
సైకిల్పై హైదరాబాదీ సాహసయాత్ర
హైదరాబాద్కు చెందిన పారా సైక్లిస్ట్ ఆదిత్య మెహతా మనాలీ నుంచి ఖర్దుంగా లా వరకు దాదాపు 500 కిలోమీటర్ల సాహస యాత్రను పూర్తి చేసుకున్నారు. మనాలీ నుంచి జాతీయ పతాకాన్ని ధరించి, ఆగస్టు 1న బయలుదేరిన ఆదిత్య సరిగా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఖర్దుంగా లా చేరుకున్నారు. సముద్రమట్టానికి దాదాపు 13 వేల అడుగుల ఎత్తయిన మనాలీ-లేహ్ హైవేపై బలమైన ఎదురుగాలులను, వణికించే చలిని తట్టుకుంటూ ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా ఈ యాత్ర పూర్తి చేయడం విశేషం. ఈ ప్రయాణంలో ఆయన ఆగస్టు 9న లేహ్ చేరుకున్నారు.