స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ మానేరులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మంగమ్మతోటకు చెందిన బీరెల్లి అరుణ్(16) శ్రీగాయాత్రి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సునంద్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వీరిద్దరు ఈ రోజు ఉదయం మరో ఐదుగురు స్నేహితులతో కలిసి లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వె ళ్లారు. ఈ క్రమంలో ఈతకొడుతూ వీరిద్దరు నీట మునిగారు. ఇది గుర్తించిన తోటి స్నేహితులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మానేరు డ్యాంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
Published Wed, Jun 1 2016 10:40 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM
Advertisement
Advertisement