కారు బోల్తా: ఇద్దరు మృతి | car accident, two people dead | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఇద్దరు మృతి

Published Sun, Jan 24 2016 7:36 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

car accident, two people dead

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ.. డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జి మీద నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కొత్తూరు మండలం ఇనుముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement