మావోయిస్టుల దాడిలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులకు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో నివాళులర్పించారు.
ఆత్మకూరు(ఎం): మావోయిస్టుల దాడిలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులకు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2006 ఆగస్టు 18న పోలీస్స్టేషన్లో మావోయిస్టులు జరిపిన దాడిలో మృతిచెందిన ఎస్ఐ చాంద్పాషా, ఏఎస్ఐ సుల్తాన్మహీనొద్దీన్, హోంగార్డు లింగయ్య చిత్రపటాలకు పూలమాలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ ఎండి.జాఫర్, ఎండి. అబీబ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ఎ.నగేష్, కానిస్టేబుల్స్ హరీష్, రాజు కుమార్ పాల్గొన్నారు.