-
‘మహాఘట్ బంధన్’లో సీట్ల చిచ్చు.. కోరుకున్న స్థానాలపై లాలూ పేచీ
సాక్షి, పాట్నా: త్వరలో జరగనున్న బీహార్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో మహాఘటబంధన్ కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), లెఫ్ట్ పార్టీలు పోత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే, లోక్సభ సీట్లను కేటాయించినట్లుగా అసెంబ్లీ స్థానాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం లేదని, ఫలితంగా నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ నియోజవర్గాలైన ఔరంగాబాద్, బెగుసరాయ్, కతిహార్, పూర్ణియా, శివన్ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఔరంగాబాద్తో పాటు బెగుసరాయ్ సీటులోనూ కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య వివాదం నెలకొంది. ఇటీవల సీపీఐ సీట్ల కేటాయింపులో కూటమిలోని పార్టీ పెద్దల్ని సంప్రదించ కుండానే ఔరంగాబాద్ లోక్సభ అభ్యర్థిగా అవదేశ్ రాయ్ను ప్రకటించింది. శివన్ బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అవద్ బిహారీ చౌదరికి టికెట్ ఇవ్వాలని లాలూ ప్రసాద్ ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. సీపీఐ, సీపీఐ(ఎంఎల్)లు కూడా శివన్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కతిహార్ నియోజకవర్గం నుంచి తారిఖ్ అన్వర్ను పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. అదే సీటు తమకే కావాలంటూ ఆర్జేడీ పట్టుబడుతుంది. దీంతో అసెంబ్లీ సీట్ల కోసం అయా పార్టీల నేతల సిగపట్లతో కార్యకర్తలు విస్తుపోతున్నారు. -
దేశ చరిత్రలో నిలిచే రోజు..!
-
ఇది ఫిక్స్...! సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
-
'ఏళ్లుగా సాగతున్న సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్'! సీఎం ఎవరంటే..?
రాజస్థాన్ ఎన్నికల పరంగా సాగుతున్న సంప్రదాయాన్ని మార్చి చరిత్ర తిరగరాయాలనుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యం చూపింది. కాంగ్రెస్ నమ్ముకున్న గ్యారంటీ హామీ గేమ్ కంటే బీజేపీ స్ట్రాటజీనే గెలించిందన్నట్లుగా ఓట్ల ఆధిక్యం చూపిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ సాగించిన పాలనపై విమర్శలు కురిపిస్తూ అవి ప్రజల్లోకి వెళ్లే దిశగా చేసిన ప్రచార స్ట్రాటజీ ఫలించింది. ఇక ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నాం 1.00 గంట బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 111 72 02 దీంతో బీజేపీ కార్యాలయాల్లో 'మోదీ'..'మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో మహిళల అంశమే కీలకపాత్ర పోషించదని అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి దియా కుమారి అన్నారు. బీజేపీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మహిళలకే పెద్ద పీఠం వేస్తూ.. లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 2 లక్షల పొదుపు బాండ్, లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు, కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరంటే..? ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. కాగా, రాజస్తాన్లో మూడు దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి బీజేపీ అంటూనే సాగినప్పటికీ 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఆశ్చర్యపరిచింది. దాదాపు 200 మంది సభ్యులుండే సభలో 101 మందికి ఒక్కటి తక్కువ ఉన్న కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: రాజస్థాన్ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్డేట్స్) -
ప్రస్తుతానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది: CEO
-
నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
ఖమ్మం జిల్లా రాజులపాలెం గ్రామంలో ఓటర్ల నిరసన
-
15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్
రాయపూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 55 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం రమణ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై బఘేల్ స్పందిస్తూ.. ఇది ఆయన చేసిన బూటకపు ప్రకటన అని కొట్టిపారేశారు. రమణ్ సింగ్ వ్యాఖ్యలపై బఘెల్ మాట్లాడుతూ ‘రమణ్ సింగ్ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే 52 సీట్లను అధిగమించలేదు. ఇప్పుడు 55 సీట్లు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఇదంతా తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచడానికే చెబుతున్నాడు. కనీసం 15 సీట్లయినా సాధిస్తారో లేదో ఫలితాలు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది’ అన్నారు. నవంబర్ 7న మొదటి దశ ఎన్నికల తర్వాత మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రంలో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 20 సీట్లలో బీజేపీ కనీసం 14 స్థానాలను గెలుచుకుంటుంది" అని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో 90 నియోజకవర్గాలు ఉండగా నవంబర్ 7న తొలిదశ, నవంబర్ 17న రెండో దశతో ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
పక్క సీఎం అవుతా!..రేవంత్ రెడ్డి ఓపెన్ డిబేట్
-
సీఎం శివరాజ్ సింగ్ మంచి నటుడు: కమల్నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్నాథ్ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్సింగ్ చౌహాన్ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్ చెప్పారు. శివరాజ్సింగ్ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్నాథ్ చమత్కరించారు. సాగర్ జిల్లాలోని రేహ్లీ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్సింగ్ కనీసం బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్సింగ్ చౌహాన్ హామీల మెషీన్ డబుల్ స్పీడ్తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్నాథ్ కోరారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్నాథ్ కాంగ్రెస్ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇదీ చదవండి..కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు చెందిన వారేనని పేర్కొంది. సుర్గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్గఢ్లో ఆజాద్ జనతా పార్టీ టికెట్పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్గేర్లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్గేర్లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్ఖండ్లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
పరామర్శకైనా పనికిరామా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న క్రమంలో బీజేపీలో టికెట్ల చిచ్చు రగులుతోంది. రెండు జాబితాల్లో కలిపి 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక, నవంబర్ 1న మూడో జాబితా వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురిలో అసంతృప్తి వ్యక్త మౌతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 60–70 చోట్లయినా సీరియస్గా టికెట్ ఆశిస్తున్న వారు ఇద్దరు, ముగ్గురున్నప్పుడు అభ్యర్థిత్వం ఖరా రుకాని వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేకపోవడాన్ని తప్పుబడు తున్నారు. గతంలో టికెట్ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పని చేసేలా ఒప్పించిన పరిస్థితులుండగా ఇప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోక పోవడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం బుజ్జగింపులు, నచ్చజెప్ప డాలు వంటి వాటికి కూడా తాము నోచుకోలేదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు. పరామర్శకైనా తాము పని కిరామా అని ఆవేదన చెందుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ విజయం సాధ్యమనే విష యాన్ని నాయకులు విస్మరించారని అంటున్నారు. గుర్తింపుపై భరోసా ఏదీ? ఇప్పుడు వివిధ సమీకరణల మధ్య టికెట్ ఇవ్వలేక పోయామని, భవిష్యత్లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపైనా పలువురు కమలనాథులు రుసరుసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామనే హామీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు. అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం కోరడంతో రికార్డు స్థాయిలో 6,003 దరఖాస్తులు వచ్చాయి. వారిలో తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిని పార్టీపరంగా అనునయించే ప్రయత్నమేదైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే అవకాశం కల్పించి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజీనామా చేస్తానని ప్రకటించినా... ముథోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజీనామా చేస్తానని ప్రకటించాక కూడా ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగు తోంది. తొలిజాబితాలో తనకు ఆందోల్ టికెట్ను ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి బాబూ మోహన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా భరోసా దొరుకుతుందేమోనని ముఖ్యనేతలకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆయన వాపోయారు. వరంగల్(పశ్చిమ) నుంచి రావు పద్మకు టికెట్ కేటాయించడంతో... టికెట్ ఆశించి భంగపడిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి రెబెల్గా పోటీచేస్తానని ప్రకటించారు. అయినా ఆయనను నచ్చజెప్పేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా పరిస్థితులు మరికొన్ని నియోజక వర్గాల్లోనూ ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలోనైనా టికెట్లు ఆశిస్తున్న ముఖ్యనే తలతో పార్టీ పెద్దలు మాట్లాడాలని ఓ ముఖ్యనేత సాక్షితో చెప్పారు. -
తోకముడిచిన టీడీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్లు చావు కబురు చల్లగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎదుర వుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకే తమకు సమయం సరిపోతుందని, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేంత స్థాయిలో తాము దృష్టి కేంద్రీకరించలేమని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. తండ్రీ కొడుకుల ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నట్టేట ముంచారంటూ తమ్ముళ్లు ఆందోళనకు గురవుతు న్నారు. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న లోపాయి కారీ ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీకి మేలు చేసేందుకు తమను బలిపశువులను చేశార ని ఆవేదనకు గురవుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతామని, బీఫారాలు ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలుగుదేశం అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. లోకేశ్తో మాట్లాడుకోవాలన్న బాబు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా నాన్చుతూ వస్తోంది. అన్నిచోట్లా పోటీ చేయకపోయినా, బలమున్న చోటయినా పోటీకి దిగుదామని పార్టీ నేతలకు చెప్పుకుంటూ వచ్చింది. కాగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పోటీ విషయమై తేల్చుకునేందుకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవల చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయ్యారు. అయితే తెలంగాణలో పోటీ చేసే విషయం తాను మాట్లాడలేనని, లోకేశ్తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జ్ఞానేశ్వర్ అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు రావాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు ఆహ్వానం పంపారు. అయితే లోకేశ్ హాజరు కాకుండా.. తెలంగాణలో పోటీ చేయడం లేదనే సమాచారాన్ని పంపించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడాల్సి వచ్చింది. తాము ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని, బలమున్న నియోజకవర్గాల్లో నైనా పోటీకి అంగీకరించాలని డిమాండ్ చేశారు. కానీ లోకేశ్ ససేమిరా అనడంతో సమావేశానికి వచ్చిన నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. తండ్రీకొడుకుల కోసం తాము త్యాగాలెందుకు చేస్తామని ప్రశ్నించిన నేతలు.. కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలన్న ఆలోచనతోనే తెలంగాణలో పోటీని విరమించుకున్నారంటూ బహిరంగ ఆరోపణలకు దిగారు. స్వతంత్ర అభ్యర్థు లుగానైనా బరిలోకి దిగుతామంటూ సమావేశంలో తీర్మానం చేశారు. -
మూడో జాబితాపై ముమ్మర కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్లోని సీట్లపై చర్చలో భాగంగా.. సనత్నగర్ నుంచి మర్రి శశిధర్రెడ్డి, జూబ్లీహిల్స్ విక్రమ్గౌడ్, ముషీరాబాద్ నుంచి గోపాల్రెడ్డి/ బండారు విజయలక్షి, అంబర్పేట నుంచి బండారు విజయలక్షి / ఎన్.గౌతమ్రావు, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్రెడ్డి అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు సమాచారం. ఎల్బీనగర్ సీటు కోసం సామ రంగారెడ్డి, వంగ మధుసూదన్రెడ్డి, గంగిడి మనోహర్రెడ్డి ఆశలు పెట్టుకోగా.. ఉప్పల్ నుంచి ఎనీ్వఎస్ఎస్ ప్రభాకర్తో పాటు వీరేందర్గౌడ్, మేడ్చల్ నుంచి విక్రమ్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ రెండో జాబితా కూడా వెలువడిన నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల్లోని అసంతృప్తులను చేర్చుకుని, టికెట్ ఇచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే జాబితా విడుదల ఆదివారంగానీ, సోమవారంగానీ బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి మూడో జాబితా ముసాయిదాను పార్టీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 1న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి.. సుమారు 40– 45 మంది పేర్లతో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ రోజున ఆలస్యమైతే రెండో తేదీన విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన సీట్లలో పదిచోట్ల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, వాటి విషయాన్ని చివర్లో తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకు కేటాయించే సీట్లపైనా చర్చించారని, ఈ విషయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందని తెలిసింది. -
ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్.. ఆత్మవిశ్వాసమా.. అత్యుత్సాహమా..?
-
BRS Party: కారు చివరి సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పెండింగ్లో ఉన్న మిగతా స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసింది. మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ కొత్త అభ్యర్థికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు పెండింగ్ అభ్యర్థులతో త్వరలోనే రెండో జాబితాను ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటే విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించిన నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్ పదును పెడుతున్నట్లు సమాచారం. ముగ్గురికి పచ్చజెండా బీఆర్ఎస్ గత నెల 21న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంతో, ఈ నియోజకవర్గంతో పాటు గతంలో పెండింగులో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. వారు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు పచ్చజెండా ఊపారు. పల్లా రాజేశ్వర్రెడ్డి (జనగామ), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), మర్రి రాజశేఖర్రెడ్డి (మల్కాజిగిరి), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్) పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కసరత్తు కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కిరానుంది. గులాబీ గూటి నుంచి బయటకు.. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన పలువురు ముఖ్య నేతలకు సర్ది చెప్పేందుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావుతో పాటు పార్టీ అధిష్టానానికి సన్నిహితం ఉండే నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిచోట్ల ఫలించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయా పార్టీల టికెట్ ఆశిస్తూ బీఆర్ఎస్ను వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ కారణాలతో ఇప్పటివరకు సుమారు 20 మంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), తుమ్మల నాగేశ్వర్ రావు (పాలేరు) లాంటి వారు ఇందులో ఉన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇటీవల అసంతృప్తి రాగం అందుకున్నారు. ఈ ఏడాది జూన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేవలం మూడు నెలల కాలంలోనే మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్లో చేరారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా.. బీఆర్ఎస్ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖా నాయక్ (ఖానాపూర్), రాథోడ్ బాపూరావు (బోథ్)తో పాటు టికెట్ దక్కినప్పటికీ మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి) పార్టీని వీడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), నల్లాల భాగ్యలక్ష్మి (మంచిర్యాల), సరిత (గద్వాల) కూడా వేర్వేరు సందర్భాల్లో కారు దిగేశారు. పదవులు, బుజ్జగింపులతో కట్టడి యత్నం ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం అత్యంత సహజమని చెప్తూనే అసంతృప్తులకు కళ్లెం వేసేందుకు బీఆర్ఎస్ మరింత ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో పాటు ప్రవీణ్ (బెల్లంపల్లి), నరోత్తమ్ (జహీరాబాద్), గోలి శ్రీనివాస్రెడ్డి (కల్వకుర్తి), బక్కి వెంకటయ్య (దుబ్బాక) తదితరులకు ఇటీవల ప్రభుత్వ పదవులను అప్పగించారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘనపూర్)కు కూడా కీలక పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే టికెట్ దక్కని ఎమ్మెల్యే బేతి సుభా‹Ùరెడ్డి (ఉప్పల్)తో పాటు నేతలు గడ్డం అరవింద్ రెడ్డి (మంచిర్యాల), నీలం మధు (పటాన్చెరు), మన్నెం రంజిత్ యాదవ్, బుసిరెడ్డి పాండురంగారెడ్డి (నాగార్జునసాగర్) చందర్రావు (కోదాడ) తదితరులు అభ్యర్థులను మార్చాలని ఒత్తిడి పెంచుతుండటం గమనార్హం. -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ నేతల రచ్చ -
ఇండియా కూటమికి ఎదురుదెబ్బ.. ఆప్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా!.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ సమావేశం నిర్వహించారు. 2025లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు ఆప్ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బిహార్లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సందీప్ పాఠక్ నాయకులకు సూచించారు. నీచరాజకీయాల కారణంగానే బిహార్ ముందుకు పోవడం లేదని ఆరోపించారు. ఆప్ తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అంతకుముందే పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులను కోరారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ బిహార్ ఇంఛార్జీ అజేష్ యాదవ్లు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. గుజరాత్లో మాదిరిగానే బిహార్లోనూ పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని పాఠక్ అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయగానే తదుపరి ప్రణాళికలను వెల్లడిస్తామని చెప్పారు. బిహార్లో పంచాయతీ ఎన్నికల్లో మొదట పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశం కఠిన సమయంలో ఉందని పాఠక్ అన్నారు. ప్రధాని మోదీ ఈ తొమ్మిదేళ్లలో ప్రసంగాలు ఇవ్వడం తప్పా.. ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇండియా కూటమి పరిస్థితిపై ప్రశ్నించినప్పుడు.. 'పార్టీల అభిప్రాయాలు వేరు.. దేశమే ప్రధానం.. కూటమిలు తర్వాత' అని పాఠక్ చెప్పారు. ఆప్ జాతీయ పార్టీ.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. జేడీయూ, ఆర్జేడీ రియాక్షన్.. ఆప్ నిర్ణయంపై ఆర్జేడీ నాయకుడు, ఎంపీ మనోజ్ స్పందించారు. 'ఇండియా కూటమిని నిర్మించేప్పుడే కొన్ని కట్టుబాట్లను పెట్టుకున్నాం. ఈ విధివిధానాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆప్ కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి'అని ఆయన సూచించారు. పార్టీని విస్తరించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ అన్నారు. తాము కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పారు. కూటమి పార్టీలన్నీ ఏకంగా పోటీచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా ఇతర నాయకులు చెప్పారు. అంతర్గత అభిప్రాయ భేదాలు క్రమంగా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన? -
TS Election 2023: 'భారత రాష్ట్ర సమితి'లో.. ముగ్గురు కొత్తవారు!
కరీంనగర్: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తన అభ్యర్థులను ప్రకటించింది. 13 అసెంబ్లీ స్థానాలున్న విశాల ఉమ్మడి జిల్లా అభ్యర్థుల జాబితాను సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటించగానే.. పాత జిల్లాలో గులాబీ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. ఇటీవల జాబితాలో ఉమ్మడి జిల్లాలో భారీగా మార్పులు ఉంటాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎం జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ.. పాత జిల్లాలో పదిమందిని పాత వారిని, ముగ్గురు కొత్తవారి పేర్లు ప్రకటించి సీఎం.. అందరి అంచనాలను తలకిందులు చేశారు. అంతా ఊహించినట్లుగా వేములవాడ అభ్యర్థిని అందరి కంటే ముందే మారుస్తున్నామని సీఎం ప్రకటించారు. పౌరసత్వం వివాదంలో ఆయన మార్పు అనివార్యమైందని వివరించారు. ఆయన స్థానంలో చెలిమెడ లక్ష్మీనర్సింహారావు పేరును ఖరారు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్రావు కుమారుడు డాక్టర్ కె.సంజయ్ను ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యాసాగర్రావు కోరిక మేరకు సంజయ్కు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక హుజూరాబాద్లో అంతా అనుకున్నట్లుగా ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిని ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు సిట్టింగులను మార్చగా ఇందులో జిల్లాకు చెందినవారే ఇద్దరు కావడం విశేషం. పదిమంది పాతకాపులే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడుస్థానాల్లో అభ్యర్థులు మారగా, మిగిలిన 10 స్థానాల్లో సీనియర్లే ఉన్నారు. అందులో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్, కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీచేస్తారు. చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్, మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్, హుస్నాబాద్ నుంచి సతీశ్బాబు, జగిత్యాల నుంచి సంజయ్, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్రెడ్డి, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు బరిలో దిగనున్నారు. ఇందులో సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, మానకొండూరు, జగిత్యాల మినహా మిగిలిన చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు వీచాయి. మంత్రి ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో చొప్పదండి, రామగుండం, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు తిరుగుబాటు చేశారు. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఈశ్వర్ల చొరవతో అవన్నీ సద్దుమణిగాయి. కులాల వారీగా.. 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలకు అవకాశం దక్కింది. ఇందులో కేటీఆర్, డాక్టర్ సంజయ్, డాక్టర్ కె.సంజయ్కుమార్, చలిమెడ లక్ష్మీనర్సింహరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ది రెడ్డి సామాజిక వర్గం. హుస్నాబాద్ నుంచి సతీశ్బాబు బ్రాహ్మణ(కరణం) కాగా, కరీంనగర్ నుంచి కమలాకర్, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు.. ఈ ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గం వారు కావడం విశేషం. సుంకె రవిశంకర్(చొప్పదండి), రసమయి బాలకిషన్(మానకొండూరు) మాదిగ, కొప్పుల ఈశ్వర్(ధర్మపురి) మాల సామాజిక వర్గానికి చెందివారు కావడం గమనార్హం. ఏడుగురు మూడోసారి.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాతజిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు నాయకులు బీఆర్ఎస్ టికెట్పై మూడోసారి పోటీ చేస్తున్నారు. అందులో కేటీఆర్(సిరిసిల్ల), సతీశ్బాబు(హుస్నాబాద్), మనోహర్రెడ్డి(పెద్దపల్లి), పుట్ట మధు(మంథని), గంగుల కమలాకర్ (కరీంనగర్), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), రసమయి బాలకిషన్ (మానకొండూరు) ఉన్నారు. డాక్టర్ సంజయ్(జగిత్యాల), సుంకె రవిశంకర్(చొప్పదండి) రెండోసారి బీఆర్ఎస్ టికెట్పై బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన నలుగురు లక్ష్మీనర్సింహారావు(వేములవాడ), పాడికౌశిక్రెడ్డి(హుజూరాబాద్), డాక్టర్ కె.సంజయ్ (కోరుట్ల), కోరుకంటి చందర్(రామగుండం) తొలిసారిగా బీఆర్ఎస్ బీఫాం మీద పోటీ చేయనున్నారు. -
TS Election 2023: ‘కారు’ టిక్కెట్లు ఖరారు! 'అల్లోల' కి చాన్స్.. జాన్సన్కు జాక్పాట్..
నిర్మల్: కొన్నిరోజుల నుంచి ఊహిస్తున్నట్లే కారు పార్టీ టికెట్లు ఖరారయ్యాయి. సీనియారిటీతోపాటు ప్రజల్లో ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించింది. నిర్మల్ సీటు మళ్లీ ఇంద్రకరణుడినే వరించింది. అసమ్మతిరాగం వినిపించినా ముధోల్ టికెట్ విఠల్రెడ్డికే దక్కింది. కొంతకాలంగా ఊహిస్తున్నట్లుగానే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్కు షాక్ తప్పలేదు. ఆ స్థానాన్ని మారుస్తూ మంత్రి కేటీఆర్ మిత్రుడైన భూక్య జాన్సన్నాయక్కు ఇచ్చారు. మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లో గులాబీశ్రేణులు ఆశించినట్లుగానే పార్టీ అధిష్టానం సీట్లు ఖరారు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, కేసీఆర్, కేటీఆర్లకు పాలాభిషేకాలు చేస్తూ, స్వీట్లు పంచుతూ సంబురాలు చేశారు. అడ్డులేని ‘అల్లోల’.. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎలాంటి పోటీ, అసమ్మతి వర్గాలు లేకుండా ఉన్న అల్లోలకే మళ్లీ పార్టీ పట్టం కట్టింది. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఇంద్రకరణ్రెడ్డిని ఖరారు చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఇప్పటికీ ప్రజల్లో ఆయనపై అభిమానం, విశ్వసనీయత ఉండటంతో పార్టీ అల్లోలకే టికెట్ ఇస్తోంది. వ్యక్తిగతంగా వయసు మీద పడుతున్నా.. ఇప్పటికీ ఎక్కడా తగ్గకుండా నిత్యం ప్రజల్లో ఉండటం, సమస్యల పరిష్కారంలోనూ చురుకుగా ఉంటారన్న పేరు రావడం, వీటన్నింటికీ తోడుగా అ టు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్తోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం అల్లోలకు కలిసివచ్చాయి. గడ్డిగారికే మొగ్గు.. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి టికెటిస్తే తామంతా పనిచేసేది లేదని కొంతకాలంగా ముధోల్లో అసమ్మతి రగులుతున్నా.. బీఆర్ఎస్ మాత్రం మళ్లీ గడ్డిగారివైపే మొగ్గు చూపింది. వరుసగా రెండుసార్లు గెలువడం, నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయనపై నమ్మకం ఉండటం కలిసివచ్చింది. ఓసీ వర్గాలతో పాటు బీసీల్లో ప్రధానంగా మున్నూరుకాపులు సైతం ఆయనకు మద్దతు పలకడంతో పార్టీ విఠల్రెడ్డికే సీటిచ్చింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ దండె విఠల్తోపాటు సీనియర్లు రాజేశ్బాబు, సూర్యకాంత్రావు తదితరులు టికెట్ ఆశించారు. ప్రస్తుత బీజేపీ ప్రభావిత పరిస్థితుల్లో ముధోల్లో కొత్తప్రయోగం చేసే ఆలోచన పార్టీ చేయలేదన్నది స్పష్టమైంది. సౌమ్యుడిగా పేరున్న విఠల్రెడ్డి వైపే బీఆర్ఎస్ మొగ్గు చూపింది. జాన్సన్కు జాక్పాట్.. ఖానాపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే భూక్య జాన్సన్నాయక్ జాక్పాట్ కొట్టేశారు. తను అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్పై తీవ్రంగా ఉన్న వ్యతిరేకతే ఆయనకు పార్టీ పరంగా బలంగా మారింది. జగిత్యాల జిల్లా కు చెందిన జాన్సన్ మంత్రి కేటీఆర్కు దగ్గరి మిత్రుడు కావడం, ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ సపోర్ట్తోనే ఆయనకు టికెట్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
TS Election 2023: ఎవరి కుర్చీ పదిలం..!? తుదిజాబితా కోసం ఉత్కంఠ!
కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా తయారైంది. సొంత పార్టీలో అసమ్మతి నేతలు వేర్వేరు కుంపట్లు పెట్టి సిట్టింగ్లకు సీట్లు ఇస్తే సహకరించేది లేదని, తమలో ఒకరికి ఇస్తే కలిసి పనిచేస్తామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. రోజుకో నియోజకవర్గంలో అసమ్మతివాదుల సంఖ్య పెరుగుతుండడం.. ఏకంగా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయడం, శుభ, అశుభ కార్యక్రమాలకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతుండడంతో క్షేత్రస్థాయి క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పార్టీ అధిష్టానం నుంచి రెండు, మూడు రోజుల్లో మొదటి విడత జాబితా వస్తుందంటూ వస్తున్న సంకేతాలతో ఉన్న సీటు ఉంటదా..? ఊడుతుందా..? అనే సందిగ్ధంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం టికెట్ తమకే అంటూ ఎవరి స్టైల్లో వారు నియోజకవర్గకేంద్రాలు, మండలాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న తతంగంపై పార్టీ అధిష్టానం ఒకింత దృష్టి సారిస్తూనే అసమ్మతివాదులను బుజ్జగిస్తూ.. వివాదాలు లేకుండా చేసే ప్రయత్నంలో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీట్ల కేటాయింపు విషయానికి వస్తే వేములవాడ, రామగుండం, మంథని, పెద్దపల్లి, చొప్పదండి తదితర నియోజకవర్గాలలో సొంత పార్టీ నుంచే తీవ్ర అసమ్మతిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సీట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. జగిత్యాల జిల్లా.. ► జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్కు టికెట్ కేటాయించే విషయంపై పార్టీలో కొంత అసమ్మతి నెలకొంది. టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఓరుగంటి రమణారావు, పి.జితేందర్రావులు టికెట్ కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ► కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్రావు అభ్యర్థిత్వాన్ని వీలైతే మార్చి అతని కుమారుడు డాక్టర్ సంజయ్ని బరిలో దింపే అవకాశాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ► ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రస్తుత ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పార్టీ అధిష్టానం తాను కోరుకుంటే తప్ప అభ్యర్థిత్వాన్ని మార్చబోదని సమాచారం. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తే ధర్మపురిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారే అవకాశాలు ఉండనున్నాయి. కరీంనగర్ జిల్లా.. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను మార్చాల్సిందేనంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఇటీవల కరీంనగర్లోని ఓ హోటల్లో సమావేశమై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలోనే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వారి అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి గంగుల మంతనాలు జరుపుతున్నారు. అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య సొంత పార్టీలోనే రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ ఆర్డీవో బైరం పద్మయ్య, కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, బండపల్లి యాదగిరి, గంట కళ్యాణిశ్రీనివాస్ పార్టీ అధిష్టానం వద్ద అభ్యర్థనలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ► మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓరుగంటి ఆనంద్ పార్టీ అధిస్టానం వద్ద ప్ర యత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ► హుజూరాబాద్ సీటు కేటాయింపు విషయంలో గతంలోనే జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు తదితరులు ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి టికెట్ ఖాయమని సంకేతాలు ఇచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వొడితెల సతీష్బాబు సైతం హుజూరాబాద్ నుంచి పోటీ చేసే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. హుస్నాబాద్ సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే సతీష్బాబు హుజూరాబాద్కు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవలే అక్క డి పార్టీ నేతలు పొనగంటి మల్లయ్య, తుమ్మేటి సమ్మిరెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్క డి నుంచే ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన పర్యాటక సంస్థ అబివృద్ధి చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ సతీమణిని సైతం బరిలో దించే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ► కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి టికెట్ దక్కించుకుని నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీలో అసమ్మతి ఏమీ లేకపోవడంతో టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా.. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు చేయడంతోపాటు నియోజకవర్గకేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతివాదులంతా ఏకమై పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వేరుకుంపటి తయారు చేసి తమ పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. తాజాగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కౌశిక హరిని శుక్రవారం హైదరాబాద్ తీసుకెళ్లి ప్రగతిభవన్లో పార్టీ అధిష్టానంతో మాట్లాడించడంతో హరి చేరిక ఖాయమైంది. ఈ పరిణామంతో రామగుండం రాజకీయం రసకందాయంలో పడింది. ► మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు టికెట్ కేటాయించవద్దని ఇటీవలే ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధులు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతివరప్రసాద్, బందం వసంతరెడ్డి తదితరులు తేల్చిచెప్పడంతో పార్టీ అధిష్టానం మంథనిపై ఫోకస్ పెట్టింది. కాటారం మాజీ జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి సైతం టికెట్ రేస్లో ఉన్నట్లు వినికిడి. జెడ్పీ చైర్మన్గా ఉన్న పుట్ట మధు మాజీ ఎమ్మెల్యే కావడం.. పార్టీలో బలమైన నాయకుడు కావడంతో టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ► పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డికి మరోసారి టికెట్ కేటాయింపు వద్దని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్.రాజయ్య నిరసన వ్యక్తం చేసి ఏకంగా పార్టీకి గుడ్బై చెప్పారు. వారంతా ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. నల్ల మనోహర్రెడ్డి, బొద్దుల లక్ష్మణ్ సైతం పార్టీ అధిష్టానం వద్ద తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు వినికిడి. నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. టికెట్ కేటాయింపు వ్యవహారం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. సిరిసిల్ల జిల్లా.. ► వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ అభ్యర్థిత్వం ఈసారి మార్పు తప్పదంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పౌరసత్వ వివాదం తేలకపోవడం.. ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో బీఆర్ఎస్లో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ కేటాయింపు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సూచనతోనే ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేసి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఏనుగు మనోహర్రెడ్డి, ఎన్ఆర్ఐ డాక్టర్ గోలి మోహన్ కూడా పార్టీ అధిష్టానం వద్ద తన పేరు పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం. ► సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టికెట్ ఖాయం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ మరోసారి విజయఢంకా మోగించేందుకు తనదైన శైలిలో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. -
ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు
-
‘డబుల్’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో బెల్లంపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకుని 2017 జూన్ 10న ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై ఆరేళ్లు కావస్తుండగా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక అవరోధాలతో అపసోపాలు పడుతూ ప్రస్తుతం సగానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తుది దశకు చేరాయి. రూ.968 లక్షల అంచనాతో 160 2బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణ వ్యయం యేటా పెరుగుతుండగా ఇప్పటికే పూర్తి కావాల్సిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. తుది దశలో పనులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు బిగించాల్సి ఉంది. ఆయా పనులు పూర్తయితే దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లే. 160 ఇళ్లకు గాను పైపులైన్ పనులు 100 ఇళ్ల వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్కు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటాయిపులపై ఆశలు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తంతు ప్రారంభం కాకముందే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందస్తుగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల పరం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు తుది దశలో ఉండడంతో పేదలు ఆశలు పెంచుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే అర్హులకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. గృహలక్ష్మి వైపు చూపులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈసారి కూడా పూర్తికాని పరిస్థితులు ఏర్పడితే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పేదల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు ఉన్నాయి. ఇటీవలనే ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 వేల మందికి ఇళ్లపట్టాలు వచ్చే అవకాశాలు ఉండగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తికాని పక్షంలో నివేశన స్థలం ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లనిర్మాణ పనులు పూర్తి చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. బిల్లుల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – పెద్దయ్య, ఆర్అండ్బీ ఇంచార్జి ఈఈ, మంచిర్యాల -
తనువు బీఆర్ఎస్.. మనసు కాంగ్రెస్
బీఆర్ఎస్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వలస నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. సన్నిహితుల వద్ద తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులైతే తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని బాహాటంగానే అంటున్నారు. బీఆర్ఎస్లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం పార్టీ మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని వర్గాల్లో రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న అన్ని మండలాలు, మున్సిపల్ డివిజన్ల పరిధిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మధ్య రానున్న ఎన్నికల ఫలితాల విషయమై ఎడతెగని విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, శ్రేణులు మాత్రం ఎలాగైనా వచ్చేసారి తాము గెలవాలనే లక్ష్యంతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్లో ఉన్న పలువురు నాయకులు, సీనియర్ కార్యకర్తలు మాత్రం మళ్లీ గెలవాలనే ఆకాంక్షను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయకపోతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు అత్యంత నమ్మకమైన వారి వద్ద సదరు నాయకులు బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే తమకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కదని, అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతుండడం విశేషం. అంటే ఇక్కడ మనిషి ఒకచోట, ఆలోచన ఒకచోట అన్నమాదిరిగా.. బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటుండడం గమనార్హం. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో స్థానికంగా వెలుగు వెలుగుతూ అందరికీ అందుబాటులో ఉన్నామని, మళ్లీ అలాంటి పరిస్థితి రావాలంటే తాము ఉన్న బీఆర్ఎస్ గెలవకూడదని కోరుకుంటుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. తమకు ప్రాధాన్యత దక్కనప్పుడు ఇందులో ఉండి ఏం లాభమని అంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో అధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతం అయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు, భూదందాలు సహా తదితర వ్యవహారాల్లో ఆయా మండలాల్లో ఒకరిద్దరు నాయకులదే హవా నడుస్తోందని అనేకమంది నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు అయితే తమకు ఏమాత్రం న్యాయం జరగడంలేదని బాహాటంగానే అంటున్నారు. జిల్లాలో పలువురు సర్పంచులు బిల్లులు రావడంలేదని ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో కల్లెడ సర్పంచ్ లావణ్య ప్రసాద్గౌడ్ దంపతులపై కేసులు పెట్టిన వైనంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుస్సాగా ఉన్నారు. ఇక జిల్లాలో వివిధ మండలాల్లో బీఆర్ఎస్లో వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొన్ని వర్గాలను ప్రోత్సహించి తమ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వివిధ అంశాల్లో నటిస్తున్నారని, తాము కూడా నటించాల్పి వస్తోందని పలువురు బీఆర్ఎస్ నాయకులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని సమాచారం. మరోవైపు తమను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి అన్నిరకాలుగా సహకరిస్తూ కోవర్టు వ్యవహారాలు నడపడం పట్ల బీఆర్ఎస్లో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్లో ఆది నుంచి ఉన్న ఉద్యమకారులు మాత్రం తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఈసారి కాంగ్రెస్కు ఓటు వేయాలని పలువురు బీఆర్ఎస్ నాయకులే అంటుండడం గమనార్హం. ఇందులో భాగంగా పలువురు రుణాలను సైతం ఎక్కువ మొత్తంగా తీసుకుంటుండడం విశేషం. కాంగ్రెస్ వస్తే రుణమాఫీ వస్తుందని రైతులతో పాటు సదరు బీఆర్ఎస్ నాయకులు సైతం విశ్వసిస్తుండడం ఆలోచింపజేస్తోంది. మరోవైపు ధరణి సమస్యల విషయంలోనూ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. డబుల్ ఇళ్ల విషయమై నిలదీయాలని ప్రజలను ప్రోత్సహిస్తుండడంతో పాటు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమై ఆలోచించాలని యువతకు చెబుతున్నారు. మొత్తంమీద గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలవాలంటూ వివిధ చర్చల్లో ఆకాంక్షలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement