నకిలీ పాసుపోర్టులను తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు కోరుట్ల పోలీసులు.
నకిలీ పాసుపోర్టులను తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు కోరుట్ల పోలీసులు. వారి నుంచి భారీగా నకిలీ పాసుపోర్టులు, నకిలీ విద్యార్హత, జనన, నివాస దృవీకరణ పత్రాలతో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కోరుట్లకు చెందిన కమ్రుద్దీన్, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ సత్తార్లను అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిల్ నిందితుల వివరాలు వెల్లడించారు.