హౌరా నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్ ఎక్స్ప్రెస్లోని చివరి బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. ప్రయాణికులు భయంతో వెంటనే రైలు దిగిపోయారు. సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను సరిచేసి రైలును పంపించేశారు. ఈ ఘటనలో రైలు సుమారు 20 నిమిషాల పాటు ఆగిపోయింది.