services
-
సేవలపై ఫిర్యాదుకు వేచి చూడాల్సిందే
న్యూఢిల్లీ: ఏఐ ఏజెంట్లు, చాట్బాట్లు ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కస్టమర్ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించడం లేదు. ఫిర్యాదు నమోదు చేయడానికే గంటలు, రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. 2024లో దేశీయ వినియోగదారులు సేవలపై ఫిర్యాదు నమోదు చేయడానికి వేచి చూసిన సమయం 1500 కోట్ల గంటలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను సర్విస్ నౌ ‘కస్టమర్ ఎక్స్పీరియెన్స్’ నివేదిక వెల్లడించింది. కస్టమర్ల అంచనాలు, లభిస్తున్న సేవల మధ్య ఉన్న ఎంతో అంతరం ఉన్నట్టు ఈ నివేదిక గుర్తించింది. 5,000 మంది కస్టమర్లు, 204 మంది కస్టమర్ సేవల ఏజెంట్లను ప్రశ్నించి, వచ్చిన వివరాల ఆధారంగా ఫలితాలను విశ్లేషించింది. ఓపిక పట్టాల్సిందే.. 80 శాతం భారత వినియోగదారులు కనీస అవసరాలైన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఉత్పత్తుల సిఫారసుల కోసం ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారు. కస్టమర్లు అంతా కలసి ఇందుకోసం ఏటా 1500 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. 2023తో పోల్చితే 2024లో ఒక ఫిర్యాదు పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం 3.2 గంటలు తగ్గింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు, లభిస్తున్న సేవలకు మధ్య ఎంతో అంతరం ఉంది. 39 శాతం కస్టమర్ల ఫిర్యాదులను హోల్డ్లో పెట్టడం, 36 శాతం ఫిర్యాదులను బదిలీ చేయడం కనిపించింది. ఫిర్యాదుల ప్రక్రియ ఎంతో కష్టంగా ఉందని 34 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం సేవల కారణంగా బ్రాండ్లను మార్చడానికి 89 శాతం వినియోగదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. బలహీనమైన సేవలపై ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. కస్టమర్ల సేవల్లో నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి, వేగంగా పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వీలుగా వ్యాపార సంస్థలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోకుంటే కంపెనీలు కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్విస్నౌ ఇండియా ఎండీ సుమీత్ మాధుర్ అన్నారు. -
సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్
సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నాడు.. – గోల్కొండ నగరంలో అది పెద్ద లేబర్ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్ హుసేన్స్న్ సోహెల్ సూర్యనగర్ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. వలస కూలీలకు అండగా.. ఆసిఫ్హుస్సేన్ సోహెల్ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్హుస్సేన్ సోహెల్ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫస్ట్ ఎయిడ్, జిగ్జాగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్ చెబుతున్నారు. -
నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో రోగులకు వివరిస్తూ బోర్డులను కూడా తమ ఆసుపత్రుల ముందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా రోగులకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి: తెన్హా నెట్వర్క్ పరిధిలోని 368 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ (ఉద్యోగులు), జేహెచ్ఎస్ (జర్నలిస్టులు) పథకాల కింద ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల విలువైన చికిత్సలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 1,030 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.730 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు. ఈ లెక్కన ఈ సంవత్సరానికి సంబంధించి రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్లు తెన్హా చెబుతోంది.ఇంకా రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 10 నుంచి సేవలు నిలిపివేస్తామని తెన్హా ప్రకటించటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్ ఆ సంఘం నాయకులతో గురువారం చర్చలు జరిపారు. రూ.100 కోట్లను టోకెన్ కింద వెంటనే విడుదల చేస్తామని, వచ్చే నెలలో మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. దీంతో తెన్హా వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగా ఇచ్చిందేంటి? బకాయిల్లో కేవలం రూ.100 కోట్లువిడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెన్హా తప్పు పట్టింది. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.100 కోట్ల విలువైన చికిత్సలు అందిస్తుంటే.. సంవత్సరం నుంచి రావాల్సిన రూ.1,200 కోట్లకుగాను రూ.100 కోట్లు ఇస్తామనటం సరికాదని పేర్కొంది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో శివశంకర్కు శుక్రవారం లేఖ రాస్తూ.. తమ బకాయిల పరిష్కారానికి కచ్చితమైన మార్గం చూపేంత వరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. విధ్వంసకర శతకం! సెలక్టర్లకు మెసేజ్
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.రాణించిన సర్వీసెస్ కెప్టెన్ఈ క్రమంలో బ్యాటింగ్కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.57 బంతుల్లోనే రుతు శతకంఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మెగా టోర్నీకి రెడీఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్లో మహారాష్ట్ర రాజస్తాన్ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి?
దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగణంగా తగిన మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఒకటే మెట్రో రైళ్లు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కాలుష్యం నుండి నగరాలను కాపాడేందుకు మెట్రో రైళ్లు వరంలా మారాయి. ప్రస్తుతం దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.కోల్కతా మెట్రో కోల్కతా మెట్రో 1984, అక్టోబర్ 24న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు. కోల్కతా మెట్రోను కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (కేఎంఆర్సీ) నిర్వహిస్తోంది. కోల్కతా మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ మెట్రో 2002లో ప్రారంభమైంది. ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు.బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) బెంగళూరు మెట్రో 2011, అక్టోబర్ 20న తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)నిర్వహిస్తోంది. ఈ నెట్వర్క్లో రెండు లైన్లు, 64 స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను 2017, నవంబర్ 29న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ మెట్రో నిర్వహణ బాధ్యత హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై ఉంది.పూణే మెట్రో పూణే మెట్రో మూడు లైన్లు ఉన్నాయి. 23 స్టేషన్లతో కూడిన 54.58 కిలోమీటర్ల నెట్వర్క్ను పూణె మెట్రో కలిగి ఉంది. పూణే మెట్రో నిర్వహణ బాధ్యతను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్సీఎల్) పర్యవేక్షిస్తుంటుంది. పూణే మెట్రో తన కార్యకలాపాలను 2022, మార్చి 6న ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రతిరోజూ 60 వేల నుంచి 65 వేల మంది ప్రయాణిస్తుంటారు.చెన్నై మెట్రో చెన్నై మెట్రో మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. దీని నిర్వహణ బాధ్యత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)పై ఉంది. 2015లో ప్రారంభమైన ఈ మెట్రోలో ప్రస్తుతం 40 స్టేషన్లు ఉండగా, రోజుకు దాదాపు 2.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.ముంబై మెట్రో ముంబై మెట్రో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) పర్యవేక్షణలో ఉంది. 2014లో ప్రారంభమైన ఈ మెట్రోలో రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.అహ్మదాబాద్ మెట్రో అహ్మదాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎంఆర్సీఎల్) చేతుల్లో ఉంది. 2019లో ప్రారంభమైన ఈ మెట్రోలో రెండు లైన్లు, 31 స్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు.నాగ్పూర్ మెట్రో నాగ్పూర్ మెట్రో నెట్వర్క్ దాదాపు 38 కిలోమీటర్లు. నాగ్పూర్ మెట్రో నిర్వహణ బాధ్యత మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్సీఎల్)పై ఉంది. నాగ్పూర్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో 2017లో ప్రారంభమయ్యింది. దీని మొత్తం నెట్వర్క్ 27.4 కిలోమీటర్లు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్)కొచ్చి మెట్రో నిర్వహణ బాధ్యత వహిస్తుంది. కొచ్చి మెట్రోలో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు.లక్నో మెట్రో లక్నో మెట్రో నిర్వహణ బాధ్యత ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)పై ఉంది. ప్రస్తుతం లక్నో మెట్రోలో ఒక లైన్ ఉంది. లక్నో మెట్రోలో రోజుకు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. లక్నో మెట్రో 2017లో ప్రారంభమయ్యింది.జైపూర్ మెట్రో జైపూర్ మెట్రో 2015లో చాంద్పోల్- మానసరోవర్ మధ్య నడిచే సర్వీసుతో ప్రారంభమయ్యింది. 11 స్టేషన్లు ఉన్న ఈ మెట్రోను జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జేఎంఆర్సీ) పర్యవేక్షిస్తుంటుంది.కాన్పూర్ మెట్రోకాన్పూర్ మెట్రోను ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాన్పూర్ మెట్రో తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఒక లైన్ కలిగివుంది. ఈ మెట్రో 2021, డిసెంబర్ 28 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
మారిన బీఎస్ఎన్ఎల్ లోగో: కొత్తగా ఏడు సర్వీసులు
ప్రభుత్వ రంగ నెట్వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.కొత్త లోగోమారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.ఏడు కొత్త సర్వీసులుస్పామ్-రహిత నెట్వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్లు, మెసేజ్ల నుంచి బయటపడేస్తుంది. క్లీన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్లకు యాక్సెస్ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.ఎనీ టైమ్ సిమ్ కియోస్క్: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్ టు డివైజ్ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్ఎంఎస్ సేవలను ఆస్వాదించవచ్చు.పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్వర్క్ను అందిస్తుంది.గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.Today at #BSNL HQ, New Delhi, Hon'ble MoC Shri @JM_Scindia Ji, along with Hon'ble MoSC Shri @PemmasaniOnX Ji and Secretary DoT Shri @neerajmittalias Ji, unveiled BSNL’s new logo, reflecting our unwavering mission of "Connecting Bharat – Securely, Affordably, and Reliably." pic.twitter.com/EFvYbVASGx— BSNL India (@BSNLCorporate) October 22, 2024 -
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్వర్క్కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్వర్క్లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
అల్పాదాయ దేశాలకు ఆర్థిక వనరులు అందించాలి
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది. మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్కు 83,673 షేర్లు ఉన్నాయి. -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)
-
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. -
నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షుడిగా బాపయ్య చౌదరి(బాపు) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది. బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా నాట్స్ మన గ్రామం-మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ అండ్ వీల్ పేరుతో మొబైల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటిజం కేర్ ఆన్ వీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు. నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు.(చదవండి: నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి) -
మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనుంది. యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులు, కేటగిరీల పోస్టులు.. పోలీస్, అగ్నిమాపక, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఎక్సైజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగాలకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నిరుద్యోగుల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్కు కూడా గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్లో ఈనెల 8న నోటిఫికేషన్ను పబ్లిష్ చేశారు. 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన ఉత్వర్వుల్లో యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని పెంచకపోవడం గమనార్హం. -
టెలిమెడిసిన్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ఫోన్ ద్వారా కూడా సేవలు.. ఇక స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ ఫేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
ఇంటర్ విద్యలో డిజిటల్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించేందుకు బోర్డు డిజిటల్ విధానాలను అనుసరిస్తోంది. ఇప్పటికే డిజి లాకర్లో 2006 నుంచి 2023 మధ్య ఇంటర్మీడియట్ పాసైన 68.73 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచగా, ఈ ఏడాది నుంచి ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దీంతో విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాభావం తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. గతంలో చలాన్ రూపంలో ఫీజు చెల్లించగా, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. కానీ, ఈ ఏడాది ఫీజులను, నామినల్ రోల్స్ను కూడా ఆన్లైన్ చేయడంతో గత ఇబ్బందులన్నీ తొలగించినట్లయింది. ఇంటర్ పరీక్షలకు 9,59,933 మంది.. ఇక మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 5,17,591 మంది, రెండో ఏడాది 4,45,342 మంది మొత్తం 9,59,933 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాలను సిద్ధంచేశారు. ఇప్పటికే ఆయా జూనియర్ కాలేజీల్లోని పరీక్ష జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అలాగే, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు 2,130 సెంటర్లను సిద్ధంచేశారు. ఈసారి ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఇదే ఆన్లైన్ విధానం కొనసాగుతుందన్నారు. డిజిలాకర్లో 68.73 లక్షల సర్టిఫికెట్లు.. రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్లో సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వ లెన్సీ, జె న్యూనెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు కావాలన్నా తీసుకునేలా ‘డిజిలాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. ఇందుకోసం ‘జ్ఞానభూమి’ ని డిజిలాకర్కు అనుసంధానించింది. ఇందులో ఇప్పటివరకు 2006 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తిచేసిన 68,73,752 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచారు. సర్టిఫి కెట్లలో తప్పుపడిన పేరును సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. డిజి లాకర్గా పిలుస్తున్న ‘డిజిటల్ డాక్యుమెంట్స్ రిపోజిటరీ’లో ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థులు తమ పత్రాలను పొందవచ్చు. గతంలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు ‘డూప్లికేట్’ పొందాలంటే పోలీసు వి భాగం ఎన్ఓసీ, నోటరీ అఫిడవిట్తో దరఖాస్తు చేయడంవంటి వ్యయప్రయాసలు పడాల్సి వచ్చే ది. ఈ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడంతో విద్యార్థి తన మొబైల్ ఫోన్లోని డిజిలాకర్ యాప్ ద్వారా సర్టిఫికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా పొందే విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది. -
ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న ప్రచారం నిజం కాదని ప్రకటన
-
సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సెలవులంటే ప్రతిఒక్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్ సెలవుల సీజన్ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ యాప్ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు. Cisco Survey: సిస్కో యాప్ డైనమిక్స్ సీజనల్ షాపింగ్ పల్స్ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా, వీడియో కాల్స్ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్ యాప్లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్లను, 88 శాతం మంది టేక్ అవే కోసం ఫుడ్ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది. -
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
డిజిటలైజేషన్ దిశగా టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9 వేలకు పైగా బస్సులు, 50 వేల మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల నడుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుషన్ (CIS)పై మొగ్గు చూపి వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. “సంస్థ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈఆర్పీ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. పది నెలల వ్యవధి రికార్డు సమయంలో సంస్థ ఈఆర్పీ ప్రాజెక్టును అమలులోకి తెచ్చాం. CIS ప్రాజెక్ట్ సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతోంది. కేంద్రీకృత సమగ్రమైన డేటా లభ్యత, భద్రతతో పాటు మానవశక్తి వినియోగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్లపై కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత స్టోర్లు, వర్క్షాపులు, ఆదాయ నిర్వహణ, పే రోల్ వంటి కార్యకలాపాల నిర్వహణలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలన్నింటినీ ఈఆర్పీ ఏకీకృతం చేస్తోంది. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీల్లో టీఎస్ ఆర్టీసీ మొదటిది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెట్ వర్క్ను అప్ గ్రేడ్ చేశాం అని సంస్థ వీసీ అండ్ ఎండీ వి.సి.సజ్జనర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత సామార్థాన్ని మెరుగుపరచాలనే ఉద్ధేశంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సమర్థవంతమైన ఈ వ్యవస్థ సంస్థ అభివృద్ధికి దోహద పడగలదని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన నాణ్యమైన సేవల్ని అందించేందుకు టీఎస్ ఆర్టీసీతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని నల్సాఫ్ట్ సీఈఓ నల్లూరి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషి, అంకితభావంతో పని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయగలిగామని చెప్పారు. ఆధునీక సాంకేతితను అందిపుచ్చుకోవడంలో టీఎస్ ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హన్స ఈక్విటీ పార్ట్నర్స్ త్రినాథ్ బాబు మాట్లాడుతూ, రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు. సీఐఎస్ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాల నిర్వహణ మరింత సౌలభ్యంగా మారే అవకాశం ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ టీఎస్ ఆర్టీసీ పురోగమించడం శుభపరిణామన్నారు. సీఓఓ డాక్టర్ వి రవీందర్, ఐటి కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పివి ముని శేఖర్, ఎస్ కృష్ణకాంత్, వి.వెంకటేశ్వర్లు, ఎ. పురోషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప, చీఫ్ ఇంజనీర్ (IT) ఎం. రాజ శేఖర్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్స్టాక్ యూనిట్ల (ఆర్ఎల్యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్స్టాక్ యూనిట్గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
హైదరాబాద్ నుంచి అమృత్సర్కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్సర్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్సర్కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్కు చేరుకుంటుంది. గ్వాలియర్కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్ల టెస్టింగ్ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెన్నై నుంచి సింగపూర్కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్ని విశాఖ మీదుగా నడపాలని భావించారు. ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్లోని క్యాసినో వరల్డ్కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి. -
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్నగర్లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్స్టేషన్లు: కాచిగూడ, మలక్పేట, డబీర్పురా, యాకుత్పురా, ఉప్పుగూడ, ఫలక్నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్షాప్ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
నిరుపేదలకు వరం
-
రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్
జరుగుమల్లి (టంగుటూరు): ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, అగ్రి బిజినెస్ హెడ్ ఆశిష్ అగర్వాల్లు ప్రశంసించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని అగ్రి నేషనల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుదేష్ణ, బజాజ్ ఇన్సూరెన్స్ స్టేట్ మేనేజర్ శాంతి భూషణ్, ఒంగోలు ఏడీఏ బి.రమేష్ బాబుతో కలిసి గురువారం వారు సందర్శించారు. రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు, పంట కోత ప్రయోగాలు తదితర వివరాల గురించి వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఏ ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయని రైతులను ఆరా తీశారు. పంట సాగు చేసిన వెంటనే ఈ–క్రాప్లో వివరాలు నమోదు చేయించుకుంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం సంభవిస్తే బీమా వర్తిస్తుందని రైతులకు వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను పంపిణీ చేస్తున్న తీరు, గత సంవంత్సరం రబీలో ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల రశీదులను ఈ సందర్భంగా వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని వారు కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిష్ అగర్వాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్వర్ణలత, ఏఈవో ఎన్.వెంకటేశ్వర్లు, వీఏఏ ఎల్.ప్రైసీ రీమల్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ పేమెంట్స్ సేవల విస్తరణ
ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్లోనే కార్ట్కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు. ఇందుకోసం ఇతర వెబ్సైట్కి గానీ, మరో యాప్కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ .. మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆర్పీజీ గ్రూప్ నుంచి తాబి మొబిలిటీ సర్వీసులు
ముంబై: ఆర్పీజీ గ్రూప్ తాజాగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ సంస్థలకు సాఫ్ట్వేర్ సేవలందించే (సాస్) దిశగా తాబి మొబిలిటీ వెంచర్ను ఆవిష్కరించింది. ఆయా సంస్థలు తమ వాహనాలను, లాజిస్టిక్స్ కార్యకలాపాలను రియల్ టైమ్లో పర్యవేక్షించుకునేందుకు, లోపాలను సవరించుకునేందుకు తాబి సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇంధన వ్యయాల ను తగ్గించుకునేందుకు, వాహనాల వినియోగాన్ని మరింత సమర్ధమంతంగా పెంచుకునేందుకు ఇది సహాయపడగలదని సంస్థ సీఈవో పాలి త్రిపాఠి తెలిపారు. తాబి సొల్యూషన్స్ ఇప్పటికే 100 రోజు ల్లో 100 క్లయింట్ల వ్యాపారవృద్ధికి దోహదపడిందని వివరించారు. 45,000 పైచిలుకు లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాహనాల అప్టైమ్ను 60,000 కిలోమీటర్ల మేర మెరుగుపర్చిందని త్రిపాఠి తెలిపారు. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 24/7 ఇన్బౌండ్ కాంటాక్ట్ సెంటర్ను ప్రారంభించింది. ఎస్బీఐ లైఫ్ ఆఫర్ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్ సెంటర్ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం) ఇదీ చదవండి: ఆటోసార్లో టాటా టెక్నాలజీస్ న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ తాజాగా ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో (ఆటోసార్) చేరింది. ఇంటెలిజెంట్ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్, ఓపెన్ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్వేర్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్ క్రిస్లర్, బాష్, సీమెన్స్ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం) -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసింది. మానవ వనరుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తోంది. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, తగినన్ని మందులు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. దీంతో 2018–19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022–23లో ఏకంగా 4,42,929కు చేరాయి. దీంతో అదే మేర ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిధులు పెరిగాయి. ఆరోగ్యశ్రీ కింద 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.200 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందించగా.. గత సంవత్సరం ఈ మొత్తం ఏకంగా రూ.350 కోట్లకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఆరోగ్యశ్రీ కింద అత్యధిక సేవలు అందిస్తూ విశాఖపట్నంలోని కేజీహెచ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత విజయవాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల వాటా పెంచడానికి ప్రత్యేక చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు తావులేకుండా ఏకంగా 50 వేలకు పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఎప్పుడు ఖాళీ అయిన పోస్టులను అప్పుడే వెంటనే భర్తీ చేస్తోంది. దీనికి తోడు నాడు–నేడు కింద ఆస్పత్రులకు కొత్త భవనాలు సమకూర్చడంతో పాటు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్యను వీలైనంత తగ్గించాలని వైద్య శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను గణనీయంగా పెంచడం ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద నమోదవుతున్న వైద్య సేవల్లో 69 శాతం మేర ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో, 31 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల వాటాను మరింతగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సేవల పెంపునకు ప్రత్యేక చర్యలు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మరింత పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఇన్సెంటివ్ నిధుల చెల్లింపునకు చర్యలు చేపట్టాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డ సేవలు.. బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. వీటిని మరింతగా పెంచడానికి ఆస్పత్రులకు విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. గతేడాది నిర్వహించిన కేసుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం ఎక్కువ కేసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – డాక్టర్ నరసింహం, డీఎంఈ ఆరోగ్యశ్రీ సేవలు వేల నుంచి లక్షల్లోకి.. ఇక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 2018–19తో పోలిస్తే వేల నుంచి ప్రస్తుతం లక్షల్లోకి పెరిగాయి. అప్పట్లో ఏడాదికి 16 వేలు మాత్రమే ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు ఉండేవి. వీటికి సంబంధించి నిధుల వాటా కేవలం రూ.34.94 కోట్లు మాత్రమే ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. 2022–23లో ఏకంగా రూ.151 కోట్ల విలువ చేసే వైద్యాన్ని 2.05 లక్షల కేసుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించారు. -
ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
టెలి మెడిసిన్ లో దేశంలోనే ఏపీ టాప్
-
సంపద నిర్వహణ సేవలకు డిమాండ్
సంపద వృద్ధికి మెరుగైన అవకాశాల కోసం చిన్న పట్టణాల్లోని వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెల్త్ మేనేజ్మెంట్ సేవల్లోని కంపెనీలు టైర్–2, 3 పట్టణాల వైపు చూస్తున్నాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లోని అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) సంప్రదాయ సాధనాలైన బంగారం, రియల్ ఎస్టేట్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పుడు బంగారం, రియల్టీ కాకుండా ఇతర సాధనాల్లోకి తమ పెట్టుబడులను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ధోరణి వెల్త్ మేనేజ్మెంట్ సేవలకు డిమాండ్ను తెస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పట్టణాల్లో కొన్ని వ్యాపారాలకు కొత్త జీవం రావడాన్ని వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంపద నిర్వహణ సేవలు అందించే సంస్థలు (వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు) ఆర్థిక ప్రణాళిక, పన్నుల కు సంబంధించిన సలహాలు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంస్థలతో పోలిస్తే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు విస్తృతమైన సేవలను ఆఫర్ చేస్తుంటాయి. అధిక శాతం మంది వెల్త్ మేనేజర్లు కనీసం రూ.కోటి నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడుల నిర్వహణ చూస్తుంటారు. కరోనా తర్వాతే.. కరోనా ముందు నాటికి మా మొత్తం క్లయింట్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని క్లయింట్లు 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 22 శాతానికి పెరిగినట్టు ఆస్క్ ప్రైవేటు వెల్త్ వెల్లడించింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఈ సంస్థ క్లయింట్ల ఆస్తులు 13 శాతం నుంచి 22 శాతానికి చేరాయి. నువమా వెల్త్ క్లయింట్లలోనూ కరోనా ముందు టైర్–2 నుంచి 15 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 20 శాతానికి పెరిగారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ప్రైవేటు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు విస్తరించడానికి ఎక్కువ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. మరిన్ని సంస్థలు రావడంతో అవి ఎక్కువ మంది ధనవంతులను చేరుకోగలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సేవల విస్తరణకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘కరోనా తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ గొప్ప పనితీరు చూపించింది. దీంతో ప్రమోటర్లకు, ఈ వ్యాపారాల్లో ఉన్న వారి సంపద పెరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని వారికి ఖర్చు చేయగల ఆదాయం అసాధారణంగా పెరిగింది’’అని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ డైరెక్టర్ జయేష్ ఫరీదా వివరించారు. అంతేకాదు చిన్న పట్టణాల్లో స్టార్టప్లు ఏర్పాటు అవుతుండడాన్ని వెల్త్ మేనేజర్లు గుర్తు చేస్తున్నారు. 50 శాతం స్టార్టప్లు టైర్–2, 3 పట్టణాల నుంచి ఉన్నాయని 2022 మార్చిలో కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేయడం గమనార్హం. ‘‘టైర్–2, 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. దీంతో వ్యాపారాల నిర్వహణ సులభంగా మారుతోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తోడయింది’’అని నువమా ప్రైవేట్ ప్రెసిడెంట్ అలోక్ సైగల్ పేర్కొన్నారు. మెరుగైన రాబడుల కోసం.. చిన్న పట్టణాల్లో హెచ్ఎన్ఐలు పెరగడం ఒక్కటే కాకుండా, కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులను వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంప్రదాయ సాధనాలైన బ్యాంక్ ఎఫ్డీలపై రాబడులు కనిష్ట స్థాయికి చేరడం ఇందులో ఒకటిగా ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డల్గా మారింది. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ తదితర సాధనాల వైపు చూసేలా చేసినట్టు చెబుతున్నారు. తమ కొత్త క్లయింట్లలో ఎక్కువ మంది ఇంత కాలం బంగారం, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ మినహా మరో సాధనంలో పెట్టుబడులు పెట్టని వారేనని వెల్త్ మేనేజర్లు వెల్లడించారు. ఆనంద్రాఠి వెల్త్ మేనేజ్మెంట్ కరోనా ముందు టైర్–2 పట్టణాల క్లయింట్లకు సంబంధించి రూ.814 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, కరోనా అనంతరం రూ.3,500 కోట్లకు పెరిగిపోయాయి. జో«ద్పూర్,, నాగ్పూర్ తదితర పట్టణాల్లో వ్యాపారం రెట్టింపైది. దీంతో టికెట్ సైజు (పెట్టుబడి మొత్తం) తక్కువగా ఉన్నా, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు చిన్న పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. 2022లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు ప్రారంభించిన ఎప్సిలాన్ మనీ తన క్లయింట్లలో 70 శాతం టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ‘‘చాలా మంది క్లయింట్లు సంప్రదాయ సాధనాలతోపాటు, వ్యాపారాలకే పెట్టుబడులు పరిమితం చేసుకుంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాల పట్ల వారిలో అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఉంది’’అని ఆస్క్ ప్రైవేటు వెల్త్ ఎండీ రాజేష్ సలూజా అభిప్రాయపడ్డారు. -
ఏఎన్ఎం పోస్టులు 1520
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో ఏఎన్ఎం(మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–ఫిమేల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయ్యింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్రెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ఇంగ్లిష్లో ఉంటుంది. పేస్కేల్ రూ. 31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ప్రాతిపదికన ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై త్వరలో వెల్లడిస్తామని గోపీకాంత్రెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుము రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ తదితర కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ఇవీ అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి. లేదా ఇంటర్లో మల్టీపర్పస్ హెల్త్ వర్క ర్ (ఫిమేల్) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. నిర్ధారించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్ పూర్తి చేసి ఉండాలి. వారు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే, ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. దరఖాస్తుదారులు 18 – 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. వివిధ వర్గాలకు సంబంధించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్న వారు ధ్రువీకరణపత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఏ సేవలు అందించి ఉంటే, ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. అప్లోడ్ చేయాల్సినవి : అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమో దు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, పదోతరగతి సర్టిఫికెట్, అర్హత సాధించిన కో ర్సులకు చెందిన సర్టిఫికెట్లు ఉండాలి. అనుభవ ధ్రు వీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే కులధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రిమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్ కోరేవారు తాజా ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫికెట్, ఎన్సీసీ ధ్రువీకరణపత్రం వంటివి అవసరాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఏఎన్ఎం పోస్టులను జోన్లవారీగా భర్తీ చేస్తా రు. ఆయా జోన్ల అభ్యర్ధులకే 95% పోస్టులు కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జోన్–1 (కాళేశ్వరం)లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు జిల్లాలు. జోన్–2 (బాసర)లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జోన్–3 (రాజన్న)లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జోన్–4 (భద్రాద్రి)లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జోన్–5(యాదాద్రి)లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం జోన్–6(చార్మినార్)లో మేడ్చల్ మల్కాజిగి రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జోన్–7(జోగులాంబ)లో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. మొత్తం పోస్టులు: 1520 (ఫిమేల్) దరఖాస్తులు స్వీకరణ: వచ్చేనెల 25న ఉదయం 10:30 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5:30 వరకు పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ -
శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు..
కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా... వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు. అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. వారి వల్లే వైఎస్సార్ బీమా వలంటీర్ మహబూబ్బాషా వల్లే నా కుటుంబానికి వైఎస్సార్ బీమా కింద రూ.4.50లక్షలు అందింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణపత్రాలు అందజేసి వైఎస్సార్ బీమా దరఖాస్తు చేయించి డబ్బులు అందేలా చేశారు. వలంటీర్లు చేసిన సేవలను మరువలేం. కరోనా సమయంలో పాల ప్యాకెట్లు ఇంటికే తెచ్చి ఇచ్చారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడంతో ప్రాణాలు నిలుపుకున్నాం. – ధనలక్ష్మి, 39వ వార్డు, నంద్యాల పట్టణం నా బాధలు తీర్చారు.. నా వయసు 66 దాటింది. నాకు 62 ఏళ్ల వరకు రేషన్ కార్డు లేదు. పింఛన్ రాలేదు. నా కుటుంబ సభ్యులు ఆదరించకపోవడంతో ఒంటరిగా బతుకీడుస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్ల నాకు ఎంతో మేలు కలిగింది. మా వలంటీర్ నాసు శివశంకర్ నా సమస్యను తెలుసుకుని రేషన్ కార్డు వచ్చేలా చూశాడు. ఆ తర్వాత పింఛను కూడా పెట్టించాడు. ఆ పింఛనే ఇప్పుడు నాకు జీవనాధారం. ఇంత మంచి వ్యవస్థను అందించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. – పొన్నాన రామారావు, కుమ్మరిగుంట,సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా మా కుటుంబాన్ని కాపాడిన వలంటీర్ రెండేళ్ల క్రితం మా కుటుంబంలోని మొత్తం ఆరుగురం కరోనా బారినపడ్డాం. మా వీధిని రెడ్జోన్గా ప్రకటించారు. అప్పుడు మేం ఇంట్లో నుంచి వెలుపలికి రాలేక అవస్థలు పడ్డాం. అప్పుడు వలంటీర్ అశోక్ వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచాడు. 18 రోజులు పూర్తిగా మాకు సేవలందించాడు.. వంట సామాగ్రి తెచ్చిచ్చాడు. ప్రతి రోజు బిందెలతో తాగునీరు కూడా అందించాడు. ఎవరూ మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. అటువంటి సమయంలో మా ప్రాణాలను రక్షించింది మా గ్రామ వలంటీరే. – నారాయణప్ప, తాళ్లపల్లి, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా వలంటీర్ వల్లే ఇంటి స్థలం వచ్చింది మాకు సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటూ అవస్థలు పడుతున్నాం. గత ప్రభుత్వంలో ఇంటిస్థలం కోసం అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఆర్.మహేష్ మా ఇంటికి వచ్చి ఇంటిస్థలానికి దరఖాస్తు చేయించారు. అధికారులు ఇంటిస్థలం మంజూరు చేశారు. రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం సమీపంలోని అడుసుపాళెం జగనన్న కాలనీలో ఇప్పుడు మేం ఇల్లు నిర్మించుకుంటున్నాం. వలంటీర్ వ్యవస్థ వల్ల నేను ఏ నాయకుని చుట్టూ తిరగకపోయినా, అర్హతను బట్టి ఇంటిస్థలం ఇచ్చారు. – లక్ష్మీపార్వతి, రేణుగుంట, తిరుపతి జిల్లా ఆస్తులన్నీ కరిగిపోయినా... నా పేరు మారంరెడ్డి సుబ్బారావు. నా కుడికాలు, కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా కొండపిలో నలుగురిని యాచిస్తూ జీవిస్తున్నాను. మా గ్రామ వలంటీర్ మారంరెడ్డి గంగాధర్ సహకారంతో నాకు ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంకు అకౌంట్ వచ్చింది. ప్రస్తుతం నాకు పింఛను వచ్చేటట్లు చేశాడు. ప్రతి నెలా కొండపి వచ్చి నాకు పింఛను అందిస్తున్నాడు. గ్రామ వలంటీర్ వ్యవస్థ వలన నాకు ఎంతో మేలు జరిగింది. – మారంరెడ్డి సుబ్బారావు, పీరాపురం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా కష్టకాలంలో కన్నబిడ్డలా చూసుకుంది నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేశాం. నేను, నా భర్త ఇద్దరమే ఉంటున్నాం. నాకు కరోనా సోకడంతో మాట్లాడేందుకు అందరూ భయపడ్డారు. మా వలంటీర్ తాడువాయి శ్వేత ధైర్యంగా మా ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుంది. మందులు ఇచ్చింది. కరోనా సోకిన మూడు రోజుల తర్వాత నాకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో నన్ను నరసరావుపేటలోని క్వారెంౖటెన్ సెంటర్కు పంపించింది. ఇంటి వద్ద ఉన్న నా భర్తకు కూరగాయలు, సరుకులు, పాలు వంటివి అందించింది. కోలుకుని ఇంటికి వచ్చే వరకు మమ్మల్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న వలంటీర్ శ్వేత సేవలను ఎప్పటికీ మరిచిపోలేను. – ఊటా అచ్చమ్మ, ముప్పాళ్ల, పల్నాడు జిల్లా డోలీ మోసి ప్రాణం నిలిపాడు మాది మారుమూల గిరిజన గ్రామం. నేను గత ఏడాది డిసెంబర్లో చెట్టు నుంచి జారి కిందపడిపోయాను. తలకు తీవ్రగాయమై రక్తం అధికంగా పోయింది. బుడపనస గ్రామం నుంచి ప్రధాన రహదారి రంగబయలు వరకు సరైన రహదారి లేకపోవడంతో మా గ్రామ వలంటీర్ రాము మూడు కిలోమీటర్లు గ్రామస్తుల సాయంతో అడవి మార్గంలో మోసుకుని వచ్చాడు. అక్కడ నుంచి 108కి ఫోన్ చేసి ముంచంగిపుట్టు సీహెచ్సీకి తీసుకువెళ్లాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందించాడు. లేకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఖర్చుల నిమిత్తం వలంటీర్ రాము రూ.5 వేలు ఆర్థికసాయం చేశాడు. ఆరోజు ఆస్పత్రికి సకాలంలో తరలించడం వల్ల ఈ ప్రాణాలతో ఉన్నాను. – పాంగి అనుసు, బుడపనస, అల్లూరి సీతారామరాజు జిల్లా నేనున్నానంటూ.. 2021 మే నెలలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరా జుపల్లిలో పేద దంపతులు నాగరాజు, నాగలక్ష్మమ్మ దంపతులకు కష్టమొచ్చింది. వీరి కుమార్తె సుమలత (9)కు తీవ్రజ్వరం 20 రోజులు తగ్గలేదు. హిమోగ్లోబిన్ 1.5కి పడిపోయింది. చనిపోతుందని భావించి ఇంటి బయట పడుకోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ ప్రసాద్ అప్పటి ఎంపీడీవో నరేష్కృష్ణకు సమాచారం అందించారు. బాలికను సొంత ఆటోలో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 15 రోజుల పాటు ఇతరుల నుంచి రక్తం ఇప్పించి బాలికకు చికిత్సలో సహాయపడ్డారు. ఆ అమ్మాయి కోలుకుని ఇంటికి చేరుకుంది. అయితే.. ఐదునెలలకే ఆ బాలిక చనిపోయినప్పటికీ.. వలంటీర్ ప్రసాద్ అందించిన సేవలు మాత్రం గ్రామస్తులకు గుర్తుండిపోయాయి. ప్రసాద్ సేవలను ప్రశంసిస్తూ అప్పట్లో పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ప్రాణాలు కాపాడారు ఈ ఫొటోలో కూరగాయలు ఇస్తున్న యువకులు వలంటీర్లు. కూరగాయలు అందుకుంటున్న వ్యక్తి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన కొమనబల్లి సన్యాసిరావు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో సన్యాసిరావు, రమణమ్మ దంపతులు మాత్రమే ఇంటివద్ద ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుమారుడు ఆ సమయంలో ఇంటికి రాలేకపోయాడు. తాము అసలు బతుకుతామా?లేదా? అనుకున్న సమయంలో వలంటీర్లు వీరికి వెన్నుదన్నుగా నిలిచారు. కూరగాయలు వంటివి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడంతోపాటు వారి కుమారుడిని రప్పించి, కోవిడ్ షెల్టర్లో ఉంచి అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కష్టకాలం నుంచి సన్యాసిరావును, అతడి కుటుంబాన్ని గట్టెక్కించారు. వలంటీర్కు రుణపడి ఉంటా ఈ ఫొటోలో బెడ్పై చికిత్స పొందుతున్న వ్యక్తి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన దూసనపూడి వెంకటేశ్వరరావు. ప్రతి నెల ఒకటో తేదీన వలంటీర్ ద్వారా ఇంటివద్దే పింఛను సొమ్ము అందుకుంటున్న ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విజయవాడ ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ నెల పింఛను అందదేమో అనుకున్నారు. కానీ.. వలంటీర్ కత్తుల వెంకటశ్రీలక్ష్మి సేవాభావంతో ఆమె సొంత ఖర్చులతో విజయవాడ వెళ్లి వెంకటేశ్వరరావుకు పింఛను అందజేశారు. వలంటీర్లు లేకుంటే తనలాంటి వారి గతేమవుతుందని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దేవుళ్ల వంటి వలంటీర్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా కష్టంలో అండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కరోనా కాలంలో ఒక కుటుంబానికి అండగా నిలిచారు వలంటీరు తమ్మిశెట్టి యలమందరావు. ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి కూడా ఎవరూ సాహసించని సమయంలో చల్లా లక్ష్మి కుటుంబానికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కలిగించారు. చల్లా లక్ష్మి.. డ్రైవర్గా పనిచేస్తున్న భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో.. 2019లో కరోనా బారిన పడింది. ఇరుగుపొరుగు వారు, బంధువులు, తోబుట్టువులు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. మాట్లాడేందుకు కూడా ఎవరూ రాని ఆ సమయంలో లక్ష్మిని బతుకు భయం వెంటాడింది. ఆయాసంతో బాధపడుతున్న తనకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్తు ఏమిటనే ఆందోళనకు గురైంది. ఆ సమయంలో ఆ కుటుంబానికి వలంటీర్ తమ్మిశెట్టి యలమందరావు అండగా నిలిచారు. ధైర్యంగా వారి ఇంటికి వెళ్లి కరోనా గురించి ఆందోళన చెందవద్దని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన మందుల కిట్లు, పౌష్టికాహారం అందజేశారు. రోజూ ఆమె ఆరోగ్యం గురించి కనుక్కున్నారు. క్రమంగా లక్ష్మి కోలుకుంది. తమ కుటుంబం ఇప్పుడు ఆనందంగా జీవిస్తోందంటే వలంటీరు సేవలే కారణమని ఆమె సంతోషంగా చెబుతోంది. అంతిమంలోను అండగా.. కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లిలో వలంటీర్లు మోర్త రవి, స్వామిరెడ్డి శివకామేశ్వరరావు, విజ్జపురెడ్డి నాగేంద్ర. 2021 మే నెల 3వ తేదీ గ్రామంలో తలాటం కొండయ్య కరోనాతో మృతిచెందాడు. అతడి బంధువులకు కరోనా సోకడంతో.. కొండయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు వచ్చే వీలు లేకపోయింది. ఇతరులు కూడా భయపడి ముందుకు రాలేదు. మృతదేహం ఉదయం నుంచి సాయంత్రం ఇంటి వద్దే ఉండిపోయింది. వలంటీర్లు వెంటనే పీపీఈ కిట్లు తెప్పించుకుని కొండయ్య మృతదేహాన్ని పంచాయతీ రిక్షాపై మరుభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. సేవకు ప్రతిరూపం కరోనా సమయంలోను భయపడకుండా కరోనా బాధితులకు ప్రభుత్వ సాయాన్ని పంపిణీ చేయడ మేగాక అవసరమైన నిత్యావసరాలను కూడా అందించిన ఈమె వలంటీరు రేణుకాదేవి. తిరుపతి అర్బన్ మండలం 47వ డివిజన్ ఎర్రమెట్ట ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. 2020లో లక్ష్మీదేవికి కరోనా సోకడంతో ఇంట్లోనే వేరే గదిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వలంటీర్ రేణుకాదేవి ఏఎన్ఎం ద్వారా లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు ఇంటివద్దే కోవిడ్ పరీక్షలు చేయించారు. ప్రభుత్వం అందించినరూ.వెయ్యి సాయాన్ని ధైర్యంగా లక్ష్మీదేవి ఇంటికెళ్లి అందజేశారు. రోజు ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీశారు. ఆ కుటుంబ సభ్యులకు అవసరమైన సరుకులను కూడా తీసుకెళ్లి అందజేశారు. బెంగళూరు వెళ్లి.. ఈకేవైసీ కరోనా విజృంభనకు ముందు కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు కర్ణాటకలోని బెంగళూరుకు వలసవెళ్లాయి. కరోనా పెరిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఆ కుటుంబాలు మూడునెలలు అక్కడే ఉండిపోవడంతో రైస్కార్డుల అప్డేట్కు ఈకేవైసీ అవసరమైంది. దీంతో వలంటీర్ శంకర్.. బెంగళూరు వెళ్లాడు. ఆంక్షలను అధిగమించి దాదాపు 400 కుటుంబాలకు అక్కడే ఈకేవైసీ పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, ఆదోని, కోసిగి ప్రాంతాల వాళ్లను కలుసుకుని ఈకేవైసీ పూర్తిచేశాడు. సేవ చేసేందుకే మేము.. ఇతడి పేరు వల్లెపు వెంకటేశ్వరరావు. దివ్యాంగుడు. బాపట్ల జిల్లా అద్దంకి మౌలానగర్ నివాసి. 2021 ఆగస్ట్లో ఇంట్లో వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంకటేశ్వరరావుకు కూడా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో మేదరమెట్ల వైద్యశాలలో చేరాడు. బజారులో తిరగడానికే భయపడుతున్న సమయంలో.. వారి వార్డు వలంటీరు సైదా మేదరమెట్ల వైద్యశాలకు వెళ్లి వెంకటేశ్వరరావుకు వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందించాడు. దీంతో వెంకటేశ్వరరావు తండ్రి ఇలాంటి సమయంలో మా దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చావని సంతోషిస్తూ అందులో సగం డబ్బు వలంటీరుకు ఇవ్వబోయాడు. ‘మేము సేవ చేయడానికే ఉన్నాం. ఇది మాకు జగన్ ఇచ్చిన వరం. మాకు ఏమీ వద్దు..’ అంటూ సైదా తిరస్కరించాడు. దీంతో అందరూ సైదాను అభినందించారు. మాస్కులు లేని వారికి ఉచితంగా మాస్కులు పంచడం వంటి సేవలు కూడా చేసిన సైదా అందరి ప్రశంసలు అందుకున్నాడు. పరిశుభ్రతలో.. ఇక్కడ రిక్షా తొక్కుతూ బ్లీచింగ్ చల్లుతున్న వారు పారిశుద్ధ్య కార్మికులు కాదు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వలంటీర్లు దట్టి బాలకృష్ణ, సంతోష్కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి. 2020 మే 26వ తేదీ నాటిది ఈ చిత్రం. కోవిడ్ కాలంలో ప్రజలు బయటకు రావడానికి వణికిపోయారు. శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి భయపడటంతో ఆ పనుల్ని కూడా ఈ నలుగురు భుజానికెత్తుకున్నారు. స్వచ్ఛ భారత్ వాహనాన్ని తీసుకుని వీధుల్లో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. దట్టి బాలకృష్ణ రిక్షా తొక్కగా సంతోష్కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి బ్లీచింగ్ చేతపట్టుకుని వీధివీధిన చల్లారు. ట్రాన్స్ఫార్మర్ను భుజాలపై వేసుకుని కొండలెక్కి.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని చలిసింగం గ్రామం రెండు కొండల అవతల ఉంది. ఆ గ్రామంలో తాగునీటి సదుపాయం కోసం చీకాయపాడు బోరుబావి నుంచి కొండపైకి పైపులైన్ వేశారు. గత ఏడాది ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో దానికి అమర్చిన మోటారు పనిచేయక నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాన్స్కో సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ను రహదారి ఉన్న చీకాయపాడు వరకు తేగలిగారు. అక్కడి నుంచి కొండపైకి చేర్చే మార్గం లేక అక్కడే వదిలేశారు. ఎవరూ రాకపోవడంతో రెండురోజులు అక్కడే ఉండిపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు వంజరి రవీంద్ర, కూడ రవి, తుర్రె రవి, ఒంపురి రాజు, సబ్బారపు రమణ నడుం బిగించారు. బలమైన కర్రల సహాయంతో ట్రాన్స్ఫార్మర్ను భుజాలపైకి ఎత్తుకుని అతి కష్టంపై రెండు కొండలెక్కారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించి తాగునీటి ఇబ్బందులు తొలగించారు. -
రైళ్లలో అరకొరగా ఆన్బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్రోల్స్ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్ప్రెస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా షార్ట్సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
ఉద్యమంగా ‘జగనన్న సురక్ష’
పేదవాడు ఎలా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులు పోయి.. ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో 99 శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాల వల్లో మిగతా ఒక్క శాతం మంది కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా, దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏమైనా సమస్యలున్నాయా అని అడుగుతున్న తొలి ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం.. ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు, పలానా పథకం లబ్ధి అందలేదని చెప్పే అవకాశం ఉండకూడని విధంగా సమస్యలు పరిష్కరించాలన్నదే ధ్యేయమని పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే జల్లెడ పట్టి.. అర్హులను గుర్తించి, పథకాలే కాదు వారికి కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా ఈ కార్యక్రమంలో ఇస్తారని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మండల, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ.. నేరుగా పేద లబి్ధదారుల దగ్గరకు వెళ్లడమే జగనన్న సురక్షా కార్యక్రమం అన్నారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండీ పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హుల తలుపు తట్టి, లబ్ధి చేకూర్చే మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అర్హుల కోసం జల్లెడ పడతాం ♦ అర్హులెవ్వరూ మిగిలిపోకూడదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జూలై, డిసెంబర్ మాసాల్లో పథకాలు మంజూరు చేస్తున్నాం. దీనికి మరో ప్రయత్నంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మిగిలిపోయిన అర్హుల కోసం జల్లెడ పట్టే ఈ కార్యక్రమం నెల పాటు కొనసాగుతుంది. ♦ ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర సేవలన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారు. దాదాపు 11 రకాల సేవలు ఎలాంటి సర్విసు చార్జీ లేకుండా అందించేలా అడుగులు వేస్తున్నాం. ఆధార్ కార్డుల మార్పులకు కోసం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2,500 సెంటర్లు ఏర్పాటు చేయించాం. వాటికి సంబంధించిన విధి, విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ మేరకు సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం కింద అందిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ.. ♦ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ఉత్సాహవంతులు ఒక బృందంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తడతారు. లబ్ధి అందని వారు, ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి సచివాలయంలో సమర్పిస్తారు. ♦ ఒక టోకెన్ నంబరు జనరేట్ చేసి, సర్వీసు రిక్వెస్ట్ నంబర్ కేటాయించి.. దానిని ఆయా కుటుంబాలకు అందిస్తారు. సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారు, మండల అధికారులు ఎప్పుడు వస్తారన్న తేదీ కూడా వారికి చెబుతారు. ఆ రోజున వారిని క్యాంపులకు తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు. ♦ ఈ నెల రోజుల్లో క్యాంపుల సందర్భంగా మండల స్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి ఈ సమస్యలను పరిష్కరించి, సరి్టఫికెట్లు ఇస్తారు. తాసీల్దార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో ఒక టీంగా, డిప్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ రెండో టీంగా ఏర్పడతారు. ♦ ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1 నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది ఉద్యోగులు, వలంటీర్లు ♦ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పేదవాడికి సాయం చేయడం కోసం సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వలంటీర్లు సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారు. ♦ 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు అన్ని క్యాంపుల్లో పాల్గొంటారు. అక్కడ సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీ కూడా మానిటరింగ్ చేస్తారు. క్యాంపుల నిర్వహణలో జాగ్రత్తలు ♦ సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి క్యాంపును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కచ్చితంగా సందర్శించాలి. లబ్దిదారులకు క్యాంపుల గురించి సరైన సమాచారం అందించాలి. ♦ జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి వాటిని కూడా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్లు అడిగింది సాధ్యం కాని పరిస్థితులు ఉంటే ఆ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. దాన్ని కూడా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. రెవెన్యూ డివిజన్ల వారీగా కూడా ఈ కార్యక్రమంపై పర్యవేక్షణ అవసరం. ఈ అంశంపై కూడా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. ♦ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్పుడు, ఇప్పడు పరిస్థితి గమనించండి ♦ నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వంలో పరిస్థితులను చూడండి. ఏ పట్టణాన్ని, ఏ గ్రామాన్ని, ఏ వార్డును తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. మరో వైపు వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు. మీరు ఏ పార్టీ వారనే ప్రశ్న ఎదురయ్యేది. ♦ మనం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఆరు నెలల్లోనే దాదాపు 600 రకాల పౌరసేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటకు తీసుకు వచ్చాం. ♦ అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా.. ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా పౌర సేవలు అందించడం మన ప్రభుత్వంలోనే మొదలైంది. ♦ అందువల్లే ఇవాళ ప్రతిపక్షాలకు అజెండా అన్నది మిగల్లేదు. ఇంతకు ముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్ల పట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఉద్యమాలు జరిగే పరిస్థితులు ఉండేవి. ఈ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, బర్త్, ఇన్కం, డెత్, ఇన్కం సర్టిఫికెట్లు గ్రామ స్థాయిలోనే అందుతున్నాయి. ♦ ఈ నాలుగేళ్లలో నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో డీబీటీ ద్వారా నేరుగా జమ చేశాం. నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాల విలువ కూడా కలుపుకుంటే అది రూ.3.10 లక్షల కోట్లు దాటింది. -
తెలంగాణలో జియో ట్రూ5జీ సేవల విస్తరణ
హైదరాబాద్: టెలికం దిగ్గజం జియో తాజాగా తెలంగాణలో తమ ట్రూ 5జీ సేవలను మరింతగా విస్తరించింది. ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా 850 ప్రాంతాల్లో సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాంతాలన్నింటిలోనూ 1జీబీపీఎస్ పైగా వేగంతో అపరిమిత డేటాను వెల్కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో తమ ట్రూ 5జీ సర్వీసులు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
రూ.2వేల నోట్ల మార్పిడి.. బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
ఈ నెల 19 నుంచి దేశ వ్యాప్తంగా రూ. 2000 వేల నోట్లు ఎక్ఛేంజ్, డిపాజిట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆర్బీఐ రూ. 2000 నోట్లను ఉపసంహరణ ప్రకటనతో దేశంలో పలు బ్యాంక్లు కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చాయి. బ్యాంకులు సాధారణంగా నెలలో జరిపే ట్రాన్సాక్షన్లు మించి జరిగితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ ఛార్జీలు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై వర్తిస్తాయని తెలిపాయి. ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు మాత్రం ఆ అదనపు ఛార్జీల భారాన్ని కస్టమర్లపై మోపడం లేదని ప్రకటించాయి. దీంతో సదరు బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్ల డిపాజిట్లు, ఉపసంహరణ చేసే ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లైంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్లలో రూ.2000 నోట్లను మెషిన్లో డిపాజిట్లు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లు ఇతర పద్దతుల్లో బ్యాంక్ సర్వీసుల్ని వినియోగించి డిపాజిట్లు చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేవైసీ నిబంధనలకు లోబడి బ్యాంక్ ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవని కస్టమర్లకు మెయిల్స్ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రూ.2వేల నోట్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 30,2023 వరకు ఎలాంటి అందనపు ఛార్జీలు విధించబోమని, సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో రూ. 2,000 డినామినేషన్ నోట్ల డిపాజిట్లపై నగదు చెల్లింపు ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ కార్డ్లను అడగడం లేదని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిల్ ద్వారా తన కస్టమర్లు రూ. 2,000 నోట్లను తమ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో సెప్టెంబర్ 30, 2023 వరకు ఏదైనా బ్రాంచ్లో జమ చేసుకోవచ్చని తెలియజేసింది. చదవండి👉 రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్లు! -
నర్సాపూర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్–యశ్వంత్పూర్ మధ్య 6 వారంతపు సర్విసులు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్పూర్ (07687) ఈ నెల 14, 21, 28 తేదీలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి 7.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్పూర్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. -
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది. ► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ)ని ప్రారంభించారు. ► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది. ► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది. ► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి. ► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్లో) సమయం భారతదేశం, సింగపూర్లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది. 50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. -
జంటనగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
-
మరో 14 నగరాల్లో జియో సర్వీసులు ప్రారంభం: వెల్కమ్ ఆఫర్ కూడా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సర్వీసులను తెలంగాణలో మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మరో 14 నగరాల్లో లాంఛనంగా సేవలను ప్రారంభింంది. కామారెడ్డి, మిర్యాలగూడ, గద్వాల్, సిరిసిల్ల, భువనగిరి తదితర నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లోని వినియోగదారులకు జియో వెల్కమ్ ఆఫర్ కింద ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 1 జీబీపీఎస్ పైగా వేగంతో అపరిమిత డేటా లభించగలదని సంస్థ తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సహా 19 నగరాల్లో ట్రూ 5జీ సర్వీసులను జియో అందిస్తోంది. కొత్తగా మొదలుపెట్టిన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ్చనట్లవుతుందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు. -
16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు ప్రారంభించనున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించిన ఆలయ అధికారులు.. భక్తులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరిగింది. సేవల వివరాలు ఇవీ.. వేదాశీర్వచనం: స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో (ఒక్కొక్కరికి లేదా దంపతులు) రూ.500 టికెట్తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్లలో ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్పీసు, 100 గ్రామల లడ్డూ అందజేస్తారు. స్వామివారికి తులసీమాల అలంకరణ (ప్రతి శనివారం) రూ.1,000 టికెట్తో దంపతులు లేదా ఒకరికి ఉదయం 7 గంటలకు ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో భక్తుల సమక్షంలో ధ్రువమూర్తులకు అలంకరణ చేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కండువా, జాకెట్ పీసు, 100 గ్రాముల లడ్డూలు రెండు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని బహూకరిస్తారు. స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ రూ.5 వేల టికెట్తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజు 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిõషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీ అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చన, నిత్యకల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం, దర్బారు సేవ, పవళింపు(ఏకాంత) సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ రూ.10 వేల టికెట్తో శ్రీరామనవమి కల్యాణ టికెట్ సెక్టార్ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు (ఉభయం), కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు. నిత్య పూల అలంకరణ సేవ రూ. 5 వేల టికెట్తో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం అందజేస్తారు. తులాభారం రూ.100 టికెట్ ధరతో ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, లేదా బియ్యం.. తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు. -
వాలంటీర్లంటే వణుకెందుకు బాబూ ?
-
వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు మీ ప్రాబ్లం సాల్వ్..!
-
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
భారత్-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!
ముంబై: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యునైటెడ్ అరబ్ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు) ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని అంచనా. ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్లు ఉన్నాయి. -
టెలీమెడిసిన్ సేవల్లో రికార్డు సృష్టించిన ఏపీ
-
ముద్దుల పెట్కు గ్లామర్...
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో గ్లామర్ మేనియా ఇంట్లో వారికే కాదు.. వాళ్ల పెంపుడు జంతువులకూ ముఖ్యమైపోయింది. ముద్దొచ్చే తమ పెట్స్ను మరింత అందంగా చూడాలనుకుంటున్న యజమానులు ఇందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెంపుడు జంతువులను ముస్తాబు చేసే సంస్థలు హైదరాబాద్లో క్రమంగా పెరుగుతున్నాయి. మసాజ్, గోళ్ల కత్తిరింపు, బబుల్ బాత్ వంటి సేవలను పెంపుడు జంతువులకు అందిస్తున్నాయి. తరలి వచ్చె తళుకులద్దగ... గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని హైదరాబాద్లో కొన్ని సంస్థలు మాత్రమే అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెంపుడు జంతువులను గ్రూమింగ్ పార్లర్స్కు తీసుకెళ్లలేక నగరవాసులు పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు డజనుకుపైగా మొబైల్ వ్యాన్లు పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నారు. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నామని మొబైల్ పార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు గంట పడుతుందని... బొచ్చు కుక్కలకు మాత్రం 90 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. అలాగే పిల్లులను పెంచుకొనే వారికి కూడా సేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పెట్ను ఫంక్షన్ లేదా ఫోటోషూట్కు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్ను సెట్ చేయడం కూడా చేస్తామని చెబుతున్నారు. వెటర్నరీ డిప్లొమా వారినే తీసుకున్నాం... మా మొబైల్ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారికి 3 నెలలపాటు శిక్షణ సైతం అందిస్తున్నాం. – జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు చైత్ర వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే.. శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం మన వల్ల సాధ్యం కాదు. ఫలితంగా పెట్స్కు చర్మవ్యా« దుల వంటివి రావచ్చు. అందుకే నా పెట్కి నెలకో సారి స్పాలో స్నానం, 3 నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. సగటున దాని శుభ్రతకు నెలవారీగా రూ. 3 వేలు ఖర్చు పెడుతున్నా. అయితే పెట్స్కు వ్యాధులు సోకితే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. పెట్ మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్ -
క్రెడిట్ కార్డ్తో యూపీఐ సేవలు
-
పెద్ద అవుటపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్ద అవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. తానా సర్వీసెస్ డే సందర్భంగా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో RCM స్కూల్ నందు సోమవారం ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్స్ పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు వంటి సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 27 గ్రామాల ప్రజలు, గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. 1. తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు 2. టాప్ స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం 3. ఉచిత వినికిడి పరీక్షలు 4. ఉచిత మెగా కంటి శిబిరం 5. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమము 6. తానా రైతుకోసం సందర్భంగా రైతులకు రక్షణ కిట్లు పంపిణీ. 7. తానా చేయూత ద్వారా 20 మంది అనాధ పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ. 8. జిల్లా పరిషత్ హైస్కూల్ అబివృద్ధి కోసం 1,00,000 డొనేషన్. ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని కిరణ్ కలపాల కో ఆర్డినేట చేసుకొని తమ సహకారం అందచేశారు. తానా ప్రతినిధులు: లావు అంజయ్య చౌదరి, తానా అధ్యక్షులు, వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ చైర్మన్, సతీష్ వేమూరి తానా తానా సెక్రటరి, సతీష్ వేమన, మాజీ తానా అధ్యక్షులు, రవి పోట్లురి, 2023 తానా Convenntion Convener, సునీల్ పాత్ర, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్, రాజా కసుకుర్థి, తానా కమ్యూనిటి సర్వీసెస్, సురేష్ పుట్టగుంట, ఫౌండేషన్ ట్రస్టీ, శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ, శశాంక్ యార్లగడ్డ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, ఠాగోర్ మలినేని, మీడియా కో ఆర్డినేటర్, శ్రీనివాస్ కోకట్ల,ఈవెంట్స్ కో ఆర్డినేటర్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మినారాయణ సూరపనేని, అనిల్ లింగమనేని, గన్నే రమణ, వంశీ కోట, రమేష్ యలమంచిలి, శ్రీనివాస్ నాదెండ్ల, అనిల్ యలమంచిలి, శ్రీనివాస్ తాతినేని, సుమంత్ పూసులురు ప్రజా ప్రతినిధులు: లావు రత్తయ్య, విజ్ఞాన సంస్థల అధినేత కృష్ణ దేవరాయులు, నరసరావుపేట ఎంపీ, కంభంపాటి రామ మోహనరావు, మాజీ రాజ్య సభ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ మంత్రి కూన రవికుమార్, మాజీ విప్, ఆమదాలవలస, ఆరుమళ్లీ రాదకృష్ణ, మాజీ ఎంఎల్ఏ, తణుకు, బచ్చుల అర్జునుడు, ఎంఎల్సీ, గన్నవరం, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంఎల్సీ గన్ని కృష్ణ, మాజీ గూడా చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాబి, అధికార ప్రతినిధి కేసీనేని చిన్ని, సీనియర్ నాయకులు రాము వెనిగళ్ల, సీనియర్ నాయకులు, కొనగల్ల బుల్లయ్య, రాష్ట్ర సెక్రటేరి ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, నీటి సంఘాల అధ్యక్షులు మూల్పూరి సాయి కళ్యాణి, తెలుగు మహిళ కార్యదర్శి .లావు ఫౌండేషన్ ద్వారా పెద్ద అవుటపల్లి గ్రామంలో మరెన్నో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తామని తానా అధ్యక్షులు చెప్పారు. -
హైదరాబాద్: మెట్రో ఎక్స్ప్రెస్ వే.. పెట్టుబడులకు ఆకర్షణగా కూడా!
-
మ్యాక్స్ ఫిన్కు సుమితోమో వాటా
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో మిగిలిన వాటాను కొనుగోలు చేసేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ను అనుమతించింది. దీంతో మిత్సుయి సుమితోమో కంపెనీకి గల 5.17 శాతం వాటాను రానున్న రెండు వారాల్లోగా సొంతం చేసుకునే వీలున్నట్లు మ్యాక్స్ ఫైనాన్షియల్ పేర్కొంది. షేరుకి రూ. 85 ధరలో 9.91 కోట్ల మ్యాక్స్ లైఫ్ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు మాతృ సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలు తదుపరి మ్యాక్స్ లైఫ్లో మాతృ సంస్థ వాటా 87 శాతానికి బలపడనుంది. గతంలో మ్యాక్స్ లైఫ్లో మిత్సుయి సుమితోమో 25.48 శాతం, మ్యాక్స్ ఫైనాన్షియల్ 72.52 శాతం చొప్పున వాటాలను కలిగి ఉండేది. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఔట్ పేషెంట్ (ఓపీడీ), ఇతర సేవలను అందించేందుకు డాక్టర్ల నెట్వర్క్ లేదా ఇతర ఆరోగ్య రంగ నిపుణులతో రిజిస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని.. బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ‘‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీ ‘ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ’ (హెచ్పీఆర్)ని ఏర్పాటు చేసింది. ఇందులో నమోదిత డాక్టర్లు, ఇతర ఆరోగ్య రంగ నిపుణుల వివరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది సాయపడుతుంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం పాలసీదారులకు ఓపీడీ, ఇతర సేవలు అందించేందుకు వీలుగా.. ఈ హెచ్పీఆర్ సాయంతో డాక్టర్లు/ఫిజీషియన్లు లేదా ఆరోగ్య రంగ నిపుణులతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మెడికల్ ప్రాక్టీషనర్ల గుర్తింపు, ధ్రువీకరణకు హెచ్పీఆర్ ఐడీని ఉపయోగించుకోవాలని సూచించింది. -
హైదరాబాద్ లో జియో 5G ఫ్రీ ..!
-
5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయి : ప్రధాని నరేంద్ర మోదీ
-
అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు.. తొలి దశలో 1000 మందికి..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా నేటి నుంచి (అక్టోబర్ 1) ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభమవుతున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తొలిదశలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయి సేవలు మొదల వుతాయన్నారు. ఇక్కడి సర్క్యూట్ హౌస్లో ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన ఆరుగురు ప్రతినిధులతో మంత్రి శుక్రవారం భేటీ అయ్యారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో ఓ మంచి వాతావరణంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నంబర్వన్ స్థానంతోపాటు పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనలోనూ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో మహానేత వైఎస్సార్ విశాఖలో వేసిన ఐటీ మొక్క ఇప్పుడు వృక్షంలా మారిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమన్నారు. ఇప్పటికే కొన్ని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీరికి కావాల్సిన ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందించమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. వారు కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాజా ఉద్యోగులతో పాటు త్వరలో కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కొత్త ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసుకుంటుందన్నారు. ఇక బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. దీనిపై కొందరు టీడీపీ పెద్దలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, స్వయాన లోకేశే ఐటీ మంత్రిగా పనిచేసి విశాఖకు చేసింది శూన్యమని మంత్రి కౌంటర్ ఇచ్చారు. -
అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 5G సేవలు
-
అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవలకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న ప్రగతి మైదాన్లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఇండియా 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేసింది.రానున్న ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్లో 5 జీ సేవలను లాంచ్ కానునున్నాయని ప్రకటించింది. (విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్) దేశీయ డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ ప్రధాని ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నారని వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధరర్వ్యంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని నిర్వహిస్తారు. కాగా అతి త్వరలోనే దేశంలో 5జీ టెలికాం సేవలు 80శాతం చేరువ కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మీడియా మింట్ కొనుగోలు ఒప్పందం రద్దు: బ్రైట్కామ్
న్యూఢిల్లీ: మీడియామింట్ సంస్థ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్రైట్కామ్ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ‘కొనుగోలు లావాదేవీ కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య డీల్గా మార్చుకోవాలని, బ్రైట్కామ్ భవిష్యత్తులో చేపట్టే కొనుగోళ్లకు బ్యాక్ఎండ్ సేవలు అందించాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 7న కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. మీడియామింట్ ఇటీవల దక్కించుకున్న కొంత మంది క్లయింట్ల కార్యకలాపాలు .. బ్రైట్కామ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం కోవకే చెందినవని, దీని వల్ల విలీన సంస్థ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. -
ఎస్బీఐ బంపరాఫర్, స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు అవసరమైన ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్టప్లకు హబ్గా ఉంటున్న బెంగళూరులోని కోరమంగళలో తొలి బ్రాంచీని మంగళవారం ప్రారంభించింది. ప్రారంభ దశ మొదలుకుని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యే వరకూ అంకుర సంస్థలకు అవసరమైన తోడ్పాటును ఈ శాఖ అందిస్తుందని బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఈ శాఖ అనుభవాలను పరిశీలించి, వచ్చే ఆరు నెలల్లో గురుగ్రామ్లో రెండోది, హైదరాబాద్లో మూడోది ప్రారంభించనున్నట్లు వివరించారు. రుణాలు, డిపాజిట్లు, రెమిటెన్సులు, చెల్లింపులు, ఫారెక్స్, బీమా తదితర సర్వీసులు, న్యాయ సలహాలు, డీమాట్.. ట్రేడింగ్ ఖాతాలు మొదలైనవన్నీ ఎస్బీఐ స్టార్టప్ బ్రాంచ్లో పొందవచ్చు. స్టార్టప్ వ్యవస్థలో భాగంగా ఉండే వివిధ వర్గాలన్నింటికీ అవసరమైన ఆర్థిక, సలహాలపరమైన సర్వీసులను ఇది అందిస్తుంది. -
ఎయిర్ ఇండియా అదనపు సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అదనంగా 24 సర్వీసులను దేశీయంగా జోడిస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, అలాగే ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ మార్గాల్లో ఇవి జతకూడనున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. ఆగస్ట్ 20 నుంచి కొత్త సర్వీసులు తోడవనున్నాయి. విమానాల కోసం భాగస్వాములతో ఆరు నెలలుగా చర్చిస్తున్నామని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంబో విల్సన్ తెలిపారు. ఇవి ప్రస్తుతం ఫలిస్తున్నాయని చెప్పారు. -
5జీ: మేమే ముందు అంటున్న ఎయిర్టెల్, జియోకు షాకేనా?
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీకి మద్దతుగా శక్తివంతమైన నెట్వర్క్తో 5జీ సేవలను భారత్కు పరిచయం చేయడంలో కంపెనీ ముందంజలో ఉంటుందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. అందరి కంటే ముందుగా భారత్లో 5జీ పరీక్షలను జరిపినట్టు ఎయిర్టెల్ 2021-22 వార్షిక నివేదికలో గుర్తు చేశారు. ’ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగండి’ అనే శీర్షికతో వాటాదార్లకు ఆయన సందేశం ఇచ్చారు. ‘రాబోయే కాలంలో అసెట్ లైట్ విధానాన్ని కొనసాగిస్తూనే డిజిటల్ సేవలు కంపెనీ ఆదాయానికి అనేక బిలియన్ డాలర్లను జోడిస్తాయి. ఎయిర్టెల్ డిజిటల్ ప్రయాణంలో అందించిన ప్రారంభ విజయాలు ఈ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. 5జీ క్లౌడ్ గేమింగ్ అనుభవాన్ని ప్రదర్శించిన తొలి భారతీయ టెలికం సంస్థగా నిలిచాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం 700 మెగాహెట్జ్ బ్యాండ్లో ట్రయల్స్ చేపట్టిన మొదటి ఆపరేటర్ పేరు తెచ్చుకున్నాం. కోవిడ్-19 కొత్త రకాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, అంతకంతకూ పెరుగుతున్న వస్తువుల ధరలు, అధిక ద్రవ్యోల్బణం మధ్య 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక ప్రకాశ వంతమైన ప్రదేశంగా ఉద్భవించింది. మనమందరం ఒక పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధం కావాలి. నూతన విశ్వాసంతో కొత్త మార్గంలో పనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి’ అని వార్షిక నివేదికలో వివరించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం కౌంట్డౌన్ మొదలైనందున సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ రేడియో తరంగాలను జూలై 26 నుంచి వేలం వేయనున్న సంగతి తెలిసిందే. జూలై 22, 23 తేదీల్లో టెలికం శాఖ మాక్ ఆక్షన్ నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు అదానీ ఎంటర్ప్రైసెస్ సైతం వేలంలో పాల్గొంటున్నాయి. ఇది కూడా చదవండి: రూపాయి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు -
సర్కారు దవాఖానలో సౌలత్లు బాగున్నయ్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని చింతల్ఠాణా పునరావాస కాలనీకి చెందిన సామంతుల వసంత, స్వామి కూతురు శిరీష (హారిక) పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లారు. వైద్యులకు చూపించారు. వారు ‘ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం’అనడంతో.. సాధారణ కాన్పుకు సిద్ధమయ్యారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు, సేవలపై వసంత సంతృప్తి చెందింది. దీంతో చదువు రాని ఆమె వెంటనే తన కూతురు శిరీషతో రాయించిన ఉత్తరం మంత్రి హరీశ్రావుకు మంగళవారం చేరింది. ఉత్తరం ఇలా.. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులున్నాయని నా బిడ్డను సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేశాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికెళ్లినం. అక్కడ డాక్టర్లు మంచిగా చూసి ‘సాధారణ కాన్పు చేపించుకో’అన్నారు. పైసా ఖర్చులేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, అమ్మఒడి వాహనంలో మా ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా. సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్.. కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. నాకు జరిగిన మేలు అందరికి జరగాలే.. ఇట్లు.. శామంతుల వసంత’అని లేఖలో పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని.. సాధారణ కాన్పులు చేపించుకోవాలని, తన బిడ్డకు జరిగిన మేలు అందరికీ జరగాలని ఒక మంచి సందేశం ఇచ్చిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది. – మంత్రి హరీశ్రావు సారుకు చేరుతుందని అనుకోలే.. మా బిడ్డ చిన్న వయసుది. కోనరావుపేట మల్కపేటకు చెందిన శ్రీకాంత్తో పెళ్లి చేసినం. తొలిచూరు కాన్పు తల్లిగారే చేయాలి కాబట్టి సిరిసిల్ల దవాఖానాకు తీసుకపోయిన. నార్మల్ డెలివరీ అయింది. మాకు జరిగిన మేలు పది మందికి తెలువాలే అని సారుకు మా బిడ్డ శిరీషతో ఉత్తరం రాయించిన. అది సారుకు చేరుతుందని అనుకోలే. ప్రైవేటు దావాఖానాకు పోతే ఎంత లేదన్నా రూ.40వేలు అయ్యేది. మా ఉత్తరానికి మంత్రి స్పందించడం సంతోషంగా ఉంది. – వసంత, చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ -
Vizag: ‘ఇన్ఫోసిస్’ గుడ్న్యూస్.. ఆగస్టు నుంచే సేవలు!
దొండపర్తి(విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు నుంచే సేవలు అందించేందుకు ఆ సంస్థ సమాయత్తమవుతోంది. ముందుగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఓ ప్రైవేట్ నిర్మాణంలో కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు నగరంలో అన్వేషిస్తున్నారు. చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు 800 ఉద్యోగుల కోసం.. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ సంస్థ మెట్రో నగరాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. టైర్–2 నగరాల్లో అన్నింటి కంటే విశాఖే ప్రథమ స్థానంలో ఉండడంతో.. ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్ ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 750–800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేíÙస్తున్నారు. ఇక్కడ కార్యాలయం ఏర్పాటు వల్ల రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదు. పశి్చమ, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది. త్వరలో పూర్తి స్థాయిలో సేవలు ఇన్ఫోసిస్ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయాలతో విశాఖలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటి వరకు సొంత నిర్మాణాల్లోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలయానికి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం అధిక శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. కోవిడ్ క్రమంగా తగ్గుతుండడంతో మళ్లీ కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను మెట్రో నగరాలకు రప్పించే కంటే రాష్ట్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇన్ఫోసిస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. అందుకు అనువైన వాతావరణాన్ని కలి్పస్తామని భరోసా కలి్పంచింది. దీంతో విశాఖ కేంద్రంగా సంస్థ సేవలు అందించేందుకు సంస్థ ఆసక్తి చూపించింది. భవిష్యత్లో విస్తరణ ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. భవిష్యత్తులో సంస్థ సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇన్ఫోసిస్ రాకతో విశాఖలో ఐటీ పునరుత్తేజానికి బాటలు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. మున్ముందు మరిన్ని బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విద్యావేత్తలు, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
‘వాట్సాప్’ సేవలు.. ఏపీ సర్కార్ ఒప్పందం..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను త్వరితగతిన ప్రజలకు చేరవేసే విధంగా వాట్సాప్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ–సేవల విస్తరణలో భాగంగా వాట్సప్ చాట్బోట్ సేవలను కూడా అందించనున్నట్లు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) తెలియజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగతిశీల అజెండాను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేర వేసేలా వాట్సాప్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఏపీడీసీ వైస్ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్సెట్టర్ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ మరింత మెరుగు పరిచే విధంగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వాట్సాప్ ఇండియా పబ్లిక్పాలసీ అధిపతి శివనాథ్ ఠుక్రాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా వాట్సాప్ సేవలు ఉపయోగపడతాయన్నారు. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్ సేవలకు స్వస్థి పలికింది. 104 వాహనాల సేవలను రద్దు చేస్తూ బుధవారం జీవోను విడుదల చేసింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్ సేవలను కోల్పోనున్నారు. ఇక, 104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇదిలా ఉండగా, 104 అంబులెన్స్ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఈ అంబులెన్స్లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, డ్రైవర్లను నియమించింది. ఇది కూడా చదవండి: రోగులకు మందుల సరఫరాకు బ్రేక్ -
5జీ సర్వీసులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశీయంగా సొంత 5జీ టెలికం సాంకేతికత ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికల్లా అందుబాటులోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు. నాణ్యమైన సాంకేతికతను చౌకగా పొందేందుకు ఇతర దేశాలు కూడా ఈ టెక్నాలజీలను పరిశీలించాలని కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు సూచించారు. మరోవైపు, ఆర్థిక వృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో డిజిటల్ తారతమ్యాలను తొలగించడం మరింత కీలకంగా మారిందని వైష్ణవ్ తెలిపారు. సమ్మిళిత వృద్ధి కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఆయన వివరించారు. మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వైష్ణవ్ చెప్పారు. నిబంధనలు పాటించకుంటే.. వెళ్లిపోవచ్చు.. కొత్త మార్గదర్శకాలను పాటించేందుకు సిద్ధంగా లేని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వీస్ ప్రొవైడర్లకు దేశం నుంచి నిష్క్రమించడం ఒక్కటే మార్గమని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సైబర్ నేరాల రిపోర్టింగ్ కొత్త నిబంధనలపై సందేహాల నివృత్తికి రూపొందించిన ఎఫ్ఏక్యూలను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీతో భారీగా ఉపాధికి ఊతం: టెలికం శాఖ కార్యదర్శి 5జీ టెక్నాలజీ, కొత్త సర్వీసులతో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు రాగలవని టెలికం శాఖ కార్యదర్శి కె. రాజారామన్ తెలిపారు. కొత్త టెక్నాలజీల్లో శిక్షితులైన వారి అవసరం గణనీయంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. టెలికం పరిశ్రమ నైపుణ్యాల మండలి (టీఎస్ఎస్సీ) కార్యక్రమంలో పాల్గొ న్న సందర్భంగా రాజారామన్ ఈ విషయాలు వివరించారు. భారత్నెట్ నుంచి స్పేస్ కమ్యూనికేషన్స్ వరకూ, 5జీ నుంచి ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల దాకా టెలికంలో.. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన విభాగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు రాగలవన్నారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే 5జీ ప్రక్రియ.. -
తెలుగు రాష్ట్రాల్లో 71 పట్టణాల్లో జియో ఫైబర్
దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సేవలు భారీ స్థాయిలో విస్తరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు లభిస్తున్నాయి. జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందిన వారు వర్క్ ఫ్రం హోంకి అనుకూలంగా ఉంది. కొత్త యూజర్లకు పోస్ట్ పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్ స్టాలేషన్ లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్ టెయిన్ మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్ కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్ ను చూడవచ్చు. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. వీటిలో విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలతో పాటు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులు ఉన్నాయి. తెలంగాణలో తెలంగాణలో జియోఫైబర్ 28 నగరాలు, పట్టణాలకు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్ లలో కూడా లభ్యమవుతుంది. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది. చదవండి: జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్స్క్రిప్షన్! -
శాటిలైట్ సర్వీసుల కోసం 27.5 గిగాహెట్జ్ స్పెక్ట్రం!
త్వరలో నిర్వహించబోయే వేలంలో 27.5–28.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయించకపోవచ్చని తెలుస్తోంది. దీన్ని శాటిలైట్ సర్వీసుల (టీవీ,రేడియో, ఇంటర్నెట్) కోసం పక్కన పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫ్రీక్వెన్సీని మొబైల్, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. అయితే, 5జీ, శాటిలైట్ ట్రాన్స్మిటర్లు పక్కపక్కనే పని చేయడం కుదరదని, ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీని రెండు రకాల సర్వీసుల కోసం షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని టెలికం శాఖ భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే, ఇవన్నీ వదంతులేనని టెలికం శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. దీనిపై డిపార్ట్మెంట్లో పలు అభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. 5జీ తదితర సేవల కోసం వివిధ ఫ్రీక్వెన్సీల్లోని స్పెక్ట్రంను దాదాపు 7.5 లక్షల కోట్లకు వేలం వేయవచ్చంటూ ట్రాయ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందంటూ టెల్కోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
విమానయానానికి మరింత డిమాండ్ ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్పరమైన సవాళ్లు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాసియాలో విమానయానానికి మరింతగా డిమాండ్ పెరగనుందని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ కమర్షియల్ ఎయిర్ప్లేన్స్ ఎండీ (రీజనల్ మార్కెటింగ్) డేవ్ షుల్టి తెలిపారు. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు మొదలైన వాటి కోసం ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో మళ్లీ ధీమా పెరుగుతోందని, ఎయిర్లైన్స్ కూడా సర్వీసులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు. దాదాపు 90 శాతం వాటాతో దక్షిణాసియా విమానయాన మార్కెట్లో భారత్ కీలకంగా ఉంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే 20 ఏళ్లలో భారత ఎయిర్లైన్ ఆపరేటర్లకు కొత్తగా 2,000 పైగా చిన్న విమానాలు అవసరమవుతాయని డేవ్ చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాసియా, భారత మార్కెట్పై బోయింగ్ రూపొందించిన అంచనాల నివేదికను శుక్రవారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమం సందర్భంగా డేవ్ ఆవిష్కరించారు. భారత్ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుండటం, మధ్య తరగతి వర్గాల పరిమాణం పెరుగుతూ ఉండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దక్షిణాసియాలో డిమాండ్ పుంజుకోగలదని ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణాసియాలో వచ్చే రెండు దశాబ్దాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఏటా 6.9 శాతం మేర వృద్ధి నమోదు కాగలదని, కొత్తగా దాదాపు 375 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,400 కమర్షియల్ విమానాలు అవసరమవుతాయని డేవ్ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి విమానయాన సంస్థలు.. ఇంధనం ఆదా చేసే విశిష్టమైన పెద్ద విమానాలపై మరింతగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశీ ఎయిర్లైన్స్కు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ తరహా పెద్ద విమానాలు 240 పైగా అవసరం పడవచ్చని వివరించారు. భారత్లో కార్గో కార్యకలాపాలు సగటున 6.3 శాతం వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉందని బోయింగ్ తన నివేదికలో పేర్కొంది. దేశీయంగా 75 పైగా రవాణా విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
ఆకాశవీధిలో.. వేసవిలో పెరగనున్న విమానాలు
న్యూఢిల్లీ: రాబోయే వేసవి షెడ్యూల్కు సంబంధించి దేశీ విమానయాన సంస్థలు .. వారంవారీగా ఫ్లయిట్ సర్వీసులను 10.1 శాతం మేర పెంచనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. గత సీజన్లో ఈ సంఖ్య 22,980గా ఉండగా ఈ సీజన్లో 25,309గా ఉంటుందని పేర్కొంది. ఇండిగో అత్యధికంగా దేశీ రూట్లలో తన ఫ్లయిట్స్ సంఖ్యను 10.4 శాతం పెంచి 11,130 వీక్లీ సర్వీసులను నడపనున్నట్లు వివరించింది. ఎయిర్పోర్ట్ స్లాట్లపై గత నెల జరిగిన వర్చువల్ సమావేశం అనంతరం దేశీ విమానయాన సంస్థల వేసవి షెడ్యూల్ను ఖరారు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షల కారణంగా గత 24 నెలలుగా దేశీ ఏవియేషన్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. గత కొద్ది వారాలుగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. వేసవి షెడ్యూల్ ప్రకారం వారంవారీగా ఎయిర్ఏషియా 1,601 (16 శాతం అధికం), ఎయిరిండియా 2,456 (10 శాతం అధికం) ఫ్లయిట్ సర్వీసులు నడపనున్నాయి. -
‘మొబైల్ సేవల లోపాలపై ఫోరంను ఆశ్రయించొచ్చు’
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీల మొబైల్ సేవల్లో లోపాలపై కస్టమర్లు వినియోగదారుల ఫోరాలను నేరుగా ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్న మధ్యవర్తిత్వ సదుపాయం దీనికి అడ్డు కాబోదని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. రెండింట్లో దేన్ని ఎంచుకోవాలన్నది కస్టమర్ ఇష్టమేనని చెప్పింది. ఉచిత సేవలు, కాంట్రాక్టులో భాగంగా కస్టమర్కు వ్యక్తిగతంగా అందించే సేవలు మాత్రమే ఇందుకు మినహాయింపు అని వివరించింది. అహ్మదాబాద్కు చెందిన ఓ కస్టమర్ తమపై నేరుగా ఫోరాన్ని ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ వొడాఫోన్–ఐడియా సెల్యూలర్ కంపెనీ చేసుకున్న అపీలుపై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎనిమిది నిమిషాల్లో!!.. ప్రాణాలు నిలబెట్టేందుకు ఉరుకులు
పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరుగులు తీయాల్సిందే. ఎంత త్వరగా సేవలు అందితే.. అంత త్వరగా ఎదగవచ్చనే అంచనాకి వచ్చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఫుడ్, గ్రాసరీ స్టార్టప్లు.. 2021లో ‘పది నిమిషాల’ మార్క్తో నయా ట్రెండ్ను ఫాలో అయ్యాయి. అయితే ఇప్పుడు హెల్త్ సర్వీసులు.. అది మనిషి ప్రాణం నిలబెట్టగలిగే ఆంబులెన్స్ సర్వీసులకు పాకింది. ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది స్టాన్ఫ్లస్. పైగా ఇది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కావడం మరో విశేషం. స్టాన్ఫ్లస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్.. ఎమర్జెన్సీ మెడికల్ రెస్సాన్స్ స్టార్టప్. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సేవల కోసం ఈ స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ఈ స్టార్టప్ 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.148 కోట్లపైనే) ఫండింగ్ దాటేసింది. ఢిల్లీ కేంద్రంగా హెల్త్క్వాడ్, కలారీక్యాపిటల్(బెంగళూరు), హెల్త్ఎక్స్ సింగపూర్(సింగపూర్) వరుసగా ఫండింగ్కు వెళ్లడంతో ఈ ఘనత సాధించింది స్టాన్ఫ్లస్. ఈ హుషారులో నగరంలో 500 ఆస్పత్రులకు తమ సేవలకు విస్తరించేందుకు స్టాన్ఫ్లస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు తమ సేవల నిడివి సమయాన్ని 15 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్య ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే కేవలం 8 నిమిషాల్లో మనిషి ప్రాణం నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేయబోతుందన్నమాట. 2016లో మొదలైన ఈ స్టార్టప్.. ప్రస్తుతం ఈ నెట్వర్క్లో 3 వేల ఆంబులెన్స్లు ఉండగా.. అందులో స్టాన్ఫ్లస్కు 200 సొంత ఆంబులెన్స్లు ఉన్నాయి. ఎనిమిదే ఎందుకు? ప్రస్తుతం గ్రాసరీ డెలివరీ కోసం 10 నిమిషాలు మార్క్ను ప్రకటించుకున్నాయి స్టార్టప్లు. అయితే ఆంబులెన్స్ సేవలను అందించే వియషంలో ఆ సమయం మరీ ఎక్కువగా(45 నిమిషాల దాకా) ఉంటోంది. అందుకే మనిషి ప్రాణాలు నిలబెట్టగలిగే ఈ విషయంపై ఫోకస్ చేసినట్లు స్టాన్ఫ్లస్ సీఈవో ప్రభ్దీప్ సింగ్ చెప్తున్నారు. ‘ఫస్ట్ మినిట్.. లాస్ట్ మైల్’ హెల్త్కేర్ పేరుతో గరిష్ఠంగా 15 నిమిషాలు.. కనిష్ఠంగా 8 నిమిషాల ఆంబులెన్స్ సేవల్ని అందించే ప్రయత్నం చేయబోతున్నారు. ఎఫెక్ట్.. దేశంలో ఫుడ్, గ్రాసరీ యాప్ల తరహాలో.. త్వరగతిన ఆంబులెన్స్ సర్వీసులను అందించేందుకు మరికొన్ని స్టార్టప్లు ఉన్నాయి. ముంబైకి చెందిన డయల్4242, హైదరాబాద్కి చెందిన ఫస్ట్ కన్సల్ట్ టెక్నాలజీస్ ‘అంబీ’ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. అలాగే స్టాన్ఫ్లస్ ఎఫెక్ట్తో 8 నిమిషాల లిమిట్ను పరిగణనలోకి తీసుకుని మరికొన్ని స్టార్టప్లు తక్కువ కాలపరిమితి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘8 నిమిషాల’ మీదే ఇప్పుడు మిగతా స్టార్టప్ల దృష్టి కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమర్శకుల స్పందన ఫుడ్ డెలివరీ యాప్ల విషయంలో 10 నిమిషాల గడువు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిజీ టైంలో ప్రమాదాలకు కారణమవుతుందని కొన్ని అభ్యంతరాలను సైతం లేవనెత్తారు. అయితే ప్రస్తుతం ఆంబులెన్స్ల విషయంలో మాత్రం విమర్శకులు.. వేరే గళం వినిపిస్తున్నారు. కరోనాలాంటి సంక్షోభాల నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి హెల్త్కేర్ సర్వీసుల అవసరం అవసరం ఉందనే చెప్తున్నారు. చదవండి: ఫ్లిప్కార్ట్ మాజీల స్టార్టప్ అట్టర్ ఫ్లాప్.. రూ. 66 కోట్ల పెట్టుబడి వెనక్కి -
కన్న పేగు కదయ్యా.. కుమారుడికి ప్రేమతో..
పొలమూ ఉంది..పైరూ ఉంది.. పచ్చగా కళకళలాడే మాట ఒకటి కరువైంది.. ఇల్లూ ఉంది..వాకిలీ ఉంది.. ఉత్తేజాన్ని ఇచ్చే ఓ నవ్వు మాయమైంది.. బంధువులూ ఉన్నారు..బంధాలు ఉన్నాయి.. ఆత్మీయత పంచే ఓ చూపు అదృశ్యమైంది.. ఆ మాట కోసం.. ఆ నవ్వు కోసం.. ఆ చూపు కోసం.. ఓ తండ్రి 14 ఏళ్లుగా తల్లడిల్లుతున్నాడు.. తల్లిలా కుమారుడికి సేవ చేస్తున్నాడు!! మహానంది(కర్నూలు జిల్లా): రుద్రవరం మండలం కోటకొండ గ్రామానికి చెందిన సంపంగి సాంబశివుడు, మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన శివమ్మలకు సుమారు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మహేశ్వరి, శివయ్య, శివశంకర్ సంతానం. ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు సాగుచేస్తూ జీవనం సాగించేవారు. మహేశ్వరి, శివశంకర్లకు వివాహం కాగా..శివయ్య తన 18 ఏళ్ల వయస్సులో మతిస్థిమితాన్ని కోల్పోయాడు. మాటలు పడిపోవడంతోపాటు మనుషులను సైతం గుర్తించలేకపోవడం, ఆకలేసినా అన్నం అడగలేకపోయే స్థితికి రావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు శివయ్యను నంద్యాల, కర్నూలులోని ప్రముఖ న్యూరోసర్జన్ల వద్దకు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించారు. కొన్నిరోజులు బాగున్నా మళ్లీ పరిస్థితి మామూలు స్థితికి రావడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి..వంశపారంపర్య సమస్య అని, బాగు చేయడం కష్టమని తేలి్చచెప్పారు. అప్పటి నుంచి శివయ్యను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకునేవారు. ఇంటి వద్ద ఉండకుండా.. మతిస్థిమితం లేని శివయ్య ఇంటి వద్ద ఉండేవాడు కాదు. కుటుంబ సభ్యులంతా పొలం వెళ్తే ఇతర ఊర్లకు పయనమయ్యేవాడు. కాలినడకన వందల కిలోమీటర్లు నడిచేవాడు. కాలిబాటలో ఎవరైనా ఏదైనా ఆహారం పెడితే తింటూ కాలం వెళ్లదీసేవాడు. తరచూ శ్రీరంగా పురం, శిరివెళ్ల, రుద్రవరం, మహానంది, కడప, దోర్నా ల, శ్రీశైలం వరకు వెళ్తుండేవాడు. ఆయా గ్రామాల్లో ఎవరైనా తెలిసిన వారు ఉంటే సాంబశివుడికి సమాచారం ఇచ్చేవారు. ఓ సారి దోర్నాల వెళ్లి చాలా రోజులు అక్కడే ఉన్నాడు. గ్రామస్తులు గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చినా పట్టుమని పదిరోజులు సైతం ఉండడు. సపర్యలు చేస్తూ.. కుమారుడు మామూలు మనిషి కావాలని సాంబశివుడు చేయని ప్రయత్నం లేదు. తరచుగా మహానందికి వస్తున్న శివయ్యలో మార్పు తీసుకురావాలని ఇంటి నుంచి అన్నం తీసుకొచ్చి తినిపిస్తున్నాడు. కుమారుడికి స్నానం చేయించి మంచి దుస్తులు తొడుగుతున్నాడు. బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అయినా మళ్లీ మూడు రోజులకే శివయ్య మహానంది బాట పడుతుంటాడు. తమ ఇంటి దేవుడు మహానందీశ్వరుడని, తన బిడ్డను తన సన్నిధిలోనే స్వామి తిప్పుకుంటున్నాడని సాంబశివుడు చెబుతుంటాడు. ఎందుకంత శ్రమ.. కుమారుడ్ని ఎక్కడైనా దూరంగా వదిలేసి రండి అంటూ చాలా మంది సలహాలు ఇస్తుంటారు. కన్న పేగు కదయ్యా..అంత కఠినంగా ఎట్లా ఉంటాం. వాన్ని ఈ చేతుల్తో పెంచిన. ఎంతో చలాకీగా ఉండేటోడు. ఎంత పెద్ద పనైనా చేసేవాడు. మా టైం బాగా లేదు. చెట్టంత కొడుకు..కన్న తల్లిదండ్రులను గుర్తు పట్టలేడు. ఆకలేస్తే అడగలేడు. 32 ఏళ్లు వచ్చినా పసివాడే కదయ్యా..వాన్ని ఎట్టా వదులు కుంటాం. – సాంబశివుడు, శివయ్య తండ్రి -
కరూర్ వైశ్యా బ్యాంకు ద్వారా కస్టమ్స్ సుంకాల చెల్లింపు
ముంబై: కస్టమ్స్ సుంకాలను తమ ఖాతాదారులు ఇకపై ఐస్గేట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) వెల్లడించింది. ఇందుకోసం కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు చెందిన ఐస్గేట్లో (ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే) లింకు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ పోర్టల్లో తమ బ్యాంకును ఎంచుకోవడం ద్వారా ఖాతాదారులు నేరుగా కస్టమ్స్ సుంకాలను చెల్లించవచ్చని కేవీబీ ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. కొత్తగా కరెంటు అకౌంటు కస్టమర్లను పెంచుకునేందుకు కూడా తమకు ఈ సదుపాయం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పన్నుల వసూళ్లకు అధీకృత బ్యాంకుల జాబితాలో సీబీఐసీ గతంలో కేవీబీని కూడా చేర్చింది. -
అజ్ఞాత మహనీయుడు
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు 1930ల నాటికే బయోకెమిస్ట్రీ పాఠ్యపుస్త కాల్లోకి ఎక్కింది. ఆయన పరిశోధనంతా విదేశాల్లో సాగినా, భారతీయ శాస్త్ర జ్ఞానంపై ఆయనకు అపారమైన నమ్మకం. భారతదేశం పరాయిపాలనలో వుండగా సుబ్బారావు విదేశీయుల వద్ద చదువు కున్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్య మంలో భాగంగా ఖద్దరుతో నేసిన సర్జికల్ ఏప్రాన్ వేసుకుని మెడికల్ కాలేజీకి హాజరయ్యారు. ప్రొఫెసర్ బ్రాడ్ఫీల్డ్ ‘గాంధీ వైస్రాయ్ అయ్యాక వేసుకుందువు గానిలే’ అని వేళాకోళం చేశాడు. ‘వైస్రాయ్ స్థాయికి గాంధీ ఎప్పుడూ దిగ జారడు’ అన్నాడీయన. ఈ మాట అన్నది 1920 ప్రాంతంలో. ఆ ప్రొఫెసర్ కసి పెట్టుకుని ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వకుండా అంత కంటే తక్కువదైన ఎల్ఎమ్ఎస్ డిగ్రీ ఇచ్చాడు. దాంతో మద్రాస్ మెడికల్ సర్వీసెస్లో ఉద్యోగం రాలేదు. ఆయుర్వేద కాలేజీలో చేరవలసి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో డిప్లోమా కోర్సుకి అడ్మిషన్ ఇచ్చారు కానీ ఫిజిషియన్గా కాదు, కెమిస్ట్గా. కోర్సు పూర్తి చేశాక జూని యర్ ఫ్యాకల్టీ మెంబర్గా ఉద్యోగం ఇచ్చారు. వాళ్ల ఇంట్లో అనారోగ్యం, దరిద్రం రెండూ ఉన్నాయి. సుబ్బారావు నాన్నగారికి దరిద్రం వలన అనారోగ్యం, దానివలన ఉద్యోగం పోయింది. ఈయనకు 18 ఏళ్ల వయసులో నాన్నగారు పోయారు. ఆయన సోదరులకు కూడా అనారోగ్యమే. ఇంకో ఏడేళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చి వెళదామ నుకుంటూండగా అన్నయ్య, పెద్ద తమ్ముడు రోజుల తేడాతో ‘స్ప్రూ’ వ్యాధితో పోయారు. మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కనబడని సందర్భంలో కాకినాడ వెళ్లి అప్పు చేయబోయారు. ‘అప్పెందుకు, మేం చదివిస్తాం, చదువయ్యాక మా అమ్మాయిని పెళ్లి చేసుకో’ అని ఒక కుటుంబం ముందుకొచ్చింది. అతనికి పెళ్లిమీద ధ్యాస లేదు. చదువుకోసం సరేనన్నారు. సుబ్బారావు స్కూలు ఫైనల్ రెండు సార్లు ఫెయిలయ్యారు. ఇంటర్లో ఆయన సబ్జక్ట్ మేథ్స్. మరి మెడికల్ సైంటిస్టు కావడానికి ఇవేమైనా అడ్డు వచ్చాయా? ఆట్టే మాట్లాడితే ఆయన ఎంబీబీఎస్ కూడా కాదు. ఆయన చేసిన రీసెర్చి పేపర్లు ఆయన సమ్మతితోనే తక్కినవాళ్ల పేర పబ్లిష్ అయ్యాయి. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకు వెళ్లి రీసెర్చి చేసిన శిష్యులకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఆయనకు రీసెర్చి అంటే ఎంతో పిచ్చి. లీడర్లీ కంపెనీలో 15,000 డాలర్ల జీతం ఇస్తామన్నారు. అప్పట్లో ఆయనకు హార్వర్డ్ యూని వర్శిటీలో కేవలం 2,700 డాలర్ల జీతం మాత్రమే. ఒక్కసారిగా పెద్ద అవకాశం. అప్పులన్నీ తీరిపోతాయి. ఎగిరి గంతేయాలి కానీ తను చేసే ఎక్స్పెరిమెంట్స్కు కొత్త బిల్డింగ్ ఇచ్చే మాటైతే సగం జీతానికే పని చేస్తానని అన్నారు. రీసెర్చి అంటే ప్రాణం పెట్టే లీడర్లీ ప్రెసిడెంట్ విలియం బ్రౌన్బెల్ కొత్త బిల్డింగూ ఇచ్చాడు, ఆఫర్ చేసిన జీతమూ ఇచ్చాడు. బాడీ ఫ్లూయిడ్స్లో, టిష్యూస్లో ఫాస్ఫరస్ మోతాదు ఎంత ఉండాలి అని బేరీజు వేసే అంశంపై ఆయన దృష్టి సారించి సైరస్ ఫిస్కేతో కలిసి ఒక పద్ధతి కనిపెట్టారు. టెక్నికల్గా దాన్ని ర్యాపిడ్ కేలోరిమెట్రిక్ మెథడ్ అన్నా, వాడుకలో దానికి ఫిస్కే–సుబ్బారావ్ మెథడ్ అని పేరు వచ్చింది. ఇంత గొప్ప పరిశోధన చేసేనాటికి ఆయనకు నిండా 30 ఏళ్లు లేవు. అమెరికన్ సొసైటీ ఆఫ్ బయొలాజికల్ కెమిస్ట్రీస్ వార్షిక సదస్సులో 1924లో దీన్ని డిమాన్స్ట్రేట్ చేశారు. మన శరీరంలో శక్తిని నిల్వచేసే ఫాస్పోక్రియాటిన్, అడినాసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) కనుక్కున్నారు. రెండవ ప్రపంచయుద్ధంలో పసిఫిక్ తీరంలో యుద్ధ రంగంలో వున్న అమెరికా సైనికులు మలేరియా, ఫైలేరియాసి స్తో బాధపడి చికిత్సకై వచ్చినపుడు వారు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి మట్టి శాంపుల్స్ తెప్పిం చారు. ఎందుకంటే వ్యాధి ఒకేలా ఉన్నా, దాని తీవ్రతలో, అది శరీరంపై చూపే ప్రభావంలో తేడా ఉంది. సైనికుడి శరీరం లోని ఇమ్యూనిటీకి తోడు ఇంకా ఏదో ఫ్యాక్టర్ ఉండి ఉంటుంది అనుకున్నారు. అందుకని అక్కటి మట్టి తెప్పించి దానిలో నేచురల్గా ఉండే ఫంగస్లో యాంటీ బ్యాక్టీరియల్ ఏజంట్స్ ఏవైనా వున్నాయా అని పరీక్ష చేశారు. ఇలా చేయడం అప్పటికి చాలా కొత్త. దీని కారణంగానే ప్రపంచంలో తొలి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ – ఆరియోమైసిన్ కనిపెట్టబడింది. 1994లో సుబ్బారావుగారి శతజయంతి జరిగిన సంద ర్భంలో ఆయన పేర మన ప్రభుత్వం స్టాంపు విడుదల చేసింది. అదే సంవత్సరం టెట్రాసైక్లిన్ లేటెస్ట్ వెర్షన్ డాక్సీసైక్లిన్ గుజరాత్, మహారాష్ట్రలలో చెలరేగిన ప్లేగును అరికట్టడానికి ఎంతో ఉప యోగపడింది. బెంజమిన్ డగ్గర్తో కలిసి ఆయన 1945లో టెట్రాసైక్లిన్ కనిపెట్టారు. ఆయన పోయిన సంవత్సరమే అంటే 1948లో అది మార్కెట్లోకి వచ్చింది. ఇన్నేళ్లలో కొన్ని కోట్ల మందిని కాపాడి ఉంటుంది. సుబ్బారావు అమెరికాలో వున్నా ట్రాపికల్ ఏరియాస్లో, ముఖ్యంగా తను పెరిగిన రాజమండ్రి, కాకినాడలలో ఎక్కువగా ఉన్న ఫైలేరియా గురించి పరిశోధన కేంద్రీకరించి హెట్రజన్ ఔషధం కనిపెట్టారు. అప్పట్లో మన దేశంలో ఎక్కువగా ఉన్న టీబీని అరికట్టడానికి ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్ కని పెట్టారు. తన సోదరులను పొట్టన పెట్టుకున్న ‘స్ప్రూ’ను అరికట్టడానికి ఫోలిక్ యాసిడ్ను లివర్లోని బ్యాక్టీరియా నుండి విడదీశారు. అది రక్తహీనతతో బాధపడే మన భారతీయులకు ఎంతో అవసరం. క్యాన్సర్కు కీమోథెరపీ వాడకం గురించి ఇప్పుడు సామాన్య జనానికి కూడా తెలుసు. కీమోథెరపీ ఏజంట్లలో తొలితరం డ్రగ్ మెథోట్రెక్సేట్ను డెవలప్ చేసినది సుబ్బారావు, ఆయనతో బాటు సిడ్నీ ఫార్బర్! ఆంధ్రప్రాంతంలో ‘బెరిబెరి’ (నంజు వ్యాధి) కూడా తీవ్రమైన వ్యాధే. దానికై ఆయన థయామిన్ తయారీపై దృష్టి సారించారు. ఈయన వచ్చేసరికి పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ తప్ప యాంటీబయాటిక్స్ ఏమీ తెలియవు. 8 ఏళ్లల్లో ఆయన ఇన్ని డిస్కవరీస్ చేయడానికి కారకుడయ్యారు. 1948లో ఆయన చనిపోక పోయి ఉంటే యింకా ఎన్ని గొప్ప ఔషధాలు దక్కేవో! అప్పట్లో రీసెర్చి అంటే ఇంగ్లండ్కు వెళ్లేవారు. కానీ ఆయన అమెరికాకు వెళ్లారు. మెడికల్ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్ చూపిం చిన పక్షపాత బుద్ధి వలన! ఆయన డిస్కవరీల పేటెంట్లన్నీ అమెరి కాకు వెళ్లాయి. అది అమెరికాకు గెయిన్, బ్రిటన్కు లాస్. ఆయన చనిపోయాక ఆయన లైబ్రరీని లీడర్లీ వాళ్లు ఆయన పేర ఆంధ్ర యూనివర్సిటీకి డొనేట్ చేద్దామనుకున్నారు. అక్కడ దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం, ఆవశ్యకత ఎవరికీ లేదని గుర్తించి తమ కంపెనీలోనే ఆయన పేర లైబ్రరీ పెట్టి అక్కడే ఉంచేశారు. -డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి వ్యాసకర్త శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు, ‘పద్మభూషణ్’ గ్రహీత -
సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు సమ్మె ప్రారంభించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ, తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించారు. సమ్మె రెండవరోజూ కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం కూడా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వం మొండి విధానం వల్లే... ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చేసిన ప్రకటన ప్రకారం, గురువారం దాదాపు రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు జరగలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానం వల్ల దేశ వ్యాప్తంగా లక్షకు పైగా బ్యాంకింగ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బ్రాంచీల కార్యకలాపాలు నిలిచిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే. సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, శివసేనసహా పలు రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు నిచ్చినట్లు తెలిపారు. కాగా, ఇంటర్ బ్యాంక్ చెక్ క్లియరెన్స్ ఇబ్బందులు మినహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు యథాపూర్వం విధులు నిర్వహించాయి. చదవండి:యూజర్లకు ఎల్ఐసీ హెచ్చరిక! పర్మిషన్ లేకుండా అలా చేస్తే.. -
కబురు చేస్తే చాలు.. పేదింటి పెళ్లికి పెద్దకొడుకు
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): జిల్లా కేంద్రంలోని పద్మనగర్కు చెందిన నాయుడు రమ (భర్త శ్రీధర్ చనిపోయారు) కూతురు వసంతకు శుక్రవారం వివాహం నిశ్చయమయ్యింది. అలాగే తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో ఉండే గాజుల లలిత కూతురు కీర్తి పెళ్లి కూడా ఇదే రోజున ఖాయమైంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న వీరు పేదరికం కారణంగా తెలిసిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు లగిశెట్టి శ్రీనివాస్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన పెళ్లికి అవసరమైన పుస్తె మెట్టెలు, పెండ్లి చీర, గాజులను అందజేసి పేదింటి పెళ్లికి పెద్ద కొడుకు అవుతున్నాడు. ..ఇలా ప్రయోజనం పొందింది కేవలం వసంత, లలిత మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా నిరుపేద కార్మిక, కర్షక కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడపిల్లలు కల్యాణ సాయం కింద పుస్తె, మెట్టెలను అందుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నిరుపేద కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఆర్థికంగా చితికిపోయిన ఆడపిల్లల పెళ్లిళ్లకు తక్షణ సాయంగా పుస్తెమెట్టెలను అందిస్తూ సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. నేపథ్యం.. ప్రస్తుతం పట్టణంలో వస్త్ర వ్యాపారం చేసే లగిశెట్టి విశ్వనాథం, దేవేంద్రమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్. 1971 మార్చి 5న జన్మించిన శ్రీనివాస్ తన తండ్రి నుంచి వారసత్వంగా అందివచ్చిన వ్యాపారాన్ని నిర్వహిస్తూ కాలానుగుణ మార్పులతో పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ముతక రకం నూలు వస్త్రం తయారయ్యే కాలంలో ఆధునికంగా ఆలోచించి క్లాత్ ప్రాసెసింగ్ రంగాన్ని పరిచయం చేశారు. రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్టు ద్వారా.. తన ఉన్నతికి కారణమైన పట్టణంలోని ప్రజానీకానికి తన వంతుగా సేవలు అందించాలని సంకల్పించి 2011లో తన పేరిట చారిటబుల్ ట్రస్టును స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు ద్వారా సమాజ సేవలను అందిస్తున్నాడు. విద్యార్థులకు నోట్ బుక్కులు, పుస్తకాలు, వృద్ధాప్యంలో ఉన్నవారికి దుప్పట్లు ఏటా వితరణ చేసే ఆయన తంగళ్లపల్లి మండలం పద్మనగర్లోని తన సొంత స్థలంలో సంతోషిమాత దేవాలయాన్ని నిర్మించారు. ఆలయానికి పరిసరాల్లో వృద్ధాశ్రమాన్ని కూడా స్థాపించారు. అవసాన దశలో అయినవాళ్ల నిరాదరణకు గురైన పేద వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. సుమారు 20మందికి పైగా వృద్ధులు ప్రస్తుతం వృద్ధాశ్రమంలో తల దాచుకుంటున్నారు. జన్మభూమి కోసం.. పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయడం ప్రతి మనిషి కనీస కర్తవ్యం. ఇక్కడి ప్రజల ఆశీస్సులతో ఎదిగిన నేను నా వంతుగా సమాజానికి సేవలు అందించాలనుకున్నాను. ఆపన్నులకు అండగా ఉండేందుకు చారిటబుల్ ట్రస్టును స్థాపించా. వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు పేదల పెళ్లిళ్లకు సహాయపడటం సంతృప్తి నిస్తోంది. పేదరికం పెద్ద చదువులకు ఆటంకం కావద్దని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకరిస్తున్నా. ఇదంతా సంతోషిమాతా దేవితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నా. – లగిశెట్టి శ్రీనివాస్, ట్రస్టు నిర్వాహకుడు చదవండి: అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు! -
ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): మారుమూల కొండకోనల్లోని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్లు అపర సంజీవనిలా మారాయి. 108, 104 వాహనాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలకు సులభంగా చేరుకుంటూ అడవిబిడ్డలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. దీంతో జోలికట్టి భుజాలపై మోసుకొచ్చే కష్టాలు గిరిజనులకు తప్పాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ అధికారులు ఎనిమిది బైక్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నుంచి ఈ వాహనాల ద్వారా విశేష సేవలు అందుతున్నాయి. (చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..) ఐదు మండలాల పరిధిలో.. కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 152 గ్రామాలు, 405 శివారు గ్రామాలు ఉండగా సుమారు 1,20,000 వరకూ గిరిజన జనాభా ఉంది. దాదాపు 40 గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా బస్సులు, 108, 104 వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యాలపాలైతే జోలి కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. చదవండి: రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్' ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందిచేలా రాష్ట్రవ్యాప్తంగా బైక్ అంబులెన్స్లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 40 గ్రామాలకు సే వలందించేలా ఎనిమిది వాహనాలను సమకూర్చగా.. మరో ఏడు వాహనాల కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేశారు. ఇవి త్వరలో రానున్నాయని సమాచారం. రెండేళ్లు.. 11,255 కేసులు రెండేళ్ల నుంచి జిల్లాలో బైక్ అంబులెన్స్ల ద్వారా 11,255 అత్యవసర కేసులకు సేవలు అందించారు. 2019–20లో గర్భిణులు 824, జ్వర పీడితులు 3,012, పాయిజన్ కేసులు 160, ఆర్టీఏ 118, ఇతర కేసులు 1,020 మొత్తం 5,134 కేసులకు బైక్ అంబులెన్స్ల ద్వారా సేవలందించారు. 2020–21, 2021–22లో ఇప్పటివరకూ గర్భిణులు 558, ఆర్టీఏ 99, జ్వరపీడితులు 4,059, పాయిజన్ కేసులు 149, ఇతర కేసులు 956 మొత్తంగా 6,121 మందికి సేవలు అందించారు. ప్రయోజనాలు ఎన్నో.. ►పరిమాణం, పనితీరు కారణంగా బైక్ అంబులెన్స్లు గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు సాధారణ అంబులెన్స్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ►దీని ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. గర్భిణులను వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ►కుక్కునూరు మండలంలో అమరవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో కొయిదా, తొట్కూరుగొమ్ము, పోలవరం మండలంలో కొరుటూరు, మేడేపల్లి, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, చింతపల్లి తదితర గ్రామాల్లో బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని సేవలు అందించేలా.. గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తున్నాం. మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఎనిమిది బైక్ అంబులెన్స్లు వినియోగిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మరో ఏడు బైక్ అంబులెన్స్లకు ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం అత్యవసర వైద్యం బైక్ అంబులెన్స్లలో అత్యవసర వైద్యానికి సంబంధించిన మెడికల్ కిట్ను అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది. సెలైన్ పెట్టే సౌకర్యం కూడా అంబులెన్స్లో ఉంది. అనారోగ్యం పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశాం. బైక్ అంబులెన్స్ సేవలు మరింత విస్తరిస్తాం. – జి.మురళీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్పురం -
TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించే సేవల వివరాలన్నీ ఒకే యాప్లో పొందు పరిచేందుకు జియో సంస్థతో దేవస్థానం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనీష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేయడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ప్రయత్నించడంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించేందుకు జియో సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. టీటీ డీకి సంబంధించిన సమస్త సేవలు, సమాచారం ఒకేచోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సమన్వ యంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
అనుసంధాన లోపాలతో అంతరాయం
వాషింగ్టన్, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల సేవలు స్తంభించిన ఏడు గంటల తర్వాత పునరుద్ధరించారు. ఫేస్బుక్ చరిత్రలో ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద అంతరాయం ఇదే. భారతకాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన సేవలు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకి తిరిగి అందుబాటులోకి రావడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్లో వెల్లడించింది. ‘మనం సామాజిక మాధ్యమాల్లో వాడే భాషని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చడానికి వీలు కల్పించే కమ్యూనికేషన్ టూల్స్లో లోపం కారణంగా వాటి సర్వీసులు స్తంభించాయి. ఈ లోపం వల్ల అంతరాయం ఏర్పడిందని అనిపిస్తుంది కానీ మనం అనుసంధానం కావడంలో సమస్యలు తలెత్తడమే అసలు కారణం’ అని ఫేస్బుక్ ఇంజనీర్ల బృందం వివరించింది. బిలియనీర్ల జాబితాలో ఐదో స్థానానికి జుకర్బర్గ్ ఫేస్బుక్కి చెందిన మూడు సామాజిక మాధ్యమాల సేవలు చాలా గంటలపాటు ఒకేసారి పనిచేయకపోవడం, ఫేస్బుక్ ప్రజాసంక్షేమం కంటే.. ఆదాయార్జనకే అధిక ప్రాధాన్యమిస్తోందని మాజీ ఉన్నతోద్యోగి ఒకరు ఆరోపించడంతో ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో 5 శాతం మేరకు పతనమయ్యాయి. ఫేస్బుక్ నుంచి ఎన్నో సంస్థలు తమ ప్రకటనలు తొలగించడంతో మార్క్ జుకర్బర్గ్ సంపద ఏకంగా 700 కోట్ల డాలర్లు తగ్గిపోయింది. దీంతో ఆయన బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో మూడో స్థానం నుంచి అయిదో స్థానానికి పడిపోయారు. -
Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత మండలాలైన 13 మండలాల్లో 61 కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించి, వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదల పాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 500 మందికి పునరావాసం కల్పించామని అన్నారు. కవిటి మండలంలోని కుసుమపురం, మాణిక్యపురం, ఎద్దువాణిపాలెం, కవిటి.. ముత్యాలపేట తుపాను సురక్షిత కేంద్రాల్లో 342 మందికి, వజ్రపు కొత్తూరులోని హుకుంపేట, మంచినీళ్లపేట, కె.ఆర్.పేట, బైపల్లి, మెట్టూరు మరియు వజ్రపు కొత్తూరు తుఫాన్ రక్షిత కేంద్రాల్లోకి 182 మందికి ఇప్పటివరకు తరలించామన్నారు. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, ఈదుపురం తుపాను రక్షిత కేంద్రాలతో పాటు డొంకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 100 మందికి, సంతబొమ్మాళి మండలంలో ఆర్.సున్నపల్లి తుపాను రక్షిత కేంద్రంలో 100 మందికి, పోలాకిలోని గుప్పిడిపేట, రాజారాంపురం పునరావాస కేంద్రాల్లోకి 54 మందిని తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. కంచిలి మండలంలోని కుట్టుమ పునరావాస కేంద్రానికి 30 మందికి, పలాస మండలంలోని అమలకుడియా, సరియాపల్లి, బొడ్డపాడు, రంగోయి కేంద్రాలకు 30 మందికి, సోంపేట మండలంలోని బారువ పునరావాస కేంద్రానికి 20 మందిని మొత్తం 1,358 మందికి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు కంచిలి మండలంలోని మద్దిపుట్టుగ గ్రామంలో 2 ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోగా వాటిని తక్షణమే అధికారులు మరమ్మతులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సోంపేట మండలంలోని మాకన్నపురంలో ఒక ఇల్లు, కాశీబుగ్గ హరిజన వీధిలో ఒక ఎలక్ట్రికల్ పోల్ విరిగినట్లు ఇప్పటివరకు అందిన సమాచారమని కలెక్టర్ తెలిపారు. పలుచోట్ల రహదారులకు అడ్డంగా విరిగిన చెట్లను తక్షణమే చెట్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా మిగిలిన ప్రాంతాల నుండి నష్టపోయిన వివరాలు అందాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. -
AP: కాల్ సెంటర్ సేవలు భేష్
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమీకృత రైతు సమాచార కేంద్రం ద్వారా రైతులకు అందిస్తోన్న సేవలు బాగున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం ఆయన గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను సందర్శించారు. కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా రైతుల నుంచి రోజూ ఎన్ని కాల్స్ వస్తున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తు న్నారు? తదితర విషయాలు తెలుసుకు న్నారు. కాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్ను సందర్శించి ప్రసారాలు, కార్యక్రమాల వివరాలను ఆరా తీశారు. రైతులకు మరింత ఉప యోగపడేలా ఈ సేవలను విస్తరించాలని సూచించారు. అజేయ కల్లం వెంట రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో సేవల రంగం సూపర్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఆగస్టులో దూసుకుపోయింది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ క్షీణత నుంచి భారీ వృద్ధిలోకి జంప్ చేసింది. జూలైలో 45.4 క్షీణతలో ఉన్న రంగం, ఆగస్టులో 18 నెలల గరిష్ట స్థాయి 56.7కు ఎగసింది. సూచీ 50 లోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సమీక్షా నెల్లో బిజినెస్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సెకండ్వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించడం, పలు సంస్థల పునఃప్రారంభం, కొత్త ఆర్డర్లు, వినియోగం భారీగా పెరగడం వంటి పలు అంశాలు ఆగస్టు సేవల రంగంపై ప్రభావం చూపాయి. కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో గడచిన నాలుగు నెలలుగా సేవల ఇండెక్స్ 50లోపు క్షీణతలోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ ఇండెక్స్ కూడా దూకుడే... సేవలు, తయారీ ఇండెక్స్ కలిసిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా 49.2 క్షీణత (జూలై) నుంచి ఆగస్టులో 55.4 వృద్ధిలోకి మారింది. మూడు నెలలుగా ఈ విభాగం క్షీణతలోనే కొనసాగింది. ఒక్క తయారీ రంగం చూస్తే, తయారీ రంగం ఆగస్టులో వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, జూలైకన్నా నెమ్మదించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 52.3 వద్ద ఉంది. జూలైలో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంకాగా, పారిశ్రామిక రంగం వాటా 15 శాతం. పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వెయిటేజ్ దాదాపు 70 శాతం. చదవండి: -
Andhra Pradesh: ఒక్క బటన్ నొక్కితే చాలు.. ముంగిటికే అన్నీ
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలసి ఉదయం వాకింగ్ చేస్తుండగా 6.30 గంటలకు ఓ యువకుడు వచ్చి వేధించి తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ యువతి అందుకు నిరాకరించడంతో ఆ యువతి చెయ్యి పట్టుకుని లాగి, దాడి చేశాడు. దాంతో ఆమె మెడ, మొహం మీద గాయాలు అవ్వడంతోపాటు కంటి సమీపంలో రక్తం గడ్డకట్టింది. అతను కత్తి చూపిస్తూ తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్లాడు. వెంటనే యువతి 6.45 గంటలకు దిశ యాప్లోని ఎస్వోఎస్ బటన్ నొక్కింది. దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే అనకాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు 6.55 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షి, అమరావతి: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు ప్రభుత్వ యంత్రాంగం సేవలన్నీ అరచేతిలోకే అందుబాటులోకి వస్తున్నాయి. పౌరసేవల్లో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తేవడంతో అత్యంత వేగంగా ఫలాలు అందుతున్నాయి. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి తొలగింది. మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా సమాచారం అందిస్తే చాలు ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి నిర్దిష్ట సేవలను అందిస్తోంది. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారిస్తూ పౌర సేవలన్నీ సత్వరం, మెరుగైన రీతిలో వారి చెంతకే చేరుస్తోంది. అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక యాప్లను రూపొందించాయి. వీటిని లక్షలాదిగా డౌన్లోడ్ చేసుకుంటూ ప్రభుత్వ సేవలను సులభంగా పొందుతున్నారు. ప్రభుత్వ చొరవ పట్ల జాతీయస్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు వ్యయ ప్రయాసలను నివారించి ప్రభుత్వ సేవలను వారి చెంతకే విజయవంతంగా అందిస్తున్న కొన్ని యాప్ల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా పోలీసు శాఖ ► మహిళా భద్రతకు భరోసా ‘దిశ’ మహిళలు, యువతుల భద్రతకు పూర్తి భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆధునిక సాంకేతిక అద్భుతం ‘దిశ’ యాప్. మహిళల మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు పోలీసుల భద్రతా వలయంలో ఉన్నంత సురక్షితంగా ఉండొచ్చు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా.. వేధింపులకు గురైనా యాప్లో ఎస్వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తారు. ఎస్వోఎస్ బటన్ నొక్కేందుకు అవకాశం లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ను అటూ ఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ కంట్రోల్కు సమాచారం చేరిపోతుంది. ఎస్వోఎస్ బటన్ నొక్కినా, మొబైల్ ఫోన్ను అటూ ఇటూ ఊపినా సరే బాధితురాలి వివరాలు, ప్రస్తుతం ఉన్న ప్రదేశం వివరాలు దిశ కమాండ్ కంట్రోల్కు తెలుస్తాయి. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ను సమాచారం అందించి బాధితురాలి రక్షణకు పోలీసులను పంపిస్తారు. ప్రయాణాల్లో రక్షణ కోసం మై ట్రావెల్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సమస్యాత్మక ప్రదేశాలను పోలీసు శాఖ జియో ట్యాగింగ్ చేసి మహిళలను అప్రమత్తం చేస్తోంది. దిశ యాప్ ద్వారా పోలీసులు రికార్డు స్థాయిలో మహిళల వేధింపులకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నారు. మహిళల భద్రతకు ఇంత భరోసా ఇస్తున్నందువల్లే ఇప్పటికే రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా ►అరచేతిలో స్టేషన్.. పోలీస్ సేవా యాప్ పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ‘పోలీస్ సేవా యాప్’ రూపొందించారు. ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ కాపీల డౌన్లోడ్, నిందితుల అరెస్టు వివరాలు, పొగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, బయట ఊర్లకు వెళ్లాల్సి వస్తే మన ఇంటిపై ప్రత్యేకంగా పోలీస్ పహారా కోసం వినతి, వాహనాల దొంగతనంపై ఫిర్యాదులు, ఈ–చలానా వివరాలు, సైబర్ భద్రత, సోషల్ మీడియాలో పోస్టులపై ఫ్యాక్ట్ చెక్, కమ్యూనిటీ పోలీసింగ్, సమీపంలోని ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల వివరాలు, రహదారి భద్రత, సభలు– సమావేశాలకు పోలీసు అనుమతులు.. ఇలా మొత్తం 87 రకాల పోలీసు సేవలను ఈ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంత సౌలభ్యంగా ఉండటంతో పోలీస్యాప్ను ఇప్పటి వరకు 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. విద్యా శాఖ ► మనబడికి పోదాం యాప్... రాష్ట్రవ్యాప్తంగా 6 – 14 సంవత్సరాల వయసు కలిగిన బడి బయటి పిల్లలను గుర్తించడం కోసం మనబడికి పోదాం యాప్ రూపొందించారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించి తగిన తర్ఫీదుతో దగ్గరలోని పాఠశాలలో వయసుకు తగ్గ తరగతిలో చేర్పిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ యాప్లో అలాంటి పిల్లలను గుర్తించడం, స్కూళ్లలో చేర్పించడం లాంటి పనుల సమాచారాన్ని పొందుపరుస్తారు. మనబడి నాడు–నేడు యాప్ (ఎస్టీఎంఎస్)... మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పది రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు. పాఠశాలల స్థాయిలో పనుల ప్రగతిని ఈ యాప్లో పొందుపరుస్తున్నారు. ఈ– హాజరు యాప్.. ఈ యాప్ ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. దీక్ష.. విజ్ఞానాన్ని పంచుకునేందుకు డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్తో కూడిన వేదిక ఇది. టీచర్లు, స్టూడెంట్ల కోసం దీన్ని రూపొందించారు. ఈ యాప్లో పాఠ్యపుస్తకాలను డిజిటలైజ్ చేసి పొందుపరిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివిధ కోర్సులు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. వైద్య– ఆరోగ్య శాఖ ఐదు రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించే ‘ఈ సంజీవని – ఓపీడీ’ యాప్ స్పెషలిస్ట్ వైద్యుల సలహాలు కావాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ–సంజీవని– ఓపీడీ’ యాప్ మీ మొబైల్ ఫోన్లో ఉంటే చాలు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఐదు రకాల స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఈ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. స్పెషలిస్ట్ వైద్యులు యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చి తగిన వైద్య సలహాలు ఇచ్చి అనంతరం వైద్యం సాయం అందిస్తారు. అందుకోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 13 ఈ–సంజీవనీ హబ్లను ఏర్పాటు చేశారు. రోగుల పాలిట ఆపద్భంధువుగా మారిన ఈ యాప్ విజయవంతమైంది. 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు 39 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో కొత్తగా మరో 14 ఈ–సంజీవని హబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 27 హబ్లు అవుతాయి. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలు ఆర్బీ యూడీపీ యాప్తో పంటల నమోదు విత్తనం నుంచి విపణిలో పంటల విక్రయం వరకు అన్నీ సేవలను యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చింది. విత్తనాల కొనుగోలు, పంటల బీమా నమోదు, పెట్టుబడి రాయితీ పొందడం, బ్యాంకు నుంచి రుణాలు, పంటలు నష్టపోతే పరిహారం పొందడం... ఇలా అన్నింటికీ కీలకం ‘పంటల నమోదు’. ఇంత కీలకమైన ఈ–క్రాపింగ్ ప్రక్రియను వ్యయ ప్రయాసలు లేకుండా నమోదు చేసేందుకు ‘రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫాం’ పేరుతో యాప్ను రూపొందించారు. భూ రికార్డుల ఆధారంగా పంట వివరాలతో ఆన్లైన్లోనే జియో ఫెన్సింగ్ చేస్తారు. విత్తనాలు వేసిన రెండువారాల తర్వాత వీఏఏ, వీహెచ్లు పొలాలకు వెళ్లి పరిశీలించి ఫోటో తీసి ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. అన్నీ పక్కాగా ఉంటే మొబైల్కు డిజిటల్ రసీదు పంపుతారు. తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను రైతులు పొందేందుకు అర్హులవుతారు. పశు సంరక్షక్ యాప్ పశువైద్యాన్ని పాడి రైతుల గుమ్మం వద్ద అందించేందుకు పశుసంవర్ధక శాఖ ‘పశు సంరక్షక్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పశువుల నుంచి సేకరించే మూత్రం, పేడను పశువ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపి ఫలితాలను యాప్లో నమోదు చేస్తారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రబలే సీజనల్ వ్యాధుల గురించి పాడి రైతులు అవగాహన పెంచుకుని నివారణ చర్యలు చేపట్టవచ్చు. సీఎం యాప్తో పంటలకు మద్దతు ధర పంటలకు మెరుగైన ధర అందించేందుకు మార్కెటింగ్ శాఖ సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్) రూపొందించింది. రాష్ట్రంలో వ్యవసాయ పంటల ధరల హెచ్చుతగ్గులను విశ్లేషించడం ద్వారా కనీస మద్దతు ధరను నిర్ణయించడం, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయడానికి ఈ యాప్ దోహదపడుతుంది. ఈ–మత్స్యకార యాప్ మత్స్య శాఖ అందించే అన్ని సేవలను అనుసంధానిస్తూ ‘ఈ– మత్స్యకార’ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ‘అప్సడా’ రిజిస్ట్రేషన్లు, ఇన్పుట్ సరఫరా, మత్స్య సాగుబడి, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లాంటి కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువుల నమోదు, వినూత్న ఆక్వా కల్చర్ యూనిట్ల నమోదు అంతా ఈ యాప్ ద్వారానే జరుగుతోంది. రైతులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. ఈ యాప్ ద్వారా క్వాలిటీ ఇన్పుట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. విపత్తుల వేళ పంట నష్టాన్ని అంచనా వేసి ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. విద్యుత్తు శాఖ విద్యుత్ శాఖలో ‘ఈ–విప్లవం’ రాష్ట్రంలోని 1.89 కోట్ల మంది వినియోగదారులకు సేవలందించేదుకు మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు మొబైల్ యాప్లు రూపొందించాయి. కొత్త సర్వీసులు పొందడం, బిల్లుల చెల్లింపులు, వినియోగదారుల సేవలు, విద్యుత్తు వినియోగం, చెల్లింపుల వివరాలు, సరఫరా పరిస్థితి, వినియోగించిన విద్యుత్తు వివరాలు, స్వయంగా మీటర్ రీడింగ్ నమోదు చేసే సౌలభ్యం తదితర సేవలన్నీ ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. హెట్టీ విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ‘కైజాలా’ యాప్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఏ రోజు విద్యుత్తు సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘ఏపీ విద్యుత్ ప్రవాహ్’ యాప్ను తెచ్చారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ఫ్రీ నెంబర్ సదుపాయం ఉంది. పురపాలక శాఖ 92 రకాల సేవలు... నగర, పురపాలికలు, నగర పంచాయతీల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ‘పురసేవ’ యాప్ దోహదం చేస్తోంది. ఈ యాప్లో మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి 92 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఫోటోలు, వీడియోల ద్వారా ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేసే సదుపాయం యాప్లో ఉంది. ఆస్తి, నీటి పన్నులు ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. యాప్ ద్వారా గత నాలుగు నెలలుగా పట్టణ ప్రజల నుంచి అందిన 3, 287 ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. ఎన్నో ఉపయోగాలు ఉన్నందున ఈ యాప్ను ఇప్పటివరకు 10.15 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీకి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్ తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ నమోదు, పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అంగన్వాడీలకు వ్యాన్ల ద్వారా పాల సరఫరాను పర్యవేక్షించేందుకు ‘మిల్క్ యాప్’ రూపొందించారు. పాల వ్యాన్లకు జియో ట్యాగింగ్ కూడా చేశారు. 24 గంటల్లోపే విత్తనాలు, ఎరువులు 15 ఎకరాల్లో వరి, పసుపు పంటలు వేశా. ఆర్బీకే 2.0 యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు బుక్ చేసుకున్నా. ఆన్లైన్లో డబ్బులు చెల్లించా. 24 గంటలు తిరక్కుండానే రైతు భరోసా కేంద్రం సిబ్బంది వాటిని సరఫరా చేశారు. మార్కెట్లో దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండాపోయింది. – గుంటక భాస్కరరెడ్డి, రైతు, పెద ఒగిరాల, కృష్ణా జిల్లా -
ఐదు నిముషాల్లో.. రెండు వైపుల నుంచి రెండు అంబులెన్స్లు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లో 108 అంబులెన్స్ లు ఎలా పని చేస్తున్నాయన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వాళ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. రాజం దాటాకా పాలకొండ లైన్ సెర్లాం జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎదురెదురుగా వస్తోన్న రెండు బళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఇందులో విజయనగరం జిల్లా ఎర్రవానిపాలెంకు చెందిన పార్ధు (35) పాపారావు (32) గాయపడ్డారు. ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు.. వెంటనే 108కి కాల్ చేశారు. సరిగ్గా అయిదు నిమిషాల్లోనే రెండు వైపుల నుంచి రెండు వేర్వేరు అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు వేగంగా ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు 108 సిబ్బంది. -
నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ వైద్య సేవలు
-
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్ఝున్వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్ఝున్వాలాకు ఎయిర్లైన్స్లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్బుల్గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్ఝున్వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్లైన్స్లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ
సాక్షి, విజయవాడ: ఈ-సంజీవని సేవలలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లో భాగంగా ఏపీలో ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్ ఏర్పాటయ్యిందన్నారు. 13 జిల్లాల్లోని వైద్యకళాశాల్లో 13 టెలీమెడిసిన్ హబ్ల ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్పెషలిస్టులు సేవలందిస్తున్నారన్నారు. 1145 పీహెచ్సీలు, 2914 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లకు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్లు, వైద్యులు సూచించిన మందులు పేషెంట్ల ఇంటికే పంపిణీ వంటి సేవలు అందించామన్నారు. 20,13,248 మందికి టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సేవలందించి దేశంలోనే టాప్లో ఏపీ నిలిచిందని ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. -
తప్పతాగి దర్జాగా నిద్రపోయాడు; రైల్వే సేవలకు అంతరాయం
ఢిల్లీ: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్(ఏఎస్ఎమ్) నిర్వాకంతో నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఉరుకులు పరుగుల మీద వచ్చిన అధికారులు అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. అప్పటికే ఫూటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన అనిరుద్ కుమార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులకు హజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్కు ఫరక్కా, మగధ ఎక్స్ప్రెస్లు వచ్చి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు అనిరుద్ కుమార్కు ఫోన్ చేశారు. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అధికారులు వచ్చి చూడగా.. అధికారులు షాక్ తిన్నారు. అనిరుద్ కుమార్ దర్జాగా నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి తుండ్లాలోని మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. '' ఇలాంటి అధికారులు ఉండడంతోనే దేశం ఇలా తగలడింది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆధార్ కార్డులో ఈ రెండు సర్వీసులు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఎఐ) షాక్ ఇచ్చింది. యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ధృవీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులోని చిరునామాలను అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేసింది.దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇకపై సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. అయితే ఆధార్ కార్డులో తప్పులును సరిచేసుకొనే అవకాశం యథావిధిగాఉంటుంది. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఆన్లైన్ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. -
Doctors day: జన్మ తల్లిది.. పునర్జన్మ వైద్యుడిది..
వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. దానిని నిత్య సత్యం చేస్తూ కలియుగ దైవం లాగా కరోనా కష్టకాలంలో వైద్యులు చూపుతున్న తెగువ మరువలేనిది. కరోనా సోకితే అయినవారే దగ్గరకు రాని సందర్భంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రోగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ జీవితంపై భరోసా కల్పిస్తున్నారు.. వైరస్ సోకుతుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని వీడకుండా... కోవిడ్ రోగులకు నిరంతరం వైద్యం అందిస్తూ సమాజంపై వారి బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆశలు సన్నగిల్లిన వారిలో మళ్లీ చిరునవ్వులు తెప్పించడంలో వారి పాత్ర కీలకం.. రోగులను కరోనా నుంచి కాపాడుతూ వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మరెందరో మహమ్మారి కాటుకు బలవుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రజల్లో భరోసానిస్తున్న వైద్యుల జాతీయ దినోత్సవం సందర్భంగా అభిప్రాయాలు వారి మాటల్లోనే.. డాక్టర్ బీసీ రాయ్ సేవలకు గుర్తుగా... భారతీయ వైద్య రంగంలో వ్యక్తిత్వంతో పాటు అన్ని తరాలకు ఆదర్శనీయంగా నిలిచిన డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా.. సంఘసంస్కర్తగా.. నిరుపేదలకు అపన్ననేస్తంగా వైద్య సేవలు అందించారు. 1882 జులై ఒకటో తేదీన పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని బన్కీఫోర్లో జన్మించిన అతడు వైద్య రంగంలో చేసిన సేవలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం అనంతరం పశ్చిమబెంగాల్కు 12ఏళ్లపాటు సీఎంగా పనిచేశారు. వైద్య రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లో భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆయన పుట్టిన రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. బీసీ రాయ్ మరణించిన రోజు కూడా జులై ఒకటో తేదీనే కావడం గమనార్హం. సిబ్బందిలో మనోధైర్యం నింపుతూ నిర్మల్ చైన్గేట్: ఒకవైపు కరోనా మొదటి వేవ్ ఉధృతి అంతగా లేనప్పటికీ.. సెకండ్ వేవ్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందజేశాం. సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపుతూ రోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూశాం. కరోనాతో ప్రజలు చిన్నపాటి జ్వరం, దగ్గు వచ్చిన చాలా భయపడుతున్నారు. అలాంటి వారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తలు సూచిస్తున్నాం. – డాక్టర్ దేవేందర్రెడ్డి, నిర్మల్ జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకులు ధైర్యం కల్పిస్తున్నాం... నిర్మల్ చైన్గేట్: మొదటి వేవ్లో కరోనా సోకినప్పటికీ కోలుకుని విధులు నిర్వహించాను. కరోనా సమయంలో అన్ని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయకపోడంతో జిల్లా ప్రసూతి ఆస్పత్రికి తాకిడి పెరిగింది. ఒక వైపు కరోనా విజృంభన మరో వైపు సిబ్బంది కొరతను అధిగమించి వైద్య సేవలు అందజేశాం. సెకండ్ వేవ్లో కరోనా సోకిన 10మంది గర్భిణులకు ప్రసూతి చేశాం. ఎప్పటికప్పుడు గర్భిణులకు, బాలింతలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు చెబుతున్నాం. – డాక్టర్ రజని, నిర్మల్ జిల్లా ప్రసూతి ఆస్పత్రి పర్యవేక్షకురాలు హాస్టల్లో ఉండి విధులు తాంసి: కరోనా లాక్డౌన్ సమయంలో హాస్టల్లో ఉంటూ విధులు నిర్వహించాను. నాకు ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా కాలంలో తనవంతుగా కుటుంబ సభ్యులకు, పిల్లలకు దూరంగా ఉన్న బాధపడకుండా వైద్యసేవలు అందించాను. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్లి అధైర్యపడకుండా ఉండాలని చెప్పాను. – నర్మద, మండల వైద్యాధికారి ప్రజల ప్రాణాలు కాపాడడమే బాధ్యత ఆదిలాబాద్టౌన్: ప్రజల ప్రాణాలు కాపాడడమే వైద్యుల బాధ్యత. నేను కూడా కరోనా బారిన పడి 14 రోజుల తర్వాత కోలుకున్నాను. ఆ తర్వాత విధుల్లో చేరాను. అధైర్యపడకుండా ఉన్నాను. కుటుంబ సభ్యుల్లో కూడా ధైర్యాన్ని నింపాను. విధి నిర్వహణలో బయటకు వెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్ ఇంట్లో నలుగురం కోవిడ్ బారినపడ్డాం ఆదిలాబాద్టౌన్: కోవిడ్ ఫస్ట్వేవ్లో మా ఇంట్లో ఉన్న నలుగురు సైతం కోవిడ్ బారిన పడ్డాం. వృత్తిరీత్యా మా ఆయన మనోహర్ అడిషనల్ డీఎంహెచ్వో. ఇద్దరు పిల్లలు. గత సెప్టెంబర్లో ఒకేసారి అందరం కోవిడ్ బారిన పడ్డాం. 17 రోజుల తర్వాత కోలుకొని 18వ రోజున విధుల్లోకి వచ్చాం. ఓపీలో కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణులకు సైతం వైద్యసేవలు అందించాను. గర్భిణులకు అవగాహన కల్పించాం. – డాక్టర్ సాధన, డిప్యూటీ డీఎంహెచ్వో, ఆదిలాబాద్ కరోనా వచ్చినా భయపడలేదు ఆదిలాబాద్టౌన్: విధి నిర్వహణలో ఉన్నప్పుడు కోవిడ్ ఫస్ట్వేవ్లో కోవిడ్ బారిన పడ్డాను. 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే ఐసోలేషన్ కిట్ను వాడి కోలుకున్నాను. బయట వస్తువులు తినకుండా, నీరు తాగకుండా ఇంటినుంచే టిఫిన్ బాక్సును తీసుకెళ్తున్నాను. పౌష్టికాహారం తీసుకోవడంతో త్వరగానే కోలుకున్నా. ఏ వస్తువులను ముట్టకుండా, భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నాను. కోవిడ్ నిబంధనలను పాటిస్తే ఈ మహమ్మారి బారినపడకుండా ఉండవచ్చు. – డాక్టర్ శ్రీకాంత్, జిల్లా కుష్ఠు నివారణ అధికారి, ఆదిలాబాద్ మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆదిలాబాద్రూరల్: కోవిడ్ సమయంలో మానసికంగా ఇబ్బందులు ఎదురైనా గంటల తరబడి కోవిడ్ వార్డులో ఉంటూ రోగులకు వైద్య సేవలు అందజేసినా. కోవిడ్ సమయంలో ఎలాంటి సెలవులు ఉండవు, 24 గంటలు వైద్య సేవలు అందజేశాను. కోవిడ్ సోకిన అధైర్యపడలేదు. ఇంటికి వెళ్లినా రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆలోచనలే ఉండేవి. ఎవరో ఓ డాక్టర్తో తప్పు జరిగితే డాక్టర్లను నిందించడం సరికాదు. మూడోవేవ్ వస్తుందని ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ప్రతి వైద్యుడు తగిన జాగ్రత్తలు తీసుకోని వైద్య చికిత్స అందజేయాలి. – డాక్టర్ సుమలత, రిమ్స్, అసోసియేట్ ఫ్రొఫెసర్ చదవండి: దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు? -
మొరాయించిన గూగుల్: యూజర్లు పరేషాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజీన్ సంస్థ గూగుల్, దాని సంబంధిత సేవలు పనిచేయకపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఆల్ఫాబెట్ సొంతమైన సెర్చ్ ఇంజన్ గూగుల్తో పాటు దాని స్ట్రీమింగ్, ఈమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మానిటరింగ్ వెబ్సైట్ డౌన్డెక్టెక్టర్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ సమస్యకు గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. డౌన్డెక్టెక్టర్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్, యూట్యూబ్, జీమెయిల్తో కొన్ని గూగుల్ ప్లాట్ఫారమ్లు సోమవారం సాయంత్రంనుంచి మొరాయించాయి. ఉత్తర అమెరికాలోని కొన్నిప్రాంతాల్లోకి లాగిన్ అయ్యేందుకు, వెబ్సైట్ను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసినట్లు డౌన్డెక్టర్ తెలిపింది. ఒక దశలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు గూగుల్ సేవల అంతరాయంతో గగ్గోలు పెట్టారని తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్ టీవీ , గూగుల్ డ్రైవ్తో కూడా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చదవండి : ఫేస్బుక్, గూగుల్కు సమన్లు ఫ్లిప్కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
ఆదర్శనీయులు ఆర్కాట్ నవాబులు.. ‘డచ్చస్’ క్లబ్ ప్రశంసలు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆర్కాట్ నవాబులు సంస్కృతి, సంప్రదాయాలకే కాదు, కుల మతాలకు అతీతంగా సేవలు అందించడంలో ఆదర్శనీయులని డచ్చస్ క్లబ్ వ్యవస్థాపకురాలు, హోటల్ సవేరా మేనేజింగ్ డైరెక్టర్ నీనారెడ్డి శ్లాఘించారు. మహిళా సాధికారత, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న డచ్చస్ క్లబ్ ప్రతినెలా ఒక ప్రముఖుడితో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూన్ నెల విశిష్ట అతిధిగా ఆర్కాట్ నవాబు దాదా మహమ్మద్ ఆసిఫ్ అలీని ఆహ్వానించి జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నీనారెడ్డి మాట్లాడుతూ, ఆర్కాట్ నవాబుల్లో రాజదర్పమే కాదు, మానవతా విలువలూ మూర్తిభవించాయన్నారు. అనేక హిందూదేవాలయాల నిర్మాణాల్లో ఆర్కాట్ నవాబులది ప్రధాన పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఆర్కాట్ నవాబ్ ఆసిఫ్ అలి మాట్లాడుతూ, చెన్నై రాయపేటలోని ఆమీర్ మహల్ ఆనాటి ఆర్కాట్ నవాబుల వైభవ జీవితానికి, అభిరుచులకు నిలువుట్టద్దంగా నిలుస్తూ నేటికీ వర్ధిల్లుతోందని అన్నారు. అమీర్ మహల్లోని పూర్వీకుల తైలవర్ణ చిత్రాలు, మేనా (పల్లకి), షాండిలియర్స్ అందాలు వర్ణనాతీతమన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందం అమీర్ మహల్ సొంతమని వర్ణించారు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆలయం, చెన్నై మైలాపూర్ ఆలయంతోపాటూ పలు హిందూ దేవాలయాల నిర్మాణాలకు తన తాతముత్తా లు అందజేసిన సేవల గురించి ఆయన వివరించారు. ఆర్కాట్ నవాబుల విశేషాలు, అమీర్ మహల్ అందాలు తిలకించే భాగ్యం కల్పించిన ఆర్కాటు నవాబుకు డచ్చస్ క్లబ్ తరపున నీనారెడ్డి, అనుఅగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. డచ్చస్ ప్రతినిధులు సుజాత ముంద్రా, అను అగర్వాల్, అను సచ్చిదేవ్, రా«ధీ నీలకంఠన్ తదితర 100 మంది సభ్యులు పాల్గొన్నారు. -
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చదవండి: టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
టెక్నాలజీతో మెరుగైన సేవలు
బెంగళూరు: కోవిడ్-19 మహమ్మారి విషయంలో స్పందించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రభుత్వ, ప్రజా సేవల సంస్థలు ప్రభావవంతంగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. ఈవై కనెక్టెడ్ సిటిజన్ సర్వేలో ఈ విషయాన్ని 80 శాతం మంది అంగీకరించారు. 12 దేశాల్లో 12,100 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో భారత్ నుంచి 1,000 మందికిపైగా 18-50 ఏళ్ల వయసున్నవారు ఉన్నారు. ‘ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరడంలో సాంకేతిక ఆవిష్కరణల పాత్ర కీలకం. సాంకేతికత ప్రజా సేవలను మెరుగ్గా మారుస్తుందని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. మహమ్మారి కారణంగా భవిష్యత్తులో దైనందిన జీవితంలో టెక్నాలజీ వినియోగం అధికమవుతుందని 71 శాతం మంది తెలిపారు. ప్రజా సేవలు పొందడానికి తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ప్రభుత్వానికి ఇవ్వడానికి 63 శాతం మంది సమ్మతి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కలిసేబదులు టెక్నాలజీని వినియోగించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆర్టిఫీషియల్ ఆధారిత చాట్ బోట్ ద్వారా ప్రభుత్వంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పెన్షన్ ప్రణాళిక, వ్యాపారాల ఏర్పాటుకు వనరుల సమాచారం వంటివి ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు’ అని సర్వేలో తేలింది. -
పోలీస్ సేవల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా సంరక్షణ కార్యదర్శిని పోలీస్ తరహా సేవలకు వినియోగిస్తున్నారు. వీరి ద్వారా కూడా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా వీరు పోలీసులకు సమాచారం ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. వీరు ఏం చేస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 మహిళా సంరక్షణ కార్యదర్శులున్నారు. వీరి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకునేలా రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచే సమీపంలోని పోలీస్స్టేషన్కు వీరు వారధుల్లా పనిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి పోలీస్ తరహా సేవలందించేలా వీరిని తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్(ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) పద్ధతి అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయాల్లో వీరి ద్వారా పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామాలు, వార్డుల్లో జరిగే అనేక విషయాలను వీరు పోలీస్స్టేషన్కు నివేదిస్తారు. అపరిచితులు, అసాంఘిక కార్యకలాపాలపైనా ఎప్పటికప్పుడు వీరు పోలీస్స్టేషన్కు సమాచారమిస్తారు. అంతేకాదు, మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, మానవ అక్రమ రవాణా నిరోధం, మహిళల భద్రత, రహదారి భద్రత, సైబర్ భద్రత, బాల్య వివాహాలను అరికట్టేందుకు, రైతు ఆత్మహత్యల నిరోధంలో వీరు తమ వంతు పాత్ర పోషిస్తారు. వీటితో పాటు ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వాముల్ని చేస్తున్నారు. వీరి ద్వారా పోలీస్ సేవలు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పోలీస్ సేవలను అందించేలా మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే వారికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) ద్వారా శిక్షణ ఇచ్చాం. శాంతిభద్రతల నిర్వహణలో పలు అంశాలపై ప్రాథమికంగా వీరికి అవగాహన కల్పించాం. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని డిజిటల్ (ఆన్లైన్) సేవలను గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్తో మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలను వినియోగించుకుంటున్నాం. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చదవండి: లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు సిగ్గుంటే రాజీనామా చెయ్.. -
నేటి నుంచి వేములవాడలో హెలీకాప్టర్ సేవలు
వేములవాడ: వేములవాడ రాజన్న జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94003 99999, 74834 32752, 99800 05519, 95444 44693 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చదవండి: వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
సేవలు సరిగా అందుతున్నాయా?
సాక్షి, అమరావతి: గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు మార్చేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై దృష్టి కేంద్రీకరించింది. రెండు మాసాల క్రితమే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మరోవైపు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వాటి రూపురేఖలు మార్చే పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నిటినీ ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్హెల్త్ స్టాండర్డ్ సర్వీసెస్) ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో భారీగా మౌలిక వసతులు సమకూర్చుతున్నారు. అయితే సిబ్బంది, సదుపాయాలు ఉంటే సరిపోదని, రోగులకు సంతృప్తి కలిగించే విధంగా సేవలు కూడా అందాలని ప్రభుత్వం భావించింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన రోగుల అభిప్రాయాలు సేకరించడం (ఫీడ్బ్యాక్) ద్వారా మరింత మెరుగైన సేవలందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాజస్థాన్లోని సవాయ్ మాన్సింగ్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో మినహా దేశంలో మరెక్కడా ఇలాంటి పద్ధతి లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల మనోగతాలకు పెద్దపీట వేస్తోంది. తొలిదశలో 28 ఏరియా ఆస్పత్రుల్లో, 13 జిల్లా ఆస్పత్రుల్లో ప్రతిరోజూ రోగుల అభిప్రాయాలను సేకరించి పోర్టల్కు అప్లోడ్ చేస్తున్నారు. వాటి ఆధారంగా ఆయా ఆస్పత్రుల్లో లోపాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించి సరిచేసేందుకు చర్యలు చేపడుతోంది. డిశ్చార్జి సమయంలో ఫోన్ ఆస్పత్రిలో చేరేందుకు రోగి రాగానే సిబ్బంది అతని ఫోన్ నంబర్ తీసుకుని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపుతారు. రోజువారీ వైద్యం వివరాలు ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరుస్తారు. రోగి కోలుకున్నాక డిశ్చార్జి అయ్యే సమయంలో ఆ సమాచారం కూడా వెబ్సైట్లో పెడతారు. అదే రోజు కమిషనర్ కార్యాలయ సిబ్బంది రోగికి ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుంటారు. చికిత్స వివరాలు, అందిన సేవలు, పారిశుధ్యం ఎలా ఉందీ.. తదితర వివరాలు అడుగుతారు. ఫిర్యాదుల మేరకు చర్యలు ♦ రోగి ఏ విషయంలోనైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే దానికి ఎవరు బాధ్యులో నమోదు చేస్తారు. ♦ మందులు లేదా మౌలిక వసతుల లోపమైతే దాన్ని కూడా నమోదు చేస్తారు. ♦ నెలకు ఒకసారి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తారు. ♦ మౌలిక వసతులు, మందుల కొరత ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటారు. ♦ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిపై ఫిర్యాదులుంటే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. రోగిని అడిగే కొన్ని ప్రశ్నలు ♦ ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి? ♦ ఏ విషయంలోనైనా మీకు ఇబ్బంది కలిగిందా? ♦ మీ పట్ల డాక్టర్లు, నర్సుల ప్రవర్తన ఎలా ఉంది? ♦ చికిత్సకు మీ నుంచి డబ్బులేమైనా తీసుకున్నారా? ♦ ఆస్పత్రిలో పారిశుధ్యం ఎలా ఉంది? -
రూ.10కే అత్యాధునిక వైద్యం
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్లో గురువారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రూ.10కే అత్యాధునిక వైద్యం అందజేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు ఇక్కడ వైద్యం అందనుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎయిమ్స్ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఇందుకోసం డాక్టర్ల నియామకం, వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో 100 పడకల ఇన్పేషెంట్ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామని, ఇందులో పాజిటివ్ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన సేవల కోసం రాజీపడం మెరుగైన సేవల కోసం ఎక్కడా రాజీపడేది లేదని వికాస్ భాటియా స్పష్టం చేశారు. తెలంగాణ ఎయిమ్స్లో పనిచేయడానికి దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున పోటీ పడుతున్నారని తెలిపారు. 483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తయిందని, మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తవుతుందని ఆయన వివరించారు. 2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. మాస్టర్ప్లాన్ అప్రూవ్ అయ్యింది ఎయిమ్స్ ప్రధాన భవన సముదాయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయ్యిందని భాటియా తెలిపారు. 201 ఎకరాల్లో విశాలమైన పార్కులు, క్రీడా మైదానాలు, ఆస్పత్రి భవనాలు, విద్యార్థుల వసతి గృహాల 28 అంతస్తుల 3 టవర్లు బాలురు, బాలికలు, స్టాఫ్ కోసం వేర్వేరుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్, గార్డెనింగ్, గెస్ట్హౌజ్, మెడికల్ కళాశాల, ఆయుష్ బిల్డింగ్, ఆడిటోరియం వెనక స్టాఫ్ రెసిడెన్షియల్ భవనాలు, పార్కులు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నిమ్స్ భవన సముదాయాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు అధికారికంగా అప్పగించలేదన్నారు. ఎయిమ్స్కు అనుబంధంగా 40 నుంచి 60 కిలో మీటర్ల లోపు రూరల్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. -
శభాష్.. పోలీస్
సాక్షి, అరావతి: శాంతి భద్రతల పరిరక్షణతోపాటు విపత్తు వేళ వరద ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవలు శభాష్ అనిపించుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిర్విరామంగా సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరద ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్తో.... వరద నీటిలో చిక్కుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులంకలో బిడ్డకు జన్మనిచ్చిన వాసిమల్ల ప్రసన్న అనే మహిళను పోలీసులు ప్రత్యేక రోప్ (బలమైన పెద్ద తాళ్లు) సాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందేలా సహకరించారు. వరద నుంచి తల్లీ బిడ్డను కాపాడిన ఎస్ఐ ఉమేష్, సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్గున్నీ అభినందించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట విద్యానగర్లో వరదలో చిక్కుకున్న బాధితులను ఎస్ఐ చిన్నబాబు సిబ్బంది సహకారంతో కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలో కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై బండరాళ్లు పడటంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణం స్పందించి వీటిని తొలగించిన స్థానిక పోలీసులను ప్రజలు అభినందించారు. విశాఖ–అరకు రోడ్డులో దముకు, శివలింగాపురం ప్రాంతాల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఎస్ఐ అనంతగిరి, సిబ్బంది స్థానికుల సహకారంతో తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు ఎస్ఐ ఎన్ఆర్ఎల్ రావు తన సిబ్బందితో కలసి వరద ప్రాంతాల్లో బాధితులకు 200 వెజ్ బిర్యానీ, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని రామవరంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని హైవే మొబైల్ టీమ్ డ్రైవర్(హోంగార్డు) అర్జున్ బుధవారం కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. -
5జీ సేవలకు సన్నద్ధం : ముఖేష్ అంబానీ
ముంబై : రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్వర్క్ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్వర్క్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీని ఉద్దేశించి ముఖేష్ మాట్లాడుతూ జియో ప్రస్ధానాన్ని వివరించారు. జియో 4జీ నెట్వర్క్ ద్వారా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్ కనెక్టివిటీ, సహేతుకమైన ధరల్లో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తీరును ముఖేష్ అంబానీ గుర్తుచేశారు. జియోకు ముందు భారత్ 2జీ టెక్నాలజీకే పరిమితమైందని, భారత్ డేటా కష్టాలకు ముగింపు పలకాలని జియో నిర్ణయించుకుని డిజిటల్ విప్లవాన్ని చేపట్టిందని చెప్పారు. దేశమంతటా అత్యధిక వేగంతో పాటు మెరుగైన కవరేజ్తో ప్రపంచ శ్రేణి డిజిటల్ నెట్వర్క్ను సృష్టించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్ను తాము ప్రవేశపెట్టామని, జియో యూజర్లకు వాయిస్ సేవలను పూర్తి ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. జియోకు ముందు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యంకాక వందకోట్ల భారతీయుల్లో సగానికి పైగా డిజిటల్ ఉద్యమానికి దూరంగా ఉన్నారని అన్నారు. 2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్వర్క్లో చేరుతున్నారని చెప్పారు. భారత్లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి : రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్.. -
కోవిడ్ సేవల్లో కడప 2వ స్థానం
సాక్షి, కడప: కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర స్దాయిలో మన జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. గత గురువారం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. ఈ మూడు రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకొని రెండవ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతి సోమవారం, గురువారం కరోనా సేవలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించి, ర్యాంకులు ప్రకటిస్తుంది. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష జరిగింది. జిల్లా రెండవ స్థానంలో నిలిచినట్లుగా ఉన్నతాధికారులు ఇందులో ప్రకటించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ నేతృత్వంలో కోవిడ్పై ఒక అధికారిని నియమించారు. అన్ని శాఖల అధికారులకు భాగస్వామ్యం కల్పించారు. కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా సేవలందిస్తోంది. కరోనా నిర్ణారణ పరీక్షలు నిర్వహంచడం, పాజిటివ్గా నిర్ణారణ అయిన వ్యక్తులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడం. సకాలంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ను గుర్తించడం, కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించడం, శుభ్రత చర్యలు చేపట్టడం, హోం ఐసోలేషన్లో ఉన్న వారిని పరిశీలించడం లాంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటి ఆధారంగా సోమ, గురువారం ర్యాంకులను ప్రకటిస్తుంది. -
అరచేతిలో పోలీస్ స్టేషన్!
సాక్షి, అమరావతి: పోలీస్ స్టేషన్ పేరు వింటేనే కొంత జంకు, బెరుకు సహజం. పోలీసులు స్నేహహస్తం చాస్తున్నా అందుకునేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర పోలీసు శాఖ ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించింది. రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్ గడప తొక్కకుండానే ప్రజలు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్ సేవ’ మొబైల్ యాప్ సిద్ధమైంది. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ యాప్ త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. (చదవండి: అంతర్వేది ఘటన సీబీఐకి..) అరచేతిలో అన్ని సేవలు.. ♦పోలీసు స్టేషన్ ద్వారా లభించే అన్ని సేవలను ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ యాప్ ఫిర్యాదులు స్వీకరించడమే కాదు రశీదు కూడా జారీ చేస్తుంది. ♦దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్వోసీలు, లైసెన్సులు, పాస్పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చు. ♦ఈ యాప్ నుంచే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే అవకాశం కూడా ఉంది. ప్రజలకు చేరువలో పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండానే ప్రజలకు పోలీసు సేవలను సత్వరమే పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యం. జవాబుదారీతనంతో పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ‘ఏపీ పోలీస్ సేవ’ యాప్ను సీఎం వైఎస్ జగన్ త్వరలో ప్రారంభిస్తారు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ ఆరు విభాగాల్లో 87 రకాల సేవలు శాంతి భద్రతలు.. ♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు ♦ఎఫ్ఐఆర్ స్థితిగతులు, డౌన్లోడ్ ♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు ♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు ♦అరెస్టుల వివరాలు ♦వాహనాల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ సేవలు.. ♦ఇంటి పర్యవేక్షణ(లాక్మానిటరింగ్ సర్వీసు(ఎల్ఎంఎస్) , ఇ–బీట్) ♦ఇ–చలానా స్టేటస్ పబ్లిక్ సేవలు.. ♦నేరాలపై ఫిర్యాదులు ♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు ♦ఎన్వోసీ, వెరిఫికేషన్లు ♦లైసెన్సులు, అనుమతులు ♦పాస్పోర్ట్ వెరిఫికేషన్ రహదారి భద్రత.. ♦బ్లాక్ స్పాట్లు ♦యాక్సిడెంట్ మ్యాపింగ్ ♦రహదారి భద్రత గుర్తులు ♦బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు ప్రజా సమాచారం.. ♦పోలీస్ డిక్షనరీ ♦సమీపంలోని పోలీస్స్టేషన్ ♦టోల్ఫ్రీ నంబర్లు ♦వెబ్సైట్ల వివరాలు ♦న్యాయ సమాచారం ♦ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు పబ్లిక్ ఔట్ రీచ్.. ♦సైబర్ భద్రత 4 మహిళా భద్రత ♦సోషల్ మీడియా ♦కమ్యూనిటీ పోలీసింగ్ ♦స్పందన వెబ్సైట్ ♦ఫ్యాక్ట్ చెక్ -
పికప్ అవుతోంది
టోక్యో: జపాన్ సూషీ రెస్టారెంట్ లకు ప్రసిద్ధి. అదొక డిష్ ఐటమ్. ఉడికించిన బియ్యంలో గుబాళింపు కోసం వెనిగర్ చుక్కలు చల్లుతారు. చిన్న పిల్లల అరచేతిలో పెట్టే చిట్టి అన్నం ముద్దలా ఉంటుంది అది. దానిని ఒక రకమైన సముద్రపు కలుపులో చుడతారు. చేపలు లేదా మాంసం ముక్కలు జత చేస్తారు. శాకాహారుల కోసం అయితే వాటికి బదులుగా కాయగూరలు ఉంటాయి. సాధారణం గా అవి దోస ముక్కలు అయి ఉంటాయి. కొంచెం చక్కెర, ఉప్పు కలుపుతారు. సూషీ రెడీ అయిపోతుంది. ఇళ్లల్లో కూడా చేసుకోవచ్చు. కానీ హోటల్ నుంచి తెప్పించుకుంటే ఆ టేస్ట్ వేరు. కరోనా రాక ముందు వరకు జపాన్ లో సూషీ రెస్టారెంట్లు రద్దీగా ఉండేవి. డెలివరీ కౌంటర్ ల దగ్గరైతే తొక్కిసలాటే. డెలివరీ బాయ్స్ తో కళకళ లాడుతుండేది చిన్న సూషీ రెస్టారెంట్ కూడా. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా ఫుడ్ డెలివరీ పిక్ అప్ కావడం లేదు. ఎలా మరి బిజినెస్ జరగడం! ఏదో కొత్తగా చేయాలి. సూషీ లో కొత్తగా చేయడానికేమీ ఉండదు. ఒక వేళ చేసినా ఆ కొత్తదనాన్ని కస్టమర్లు కచ్చితంగా ఇష్టపడరు. అందుకని అక్కడి ఓ రెస్టారెంట్ ఓ కొత్త ఆలోచన చేసింది. బాడీ బిల్డర్ లను డెలివరీ బాయ్స్ గా పెట్టుకుంది!! వీళ్లేం చేస్తారంటే సూటు వేసుకుని వెళ్లి సూషీ ని డెలివరీ చేశాక, డోర్ బయట నిలబడి కస్టమర్ ముందు సూట్ తీసి, చొక్కా విప్పి కండల ప్రదర్శన చేస్తారు. ఫ్రంట్ ఒకసారి, వెనక్కు తిరిగి బ్యాక్ ఒకసారి. తర్వాత చొక్కా, సూటు వేసుకుని ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోతారు. ఇప్పుడిప్పుడు ఈ ‘డెలివరీ మాచో’ సర్వీసు (వాళ్లు పెట్టుకున్న పేరే) ఊపు అందుకుంటోందట. అయితే కనీసం 7000 ఎన్ లకు తక్కువ కాకుండా సూషీని ఆర్డర్ ఇచ్చిన వాళ్లకే ఈ మాచో సర్వీసు. మన రూపాయల్లో సుమారు ఐదు వేలు అనుకోండి. ఏమైనా ఈ పద్ధతి బాగున్నట్లు లేదని అప్పుడే ముఖాల చిట్లింపులు కూడా మొదలయ్యాయి. చూడండి: పాక్ చెరలో 19మంది భారతీయులు -
సెప్టెంబర్ 1 నుంచి మెట్రో కూత
-
మరింత సమర్థవంతగా 104 కాల్ సెంటర్లు
సాక్షి, అమరావతి: 104 కాల్ సెంటర్ను మరింత సమర్థవంతగా తీర్చిదిద్దుతున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందించేలా ఆ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకు అన్ని సేవలను పొందడానికి ఆ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ డిజిటల్ పద్ధతుల్లో దాన్ని అధికారులు పర్యవేక్షించేలా ప్రోగ్రాం రూపొందించారు. సమస్య పరిష్కారమైన తర్వాతే ప్రోగ్రాం నుంచి ఆ సమస్య తొలగించబడుతుంది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకుంది. కోవిడ్ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో 104 కాల్ సెంటర్ బలోపేతానికి తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ('అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు') సేవలు ఇలా.. ►104కు కాల్ చేయగానే కోవిడ్ పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? టెస్ట్ సెంటర్ ఎక్కడుంది? దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది? సంబంధిత ప్రాంతంలో ఏఎన్ఎం ఎవరు? సంబంధిత డాక్టర్ సమాచారం ఏంటి? తదితర సమాచారాన్ని పొందవచ్చు. ►కోవిడ్ ఉందని అనుమానం ఉంటే.. వెంటనే 104కు కాల్ చేయగానే డాక్టరు అందుబాటులోకి వస్తారు. కాల్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలుసుకుని టెస్టు చేయించుకోవాల్సిన అవసరం ఉందో? లేదో? నిర్ణయం తీసుకుంటారు. ►డాక్టర్ సిఫార్సు మేరకు టెస్టు చేయించుకున్న తర్వాత.. పాజిటివ్గా తేలితే, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుంటే.. ఆ వ్యక్తి నేరుగా మళ్లీ 104కు కాల్ చేయొచ్చు. అప్పుడు సంబంధిత సిబ్బంది నేరుగా ఫాలో అప్ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. ►ఆ చర్యల్లో భాగంగా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తికి డాక్టర్ ఫోన్ చేస్తారు. వైరస్ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని హోం ఐసోలేషన్ లేదా, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయిస్తారు. 104కు కాల్ చేసి పై రిక్వెస్టుల్లో ఏది చేసినా సరే.. అది ఆన్లైన్లో ప్రత్యేక ప్రోగ్రాంలో నమోదు అవుతుంది. కాలర్ చెప్పిన సమస్య పూర్తిగా పరిష్కారం అయిన తర్వాతనే ఆ రిక్వెస్ట్ పరిష్కరించినట్టుగా చూపిస్తుంది. లేకపోతే ఆ సమస్య పెండింగులో ఉన్నట్టుగానే భావిస్తారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో బెడ్లు, వాటి భర్తీ, ఉన్న ఖాళీలపైన కూడా ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేస్తూ.. 104తో పాటు, కోవిడ్ ఆస్పత్రుల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని వల్ల ఆలస్యాన్ని నివారించడంతో పాటు మెరుగైన సేవలు లభించనన్నాయి. ఇంకా వాటి నిర్వహణ సులభం కానుంది. -
లీజుకు మారుతీ కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అద్దె వాహన సేవలను ప్రారంభించింది. ‘మారుతీ సుజుకీ సబ్స్క్రైబ్’ పేరిట తాజా సర్వీసులను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో కస్టమర్లు కారును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, లీజు పద్ధతిలో నచ్చిన కారును వినియోగించుకోవచ్చు. మారుతీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, నెక్సా, బాలెనో, ఎర్టిగా, సియాజ్, ఎక్స్ఎల్ 6 కార్లను లీజు సభ్యత్వ సేవలో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. 24, 36, 48 నెలల కాలపరిమితితో ఈ కార్లను అందజేస్తున్నట్లు వివరించింది. నెలవారీ చందాలోనే కారు నిర్వహణ, బీమా మొత్తాలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్లో ఈ సేవలను అందించడం కోసం.. జపాన్కు చెందిన ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో లీజింగ్ సేవలను అందిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
ఏపీ వ్యాప్తంగా 412 నూతన 108 వాహనాలు
-
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్..
సాక్షి, విజయవాడ: అంతర రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని చూస్తున్నామని వెల్లడించారు. 256 సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నడపాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి భేటీ అనంతరం స్పష్టత వస్తుందని చెప్పారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు) వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామన్నారు. విభజన జరిగినప్పుడు ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. -
గరుడవేగ సేవలు పునః ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో లాక్డౌన్లు అమలైన క్రమంలో కొద్దినెలలుగా నిలిచిపోయిన తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ గరుడవేగ తెలిపింది. తమ బ్రాంచీలన్నీ పున:ప్రారంభమయ్యాయని పేర్కొంది. వినియోగదారుల సరుకులను ఎప్పటిలాగే దూర దేశాలలో ఉన్న తమ వారికి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భౌతిక దూరం, ఐసోలేషన్ వంటి కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది. తమ సంస్థ అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా 200 దేశాలకు సేవలను అందిస్తున్నదని గరుడవేగ పేర్కొంది. ఇక గరుడ బజార్ "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చని పేర్కొంది. -
నేటి నుంచి టేకాఫ్
-
ప్రారంభమైన విమాన సర్వీసులు
సాక్షి, ఢిల్లీ: రెండు నెలల తర్వాత నేడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా విమాన ప్రయాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్కు ముందుతో పోలిస్తే మూడో వంతు సామర్థ్యంతో విమానాల సర్వీసులు పనిచేస్తాయి. 7 కేటగిరీల్లో విమాన సర్వీసు ఛార్జీలు అమల్లో ఉన్నాయి. విమాన ప్రయాణికులను క్వారంటైన్పై గందరగోళం తలెత్తుతోంది. ప్రయాణికుల క్వారంటైన్ పై తలో బాటలో రాష్ట్రాలు మార్గదర్శకాలను ప్రకటించాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్ నిబంధనలు ప్రకటించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని నిబంధనలు విధించాయి. గృహ ఏకాంతవాసంలో ఉండాలని మరికొన్ని సూచించాయి. ప్రయాణికులంతా 14 రోజులపాటు ఇంటికే పరిమితమవ్వాలని కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కోరాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారిని స్వీయ చెల్లింపు క్వారంటైన్లో రెండు వారాల తప్పనిసరి బీహార్ ప్రభుత్వం తెలిపింది. ప్రయాణికులంతా తాము వెళ్లే రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య ప్రొటోకాల్లను ముందే చదవాలని విమానయాన సంస్థలు కోరాయి. ఆయా రాష్ట్రాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చినా, వాటిలో క్వారంటైన్లో ఉండాల్సి వచ్చినా తమకు సంబంధం లేదని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.విమాన సేవల పునఃప్రారంభాన్ని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలతో ముమ్మర చర్చలు జరుపుతుంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, బాగ్డోగ్రా విమానాశ్రయాల్లో గురువారం నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. -
5జీ కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ, టెలికాం పరిశ్రమల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పనులపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది. టెలికాం శాఖ 5జీ వేలంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో 5జీ వేలం ప్రక్రియ 2021లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చర్చ సాగింది. వేలం ప్రక్రియలో జాప్యం జరిగితే అది 5జీ పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన లాంఛనాలు పూర్తయి 5జీ వాణిజ్య సేవలు 2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు భారత్లో 5జీ స్పెక్ట్రమ్ బేస్ ధర యూనిట్కు రూ 492 కోట్లుగా నిర్ణయించడం టెలికాం ఆపరేటర్లకు ప్రధాన అవరోధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో బేస్ ధర అత్యధికంగా ఉందని టెలికాం దిగ్గజాలు వొడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత 5జీ ప్రణాళికల్లో చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు హువేయి, జడ్టీజీల పాత్రపై కొనసాగుతున్న అనిశ్చితి సైతం భారత్లో 5జీ ఎంట్రీని సంక్లిష్టం చేస్తున్నాయని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది. చదవండి : 5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు భారత్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మౌలిక సేవల కోసం చైనా కంపెనీలు హువేయి పాత్ర సందేహాస్పదంగా మారింది. అమెరికా చేపట్టిన చైనా వ్యతిరేక విధానంతో పలు దేశాలు హువేయి ద్వారా 5జీ మౌలిక సేవలను పొందేందుకు సానుకూలంగా లేవు. భారత్లో ఇప్పటికే టెలికాం రంగంలో తీవ్ర పోటీతో స్వల్ప మార్జిన్లతో నెట్టుకొస్తున్న టెలికాం ఆపరేటర్లు 5జీ సేవల కోసం భారీ నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేరు. కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో మొబైల్ యూజర్ల నుంచి ఖరీదైన 5జీ ప్లాన్స్కు ఆదరణ ఎంతమేరకు ఉంటుందనేది కూడా టెలికాం ఆపరేటర్లను ఆలోచనలో పడవేశాయి. ఇక 5జీ సేవలు ప్రధానంగా పారిశ్రామిక అప్లికేషన్స్కు ఉపయుక్తమని, సాధారణ యూజర్లకు 5జీ ప్రయోజనాలు పరిమితమే. ఈ పరిస్థితులను బేరీజు వేసి టెలికాం శాఖ 5జీ ఎంట్రీని మరో ఏడాది పాటు జాప్యం చేస్తోందని చెబుతున్నారు. -
విశాఖ రెడ్ జోన్ ఏరియాలో ఇండియన్ నేవీ సేవలు
-
ఇక టెలీ మెడిసిన్..
నారాయణ పేట: లాక్డౌన్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా టీ కన్సల్ట్ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సమగ్ర టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ కన్సల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును శ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి చేతుల మీదుగా ప్రారంభించి కలెక్టర్ దాసరి హరిచందనకు ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తూ శ్రీకారం చుట్టారు. టీటా నేతృత్వంలో.. జిల్లాలో ఇప్పటికే టీటా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో తమ జిల్లాలో టెలీమెడిసిన్ సేవలు ప్రవేశపెట్టాలని కలెక్టర్ హరిచందన టీటా గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్కుమార్ను కోరడంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా.. రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను అందించేందుకు టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మండలంలో 39 గ్రామాలు ఉండగా.. అందులో ఇదివరకు 17 గ్రామాల్లో సేవలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలు ఇలా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో వ్యక్తులు బయటికి రావొద్దని ఆదేశాలు ఉండటంతో వాటిని గౌరవించడంతో పాటుగా మెరుగైన వైద్య సేవలు సామాన్యులకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువ కానున్నాయి. టెలీమెడిసిన్ సేవలు అందించడంలో భాగంగా ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత ప్రత్యేక అధికారులు తమ అందుబాటులోని సమయం పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్రజలు అపాయింట్మెంట్ పొందుతారు. అనంతంర సంబంధిత డాక్టర్, గ్రామస్తుడు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలీ మెడిసిన్ ప్రక్రియ అనంతరం ప్రిస్కిప్షన్ సైతం ఆన్లైన్ ద్వారా సంబంధిత గ్రామస్తులకు వాట్సాప్ ద్వారా చేరుతుంది. నోడల్అధికారి పంచాయతీ కార్యాలయంలో ఉంటూ సేవలు అందిస్తారు. ఈ వీడియో కనెక్ట్ ప్రక్రియకు సమన్వయం చేస్తారు. క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయంతో.. దేశంలోనే పూర్తిస్థాయిలో మొదటిసారిగా ఒక మండలాన్ని టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పంచాయతీ కార్యాలయం నోడల్ కార్యాలయంగా ఉండగా.. పంచాయతీ కార్యదర్శి నోడల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. అందుబాటులో 96 మంది డాక్టర్లు వివిధ రోగాలను ప్రజలకు ఆన్లైన్లో నివృత్తి చేస్తూ.. వైద్య సేవలను అందించేందుకు 96 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, డెంటిస్ట్, న్యూరాలజిస్ట్, ఈఎన్టీ, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డయాబెటిస్, గ్రాస్టాలజిస్ట్, తదితర ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. జిల్లా అంతటా విస్తరింపజేస్తాం.. మక్తల్ మండలంలో ప్రాజెక్టు ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాత జిల్లాలోని మిగతా 10 మండలాల్లో విస్తరింపజేసేందుకు కృషిచేస్తాం. మక్తల్ ప్రజలు ఈ సేవలు అందుకునేందకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. కరోనా నియంత్రణకు ఇంటినుంచి బయటికి రాకుండా ప్రతిఒక్కరూ సహకరించాలి. లాక్డౌన్ సమయంలో ఈ సేవలు చాలా ప్రయోజనకరంగా ఉంది. – హరిచందన, కలెక్టర్, నారాయణపేట ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా.. లాక్డౌన్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా టెలీ మెడిసిన్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మక్తల్ మండలంలో 250 మందికి వైద్య సేవలను అందించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పల్లె సీమల్లోని ప్రజలకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. – సందీప్ కుమార్ మక్తాల, టీటీ గ్లోబల్ ప్రసిడెంట్ -
సులభతర వాణిజ్యానికి ఎలక్ట్రానిక్ ఫామ్..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి కొత్త ఎలక్ట్రానిక్ ఫాంను కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త కంపెనీలు నమోదు చేసుకునేందుకు ఎలక్ట్రానిక్ ఫాం ఉపయోగపడుతుందని సంబంధిత శాఖ పేర్కొంది. ఎన్పీఐసీఇ+ పేరుతో పది సేవలను కార్పొరేట్ మంత్రిత్వశాఖ అందించనుంది. ఎలక్ట్రానిక్ ఫాంతో పాటు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ రిజిష్ట్రేషన్ నెంబర్లను అందించనున్నారు. ఈ ఫామ్లో పది సేవలను పొందుపర్చడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, వ్యాపారం చేయాలనుకునే వారికి మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలపాయి. దేశ వృద్ధి రేటు పెంచే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రానిక్ ఫాం నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతగొనో ఉపయోగపడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రామపడుతున్నారు. -
పాలమూరుపై చెరగని ముద్ర
సాక్షి, మహబూబ్నగర్: పునరి్వభజన అనంతరం జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన డి.రొనాల్డ్రోస్ చెరగని ముద్ర వేశారు. విస్తృత తనిఖీలతో ప్రభుత్వ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మిషన్ కలాం పేరుతో ఎన్జీఓలను భాగస్వాములను చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానంతో సులువుగా అనుమతులు, ఫైళ్ల నిర్వహణతో పనిభారాన్ని తగ్గించగలిగారు. భూప్రక్షాళన ద్వారా జిల్లాలో పకడ్బందీగా భూరికార్డుల నవీకరణ చేపట్టారు. ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’లో సమూల మార్పులు తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్సు కోసం అన్ని తహసీల్దార్ కార్యాలయాలను అనుసంధానం చేశారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రాజెక్టుల భూసేకరణ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో విలక్షణమైన పాలనతో మెరుగైన ఫలితాలు సాధించినందుకు దేశ, రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి. మయూరి పార్కులో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రొనాల్డ్రోస్ (ఫైల్) జిల్లాకు అవార్డులు.. మహబూబ్నగర్ జ్లిలా వెబ్సైట్కు 2018 డిజిటల్ ఇండియా అవార్డ్స్లో భాగంగా వెబ్రత్న డిస్ట్రిక్ట్ అవార్డు వరించింది. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని తీసుకురావడం ద్వారా స్కోచ్ 2018, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు–2019 సాధించారు. వాటర్, శానిటేషన్, హైజీన్కు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నుంచి అవార్డు అందుకున్నారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, శిక్షణకు సంబంధించి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు–2019 వరించింది. డిజిటల్ సేవల అనుసంధానం డిజిటల్ సేవలను జిల్లాలోని అన్ని శాఖలకు విస్తరించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ–ఆఫీస్ సేవలు, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ రూపకల్పన, ప్రతీ ప్రభుత్వ శాఖకు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ వంటి వాటితో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టారు. సాంకేతికపరమైన సేవలను వినియోగించుకుని ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు చేరువ చేయడంలో తనదైన శైలితో పాలన సాగించారు. ప్రజావాణి, సమాచారహక్కు చట్టం వంటి ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పించారు. మిషన్ భగీరథ పథకంపై సమీక్ష (ఫైల్) సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ.. జిల్లాలో శాసనసభ, పార్లమెంటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను కలెక్టర్ రొనాల్డ్రోస్ సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేస్తూ ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా రూపకల్పన చేయడంతో పాటు ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యతను చాటారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సంక్షేమంపై ప్రత్యేక దృష్టి దివ్యాంగుల సంక్షేమానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు ఉపాది కలి్పంచేందుకు దివ్యాంగుల సోలార్ సొసైటీని ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు. చెవిటి, మూగ, దివ్యాంగుల పిల్లలకోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. స్త్రీ,శిశు సంక్షేమంలో భాగంగా మహబూబ్నగర్ అర్బన్లో అంగన్వాడీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు చర్యలు చేపట్టారు. మాతా శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బాల్యవివాహాల నివారణపై దృష్టి సారించారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా బాలకారి్మక వ్యవస్థ నిర్మూలకు చర్యలు చేపట్టారు. అభివృద్ధి పనుల్లో వేగం జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మయూరి పార్కును రాష్ట్ర, దేశస్థాయి నాయకులు, అధికారులు సందర్శించేలా చర్యలు తీసుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించగలిగారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ అభివృద్ధి, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిని వేగిరం చేశారు. సస్పెన్షన్లతో హడల్.. కలెక్టర్ రొనాల్డ్రోస్ పరిపాలనలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపై కఠనంగా వ్యవహరిస్తూ హడలెత్తించారు. విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో విధులపై నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలకు వెనుకాడలేదు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, తదనంతరం పది రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతలు, శ్వశానవాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణం, కంపచెట్ల తొలగింపు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి నిర్వహణపై తగు చర్యలు తీసుకున్నారు. 24 గంటల్లో 380 మరుగుదొడ్లు స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 24 గంటల్లోనే 380 మరుగుదొడ్లను నిర్మింపజేసి దేశ స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాకు గుర్తింపును తెచ్చారు. నిరీ్ణత సమయానికంటే ముందే జిల్లాను వంద శాతం మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటించారు. -
బ్యాంకు సమ్మె: 10 లక్షల మంది, 80 వేల శాఖలు
సాక్షి,చెన్నై: రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహించనుంది. మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం రెండు రోజుల సమ్మెకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్.. దేశవ్యాప్తంగా వై–ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై–ఫై నెట్వర్క్లను కూడా వినియోగించుకుని కాల్స్ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్ ప్రొజెక్ట్ కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై–ఫై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇటీవలే రిలయన్స్ జియో సైతం ఈ తరహా సేవ లను అందుబాటులోకి తెచ్చింది. -
‘వజ్రాలను’ అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వజ్ర బస్సులు చేదు అనుభవాన్నే మిగిల్చడంతో వాటిని వదిలించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు రావటంతో, వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని ఆయన ఆదేశించారు. కానీ అవి అందుకు యోగ్యం కాదని తేలడంతో వాటిని అమ్మకానికి పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఏసీ వసతితో ఉన్నందున సాఫ్ట్వేర్ కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థలు వీటిని కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్కో బస్సుకు దాదాపు రూ.10 లక్షల వరకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని సమాచారం. 60 బస్సులు సిద్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద వంద వజ్ర బస్సులున్నాయి. 2017లో 40 బస్సులతో వీటిని ప్రారంభించారు. ప్రయాణికుల వద్దకే బస్సులు వచ్చేలా సీఎం కేసీఆర్ ఈ విధానానికి రూపకల్పన చేశారు. కానీ ఆ విధానం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఫలితంగా రూ.12 కోట్ల మేర నష్టాలు వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. అప్పట్లో ఒక్కోటి రూ.25 లక్షలు వెచ్చించి ఈ బస్సులను కొనుగోలు చేశారు. వీటిని కార్గోకు వినియోగించాలని తొలుత సీఎం ఆదేశించారు. కానీ ఏసీతో ఉన్న ఈ బస్సులను సరుకు రవాణాకు వాడితే నష్టమ ని అధికారులు తేల్చారు. పైగా అవి మినీ బస్సులు కావడంతో చిన్న చక్రాలతో ఉం టాయి. అందువల్ల సరుకు రవాణాకు అనుకూలం కాదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటిని అమ్మితేనే లాభం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఉన్నవాటిలో 60 బస్సులు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు వీటిని అమ్మకానికి పెట్టబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన విక్రయ నోటిఫికేషన్ వెలువడనుంది. -
ఏపీలో ఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ
-
మంచి రోడ్లు కావాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే
న్యూఢిల్లీ: నాణ్యమైన రోడ్లు కావాలనుకుంటే టోల్ ఫీజు చెల్లించక తప్పదని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లోక్సభలో అన్నారు. రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవన్నారు. గత అయిదేళ్లలో 40 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. టోల్ వద్ద వసూలు చేసే డబ్బు పల్లెల్లో, పర్వత ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి ఉపయోగపడతాయన్నారు. రోడ్ల విస్తరణకు భూసేకరణ దగ్గరే అసలైన సమస్య ఎదురవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అధిగమించడానికి కొత్త ప్రణాళికలు రచించాలన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వేగంగా రోడ్లను నిర్మించడం ద్వారా మోదీ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్ల విలువైన ఎన్పీఏలను ఆదా చేసిందన్నారు. ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో చేరుకునేలా రహదారి నిర్మించనున్నామన్నారు. రహదారి పొడవునా పచ్చదనాన్ని పెంచుతామన్నారు. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల మీదుగా ఈ దారిని నిర్మిస్తామన్నారు. భూసేకరణలో ఈ మార్గం ద్వారా రూ. 16 వేల కోట్లను ఆదా చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, రాష్ట్ర బస్సు సర్వీసులకు టోల్ ఫీజు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేశానికి 25 లక్షల మంది డ్రైవర్ల అవసరం ఉందని, త్వరలో ప్రతి రాష్ట్రంలో ఓ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి యూరో 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తాయని, దీంతో కాలుష్యం తగ్గుతుందన్నారు. -
మహిళల ముంగిట్లో డిజిటల్ సేవలు : జియో
ముంబై : భారత మహిళలకు డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సౌకర్యాలను చేరువ చేసేందుకు అతిపెద్ద మొబైల్ డేటా నెట్వర్క్ జియో, జీఎస్ఎంఏ కనెక్టెడ్ వుమెన్ ఇనీషియేటివ్తో చేతులు కలిపినట్టు జియో ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, డేటా వాడకం, డిజిటల్ సేవలు పొందడంలో జెండర్ గ్యాప్ను నిరోధించేందుకు తమ భాగస్వామ్యం ఉపకరిస్తుందని వెల్లడించింది. భారత్లో మొబైల్ సేవలు పొందడంలో పురుషులతో దీటుగా మహిళలు ముందుకు వెళ్లలేకపోతున్నారని, ఆ సేవలు యాక్సెస్ లేకపోవడం, అందుబాటు ధరలు కొరవడటం, డిజిటల్ విప్లవంలో సమ్మిళిత వృద్ధి లోపించడం వంటి కారణాలున్నాయని, జియో ఆవిర్భావం నుంచే వీటిని అధిగమించడం జరిగిందని తెలిపింది. ఇక డిజిటల్ ఇంక్లూజన్పై జియో దృష్టిసారించిందని, గత దశాబ్ధకాలంగా మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీల పెరుగుదల మహిళా సాధికారత, ఐటీ విద్యావ్యాప్తికి ఉపకరించిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. -
ఎంచక్కా.. ఎగిరిపోదాం..!
అందుబాటులో ఉండే విమాన చార్జీలు మరోవైపు.. వెరసి హైదరాబాదీలను జాతీయ, అంతర్జాతీయ నగరాల్లో పర్యటించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలసి ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. కొద్దిరోజులుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ సుమారు55 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు 10 వేల నుంచి 15 వేల మంది అదనంగా బయలుదేరి వెళ్తున్నట్లు అంచనా. అన్ని విమానాల్లో చాలా వరకు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వేసవి రద్దీయే ఇందుకు కారణమని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. విస్తరించిన సేవలు హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరించుకుంది. ప్రస్తుతం దేశంలోని 66 నగరాలకు, విదేశాల్లో 18 నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాలు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏటా 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకొనే ప్యాకేజీలు సైతం విమాన ప్రయాణాలను బాగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 16 లక్షల నుంచి 20 లక్షల వరకు పెరిగింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకలు, వరుస సెలవులు, వేసవి లాంటి సమయాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం విమాన ప్రయాణాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నగరాలంటే మక్కువ ఎక్కువ నగరవాసులు ఎక్కువగా సింగపూర్, మలేసియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్, లండన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు తరలివెళ్తున్నారు.అందుబాటులో ఉండే చార్జీలు ఒక కారణమైతే ఈజీ కనెక్టివిటీ మరో ప్రధాన కారణం. నేరుగా ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువమంది ఈ దేశాలకు వెళ్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమే. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున పర్యాటకులు ఎక్కువ శాతం సింగపూర్, మలేషియాలను ఎంపిక చేసుకుంటున్నారు. రైలు చార్జీలతో సమానం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు శంషాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉండటంతో చాలామంది రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. చార్జీల్లోనూ ఈ మార్పు కన్పిస్తోంది.సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్ చార్జీలతో సమానమైన విమాన చార్జీలు, క్షణాల్లో గమ్యస్థానానికి చేరే అవకాశముండటంతో విమాన సర్వీసుల వైపు ఆసక్తిని పెంచుతున్నాయి. ఎక్కువ మంది బెంగళూర్, ఢిల్లీ, గోవా, ముంబై, చెన్నైతో పాటుగా ఇటు బ్యాంకాక్, నేపాల్, బ్రిటన్, అమెరికాలాంటి ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మరికొందరు వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు సోలోగా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి సుమారు 25 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్లు సైతం బాగా పెరిగినట్లు థామస్కుక్, కాక్స్ అండ్ కింగ్స్, ఐఆర్సీటీసీ.. తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. సోలోగా అయితేనే సో బెటర్ హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీటూర్లకు వెళ్తున్నట్లు ఓ అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరబందీల్లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడం వల్ల చాలా మంది సోలో జర్నీయే సో బెటర్ అనుకుంటున్నారు. ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. ఇటు దేశంలో బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చి, గౌహతి, విశాఖ నగరాలకు సోలో పర్యాటకుల ఎక్కువగా ఉంది. అత్యాధునిక సేవలు.. భద్రతా తనిఖీలను క్షణాల్లో పూర్తిచేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన ‘ప్యాసింజర్ ప్రైమ్’ సర్వీసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే ఎక్కడా ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పారదర్శకమైన భద్రతా తనిఖీలను కొనసాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్, హ్యాండ్ బ్యాగేజ్ స్కానింగ్లతో క్షణాల్లో తనిఖీలను పూర్తి చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
‘ఓటు’ జనం
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లు హైదరాబాద్ వాసులు ఓట్ల పండుగ కోసం సొంత ఊళ్లకు పోటెత్తారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ బుధవారం తారస్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గురువారమే ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు బయల్దేరారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఎక్కువ శాతం ప్రధాన రాజకీయ పార్టీలే గంపగుత్తగా బుక్ చేసుకుని ప్రయాణికులను తరలించాయి. దీంతో సాధారణ జనానికి ప్రైవేట్ బస్సు లు చాలా వరకు అందుబాటులో లేకుండా పోయా యి. ఉన్న కొద్ది పాటి బస్సుల్లోనూ చార్జీలను రెట్టింపు చేశారు. విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లోనూ ప్రయాణికులను సొంత ఊళ్లకు తరలించినట్లు సమాచారం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు రాకపోకలు సాగించే 3,500 ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సులతో పాటు మరో 700 బస్సులను రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు అదనంగా ఏర్పాటు చేశాయి. సిటీ బస్సులను సైతం ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేష న్ ప్రాంతాలు జనంతో పోటెత్తాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఆర్టీసీ యథావిధిగా 50 శాతం అదనపు చార్జీలు విధించింది. బుధవారం ఒక్క రోజే సుమారు 8 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు తరలివెళ్లినట్లు అంచనా. మొత్తంగా సుమారు 20 లక్షల మంది నగరం నుంచి వెళ్లారు. అదనపు బోగీలు.. మూడు రోజులుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు పోటెత్తాయి. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ భారీగా పెరిగింది. బుధవారం ఒక్క రోజే అదనంగా మూడు సాధారణ రైళ్లను నడిపారు. మరో 8 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సికింద్రాబాద్–కాకినాడ, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–కాకినాడల మధ్య ఏర్పాటు చేసిన సాధారణ రైళ్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సికింద్రాబాద్–గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్–నాగ్పూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–నర్సాపూర్ ఎక్స్ప్రెస్, కాచిగూడ– చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కాచిగూడ– రేపల్లె, సికింద్రాబాద్–కాకినాడ ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ఏపీ వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్, కాజీపేట్, మహబూబ్నగర్, తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బుధవారం ఒక్క రోజే సుమారు 4 లక్షల మందికి పైగా రైళ్లలో వెళ్లినట్లు అంచనా. రిజర్వేషన్లు లభించని ప్రయాణికులు సాధారణ బోగీల్లో వెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో కష్టాలను లెక్కచేయకుండా బయల్దేరి వెళ్లారు. రెగ్యులర్ సర్వీసుల్లో కోత ఏపీకి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రాజకీయ పార్టీలు గంపగుత్తగా బుక్ చేసుకోవడంతో బుధవారం పలు రూట్లలో ఆపరేటర్లు సర్వీసులను నిలిపేశారు. మిగిలిన సర్వీసుల్లో చార్జీలను రెట్టింపు చేశారు. మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగ ర్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఓటర్లను వారి సొంత ఊళ్లకు తరలించారు. నిత్యం ఏపీ వైపు రాకపోకలు సాగిం చే 1000 ప్రైవేట్ బస్సుల్లో సగానికి పైగా రాజ కీయ పార్టీలే బుక్ చేసుకున్నాయని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ తెలిపారు. వాహనాల రద్దీ వల్ల విజయవాడ, కర్నూల్, వరంగల్, తూప్రాన్ మార్గాల్లో ఉన్న టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. -
యాపిల్ టీవీ, న్యూస్ యాప్ లాంచ్
కాలిఫోర్నియా: టెక్దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెర తీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాలకనుగుణం గానే టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకువస్తామని ప్రకటించింది. యాపిల్ టీవీ యాప్ను కొత్త డిజైన్తో కొత్తగా లాంచ్ చేసింది. దాదాపు 100దేశాల్లో ఐఫోన్, ఐపాడ్, యాపిల్ టీవీ 4కె లో ప్రస్తుతానికి దీని సేవలు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ స్మార్ట్టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, ఎల్సీ, సోనీ, రోకూ, విజియో ప్లాట్ఫాంలలో కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఇందులో అన్ని కొత్త మూవీ రిలీజ్లు, లక్షకుపైగా టైటిల్స్తో ఐ ట్యూన్స్ మూవీ కాటలాగ్ను అందిస్తుంది. అంతేకాదు యూజర్ల పర్సనల్ లైబ్రరినీ బిల్ట్ ఇన్గా అందిస్తుంది. యాపిల్ టీవీ ప్లస్ ఇది స్ట్రీమింగ్ ఆన్లైన్ వీడియో సర్వీస్. సబ్స్క్రిప్షన్ ఆధారంగా తన సేవలను అందిస్తుంది. అయితే సబ్స్క్రిప్షన్ వివరాలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఇందులో కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉంటుంది. దీనికోసం కంపెనీ 34 టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాపిల్ టీవీ ఛానల్స్ సబ్స్క్రైబ్ సేవలను కూడా ఆవిష్కరించింది. ఇందులో హెచ్బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు పాపులర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్స్క్రైబ్ చేసుకొని యాపిల్ టీవీ యాప్లో చూడొచ్చు. ఆన్ డిమాండ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నవి. యాపిల్ న్యూస్ యాప్ యాపిల్ న్యూస్ ప్లస్ అనేది కంపెనీ న్యూస్ యాప్. ఇందులో వివిధ మేగజైన్ల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదికూడా సబ్స్క్రిప్లన్ ఆధారిత సేవ. వైర్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దాదాపు 300 మేగజైన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యాపిల్ క్రెడిట్ కార్డు సొంతంగా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తామని యాపిల్ ప్రకటించింది. దీని పేరు యాపిల్ కార్డు. కంపెనీ క్రెడిట్ కార్డు కోసం గోల్డ్మన్ శాక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాస్టర్కార్డ్ నెట్వర్క్ ఆధారంగా పని చేస్తుంది. -
737 మాక్స్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్
న్యూయార్క్: ప్రపంచదేశాలన్నీ 737 మాక్స్ విమానాల సర్వీసులను నిలిపివేస్తుండటంతో బోయింగ్ కంపెనీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ విమానాల్లో ఏర్పాటుచేసిన ఎంసీఏఎస్ స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థను పది రోజుల్లోగా అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కు కేవలం 2 గంటల సమయం చాలని బోయింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబర్లో స్టాల్ ప్రివెన్షన్ వ్యవస్థ విఫలం కావడంతో లయన్ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మాక్స్8 విమానం కూలిపోయిందనీ, ఈ దుర్ఘటనలో 189 మంది చనిపోయారని వెల్లడించారు. ఒక్కో బోయింగ్ మాక్స్ విమానంలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కు దాదాపు రూ.14 కోట్లు(2 మిలియన్ డాలర్లు) కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 371 బోయింగ్ 737 మాక్స్ విమానాలు సేవలు అందిస్తున్నాయనీ, వీటి అప్గ్రేడ్కు బిలియన్ డాలర్లు(రూ.6,895 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేశారు. -
స్టార్టప్లను ప్రోత్సహించాలి..
న్యూఢిల్లీ: బీపీవో, కేపీవో సేవలను జీఎస్టీ కింద ఇంటర్మీడియరీలు (మధ్యవర్తిత్వ సంస్థలు)గా పరిగణిస్తున్నందున పన్ను నిబంధనల పరంగా స్పష్టత తీసుకురావాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమలో వృద్ధి రేటు మందగించినప్పటికీ... 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 24 బిలియన్డాలర్ల ఆదాయాన్ని ఈ రంగం తెచ్చిపెట్టడమే కాకుండా నికరంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసింది. స్టార్టప్ల్లో చేసే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ పేరుతో విధిస్తున్న లెవీని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బడ్జెట్ ముందస్తు ప్రతిపాదనలను నాస్కామ్ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇంటర్మీడియరీలు కావు... బీపీవో, కేపీవోలు సహా ఐటీ ఆధారిత సేవలను ఇంటర్మీడియరీలుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తుండడంపై నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా ప్రదేశం, ప్రధాన కార్యాలయం, బ్రాంచ్ల లావాదేవీలు, సెజ్ కొనుగోళ్లనూ సత్వరమే పరిష్కరించాల్సిన అంశాలుగా నాస్కామ్ కోరింది. పెట్టుబడులకు ప్రోత్సాహం... స్టార్టప్లను ప్రోత్సహించేందుకు గాను ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలన్నది నాస్కామ్ ప్రధాన డిమాండ్లలో మరొకటి. అంతేకాదు స్టార్టప్లకు రాయితీలు కూడా కల్పించాలని కోరింది. ‘‘ఏంజెల్ ఇన్వెస్టర్లు ఓ కంపెనీ ఆరంభ దశలో ఎంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెడుతుంటారు. కొత్త కంపెనీ ఆవిర్భవించి, వృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడులు కీలకం. ఒకవేళ వీటికి రాయితీలు ఇవ్వకపోతే, కనీసం ప్రోత్సాహం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని ఆశిష్ అగర్వాల్ వివరించారు. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్పూర్కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్కు ఏడురోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
ఆ రెండు గంటలు ఐఆర్సీటీసీ పనిచేయదు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ అధికారిక వెబ్సైట్ ఐఆర్సీటీసీ కార్యకలాపాలు రెండు గంటలపాటు స్థంభించనున్నాయి. రోజువారీ సైట్ నిర్వహణలో భాగంగా రెండు గంటలపాటు టికెట్ బుకింగ్స్ నిలిచిపోనున్నాయని భారతీయ రైల్వేశాఖ వెల్లడించింది. నవంబరు10, 2018 రోజున 00.20 గంటల నుంచి 01.30 గంటల వరకు రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం, ఎంక్వయిరీ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఐఆర్సీటీసీ (irctc.co.in) సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవనీ, రెండు గంటల సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, కీలక సర్వీసులు సైతం నిలిచిపోనున్నట్టు పేర్కొంది. దీన్ని రైల్వే వినియోగదారులకు గుర్తించాలని కోరింది. రైల్వే టికెట్ బుకింగ్, టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం వెబ్సైట్ నిర్వహణ కారణంగా నవంబరు 10వ తేదీ 00:20 నుంచి 01:30 గంటలు వరకు అందుబాటులో ఉండదు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో రిజర్వేషన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ బుకింగ్, ఎంక్వైరీ సర్వీసులు (టెలిఫోన్ నెంబర్ 139) కూడా పనిచేయవని ఐఆర్సీటీసీ తెలిపింది. సాధారణంగా ప్రతిరోజు వెబ్సైట్ నిర్వహణ పనులు 23:30 గంటల నుంచి 00:30 గంటల మధ్యలో జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. -
మీరే నయం చేసుకోవాలి
భగవాన్ రమణ మహర్షి ఎడమ భుజం దిగువన చిన్న గడ్డ బయల్దేరింది. ఆయుర్వేద వైద్యులు ఏవో కట్లు కట్టినా పోలేదు. ఇంగ్లీష్ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అన్నారు. ‘‘అది ఎలా వచ్చింది అలాగే పోతుంది లెండి, దాని జోలికి మనం ఎందుకు పోవడం?’’అన్నారు భగవాన్. అయినా ఊరుకోలేదు డాక్టర్లు. ఆపరేషన్ చేశారు. తగ్గినట్టే తగ్గింది కానీ, కొంతకాలానికే అది తిరగబెట్టింది. ‘‘భగవాన్, డాక్టర్లు ఇక ఈ వ్యాధిని నయం చేయలేరు. మా మీద కరుణతో మీరే సంకల్పించుకుని నయం చేసుకోవాలి’’ అని ప్రార్థించారు భక్తులు. ‘‘నేను రమ్మన్నానా పొమ్మనేందుకు? నాకొక శరీరం ఉందనీ, దానికొక చెయ్యి ఉందనీ, ఆ చేతిమీద ఒక గడ్డ లేచిందనీ మీరంటూంటే వింటున్నాను కానీ, నాకు అదేమీ తోచడం లేదు’’అన్నారు భగవాన్. భక్తులు ఆ గడ్డను తగ్గించేందుకు ఎవరికి తోచిన సేవలు వారు చేస్తున్నారు. దాంతో ‘‘మీరందరూ వచ్చినట్లే అదీ వచ్చింది. ఈ డాక్టర్లందరూ దానికి అన్ని సేవలు చేసి గౌరవిస్తూంటే దానికి పోవాలని బుద్ధి ఎందుకు పుడుతుంది?’’అంటూ చమత్కరించారు మహర్షి. కొంతకాలానికి భోజనం మానేశారు. దాంతో బాగా నీరసించిపోయారు. శరీరం వణకడం మొదలు పెట్టింది. బలం రావడం కోసమని భక్తులు ఆయన చేత బలవంతాన పాయసం తాగించారు. కాస్త తాగగానే వాంతి చేసుకున్నారు. అది చూసి ‘‘అయ్యో! ఈ మాత్రం కూడా ఇమడలేదే’’ భక్తులు బాధపడుతుంటే, ‘‘మీరు నాకు పాయసం ఇమడలేదని బాధపడుతున్నారు. నేను యాభై సంవత్సరాలు నూరి పోసింది మీకు ఇమడలేదని నేను బాధపడుతున్నాను. ఏం చేస్తాం! తలరాత’’ అంటూ నుదురు కొట్టుకున్నారు రమణులు. భగవాన్ అంత బాధపడడానికి కారణం ఆయన మళ్లీ మళ్లీ చెప్పిన విషయం ఒకటే. ‘‘మనం ఈ శరీరాలం కాదు. మన నిజస్వరూపం అఖండమైన ఆత్మ’’ అని. – డి.వి.ఆర్. -
విదేశీ రూట్లలో గోఎయిర్ సేవలు..
ముంబై: దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్ తాజాగా అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ప్రారంభించనుంది. అక్టోబర్లో ముంబై–ఫుకెట్ రూట్లో డైలీ ఫ్లయిట్ను నడపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గురువారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, త్వరలోనే టికెట్ల బుకింగ్ ప్రారంభం కావొచ్చని వివరించాయి. వచ్చే ఏడాది మార్చికి మూడు లేదా నాలుగు విదేశీ ప్రాంతాలకు సేవలు ప్రారంభించవచ్చని సదరు వర్గాలు తెలిపాయి. ఫుకెట్ (థాయ్లాండ్) తర్వాత లిస్టులో మాలే (మాల్దీవులు) ఉంటుందని పేర్కొన్నాయి. 2005లో గోఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే విదేశీ సర్వీసులకు అనుమతులు కూడా వచ్చాయి. గతేడాది అక్టోబర్లోనే ప్రారంభించాలని భావించినప్పటికీ కీలకమైన ఎయిర్బస్ ఏ320 నియో విమాన ఇంజిన్లలో సాంకేతిక లోపాల కారణంగా వాయిదాపడింది. గోఎయిర్ ప్రస్తుతం 23 ప్రాంతాలకు వారానికి 1,544 ఫ్లయిట్స్ నడుపుతోంది. కంపెనీ వద్ద 38 ఎయిర్బస్ ఏ320 విమానాలున్నాయి. -
వైద్యరంగానికి వన్నెతెచ్చిన రాయ్
డాక్టర్ బీసీ రాయ్గా ప్రసిద్ధిగాంచిన బిధాన్ చంద్రరాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగానికి వన్నెతెచ్చిన బీసీ రాయ్ 1882 జులై 1వ తేదీన బిహార్ రాష్ట్రంలోని పాట్నాజిల్లా బంకింపూర్లో జన్మించారు. కలకత్తా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 1909లో ఇంగ్లాండ్ లోని బర్త్ హోమ్ హాస్పిటల్లో అతి కష్టంమీద సీటు సాధించిన రాయ్ కేవలం రెండేళ్ల మూడునెలల స్వల్పకాలంలోనే ఎం.ఆర్.సి.పి, ఎఫ్.ఆర్. సీ.ఎస్ డిగ్రీలు పూర్తిచేసి, ఇంత తక్కువకాలంలో ప్రతిష్టాత్మకమైన రెండు డిగ్రీలు పూర్తిచేసిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశారు. పేదరోగులకు ఏదో చేయాలన్న తపనతో జాదవ్ పూర్ టీ.బీ హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజ్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ తదితర సంస్థల్ని నెలకొల్పాడు. 1922 నుంచి, 1928 వరకు ఆరేళ్లకు పైగా కలకత్తా మెడికల్ జర్నల్కు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించాడు. 1925లో రాజకీయ రంగప్రవేశం చేసి, బార క్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా పేరుగాంచిన సురేంద్రనాథ్ బెనర్జీపై గెలుపొందిన రాయ్ అనేక రాజకీయ, అకడమిక్ పదవులు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుగాంచిన బీసీ రాయ్ 1948 జనవరి 13న పశ్చిమబెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రోజులో కనీసం ఒక్క గంట యినా పేద రోగులకోసం కేటాయించాలనే భావనతో, ఎన్ని పని ఒత్తిడులున్నప్పటికీ ఖచ్చితంగా పేద రోగులకు వైద్యసేవలందించేవాడు. విద్య, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 1961లో ఫిబ్రవరి 4న డా‘‘ బీసీరాయ్ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ప్రజా నేతగా, ప్రజావైద్యుడిగా రాయ్ చేసిన కృషికి, త్యాగానికి గుర్తుగా, ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారతప్రభుత్వం 1962లో ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1976 నుండి డాక్టర్ బీసీ రాయ్ పేరుమీద అవార్డులు అందజేస్తున్నారు. ప్రజల రోజువారీ జీవితాల్లో కీలకపాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక బీసీ రాయ్ స్ఫూర్తితో వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి వైద్యులు కృషిచేయాలి. వైద్యుణ్ణి దైవసమానుడుగా గుర్తించే స్థాయి నుంచి, వైద్యుడంటే పేదల రక్తం పీల్చే పిశాచి అన్న స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య మహోదయులపై ఈ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది. కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడిన అధికశాతం మంది వైద్యులు మానవీయ కోణాన్ని విస్మరించి ఎన్నిరకాల అవకాశాలుంటే అన్నిరకాలుగా రోగుల్ని పిండుతున్నారు. కొంతమంది అత్యాశాపరుల వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్న పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉంది. స్వాభావికంగా సేవాభావం లేని వారు, వైద్యేతర రంగాల్లోని కార్పొరేట్ వ్యాపారులు వైద్యవృత్తిలోకి ప్రవేశించి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న బలమైన వాదనపైనా దృష్టి సారించాలి. వైద్యులు రోగులపట్ల తమ దృక్పథాన్ని మార్చుకొని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలి. ప్రజా వైద్యుడిగా విశేషఖ్యాతి గడించిన డా‘‘ బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకొని వైద్యవృత్తిపై పడిన కళంకాన్ని తొలగించడానికి ప్రతి ఒక్కవైద్యుడూ ఆచరణాత్మక కృషి చేయాలి. (జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం) యండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు ‘ 99125 80645 -
వాట్సాప్ పేమెంట్ సేవలకు 24 గంటల కస్టమర్ సపోర్ట్
న్యూఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టనున్న పేమెంట్ సేవలకు 24 గంటల కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న పేమెంట్ సేవలను వచ్చే కొద్ది వారాల్లో భారత్లో ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ముమ్మరంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్లో వాట్సాప్ మెసెంజర్ యాప్కు 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. ‘పేమెంట్ సేవల కోసం రోజంతా అందుబాటులో ఉండే కస్టమర్ సపోర్ట్ను ఏర్పాటు చేయనున్నాం. సేవలను ప్రవేశపెట్టిన తర్వాత యూజర్లు ఈ–మెయిల్, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రతించవచ్చు’ అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. ఇంగ్లిష్తో పాటు హిందీ, మరాఠీ, గుజరాతీ ఈ మూడు ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీస్ సేవలను పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) ఆధారిత పేమెంట్ సర్వీసుల ప్రారంభ తేదీ, ఇతరత్రా వివరాలను మాత్రం వెల్లడించలేదు. గడిచిన కొద్ది నెలలుగా పది లక్షల మందికిపైగా వాట్సాప్ యూజర్లు భారత్లో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా వాడుతున్నట్లు అంచనా. తమ పేమెంట్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది, ఇతరత్రా వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), భాగస్వామ్య బ్యాంకులు, భారత ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశామని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు. -
భక్తితో ఆరోగ్యం.. ఆయుష్షు!
ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారని పాశ్చాత్య దేశాలలో జరిగిన తాజా పరిశోధననలో వెల్లడయింది! ప్రపంచ గమనం వేగంగా మారింది. ఏదో సాధించాలనే తపన, ఎక్కడికో వెళ్లాలన్న హడావిడి.. ఏదో చేసేయాలన్న ఆత్రుత, తలపెట్టిన పని సవ్యంగా జరుగుతుందో లేదోనన్న ఆందోళన.. ఫలితంగా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, వాతం వంటి రుగ్మతలు కమ్ముకొస్తాయి. దానికి తోడు నిర్వేదం, నిరాశ, మానసిక ఒత్తిడి మనిషిని మరింతగా కుంగదీస్తాయి. ఈ దౌర్బల్యం మనస్సును అంటకుండా ఉండడానికే యోగులు, రుషులు ధ్యానం చేసేవారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆధునికులు కూడా ఇప్పుడు యోగ, ధ్యానం చేయడాన్ని, ఆధ్యాత్మిక భావాలతో జీవించడాన్నీ అలవరచుకున్నారు. తద్వారా ఆయుష్షును పెంచుకోగలుగుతున్నారు. ఎందుకంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగ సాధన చేసేవారు శరీరాన్నే కాదు, మనస్సును కూడా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ‘యోగ’సాధన వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. చేసే పనిపై ఇష్టం, ఆసక్తి పెరుగుతాయి. శరీరం బరువు తగ్గి, చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు ముఖ్యంగా, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పుల వంటివి దరిచేరవు. వైద్యశాస్త్రానికి కూడా అంతుచిక్కని కొన్ని సమస్యలకు యోగ, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి. యోగ సాధనలు మనస్సు, భావాలను నియంత్రించడానికి సాయపడతాయి. తద్వారా గర్వం, ఈర్ష్య, అసూయ, కోపం, వ్యామోహం వంటి భావాలు నశించి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆరోగ్యంగా ఉండేవారి ఆయుఃప్రమాణం ఎలాగూ మిగతావారితో పోలిస్తే అంతో ఇంతో అధికంగానే ఉంటుంది. దాంతో ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక సాధనలు కేవలం కొన్ని వర్గాలకు లేదా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. పాశ్చాత్య దేశాలకు సైతం పాకిపోయాయి. అందుకే కాబోలు, ఇంచుమించు అన్ని దేశాలలోనూ వివిధ యోగా పద్ధతులు, ఆధ్యాత్మిక బోధనలు విభిన్న రకాల వ్యక్తిత్వ వికాస పాఠాల దిశగా ఊపిరి పోసుకుంటున్నాయి. అయితే, ఇక్కడ ఆధ్యాత్మికత అనేదానిని మనం ఎలాగైతే మానవ సేవే, మాధవ సేవ అని అంటున్నామో, అక్కడి వారు కూడా సామాజిక సేవగా మార్చుతున్నారు. బిల్గేట్స్, రాక్ఫెల్లర్ వంటి వారు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సామాజిక సేవకు ప్రాణం పోస్తున్నారు. అమెరికా, బ్రిటన్లలో కొన్ని తాజా సర్వేలలో తేలినది ఏమంటే, ఆధ్యాత్మికంగా ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారట. అన్నింటికీ ఆ భగవంతుడే అండగా ఉన్నాడు అనే భావనే వారిలో ఆయుష్షు పోస్తోందేమో మరి! – డి.వి.ఆర్. -
ఎంపీ మేకపాటి సేవలు అభినందనీయం
సాక్షి,నెల్లూరు రూరల్ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన చొరవతో రూరల్ నియోజకవర్గంలో 68 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందజేసినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. స్థానిక కొండాయపాళెం రోడ్డులోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ నిధులతో సమకూర్చిన ఐదు బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మేకపాటి చొరవతో సాధ్యమైందన్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ రూ.37 వేలు ఉంటుందని, ఇందులో ఎంపీ గ్రాంట్ కింద రూ.12 వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో రూ.25 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత నాలుగేళ్లుగా దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ సహకారాలతో 500 మంది దివ్యాంగులకు చేయూత నిచ్చామన్నారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువలకు కట్టుబడిన ఎంపీ మేకపాటి దివ్యాంగుల బ్యాటరీ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డిని ఆహ్వానించామని, అయితే తాను ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీగా రాజీనామా చేశానని, స్పీకర్ ఆమోదించినా, ఆమోదించకున్నా తాను ఎంపీని కానని, అందుకే నైతికంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం ధర్మం కాదని, అలాగని దివ్యాంగులకి ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆగకూడదని, దానిని వెంటనే జరపించాలని ఎంపీ కోరినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇంతటి నైతిక విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆదర్శం హర్షణీయమని, అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. -
విస్తారా ప్రయాణికులకు రోబో సేవలు!!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ‘విస్తారా’... ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని తన లాంజ్లో రోబో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ప్రయాణికుల సందేహాలను పరిష్కరిస్తుంది. బోర్డింగ్ పాస్లను స్కాన్ చేస్తుంది. ఫ్లైట్ స్టేటస్ను తెలియజేస్తుంది. ప్రయాణికులు వెళ్లే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేస్తుంది. అలాగే వారిని ఎంటర్టైన్ చేస్తుంది. నిర్దేశించిన దారిలో అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులను పలకరించగలదు. ఇన్ని సేవలందించే ఈ రోబోకు కంపెనీ.. ‘రాడా’ అనే పేరు పెట్టింది. తమ రోబో... సాంగ్స్ను కూడా ప్లే చేయగలదని విస్తారా తెలిపింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టర్మినల్–3లోని తమ సిగ్నేచర్ లాంజ్లో జూలై 5 నుంచి రోబోను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రోబో విషయానికి వస్తే.. దీనికి కింద 4 వీల్స్ ఉంటాయని, 360 డిగ్రీల్లో చుట్టూ తిరగగలదని, 3 ఇన్–బిల్ట్ కెమెరాలు అమర్చామని, సమర్థవంతమైన వాయిస్ టెక్నాలజీ పొందుపరిచామని వివరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రోబోను తయారుచేసినట్లు పేర్కొంది. విస్తారా అనేది టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్.