
టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరు
ఢిల్లీ: టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్కు ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు.
తెలంగాణ ప్రజలు తిరిగి కాంగ్రెస్కే అధికారం ఇస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2, 3 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.