భర్త ఇంటి వద్ద భార్య నిరాహార దీక్ష
Published Mon, Aug 22 2016 4:23 PM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM
మదనపల్లి టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డి కాలనీలో వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. సుధ(25) అనే యువతికి రెండు సంవత్సరాల క్రితం బాలప్రసాద్ అనే యువకుడితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన నాటి నుంచి కాపురానికి తీసుకెళ్లటం లేదని బాధితురాలు సుధ తెలిపింది. సుధ కుటుంబసభ్యులు సుమారు 10 మంది కలిసి బాల ప్రసాద్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగారు.
Advertisement
Advertisement