ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ మృతి
Published Mon, Mar 6 2017 11:38 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
నరసరావుపేటటౌన్ (నరసరావుపేట) : బస్సుకిందపడి ఆర్డీసీ మెకానిక్ మృతిచెందిన సంఘటన సోమవారం నరసరావుపేట ఆర్టీసీ గ్యారేజీలో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ గ్యారేజీలో జాజం నాగేశ్వరరావు (45) బస్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. మధ్యాహ్న సమయంలో బస్సు కింది భాగంలో పనిచేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ అల్లాడి విజయామృతరావు బస్సును బయటకు తీసే ›ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెనుకభాగంలో ఉన్న టైరు నాగేశ్వరరావు పైకి ఎక్కడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు, సిబ్బంది బాధితుడిని వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.
Advertisement
Advertisement