పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు | traffic diversion | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు

Published Tue, Aug 9 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు

పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు

ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాల సందర్భంగా 12వ తేదీ నుంచి జిల్లా మీదుగా వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  
దారి మళ్లింపు ఇలా 
∙చెన్నై వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలను కత్తిపూడి – అమలాపురం– చించినాడ– పాలకొల్లు– భీమవరం– కైకలూరు– గుడివాడ– చల్లపల్లి మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – తాడేపల్లిగూడెం– ఆకివీడు – గుడివాడ– చల్లపల్లి– రేపల్లె– ఒంగోలు మీదుగా చెన్నై పంపిస్తారు అలాగే నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు – కైకలూరు– గుడివాడ – చల్లపల్లి– రేపల్లె మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే  రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – హనుమాన్‌ జంక్షన్‌– గుడివాడ– చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. అలాగే దేవరపల్లి – గుండుగొలను – నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు– కైకలూరు– గుడివాడ–చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా  చెన్నై తరలిస్తారు. 
∙కోల్‌కతావైపు వెళ్లాల్సిన వాహనాలను  ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– మచిలీపట్నం– పెడన– కృత్తివెన్ను – లోసరి– నర్సాపురం – చించినాడ– రాజోలు– అమలాపురం– కాకినాడ – కత్తిపూడి మీదుగా పంపిస్తారు. అలాగే ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– హనుమాన్‌జంక్షన్‌– సిద్ధాంతం బ్రిడ్జి– రాజమండ్రి మీదుగా కూడా విశాఖపట్నం తరలిస్తారు. అలాగే ఒంగోలు– రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– కైకలూరు– ఏలూరు– సిద్ధాంతంబ్రిడ్జి– రాజమండ్రి మీదుగా విశాఖపట్నం తరలిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement