విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం | everybody needs education | Sakshi
Sakshi News home page

విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం

Oct 16 2016 6:32 PM | Updated on Sep 4 2017 5:25 PM

విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం

విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం

విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఫుడ్‌ఫస్టు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (ఫియాన్‌) స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ తంటేపూడి రవికుమార్‌ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఆదివారం స్థానిక యానాదుల కాలనీలో ఫియాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆహార భద్రత– ఆవశ్యకతపై యానాదులకు అవగాహన కలిగించి అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మచిలీపట్నం టౌన్‌ : విద్య ద్వారానే దేశాభివృద్ధి  సాధ్యమవుతుందని ఫుడ్‌ఫస్టు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (ఫియాన్‌) స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ తంటేపూడి రవికుమార్‌ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఆదివారం స్థానిక  యానాదుల కాలనీలో ఫియాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆహార భద్రత– ఆవశ్యకతపై యానాదులకు అవగాహన కలిగించి అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.  కాలనీలోని దాదాపు 400 మంది యానాది పిల్లలు, పెద్దలకు ఆ సంస్థ ప్రతినిధులు ఆహారాన్ని వడ్డించారు. రవికుమార్‌ మాట్లాడుతూ ప్రతి పేద పిల్లవాడూ చదువుకుంటే తద్వారా ఉపాధి అవకాశాలు వచ్చి వారి కొనుగోలు శక్తి పెరుతుగుతుందన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఏదోక పనిలో నిమగ్నమవుతారని దీని ద్వారా దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందన్నారు. ఆహార భద్రతకు ప్రభుత్వాలు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అప్పుడే పేదలకు కూడా తిండిగింజలు లభిస్తాయన్నారు.  ‘రైట్‌ టు ఫుడ్‌ అండ్‌ న్యూట్రీషన్‌ వాచ్‌’ అనే పుస్తకాన్ని రవికుమార్‌ ఆవిష్కరించారు.  ఫియాన్‌ సంస్థ కార్యదర్శి జి. జాన్‌రవి, కోఆర్డినేటర్‌ కె. కపాశాంతి, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ డి.వి. సాగర్, ఆ ప్రాంత పెద్దలు కె. శామ్యూల్, రమణయ్య పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement