అనంతపురం అగ్రికల్చర్ : రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 12 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీలు, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 59 నుంచి 65, మధ్యాహ్నం 28 నుంచి 33 శాతం మధ్య రికార్డు కావచ్చని తెలిపారు. గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.