అగ్నిమాపక సిబ్బంది శుభ్రంగా కడిగివేశారు. ఈఘాట్లో మూడు వైద్యశిబిరాలను, సంచార వైద్యశాలలను, అంబులెన్స్ సౌకర్యం ఆరోగ్యశాఖ ర్పాటు చేసింది. అతిథి గృహంలో పోలీస్ కంట్రోల్రూం.. ధ్యానబుద్ధ విగ్రహం పక్కను ఉన్న పర్యాటక శాఖ అతిథిగహంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఊర్పాటు చేశారు. ఇక్కడ అన్ని శాఖల ఉన్నదాధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కసి చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మూడు పిండ ప్రధాన షెడ్లు.. మూడు పిండ ప్రధాన షెడ్లు వేయటం ద్వారా భక్తులు ప్రత్యేకంగా పిండ ప్రధానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. దేవాలయంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు వేసి స్వామివారి అంత్రాలయ ద్వారానికి బంగారు రేకులతో తాపడం చేయించారు. ప్రతిరోజూ హారతికి ఏర్పాట్లు.. ప్రతిరోజు కృష్ణానదికి హారతులు ఇచ్చేందుకు దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. ఇంకా చిన్న చిన్న లోపాలను అన్ని శాఖల ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించి ఈరోజు రాత్రికి సరిచేస్తారని అధికారులు తెలిపారు. వైకుంఠపురంలో.. వైష్ణవ క్షేత్రంలో పుష్కరాల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక్కడ ఉత్తరవాహని ఘాట్లో సుమారు వందమీటర్ల సిమెంటు రోడ్డుతో పాటుగా 50 మీటర్ల ఘాట్ నిర్మాణం చేశారు. ఇక్కడ గురువారం నాడుకూడా పనులు చేయటం విశేషం. ఘాట్ వద్ద రోడ్డుపై మట్టి, బురద గురువారం సాయంత్రం వరకు శుభ్రం చేయలేదు. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో జరుగలేదు. కొండకిద ఆలయానికి రంగులు వేసి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. -
పెనుమూడి రేవుకు పుష్కర శోభ
రేపల్లె: పెనుమూడి రేవు పుష్కరశోభ సంతరించుకొంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరఘాట్ పనులను ప్రధానంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. పుష్కరఘాట్కు వచ్చే రహదారుల నిర్మాణాలను కాంట్రాక్టర్లు నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో డస్ట్వేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులకు కొత్త సమస్య ఎదురైంది. పుష్కరాలకు కృష్ణానది నీరు రాదని రూడీకావటంతో సముద్రపు పోటునీటిని తుంపర్ల స్నానాన్ని భక్తులకు అందించేందుకు పైపులైన్లు వేసేపనిలో నిమగ్నమయ్యారు. ఘాట్ వద్ద పూర్తిస్థాయిలో లైటింగ్ పనులు కూడా పూర్తికాకపోవటంపై ఉన్నతస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోరుమెదపలేని అధికారులు.. పుష్కరాలకు సంబంధించిన పనుల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవతారం ఎత్తడంతో అధికారులు పనులు చేయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పనులు శరవేగంగా జరగకపోగా నాణ్యతాలోపాలు కనిపిస్తున్నా అధికారులు నోరుమెదపలేని స్థితిలో కొనసాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు పుష్కర భక్తులకు అరకొర సౌకర్యాలతో మమ అనిపించే దిశగా ముందుకు సాగుతున్నారు. -
జల విహారానికి బోటు సిద్ధం
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): కృష్ణానదిలో ప్రజలు జలవిహారం చేసేందుకు ‘తన్వి క్రూజ్’ బోటును గురువారం ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఛాంపియన్ సంస్థ ఈ బోటును ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రానున్న భక్తులకు సేవలు అందించేందుకు శుక్రవారం నుంచే దీన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ బోటు కృష్ణానది అందాలను చూపిస్తూ విహార యాత్ర కొనసాగుతుందని, ఒకేసారి 300 మంది ప్రయాణించవచ్చని వివరించారు. టిక్కెట్టు ధర రూ.500 అని తెలిపారు. -
పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు
గుంటూరు (నగరంపాలెం) : పుష్కర ఘాట్లకు విద్యుత్ సొబగులు అద్దుతున్నారు. ఘాట్లలో నిరంతరం విద్యుత్ వెలుగులు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. తెల్లవారజాము నుంచి అర్ధరాత్రి వరకు పుష్కర స్నానాలు నిరంతరం కొనసాగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. లైటింగ్ ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను విద్యుత్ శాఖకే అప్పగించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు, పుష్కరనగర్లలో 8000 కిలోవాట్ సామర్ధ్యం ఉన్న విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1000 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలు, 500 వాట్ సామర్ధ్యం ఉన్న 1,500 దీపాలతో పాటు ఏ1, ఏ క్యాటగిరీ ఘాట్లు, పుష్కరనగర్లలో 35 హైమాస్ట్ లైటింగ్ టవర్లు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా జిల్లాలోని స్నాన ఘాట్లు, పుష్కరనగర్ల వద్ద విద్యుత్ సరఫరాకు 72.95 కిమీ 11 కెవీ కవర్డు కండక్టరును వినియోగించారు. ఏ1, ఏ పుష్కర ఘాట్ల వద్ద ఏడీఈస్థాయి అధికారి, బీ, సీ ఘాట్లకు ఏఈస్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సిబ్బంది సిద్ధం.. ఘాట్ల వద్ద 549 మంది, పుష్కరనగర్ల వద్ద 188 మంది బ్రేక్ డౌన్ సర్వీసులు సరిచేయటానికి 386 మందితో 43 క్విక్ రెస్పాన్స్ టీంలకు మూడు షిఫ్టులుగా విధులు కేటాయించారు. సిబ్బంది పనితీరు పర్యవేక్షించటానికి ఇద్దరు ఏడీఈలపై ఒక డీఈని, నలుగురు ఏడీఈలకు ఒక ఏడీఈని నియమించారు. జిల్లా ఎస్ఈ బి జయభారతరావుతోపాటు డిస్కం కార్యాలయం నుంచి చీఫ్ ఇంజనీరు బి. సంగీతరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు జి. నాగశయనరావు, డీఈ సీఏ ఆర్మ్స్ట్రాంగ్ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి ఏ1, ఏ ఘాట్లకు విద్యుత్ సరఫరా కోసం 40 జనరేటర్లు సిద్ధం చేశారు. జిల్లాలో అమరావతి, పెనుమూడి, సత్రశాల, మందడం, వీపీసౌత్లలో మెటీరియల్తో కూడిన కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విద్యుత్ సిబ్బందితో నిరంతర కమ్యూనికేషన్ కోసం 100 వైర్లెస్ సెట్లు వినియోగించనున్నారు. విద్యుత్ సిబ్బందిని వెంటనే గుర్తుపట్టే విధంగా ప్రత్యేక యూనిఫాంతో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి రక్షణ నిమిత్తం చేతి తొడుగులతో పాటు కటింVŠ Sప్లేయర్లు, ఇన్స్లేషన్ టేప్లతో సహా పూర్తి కిట్ బాక్స్ను అందిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం.. యాత్రికులకు నిరంతరం సేవలు అందించడానికి జిల్లా కార్యాలయంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. ఈ కంట్రోల్ రూం నుంచి సహాయం, సమాచారం పొందాల్సిన వారు 9440817526 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. ఘాట్లకు, పుష్కరనగర్లకు విద్యుత్ సరఫరా చేసే స»Œ æస్టేçÙన్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఆల్ట్రానేటివ్ లైన్లు కూడా అందుబాటులో ఉంచాం. – బి.జయభారతరావు, ఎస్ఈ వైర్లెస్ సెట్లతో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది ఎస్ఈ బి. జయభారతరావు వెల్లడి -
రద్దీకి అనుగుణంగా ‘రైల్వే’ సేవలు
గుంటూరు (నగరంపాలెం) : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీకి అనుగుణంగా గుంటూరు రైల్వే డివిజన్లో అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ విజయశర్మ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని వీఐపీ లాంజ్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 11 నుంచి 23 వరకు డివిజన్ మీదుగా 73 రిజర్వ్డ్ క్లాస్, 72 అన్ రిజర్వ్డ్ క్లాస్ రైళ్ళు మొత్తం 145 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నామన్నారు. డివిజన్ పరిధిలోని 26 రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్ళకు రెండు, ప్యాసింజర్ రైళ్ళకు 936 అదనపు బోగీలు ఏర్పాటు చేశామనిచెప్పారు. కృష్ణా నది సమీప ప్రాంతాల్లోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడు, గుంటూరు, మంగళగిరి, రేపల్లె రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్ళకు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటానికి బాత్ రూమ్స్, మంచి నీటి పంపులు, క్లోక్ రూంలు, పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా రెస్ట్ రూంలు, ప్రధమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ టిక్కెట్ వాహనం, అదనపు బుకింగ్ కౌంటర్లు సాధారణ టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించటానికి డివిజన్లో మొదటిసారిగా స్నానఘాట్లు, పుష్కరనగర్ల వద్ద అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు జారీ చేయటానికి రెండు బుకింగ్ కౌంటర్లు కలిగిన మొబైల్ వాహనం సిద్ధం చేశామని తెలిపారు. పుష్కర రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వే పోలీసులు సమన్వయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని వివరించారు. యాత్రికులు రైల్వే శాఖ కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. ఏడీఆర్ఎం వినయ్ అంబాడే, సీనియర్ డీసీఎం కె ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
పుష్కరాల్లో ఆరోగ్యం జాగ్రత్త!
డీఎంహెచ్ డాక్టర్ పద్మజారాణి కరపత్రాలు ఆవిష్కరణ గుంటూరు మెడికల్ : జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. పుష్కర యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రూపొందించిన కరపత్రాన్ని గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, ఫిట్స్, శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలతో బాధపడేవారు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయరాదని, పవిత్ర కృష్ణా జలంలో ఏ విధమైన వ్యర్థాలు, మల మూత్రాలు విసర్జించరాదని స్పష్టం చేశారు. భక్తులకు మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచినీటి కేంద్రాలు ఏర్పాటుచేశారని, అక్కడ అందించే పరిశుభ్రమైన నీటిని కాని, కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనారోగ్యం ఏదైనా వస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేశామని, అక్కడకు వైద్య సహాయం కోసం వెళ్లాలని తెలిపారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పారు. ఆహారం కోసం నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలన్నారు. ఆహార పదార్ధాలు తీసుకునే ముందు ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒకవేళ నీటిలో మునిగితే వెంటనే అతడిని నీటి నుంచి బయటకు తెచ్చి బోర్లా పడుకోబెట్టి, మింగిన నీటిని బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. కృత్రిమశ్వాస అందించి సత్వరమే సమీపంలోని చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లడం లేదా 108 ఉచిత అంబులెన్స్కు ఫోన్ చేయాలని, ఎవరికైనా ప్రమాదవశాత్తు గాయాలు, ఎముకలు విరిగితే సమీపంలోని వైద్య చికిత్స కేంద్రానికి తీసుకెళ్లాలని డాక్టర్ పద్మజారాణి తెలిపారు. -
పుష్కరాల్లో ఆరోగ్యం జాగ్రత్త!
డీఎంహెచ్ డాక్టర్ పద్మజారాణి కరపత్రాలు ఆవిష్కరణ గుంటూరు మెడికల్ : జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. పుష్కర యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రూపొందించిన కరపత్రాన్ని గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, ఫిట్స్, శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలతో బాధపడేవారు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయరాదని, పవిత్ర కృష్ణా జలంలో ఏ విధమైన వ్యర్థాలు, మల మూత్రాలు విసర్జించరాదని స్పష్టం చేశారు. భక్తులకు మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచినీటి కేంద్రాలు ఏర్పాటుచేశారని, అక్కడ అందించే పరిశుభ్రమైన నీటిని కాని, కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనారోగ్యం ఏదైనా వస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేశామని, అక్కడకు వైద్య సహాయం కోసం వెళ్లాలని తెలిపారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పారు. ఆహారం కోసం నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలన్నారు. ఆహార పదార్ధాలు తీసుకునే ముందు ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒకవేళ నీటిలో మునిగితే వెంటనే అతడిని నీటి నుంచి బయటకు తెచ్చి బోర్లా పడుకోబెట్టి, మింగిన నీటిని బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. కృత్రిమశ్వాస అందించి సత్వరమే సమీపంలోని చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లడం లేదా 108 ఉచిత అంబులెన్స్కు ఫోన్ చేయాలని, ఎవరికైనా ప్రమాదవశాత్తు గాయాలు, ఎముకలు విరిగితే సమీపంలోని వైద్య చికిత్స కేంద్రానికి తీసుకెళ్లాలని డాక్టర్ పద్మజారాణి తెలిపారు. -
పుష్కరాల్లో ఆరోగ్యం జాగ్రత్త!
డీఎంహెచ్ డాక్టర్ పద్మజారాణి కరపత్రాలు ఆవిష్కరణ గుంటూరు మెడికల్ : జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. పుష్కర యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రూపొందించిన కరపత్రాన్ని గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, ఫిట్స్, శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలతో బాధపడేవారు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయరాదని, పవిత్ర కృష్ణా జలంలో ఏ విధమైన వ్యర్థాలు, మల మూత్రాలు విసర్జించరాదని స్పష్టం చేశారు. భక్తులకు మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచినీటి కేంద్రాలు ఏర్పాటుచేశారని, అక్కడ అందించే పరిశుభ్రమైన నీటిని కాని, కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనారోగ్యం ఏదైనా వస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేశామని, అక్కడకు వైద్య సహాయం కోసం వెళ్లాలని తెలిపారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పారు. ఆహారం కోసం నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలన్నారు. ఆహార పదార్ధాలు తీసుకునే ముందు ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒకవేళ నీటిలో మునిగితే వెంటనే అతడిని నీటి నుంచి బయటకు తెచ్చి బోర్లా పడుకోబెట్టి, మింగిన నీటిని బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. -
పుష్కరాలకు సకల సౌకర్యాలు
-
పుష్కరాలకు సకల సౌకర్యాలు
నెహ్రూనగర్: పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పుష్కర్నగర్ వద్ద సకల సౌకర్యాలతో కూడిన సదుపాయాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్నగర్లో ఏర్పాట్ల పై విలేకర్లతో మాట్లాడారు.యాత్రికులకు షెడ్లు ఏర్పాటు చేశామని, సదరు షెడ్లలో రోజుకు 10 వేల మంది యాత్రికులు సేద తీరవచ్చన్నారు.. యాత్రికులు సౌకర్యార్థం పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. రోజు 10 వేల మందికి భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంబులెన్స్ సదుపాయం, మెడికల్ షాపులు, క్లాక్ రూం, యాత్రికులకు అవసరమైన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వినోదం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. పుష్కర్ నగర్ నుంచి అమరవాతికి, పవిత్ర సంగమం వద్దకు కూడా బస్సులు ఏర్పాటు చేశామని, బస్సులే కాక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులందరికీ సకల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. -
అయ్యో..! బస్సులొస్తున్నాయ్.. పోతున్నాయ్..
-
ఘాట్ల వద్దే రైల్వే టికెట్లు
విజయవాడ : పుష్కరస్నానం ఆచరించిన అనంతరం యాత్రికులకు ఘాట్ల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్లు జారీ చేయనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. క్రిస్ అప్రూవ్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో ఘాట్ల వద్దే రైల్వే టికెట్ల జారీకిS 40 యూనిట్లతో విజన్టెక్ సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. తన ఛాంబరులో బుధవారం కంపెనీ అధికారులతో టికెట్ల జారీపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లవద్దే టికెట్లు ఈయడం ద్వారా యాత్రికులు అనుకన్న సమయంలో తిరుగు ప్రయాణాన్ని చేయగలుగుతారన్నారు. సంబంధిత టికెట్లు జారీ చేసే బృందం వివిధ రూట్లలో అందుబాటులో ఉన్న రైళ్ళ వివరాలను అందించాలన్నారు. ఈసందర్భంగా విజన్టెక్ ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారికంగా జారీ చేసే రైల్వే టికెట్పై ప్రయాణ ప్రాంతం వివరాలను ముద్రించి అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్చందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా టెకెట్ల జారీకి ముందుకు వచ్చామన్నారు. -
పుష్కర వేడుకలకు సంసిద్ధం
-
ఒక్కో వర్ణం.. బుద్ధుని తనువుపై పులకించి..
-
బెటాలియన్కు చేరుకున్న పోలీసులు
మంగళగిరి: పుష్కరాలలో విధులు నిర్వహించేందుకు పోలీస్ బలగాలు బుధవారం పట్టణంలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్కు చేరుకున్నాయి. ఛత్తీస్గఢ్,మహారాష్ట్రలతో పాటు పలు ఏపీఎస్పీ బెటాలియన్స్ నుంచి పోలీసులు చేరుకున్నారు. సుమారు మూడువేల మందికి బెటాలియన్లో వసతి కల్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సిబ్బంది బెటాలియన్లోని కల్యాణ మండపంతో పాటు ఇతర క్వార్టర్స్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా తాగునీరు, భోజన వసతులతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు బెటాలియన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
30 పోలీస్ యాక్టు అమలు
గుంటూరు, (పట్నంబజారు): పుష్కరాలను పురష్కరించుకుని అర్బన్ జిల్లా పరిధిలో గురువారం నుంచి 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. యాక్ట్ ప్రకారం రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు వంటివి నిర్వహించేందుకు అనుమతి ఉండదన్నారు. ఏదైనా నిర్వహించాలంటే తప్పనిసరిగా చట్టప్రకారం పోలీసులను అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పుష్కరాల్లో భాగంగా ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే డయల్ 100కు గానీ, దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్లో గానీ సమాచారాన్ని అందించాలని సూచించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని అనుమానితులు, నేరస్తులు, బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. -
తుదిదశలో పుష్కర ఏర్పాట్లు
తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు సందర్శనార్థం ఎనిమిది నమూనా దేవాలయాలు పుష్కరనగర్లలో షెడ్ల ఏర్పాటు అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కరాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం పుష్కరాలు ప్రారంభం కానుండగా ధ్యానబుద్ధ ఘాట్లో కాంక్రీట్పనులతో పాటు టైల్స్ వేయటం కూడా పూర్తిచేశారు. ధ్యానబుద్ధునికి ప్రత్యేకంగా విద్యుత్ లైటింగ్తో అలంకరణ చేశారు. ఘాట్లో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకంగా కూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు లోతుకు వెళ్లకుండా ప్రత్యేకంగా మెష్ ఏర్పాటు చేశారు. ఈఘాట్లోనే కొంత భాగాన్ని వీఐపీ ఘాట్గా చేశారు. భక్తులు పుష్కరస్నానం చేశాక వివిధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఎనిమిది నమూనా దేవాలయాలు దాదాపుగా పూర్తయ్యాయి. తిరుపతి, అయినవెల్లి, నెమలి, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గదేవాలయం, కాణిపాకం, సింహాచలం, ఒంటిమిట్ట దేవాలయాల నమూనాలను నిర్మించారు. అమరేశ్వర దేవస్థానం వద్ద... అమరేశ్వర దేవస్థానం వద్ద ఘాట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈఘాట్లో తాత్కాలిక మరుగుదొడ్లు, పిండ ప్రధాన షెడ్లు వేశారు, అమరేశ్వరాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయంలో క్యూలైన్లు, సమాచార బోర్డులు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ, సత్తెనపల్లి రోడ్లలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్లలో 3000మందికి సరిపడా షెడ్లు, గుంటూరు రోడ్డులోని పుష్కరనగర్లో 10వేల మందికి సరిపడా షెడ్లు వేశారు. ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రవిసర్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల తాగునీటి కోసం ప్రత్యేకంగా బోర్లు వేసి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రసిద్ధమెన వంటకాలతో పర్యాటక శాఖ నిర్వహించే ఆహార ప్రదర్శనశాలకు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటుకు షెడ్లు సిద్ధం చేశారు. ఘాట్లలో, మెయిన్ రోడ్లలో విద్యుత్ లైట్లను, మెయిన్ రోడ్డులో డివైడర్పై రంగురంగు విద్యుత్ బల్పులను, ఘాట్లలో హైమాస్ట్ లైట్లు అమర్చారు. గురువారం పుష్కరఘాట్లను అగ్నిమాపకశాఖ వారిచే శుభ్రం చేయించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కర సేవలకు ‘రెడ్క్రాస్’ సిద్ధం
గుంటూరు ఈస్ట్ : కృష్ణా పుష్కరాల్లో సేవలు అందించేందుకు రెడ్క్రాస్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ చైర్మన్, విశ్రాంత జస్టిస్ అంబటి లక్ష్మణరావు తెలిపారు. హిందూ కళాశాల ఏడీ హాల్లో రెడ్ క్రాస్ కార్యకర్తలకు పుష్కర సేవా కార్యక్రమాల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో అమరావతి, సీతానగరంలలో క్యాంపులు నిర్వహించి 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. పెనుమూడి వారధి, విజయపురి సౌత్లలోను పుష్కర సేవలు అందిస్తారన్నారు. జిల్లా కార్యదర్శి జీవీఎన్ బాబు మాట్లాడుతూ కార్యకర్తలు పుష్కర యాత్రికులతో సేవాభావంతో మెలగాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1,500 మంది కార్యకర్తలు 12 రోజులు 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. తొలుత కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యులు ఎంవీ ఉదయ్కుమార్, జిల్లా చైర్మన్ వడ్లమాను రవి, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ పాల్గొన్నారు. -
పుష్కర వేళ.. వసూళ్ల పర్వం
పుష్కర భక్తుల సౌకర్యాల కోసం అంటూ అధికార పార్టీ నేతల వసూళ్లు సమావేశాలు పెట్టి మరీ స్పష్టమైన ఆదేశాలు అధికారులకూ టార్గెట్లు పుష్కరాల పేరు చెప్పి.. అధికార పార్టీ నేతలు అక్రమ వసూళ్లకు తెరతీశారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంఘాలు, అసోసియేషన్లు, మద్యం దుకాణాలు, రేషన్ షాపులు.. ఎవ్వరినీ వదలటం లేదు. వసూలు చేసిన సొమ్ముకు లెక్కలూ చూపటం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్య నేత తనయుడు, పలువురు ముఖ్య నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. సాక్షి, గుంటూరు : కాదేదీ కలెక్షన్కు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. పవిత్రమైన పుష్కరాల పనుల కోసం విడుదల చేసిన నిధులను ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్ల రూపంలో కొల్లగొట్టిన నేతలు తాజాగా భక్తులకు సేవా కార్యక్రమాల పేరుతో వసూళ్లకు తెర తీశారు. ఈ నెల 12 నుంచి జిల్లావ్యాప్తంగా జరగనున్న పుష్కరాలకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. వారి సౌకర్యార్థం అంటూ వ్యాపారులతో పాటు పలు వాణిజ్య సముదాయాలకు, అసోసియేషన్లకు అధికార పార్టీ నేతలు ఇండెంట్లు వేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా స్వచ్ఛందంగా భక్తులకు సహాయసహకారాలు అందించాలనుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ వ్యాపార, వర్తక సంఘాలతో పాటు పలు అసోసియేషన్ నేతలను పిలిచి సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు విధిస్తున్నారు. తమ అసోసియేషన్ తరఫున ఫలానా కార్యక్రమం చేపడుతున్నామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఒప్పుకోకుండా తమకే డబ్బు పంపాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం.. సాటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో తాము డబ్బు ఖర్చు చేద్దామని భావిస్తుంటే .. అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఒత్తిళ్లు చేయటంపై స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి మాటకు ఎదురుచెబితే తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిస్తారనే భయంతో మిన్నకుంటున్నారు. జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే, ఓ ముఖ్యనేత తనయుడు, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని అధికార పార్టీ ముఖ్య నేతలంతా దౌర్జన్యంగా కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్.. అంతటితో ఆగక ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించి మద్యం దుకాణాలు, రేషన్ డీలర్లు, పెట్రోలు బంకులు, కిరోసిన్ హాకర్లు.. ఇలా పలు వర్గాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయా శాఖలకు చెందిన అధికారులు నేరుగా వారికి ఫోన్లు చేసి ఈ నెల 11వ తేదీ సాయంత్రం కల్లా డబ్బులు అధికార పార్టీ ముఖ్య నేతలకు చేర్చాలని హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి కొందరు కింది స్థాయి అధికారులు అందులో కొంత మొత్తం తమకు పంపాలంటూ బెదిరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక అంతా తలలు పట్టుకుంటున్నారు. లెక్కా పత్రం లేకుండా వసూళ్లు.. పుష్కర యాత్రికులకు అన్నదానం, వసతి సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాల కల్పనకు అంటూ చేస్తున్న ఈ వసూళ్లకు లెక్కలు చూపే పరిస్థితే లేదు. ఎవరెవరి నుంచి ఎంతెంత సొమ్ము అందినదీ.. వాటిని ఏయే సౌకర్యాల కల్పనకు ఉపయోగిస్తారు.. అనే సమాచారం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దాతలు తాము అందజేస్తున్న సొమ్ముతో ఎంతమందికి సదుపాయాలు అందిస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. -
కృష్ణమ్మకు అడ్డుకట్ట
కనకదుర్గ వారధి వద్ద నదిలో క్రాస్బండ్ నిర్మాణం దిగువకు నీరు ప్రవహించకుండా ఏర్పాట్లు విజయవాడలో నీరు పుష్కలంగా చూపేందుకు యత్నం సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాలు దగ్గరకొచ్చేశాయి. కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. అయితే పవిత్ర పుష్కర స్నానానికి భంగం వాటిల్లేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పులిచింతల నుంచి బ్యారేజీకి విడుదల చేస్తున్న నీరు తక్కువగా ఉంది. ఆ నీటిని బ్యారేజీ వద్ద జలకళ ఉట్టిపడేలా చేయటం కోసం కిందికి వదలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందకుగాను కనకదుర్గ వారధి వద్ద అధికారులు క్రాస్బండ్ నిర్మిస్తున్నారు. నదిలో నీటిమట్టం పెరిగే క్రమంలో అడ్డుకట్ట వేయడం అనాలోచిత చర్యని భక్తులు పేర్కొంటున్నారు. నీరు ఉందని చూపేందుకే.. కృష్ణానదిలో పవిత్ర స్నానాలకు ఆశించినస్థాయిలో నీరు కనిపించడం లేదనే ఉద్దేశంతోనే అడ్డుకట్ట నిర్మిస్తున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అడ్డుకట్ట కారణంగా విజయవాడ పరిధిలోని ఘాట్లు నీటితో కళకళలాడుతాయని వారు భావిస్తున్నారు. పుష్కరాలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 153 పుష్కర ఘాట్లు సిద్ధమవుతున్నాయి. 12 రోజులపాటు జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాల కోసం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సరిపడా నీటిని నిల్వ చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలుషిత నీటిలో స్నానాలు ఎలా? ప్రభుత్వ చర్యతో పవిత్ర స్నానానికి భంగం వాటిల్లే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. నదిలో నీరు ప్రవహిస్తుంటే అందులో స్నానం చేయడం అనారోగ్యకరమని, అడ్డుకట్ట వేస్తే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ వద్ద రోజుకు 3 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉంది. మొదటి సారి స్నానం చేసే భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకపోయినా.. ఆ తరువాత పవిత్ర స్నానాలు చేయదలచిన భక్తులు మాత్రం కలుషిత నీటిలోనే చేయాల్సి ఉంటుంది. కలుషిత నీటిలో స్నానాలు చేసిన భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కింది భాగంలో ఉన్న ఘాట్లకు నీరెలా? ప్రకాశం బ్యారేజీ కింది భాగంలో ఉన్న కృష్ణా, సీతానగరం ఘాట్ కాకుండా సుమారు 30 పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్ల వద్ద రోజుకు కనీసం అంటే 50 వేల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసే అవకాశం ఉందిని అధికారుల అంచనా. కనకదుర్గ వారధి వద్ద నీటికి అడ్డుకట్ట వేయటంతో కింది భాగంలో ఉన్న 30 ఘాట్లకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. నీరు లేకుంటే ఆ ఘాట్లకు వెళ్లే భక్తుల పవిత్ర స్నానాలు ప్రశ్నార్థకంగా మారతాయి. అలాంటప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఘాట్లు ఏర్పాటు చేయటం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..!
సాక్షి, అమరావతి: జిల్లాలో ఘాట్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అనుపు ఘాట్ నిర్మాణ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్ స్తంభాలు నీళ్లు వస్తే ఏక్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉంది. పొందుగలో ఘాట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే నదిలో స్నానాలు చేసే దగ్గరే మురుగు, చెత్త వేశారు. అమరావతిలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల వద్ద 50 శాతం పనులు కూడా ప Nర్తికాని పరిస్థితి నెలకొంది. కాంక్రీట్, లైటింగ్ పనులు సాగుతున్నాయి. మొత్తం 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ ఉంది. అయితే ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో ధ్యానబుద్ద, అమరావతి ఘాట్లను కలుపకుండానే పనులు నిలిపివేశారు. అసంపూర్తిగా పుష్కర ఘాట్ల పనులు గడువు దాటిపోయినా సా..గుతున్న వైనం -
ఉచితంగా బస్సులు నడపండి
జిల్లా ఉపరవాణా కమిషనరు రాజారత్నం పుష్కరాలకు రవాణాశాఖ ఏర్పాట్లు నగరంపాలెం: జిల్లాలో ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణ పుష్కరాలకు జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థలు పుష్కర యాత్రికుల సౌకర్యార్ధం తమ బస్సులను ఉచితంగా నడపాలని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజారత్నం కోరారు. సోమవారం స్వర్ణభారతినగర్లోని ఆర్టిఏ కార్యాలయంలో ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల కోసం స్కూల్ బస్సులను 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రవాణా శాఖ ఆధీనంలో ఉంచాలని కోరారు. ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వాణిశ్రీ మాట్లాడుతూ పుష్కరాలకు ఆర్టీసీ వారు నడపలేని ప్రాం తాల్లో 120 చిన్న బస్సులను నడపాలని కోరారు. ఈ రూట్లలో 300 స్కూలు, ప్రైవేటు బస్సులు 2800 సర్వీసులు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు. ఈ బస్సులన్నీ పుష్కరనగర్ నుంచి స్నానఘాట్ వరకు నడుస్తాయన్నారు. ఇవే కాకుండా ఆర్టీసీ వారు జిల్లాలోని 14 పుష్కరఘాట్ నుంచి 473 బస్సులను 2549 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంవీఐ ఉమామహేశ్వరరావు, ఏవో కరీం, ఏఎంవీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బస సరే.. మరి భోజనం ?
స్నానాల పరిస్థితి ఏమిటి ? తలలు పట్టుకుంటున్న అధికారులు తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కర విధులకు విచ్చేసే అధికారులకు బస ఏర్పాటు చేయడానికి యంత్రాంగం పలు పాఠశాలలు, సత్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారు 300 మంది సిబ్బంది బస చేయనున్నారు. అధికారులు మొక్కుబడిగా పాఠశాలలు అప్పజెప్పారు కానీ, అందులో బస చేసే ఉద్యోగులకు స్నానాలు, టాయ్లెట్లు, ఆహారం వంటి అంశాలలో ఇప్పటికీ ఏర్పాట్లు చేయలేదు. 300 మంది ఉద్యోగులకు స్నానాలకు అవసరమైన నీరు, టాయ్లెట్లు లేని పాఠశాలలు, సత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 300 మంది ఉంటే మొత్తం విధులు నిర్వర్తించే సుమారు 5 వేల మంది ఉద్యోగులకు నీటి వసతికి తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయలేదు. భోజన సదుపాయం ఒక చోట, వసతి మరో చోట కావడంతో విధులు నిర్వహించిన అనంతరం వసతి గహంలో ఉంటే భోజనానికి అక్కడకు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లాల్సి ఉంది. పుష్కరఘాట్లలో విధులు నిర్వహించి, మరలా భోజనం కోసం అంతదూరం వెళ్లాలంటే ఎలా అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పురుషులు అయితే ఏదో విధంగా వసతి గహాల్లో కాలకత్యాలు తీర్చుకుని, స్నానం చేయగలరు. మరి మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏమిటో అర్థంకాక సతమతమవుతున్నారు. ఒకరోజు రెండు రోజులైతే ఏదో విధంగా సరిపెట్టుకుంటారు. 12 రోజులు ఎలా అని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప వచ్చే భక్తులకు, ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీతానగరం (తాడేపల్లి రూరల్) : రానున్న పుష్కరాలకు సర్వం సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం అహర్నిశలూ కష్టపడుతోందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ పార్కును పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా 72 ఘాట్ల నిర్మాణం పూర్తయిందని, వీటిని ఏ, బీ, సీ, డీ ఘాట్లుగా గుర్తించామన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అమరావతి, ధరణికోట, తాళ్లాయపాలెం, సీతానగరం, పెనుమూడి ఘాట్లకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా అని, గుంటూరు నగర శివారులో లక్ష మంది భక్తులకు వసతి కోసం గోరంట్ల రోడ్డులో ఒకటి, విజయవాడ రోడ్డులో మరొకటి పుష్కర నగర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. దీనికి అనుసంధానంగా ప్రతి పుష్కరఘాట్కు సమీపంలో ఐదారు పుష్కర నగర్లు ఏర్పాటు చేసి 25 వేల మందికి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు పుష్కర నగర్ నుంచి ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి రుసుం వసూలు చేయకుండా ప్రయాణం చేసే విధంగా వసతులు కల్పించినట్టు వివరించారు. -
పుష్కరాలకు కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణా పరీవాహక ఘాట్లకు నీటి విడుదల ఆరు టీఎంసీలు.. వారం పాటు కొనసాగే అవకాశం మాచర్ల: కృష్ణా బోర్డు ఉత్తర్వులతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాగర్ రిజర్వాయర్ నుంచి సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 3844 క్యూసెక్కుల నీటిని డెల్టాలోని పరీవాహక ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతమైన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి రెండు వైపులా పుష్కరఘాట్లకు నీరు అందుతోంది. తీరిన నీటి సమస్య.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు జూరాల నుంచి వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్కు రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతుండటం, మూడు రోజుల్లో పుష్కరాలు ప్రారంభమతున్నందున డెల్టాకు 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీనికి స్పందించిన బోర్డు 6 టీఎంసీల నీటిని సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టాకు నీటి విడుదల వారం రోజులకు పైగా కొనసాగే అవకాశం ఉండటంతో డెల్టా ప్రాంత పరిధిలోని రెండు వైపులా పుష్కరఘాట్లకు నీటి సమస్య పరిష్కారమైంది. భక్తులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆల్మటి నుంచి అన్ని ప్రాజెక్టులకు నీరు చేరి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరుకోవడంతో పుష్కరఘాట్లకు నీటి సమస్య లేకుండా సాగర్ రిజర్వాయర్ నుంచి డెల్టా ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 509 అడుగులకు చేరింది. ఇది 124 టీఎంసీలకు సమానం. -
పుష్కరాలకు సన్నద్ధంకండి!
అధికారులకు కలెక్టర్ ఆదేశం పనుల పెండింగ్పై ఆగ్రహం సాక్షి, అమరావతి: పుష్కర పనుల తీరుపై కలెక్టర్ కాంతిలాల దండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి అధికారులతో గుంటూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. పుష్కర విధుల్లో పాల్గొనే ఉద్యోగుల గుర్తింపు కార్డులు వెంటనే తయారు చేయాలన్నారు. ఘాట్ల లేటెస్టు ఫొటోలను వెబ్సైట్లో పొందు పరచాలని ఆదేశించారు. పుష్కరాల కరదీపక కోసం అన్ని శాఖలు సమాచారం ఇవ్వాలన్నారు. ఫుష్కర నగర్ల నుంచి ఘాట్ల వద్దకు భక్తులను చేర వేసేందుకు వీలుగా జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పుష్కర పూజా సామగ్రి కిట్ల విషయమై చర్చించారు. సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, పెదకూరపాడు, రైల్వే స్టేషన్ల నుంచి బస్సులను ఘాట్ల వద్దకు ఎక్కువ సంఖ్యలో నడపాలని చెప్పారు. మెడికల్, శానిటేషన్, తాగునీరు ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రేపల్లె ఘాట్లో జల్లు స్నానాలు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఘాట్లకు వెళే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
పుష్కరాలకు 1,500 మంది వైద్యసేవలు
24 గంటలు అందుబాటులో వైద్య సేవలు డీఎంహెచ్వో డాక్టర్ పద్మజారాణి గుంటూరు మెడికల్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వైద్య సేవలను అందించేందుకు 1,500 మంది వైద్యులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఆమె విలేకరికి వివరించారు. సుమారు 5 లక్షల మంది వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, ఇతర అత్యవసర, ప్రాణాపాయ వైద్య సేవలకు సంబంధించిన అన్ని రకాల మందులను ఘాట్లలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల వద్ద సిద్ధంగా ఉంచారన్నారు. సుమారు 110 రకాల మందులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. మరో 30 రకాల మందులు రెండు రోజుల్లో వస్తాయన్నారు. ట్రాలీ స్ట్రెక్చర్లు 75, ఫోల్డింగ్ వీల్ చైర్లు 150, సాధారణ వీల్ చైర్లు 50, ఐరన్ కాట్లు 150, నెబిలైజర్లు 150, పల్స్ ఆక్సీమీటర్లు 150, సెలైన్ స్టాండ్లు 250 సిద్ధం చేశామని తెలిపారు. సెక్షన్ ఆపరేటర్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, ఈసీజీ మిషన్లు, ఎమర్జన్సీ లైట్లు, బెడ్ సైడ్ స్క్రీన్లు, ఎగ్జామినేషన్ టేబుళ్లు, డెలివరీ కిట్స్ రెండు రోజుల్లో పుష్కరాల ఘాట్లకు సమకూర్చేందుకు ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే, జిల్లాకు చెందిన డాక్టర్లు 80 మంది, నర్సులు 80 మంది, ఫార్మాసిస్టులు 40 మంది, ఏఎన్ఎంలు 400 మంది, ఎంపీహెచ్ఏలు 200 మంది, ఇతర పారా మెడికల్ సిబ్బంది, వైద్యాధికారులు శిబిరాల్లో సేవలు అందిస్తారని చెప్పారు. వీరితో పాటుగా 68 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు, 78 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 78 మంది స్టాఫ్ నర్సులు, ఇతర జిల్లాల నుంచి డెప్యూటేషన్పై రెండు రోజుల్లో వస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని 72‡ఘాట్లలో ఏ–ప్లస్, ఏ కేటగిరి వాటిల్లో 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని, ‘బి’ ఘాట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, ‘సి’ ఘాట్లలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
పుష్కరాలకు 905 బస్సులు
అదనంగా అందుబాటులో మరో 500 బస్సులు 3,500 మంది సిబ్బందితో విధులు నిర్వహణ ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి వెల్లడి కృష్ణా పుష్కరాల్లో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి నది పరీవాహక ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపనున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ అధికారులు పూర్తి చేశారు. పట్నంబజారు (గుంటూరు) : పుష్కరాల సందర్భంగా 905 బస్సులతో సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ రీజియన్ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అదనంగా రీజయన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 500 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. గుంటూరు రీజియన్లోని డిపో 1, సత్తెనపల్లి, క్రోసూరు, మంగళగిరి నుంచి అమరావతికి 193 బస్సు సర్వీసులు నడపనున్నారు. అన్ని డిపోల నుంచి విజయవాడకు 140 బస్సులు, విజయపురి సౌత్కు 110, తాళ్ళాయపాలెంకు 26, కష్ణా గోదావరి సంగమ ప్రదేశానికి 20, శ్రీశైలానికి 79, పెనుమూడికి 10, చిన్న చిన్న ఘాట్ల వద్దకు 201 బస్సులను నడపనున్నారు. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, కడప రీజియన్ల నుంచి మరో 300 బస్సులు రానున్నాయి. 3,500 మంది సిబ్బంది సేవలు.. బస్సు సర్వీసులను నడిపేందుకు 3,500 మంది సిబ్బందిని సంస్థ కేటాయించింది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి మరో 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సిబ్బందికి ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక బస్స్టేషన్లు.. ప్రయాణికులకు మార్గ సూచన, మరుగుదొడ్లు వినియోగం, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు తాత్కాలిక బస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పాత ఆర్ఎం కార్యాలయం, ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్, గోరంట్ల, అమరావతిలో 3, విజయవాడలో 3, సత్తెనపల్లిలో 3 తాత్కాలిక బస్ స్టేషన్లు ఉంటాయి. వీటితో పాటుగా తాత్కాలిక కంప్యూటర్ కేంద్రాలు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్ ఇచ్చే విధంగా ఆంధ్ర ముస్లిం కళాశాల, పెదకాకాని, చినకాకానితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషానికో బస్సు సర్వీసు.. గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాలకు 12 రోజుల పాటు నిమిషాల వ్యవధిలో బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. విజయవాడ, అమరావతి, విజయపురిసౌత్, సీతానగరాలకు ప్రతి నిమిషానికి ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సగటున 2 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు సిద్ధంగా ఉన్నాం.. ఈ నెల 12న ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. ఆయా ఘాట్లకు ఉన్న రద్దీలను బట్టీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి ఘాట్ వద్ద ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుని ముందుకు సాగుతాం. సిబ్బందికి సైతం శిక్షణా తరగతులు నిర్వహించాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. – జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం -
అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు
గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ సాక్షి, గుంటూరు : పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను అతిథులుగా భావించి వారికి ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా సేవలందించాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కోరారు. గుంటూ రు నగరంలోని పోలీసు కల్యాణ మండపంలో శనివారం వలంటరీ ఫోర్స్ ప్రతినిధులు– పోలీసుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పౌరుడు బాధ్యతగల పోలీసుగా వ్యవహరించాలని సూచించారు. యాత్రికులకు దారి చూపడం, ట్రాఫిక్, దేవాలయాలు, ఘాట్లు, పార్కింగ్ స్థలాల్లో పోలీసులకు తోడుగా సేవలు అందించేందుకు వలంటరీ ఫోర్స్ను వినియోగించనున్నట్లు తెలిపారు. యాత్రికులతో దురుసుగా ప్రవర్తించకుండా గౌరవ భావంతో పలుకరిస్తూ సేవ చేయాలని సూచించారు. ఎక్కడైనా తోపులాట జరుగుతుందని ముందుగా వలంటీర్లు గుర్తిస్తే దగ్గర్లోని పోలీసు అధికారులకు విషయాన్ని తెలపాలని చెప్పారు. వలంటీర్లకు ప్రత్యేకమైన టీషర్టులు అందిస్తామని, పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు పోలీసులతో సమానంగా వారిని గుర్తిస్తామన్నారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని, వలంటీర్లు సహకరిస్తే ఈ మహాయజ్ఞాన్ని ప్రశాంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు, గుంటూరు అర్బన్ ఎస్బీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ పాల్కుమార్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎన్సీసీ కమాండర్ శ్రీనివాస్, రెడ్క్రాస్ సెక్రటరీ బాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వలంటీర్లతో కలిసి నగరంలో ర్యాలీ చేపట్టారు. -
ఏఎన్యూకి పుష్కర సెలవులు
ఏఎన్యూ: పుష్కరాలను పురస్కరించుకుని ఏఎన్యూకి సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ పరిసరాల నుంచి యూనివర్సిటీకి వచ్చే సిబ్బంది, విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య ఉండటం, పుష్కర విధులకు హాజరయ్యే పోలీసులకు ఏఎన్యూ వసతి గృహాల్లో వసతి ఇవ్వాలని పోలీసు అధికారులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి అమరావతి బాలుర వసతి గహంలో వసతి కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ సెలవులు సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులకు అందరికా లేక అధ్యాపకేతర సిబ్బంది విధులకు హాజరు కావాలా అనే అంశాన్ని సోమవారం జరిగే ప్రిన్సిపాల్స్ సమావేశంలో ప్రకటించనున్నారు. -
పుష్కర కళా వేదికపై తెనాలి నాటిక
‘పరమపదం’ నాటిక ప్రదర్శనకు విద్యార్థులు సిద్ధం వేదాద్రి, మరో 3 ఘాట్లలో ప్రదర్శనకు సన్నాహాలు తెనాలి: పుష్కరాల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కళా ప్రదర్శనల్లో తెనాలి చిన్నారులకు అవకాశం లభించింది. ‘పరమపదం’ పేరుతో 50 నిమిషాల పౌరాణిక నాటిక ప్రదర్శనకు స్థానిక అమిరినేని రెయిన్బో పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహనరావు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ నెల 19న కృష్ణా జిల్లా వేదాద్రి పుష్కరఘాట్లో, గుంటూరు జిల్లాలోని మరో 3 పుష్కర ఘాట్ల వద్ద నాటిక ప్రదర్శించనున్నారు. అమిరినేని రెయిన్బో పబ్లిక్స్కూల్, ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్– తెనాలి సంయుక్త నిర్వహణలో స్కూలు విద్యార్థులు ఈ నాటిక ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. రామాయణంలో సీతాదేవి తన తల్లి అయిన భూమాత ఒడిలోకి వెళ్లాక, శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠం చేరాల్సిన సమయం ఆసన్నమవుతుంది. లేదా అక్కడే ఉండి రాజ్యపాలనలో కొనసాగాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుడు వర్తమానాన్ని కాల పురుషుడు శ్రీరాముడికి విన్నవిస్తాడు. దీనిపై శ్రీరాముడు వైకుంఠానికి చేరేందుకు నిర్ణయిస్తాడు. ఆయన వైకుంఠానికి చేరుకోవటమే ఈ పరమపదం నాటిక ఇతివత్తం. ఇందులో శ్రీరాముడుగా రామకృష్ణ, లక్ష్మణుడుగా మణికంఠ, కాలపురుషుడు పాత్రలో విష్ణు, దూర్వాసమునిగా కరిముల్లాతో సహా 30 మంది విద్యార్థులు నటిస్తున్నారు. కూచిపూడి నృత్యంలో ప్రతిభావంతురాలైన ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించిన ఈ నాటికకు దర్శకత్వం లక్ష్మణశాస్త్రి. నిర్వహణ సారథ్యం ఆరాధ్యుల కన్నా, చెన్నం సుబ్బారావు. విద్యార్థులకు పురాణాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తున్నట్టు స్కూలు డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య చెప్పారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
యాత్రికులు, భక్తులకు సకల సౌకర్యాలు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తుళ్లూరు: కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం ఆయన తుళ్లూరు మండలంలోని పుష్కర ఘాట్లు, పుష్కర నగర్లు, పిండ ప్రదాన షెడ్లను జేసీ వెంకటేశ్వరరావుతో కలసి సందర్శించారు. యాత్రికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చివరి దశ పనులు మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా నిర్వాహకులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా భక్తులు పుష్కర స్నానాలకు రావాలని కోరారు. చాలామంది దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు,ధార్మిక సంస్థలు యాత్రికులకు, భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ సిబ్బంది అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పలు రైళ్లకు అదనపు బోగీలు
పుష్కరాల దృష్ట్యా ఏర్పాట్లు గుంటూరు (నగరంపాలెం): పుష్కరాల దృష్ట్యా గుంటూరు డివిజను మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజను అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఎండీ ఆలీఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12705/12706గుంటూరు– సికింద్రాబాద్– గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, 17221/17222 కాకినాడ– లోక్మాన్యతిలక్ టెర్మినల్స్–కాకినాడ ఎక్స్ప్రెస్, 17211/17212 మచిలీపట్నం–యశ్వంత్పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్, 57327/57328 గుంటూరు– డోన్– గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57317/57324 గుంటూరు– మాచర్ల– గుంటూరు ప్యాసింజరు, 57381/57382 గుంటూరు– నర్సాపూర్–గుంటూరు ప్యాసింజరు రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా మూడు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 17225/17226 విజయవాడ– హుబ్లీ– విజయవాడ ఎక్స్ప్రెస్కు ఆగస్టు 10 నుంచి 25 తేదీ వరకు అదనంగా నాలుగు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57620/57619 కాచిగూడ– రేపల్లె– కాచిగూడ ప్యాసింజర్ రైలుకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా ఒక జనరల్ బోగీని ఏర్పాటు చేయనున్నారు. 08405/08406 పూరీ– గుంటూరు– పూరీ ప్రత్యేక రైలుకు ఆగస్టు 11,12,16,17,19,20,22,23 తేదీల్లో రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఏసీ త్రీటైర్కోచ్, రెండు స్లీపర్ కోచ్లు, 12705/12706 సికింద్రాబాద్– గుంటూరు– సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు సెకండ్ సీటింగ్ కోచ్లు ఏర్పాటు చేయనున్నారు. 12747/12748 గుంటూరు– వికారాబాద్– గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్, 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు నాలుగు సెకండ్ సీటింగ్ కోచ్లు ఏర్పాటు చేయనున్నారు. 08507/08508 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ప్రత్యేక ఎక్స్ప్రెస్కు ఆగస్టు 11 నుంచి 23వ తేదీ వరకు రెండు స్లీపర్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నారు. దసరా సెలవుల రద్దీకి.. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం– తిరుపతి– విశాఖపట్నంకు న్యూగుంటూరు రైల్వేస్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 82851 విశాఖపట్నం – తిరుపతి ఎక్స్ప్రెస్ అక్టోబర్ 3,10,17,24,31, నవంబరు 7,14 తేదీలు, 82852 తిరుపతి– విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అక్టోబర్ 4,11,18,25, నవంబరు 1,8,15 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లలో ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైర్, తొమ్మిది స్లీపర్ కోచ్లు, ఆరు జనరల్ బోగీలు, రెండు ఎస్ఎల్ఆర్కోచ్లు ఏర్పాటు చేయనున్నారు. -
పుష్కర ప్రణాళిక రూపొందించండి
అధికారులకు పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ ఆదేశాలు విజయవాడ : పుష్కర ఘాట్లను 150 నుంచి 200 మీటర్ల వరకూ ఒక సెక్టార్గా విభజించి, ప్రతి సెక్టార్లో ఉంచాల్సిన పరికరాలు, అధికారులకు సంబంధించిన మైక్రో లెవల్ ప్లానింగ్ను ప్రతి శాఖ రూపొందించాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి సెక్టార్కు ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్.. తమ శాఖ అధికారులను ఆయా సెక్టార్లలో నియమించాలని సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ రెండో షిఫ్టు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ మూడో షిఫ్టు నిర్వహించాలని సూచించారు. మూడు షిప్టులకు నియమించే ఉద్యోగుల పేర్లు, ఆధార్, మొబైల్ నంబర్ల నివేదిక జిల్లా యంత్రాంగానికి ఆదివారంలోపు అందించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు. మహిళా సంఘాల స్టాల్స్.. కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ప్రతి ఘాట్లోనూ పిండప్రదానం ప్లాట్ఫాంను ఆనుకుని, పూజా ద్రవ్యాలు అమ్మే మహిళా సంఘాల స్టాళ్లు ఏర్పాటుచేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ తరఫున మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాల స్టాళ్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 150, పవిత్రసంగమం వద్ద 50, ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ వద్ద 50 ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలకూ చోటు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, డీఆర్వో సీహెచ్ రంగయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భద్రతే ప్రామాణికం
ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ సూచన పుష్కర ఏర్పాట్లపై సమీక్ష గుంటూరు మెడికల్ : యాత్రికుల భద్రతే ప్రామాణికంగా పుష్కరాల్లో అధికారులు సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్ డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షతన శనివారం అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పుష్కరాల్లో ఉద్యోగులు నిర్వహించాల్సిన విధులు, యాత్రికుల పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి మాట్లాడారు. ఘాట్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని, పోలీస్, అగ్నిమాపక శాఖలదే కీలకపాత్ర అన్నారు. పుష్కర ఘాట్లను మరోసారి పరిశీలించి లోపాలుంటే సవరించాలని చెప్పారు. ఘాట్ల వద్దకు వచ్చే యాత్రికులకు, స్నానం అయిన తర్వాత వెళ్లే వారికి విడివిడిగా బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఆగస్టు 12 నుంచి 15వ తేదీ, 18, 21 తేదీలు చాలా ముఖ్యమని, ఆ రోజుల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు జాగ్రత్తగా విధులను నిర్వహించాలని చెప్పారు. ఆర్టీసీ, రైల్వేశాఖ యాత్రికులను చేరవేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైల్వేస్టేçÙన్, బస్టాండ్లో యాత్రికుల రద్దీని నియంత్రించేందుకు భద్రత చర్యలు అవసరమని వెల్లడించారు. ఉద్యోగులందరికీ ఘాట్ల వారీగా, షిప్టుల వారీగా విధులు కేటాయించాలని ప్రసన్నకుమార్ తెలిపారు. 10వ తేదీ నుంచే పుష్కర విధులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. యాత్రికులకు వంట చేసుకునే అవకాశాన్ని కల్పించాలని, పుష్కర ఘాట్లకు దూరంగా ఉన్న వీధుల్లో ఒకవైపు మాత్రమే వ్యాపారాలు జరిగేలా చర్యలు చూడాలన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పుష్కరాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. -
పుష్కర పనుల పరిశీలన
-
పుష్కరాలకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు
పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజీ సంజయ్ సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లను గుంటూరు రేంజి ఐజీ సంజయ్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మహానాడు రైల్వే వంతెన వరకు పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. సీతానగరం దిగువన పోలీసు శాఖకు కేటాయించిన మత్స్యకారుల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఘాట్ల వెంట వాచ్ టవర్ల ఏర్పాట్లపై సూచనలిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో గుర్తిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఎస్పీ రామాంజనేయులు ఉన్నారు. -
మీకో దండం, పుష్కరాలకు రాకండి
ఇంత మంది జనం వరదలా రావడంలో కొంత పాపం మీడియా వారికి ఉన్నా సరే, గోదావరిలో మునగకుండానే, నిజాలు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. వాటి స్ఫూర్తితో పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం. కిలోమీటర్ల మేరకు గోదావరి దారులన్నీ లక్షల వాహనాల తో మూసుకుపోయాయని టీవీ చానళ్లు చెప్పి చెప్పలేనంత మేలు చేశాయి. రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడు స్తున్నాయట. రెండు రాష్ట్రాల్లో బస్సు స్టేషన్లన్నీ రాని బస్సుల కోసం ఎదురుచూస్తున్న భక్తు లతో అద్భుతంగా నిండిపోయాయి. దాదాపు రెండు నెలల నుంచి హోరె త్తించే ప్రచారాలు చేసి, రారండోయ్ రారండోయ్ అంటూ దేశ విదేశాల గోదావరి భక్తులను ఆహ్వానించిన టీవీ యజమానులు, సంపాదకులు, విలేకరులు, కెమెరామెన్లు గోదావరిలో మునగకుండానే బోలెడంత పుణ్యం సంపాదించుకున్నారు. ఏ విధంగా అంటే రోడ్లు, రైలు మార్గాలు, బస్సులు, రైళ్లు కిటకిట లాడుతున్నాయని ఉన్నదున్నట్టు నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలుసిసలు సమాచారం అంద డం వల్ల పుష్కరాలకు వెళ్లకూడదని చాలా మంది వివేక వంతమైన నిర్ణయం తీసుకోవడానికి మీడియా ఎంతో కమిట్మెంట్తో ఉపయోగపడింది. గోదావరీ తీర జిల్లాల్లో భయంకరంగా ఈ కోలి రోగం వ్యాపించిందనే మరొక నిజం చెప్పి మీడియా ఇంకొంచెం పుణ్యం కట్టుకున్నది. మరీ పుష్కరాలకు వెళ్లొద్దని ఆ శాస్త్ర పరిశోధకులు చెప్పడానికి మొహ మాటపడ్డారేమో. మునగండి కాని, గుటకవేయకండి, నోట్లోకి కళ్లల్లోకి, చెవుల్లోకి ఈ కోలి నిండిన నీళ్లు వెళ్లకుం డా చూసుకోండి(ఇది సాధ్యమా) అని ఉచితంగా సము చిత సలహా ఇచ్చారు, మనవాళ్లు అచ్చు వేశారు. లక్షల మంది వినకపోయినా వందలమందైనా ఆలోచించే అవ కాశాన్ని జనమాధ్యమాలు కల్పించడం ముదావహం. తెలుగు వారు పరమభక్తులనడంలో సందేహం లేదు. ఎంత భక్తులంటే పుణ్యం సంగతేమోగాని గోదా వరిలోనే తొక్కిసలాటలో 29 మంది పంచప్రాణాలు హరీమన్నా భక్తిలో ఒక్క మిల్లీ మీటర్ తేడా కూడా రావ డంలేదు. శబరిమలైలో తొక్కిసలాటలు వచ్చినా, వార ణాశిలో జనం మునిగినా, కుంభమేళాలో ప్రాణాలు పోయినా, ఏది ఏమైనా సరే ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్న సినీ డైలాగు లాగించి లారీలు బస్సులు కార్లు, రైలు బస్సుటాపులమీదైనా సరే కూర్చు ని ప్రయాణించడంలో తెలుగు భక్తుడిని మించినవాడు ప్రపంచంలోనే ఉండడు. 29 మంది చనిపోయిన తరు వాత భయపడి భక్తులు రాక జనం తగ్గుతారేమో నని అనుకున్న వాడు బుద్ధి తక్కువ వాడన్నట్టు. వాడికర్మ కాలి వాడు పోయాడు. మనం ముక్తులమవుదాం, పునీతులమవుదాం, ప్రాణాలు పోతే పోతాయి, అంత కుముందు మనకు మనమే పిండాలు పెట్టుకుందాం అన్నంత కమిట్మెంట్తో భక్తులు పోటెత్తుతున్నారు. గోదావరి గల గల, కళ కళ, పుష్కర శోభ, వైభవం, కవి తలు, కవులు వారి ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు, పారవశ్యంతో చూస్తున్న తల్లులు తండ్రులు, వారి భక్తి సెగలు ఆకాశాన్నంటి దేవతలు దుందుభులు మోగిస్తు న్నారు. తెలుగు వారి భక్తితరంగాల్లో మునిగితేలుతున్న వారిని చూసి మురిసిపోతూ జయజయధ్వానాలు చేస్తు న్న వారితో ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయింది. తొక్కిస లాటలకు ఆకాశంలో ఆస్కారం లేదు కనుక ఎవరూ చేయనవసరంలేదు. ఏడాది పొడుగునా పుష్కరాలే అయినా మొదటి పన్నెండురోజులే ప్రధానం, అందులో మొదటి రోజు మరీ ప్రధానం. అందులో మొదటి గంట ఇంకా ఇంకా ప్రధానం, మునిగితే నేరుగా మోక్షమే... (అవును 29 మందికి దొరికినా నమ్మరా) అందులో మునుగుతున్న మన నేతలే మనకు ఆదర్శం, మనను ముక్తిమార్గంలో నడుపుతున్న అవధూతల మాటలే మనకు శిరోధార్యం అని జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. వచ్చారు. ఆగడంలేదు. పాపం చంద్రబాబైనా, చంద్రశేఖరుడైనా ఏం చేస్తారు? ఏదో సెంటిమెంట్తో రమ్మంటే ఇంతగా పోలోమని రావడమేనా? ఇంతగా వరదల్లో కొట్టుకొ చ్చిన తుంగల్లా వచ్చిన జనానికి ఎవరు మాత్రం ఏం ఏర్పాట్లు చేస్తారు? ఇదేమన్నా తిరుపతా? యాదాద్రా? ఐపీఎస్లు, ఐఏఎస్లు చదివి ఫస్టొస్తే ఏం లాభం, ఏఘాట్లో ఎప్పుడు స్నానం చేయాలో తెలియకపోతే? బంగారు అంచున్న పంచెల వారు ధగధగ మెరిసే కండువాల వారు శాస్త్రాలు చదివి ఓహో నెలల నుంచి చెబుతుంటే విని వచ్చే మనని ఆపడానికి ఈ ఖాకీ వారికి, వారిని నడిపే ఆ ఖాదీవారికి ఎంత ధైర్యం? పుష్కర మరణాలు ఎన్నయితేనేం పుష్కళంగా ఉన్న మన జనాభాకు వీసమెత్తు కూడా తేడా పడదు. మీడియాను అందరూ అన్ని రకాలుగా తిడుతు న్నారు. ఈ రోజు మీడియా నిజంగా చాలా మేలు చేసిం ది. అంతకు ముందు నెలల కొద్దీ ప్రచారం చేసినా సరే, ఇంత మంది వరదలా రావడంలో కొంత పాపం వారికి ఉన్నా సరే, వారు గోదావరిలో మునగకుండానే, నిజా లు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. పునీతులయ్యారు. వారి స్ఫూర్తితో వెంటనే పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం. మనం కూడా కలుషితం చేయనందుకు మనను గోదావరిలో ఉన్న పుష్కరుడు కరుణిస్తాడు. (దయచేసి గరికపాటి వారైనా ఈ నిజం చెబితే బాగుంటుంది). బస్సు టికెట్లు రద్దు చేసుకుం దాం, మన వల్ల ఒక్క బస్సు రద్దయినా గోదావరి దారి కాలుష్యం కొంత ఆపిన పుణ్యం మనకు దక్కుతుంది. పుష్కరాల రద్దు ద్వారా వచ్చిన పుణ్యాన్ని పాపం... పోయిన ఆ 29 ప్రాణులకు అర్పిద్దాం. వారి ఆత్మలు శాంతించడానికి. ఇక పుష్కరాల కోసం ప్రతిష్టను ఫణంగా పెట్టిన ప్రభువులకు కూడా కొన్ని మనవులు చేసుకుందాం. అయ్యా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారూ వెంట నే పుష్కరాల వాణిజ్య ప్రకటనలు మానేయండి (ఈ నష్టానికి మీడియా వారు క్షమించాలి మరి) బస్సులు (నడుస్తుంటే) ఆపకండి, తిరుగు ప్రయా ణాలు నడపం డి. వస్తే జూలై 26 తరువాతనే రండి అని మీరు విలేక రుల సమావేశాల్లోనైనా చెప్పండి. వీలైతే గోదావరిలో మునగడానికి తలకు రూ.100 పుష్కర పన్ను విధిం చండి. లేకపోతే శుద్ధమైన గోదావరి జలాలను బాటిళ్ల లో నింపి దేశమంతా పంచండి, నెత్తిన పోసుకోమ నండి, కాని పుష్కరాల స్నానాలకు నదుల్లా రావద్దని చెప్పండి. ప్లీజ్. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్ -
ఉసురు తీసింది ఆ దేవుళ్లా...ఈ దేవుళ్లా?
ఇటీవలి కాలంలో జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తుంటే ఆర్భాటానికి తప్ప ఆచరణకు ప్రాధాన్యమీయడం లేదన్న వాదనలను పాలకులే బలపరుస్తున్న ట్టుగా కనిపిస్తోంది. సీరియస్గా తీసుకోవలసిన విష యాలను చాలా తేలిగ్గా తీసుకోవడం పరిపాటి అయిం ది. పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముం దే తెలియదా? తొలిరోజు, తొలిఘడియల్లో స్నానం చేయాలనే విశ్వాసం చాలామందిలో ఉంటుం దని తెలియదా? పుష్కర ఘడియ సమీపించక ముందే వచ్చిన జన సంఖ్య తెలియదా? ఒక్క ఘాట్ దగ్గరే గంటలతరబడి వేచి ఉన్న వైనం తెలియదా? ఇన్ని తెలిసీ ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యమా? ఏం జరగదులే అన్న ధీమానా? ఉదాసీనతా? ఆధ్యాత్మిక కార్యక్రమమన్నది కేవలం వీఐపీల కోసం కాదు. దేవుడు వీఐపీల సొత్తు కాదు. కానీ పాలకుల, ప్రముఖుల ఆలనాపాలనా సామాన్య భక్తులకు శాపమైపోయింది. వీరికోసం ప్రత్యేక సదు పాయాలున్నా జనాల్లో తిరిగి ఇమేజ్ పెంచుకుందా మనే ‘ఇజం’, దీనికోసం జరిగే ఆర్భాటాలు కొంపలు ముంచుతున్నాయి. అసలు పుష్కరాలు ప్రారంభించ డం ఏమిటి? ప్రకృతి సహజంగా ముహూర్త వేళ జరిగే కార్యక్రమం మానవమాత్రులు ప్రారంభిస్తారా? ఎం దుకు ప్రారంభించాలి? ఇది ఒక పండుగ...మీరుకూడా పండుగలాగే జరుపుకోండి... ఇంతజరిగినా కఠినచర్య తీసుకోవడానికి తాత్సా రం... నిజాన్ని ఒప్పుకుంటే చులకనవుతామేమోనన్న సంశయం... ఎవరికి దూరమవుతామోనన్న ఆందోళన. ఇప్పుడైనా తప్పు ఒప్పుకోకపోతే... కర్చీఫ్తో కళ్లు తుడుచుకున్నా, విచారణ చేయిస్తామంటూ ప్రకటనలు చేసినా సామాన్యునికి యాంత్రికంగానే కనిపిస్తుంది. విశ్వనాథ్ ‘స్వాతికిరణం’ సినిమాలో.. తన చర్య లతో బాలగంధర్వుడు ప్రాణాలు కోల్పోవడానికి కార కుడైన భర్తను చూపిస్తూ మతిచలించిన ఆయన భార్య అడుగుతుంది...‘గంగాధర్ ప్రాణం తీసింది ఆ దేవుడా, ఈదేవుడా’ అని. విషయం ఏదైనా, తీరు ఏదైనా మేం స్థిరమైన మతితోనే అడుగుతున్నాం...‘27 మంది అభా గ్యుల ఉసురు తీసింది ఆ దేవుళ్లా...ఈ దేవుళ్లా’? - ఎన్.సి. సతీష్ కుమార్, హైదరాబాద్