కరీంనగర్ వద్దు.. సిద్దిపేట ముద్దు
బెజ్జంకి: బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలోనే కలపాలని యూత్నాయకులు బెజ్జంకి క్రాసింగ్ వద్ద సోమవారం రాస్తారోకో చేశారు. సిద్దిపేట జిల్లాలో ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, మండలం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదన్నారు. 25కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటను కాదని కరీంనగర్ ఎలా కలుపుతారని ప్రశ్నించారు. సిద్దిపేటలో కలిపే వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బండిపెల్లి రమేష్, మాజీ సర్పంచ్ రెడ్డివేని వినోద్కుమార్, బండిపెల్లి శ్రీనివాస్, బొడిగె అనిల్, ఐలేని నర్సింహరెడ్డి, వంగల నరేష్, కత్తి అనిల్, రవి, మల్లేశం, అజయ్, మున్నా, శ్రీనివాస్, బొడిగే శ్రీను, బామండ్ల శ్రీను పాల్గొన్నారు.