ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్ | kiran kumar reddy road show in chittor district | Sakshi
Sakshi News home page

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్

Apr 12 2014 4:40 AM | Updated on Aug 14 2018 4:21 PM

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్ - Sakshi

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్

తెలుగు ప్రజలను విడగొట్టి అవమానపరిచి ఉమ్మేసిన వారికే ఓట్లు వేస్తారా అని జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

పలమనేరు/తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టి అవమానపరిచి ఉమ్మేసిన వారికే ఓట్లు వేస్తారా అని జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుప్రజల దయాదాక్షిణ్యాలతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఓటుతో బుద్దిచెప్పాలని ఆయన కోరారు.  
 
 పీలేరు నుంచే కిరణ్ పోటీ!: మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఈ ఎన్నికల్లోనూ  పోటీ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని నిలిపి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.  . శుక్రవారం పీలేరు నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్యులతో సమావేశమై తాను పీలేరు నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement