రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | student dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Published Thu, Apr 13 2017 12:12 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student dies of road accident

కనగానపల్లి (రాప్తాడు) : రామగిరి మండలం ఎగువపల్లి సమీపంలో ఆటోను ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన అనిల్‌కుమార్‌ (18) రామగిరిలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. బుధవారం పేరూరు నుంచి రామగిరికి ఆటోలో వస్తుండగా ఎగువపల్లి వద్ద ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. కుడివైపున కూర్చున్న అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పేరూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement