మహారాష్ట్రకు తరలిస్తోన్న 52 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
కామారెడ్డి: జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోన్న మోహన్ రావు, శంకర్రావు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 52 కేజీల గంజాయి, తూపాను వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణి విలేకరుల సమావేశంలో తెలిపారు.