cannabis
-
ప్రచారం పీక్ దర్యాప్తు వీక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. మత్తుపదార్థాలను కట్టడి చేస్తున్నామంటూ అధికారులు భారీగా ప్రచారం చేస్తుండగా కేసుల దర్యాప్తు పేల వంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా వరకు వీగిపోవడమే అందుకు నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన 226 కేసులకుగాను కేవలం 39 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. అంటే ఆయా కేసుల్లో నేర నిరూపణ 17 శాతంగానే ఉంది. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్డీపీఎస్ చట్టం కింద గత పదేళ్లలో నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ అత్యంత తక్కువగా 0.85 శాతంగా ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆధారాల సేకరణలో లోపాలే శాపాలై.. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసుల నమోదు, మత్తుపదార్థాల స్వాధీనం, కోర్టుకు ఆధారాల సమర్పణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కేసులు వీగిపోతున్నాయి. చాలా వరకు ఎన్డీపీఎస్ కేసులు కనీసం విచారణ దశకు కూడా రాకుండానే సాంకేతిక కారణాలతో కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందాక దర్యాప్తు అధికారులు తన పై అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు వారి నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకోవాలి. ఆ తర్వాత తనిఖీ చేసేందుకు వెళ్లే సమయంలో ఇద్దరు పంచ్ విట్నెస్లను వెంట తీసుకెళ్లాలి. అందులో కనీసం ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ తర్వాత ఎవరి వద్ద తనిఖీ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తికి సదరు అధికారులు ఆప్షన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం..దర్యాప్తు అధికారులను అవతలి వ్యక్తులు తనిఖీ చేయవచ్చు (అధికారులే మత్తుపదార్థాలను తెచ్చి పెట్టారన్న సందేహాలకు తావు లేకుండా). ఆపై తనిఖీలను అధికారులు ప్రారంభించాలి. నూతన చట్టాల ప్రకారం ఈ వ్యవహారాన్ని వీడియో తీయాలి. సాంకేతిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోయినా.. కొన్నిసార్లు పంచ్ విట్నెస్లు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వారితోనే పంచనామా చేయడం.. వారు సాక్ష్యం చెప్పడంలో తడబడటం వంటి కారణాలతో కేసులు నిలబడట్లేదు. సోదాల్లో దొరికిన మత్తుపదార్థాల నమూనాల సేకరణ, వాటికి సంఖ్య కేటాయింపు సైతం ఈ కేసుల్లో కీలకంకాగా అందులోనూ దర్యాప్తు అధికారులకు అవగాహన లేక కేసులు నిలబడట్లేదు.శిక్షలు పెంచేలా శిక్షణపై దృష్టి.. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటంతోపాటు ఆధారాల సేకరణపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణా తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టారు. టీజీఏఎన్బీ ఆధ్వర్యంలో పోలీ స్, ఎక్సైజ్, ప్రాసిక్యూషన్, రైల్వే శాఖ అధికారులకు సైతం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,654 సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు టీజీఏఎన్బీ అధికారులుతెలిపారు. -
Hyderabad: నడిరోడ్డుపై హంగామా
చార్మినార్ : చార్మినార్ ఆర్టీసి బస్టాప్ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు. కనిపించని పోలీసులు... ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్ ఆర్టీసి బస్టాండ్ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్ కేఫ్ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్పురా లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్పురా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
గంజాయి గురించి పరిశోధనలో షాకింగ్ విషయాలు?!
మన దేశంలో గంజాయి తాగడం నిషిద్ధం. అంతేగాదు గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా చేస్తే జైలుకే పరిమితమవ్వుతారు. అలాంటి గంజాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ గంజాయి ఎలా మెమరీ నష్టాన్ని, ఒత్తిడిని నివారిస్తుందో సవివరంగా చూద్దామా..మత్తు కోసం గంజాయి లేదా గంజాయి మొక్కలోని ఎండిన ఆకులు పొగబెట్టడం లేదా నమలడం వంటివి చేస్తుంటారు. అందువల్లే దీన్ని మత్తు పదార్థంగా నిర్ణయించి ప్రభుత్వాలు నిషేధించడం జరిగింది. అయితే ఈ గంజాయి మెక్కలోని సైకోయాక్టివ్ పదార్థాల్లో కన్నాబినాయిడ్స్ ఉన్నాయి. వీటి నుంచి సీబీజీ, కన్నాబిడియోల్(సీబీడీ) ఉత్పన్నం అవుతాయట. అందువల్లే కొన్ని దేశాల్లో దీన్ని కీమోథెరపీ కారణంగా వచ్చే దీర్ఘకాలిక నొప్పి లేదా వికారం చికిత్సలో ఈ గంజాయిని వినియోగించడం జరుగుతుందట. ఇప్పుడు ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది కూడా. అంతేగాదు అధికా ఆదాయ దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ గంజాయి ఔషధ వియోగం చట్టబద్ధమైనదే. దీనిపై పరిశోధనలో చేసిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గంజాయిలోని సీబీజీని నిరంభ్యంతరంగా వినియోగించవచ్చని తేల్చి చెప్పారు. అందుకోసం పరిశోధకులు రెండు వర్చువల్ సమావేశాల్లో సుమారు 34 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. వారందరికి దాదాపు 20 మిల్లీగ్రాముల సీబీజీ లేదా ప్లేసీబోను ఇచ్చారు. ఈ మత్తు ప్రభావంతో వారిలోని ఆందోళన, ఒత్తిడి మానసిక స్థితి ప్రాథమిక స్థాయిలను గుర్తించగా..చాలా ప్రభావవంతంగా వారిలో ఆందోళ, ఒత్తడి స్థాయిలు తగ్గాయి కూడా. అలాగే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల కనిపించిదని అన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో తక్కువ మత్తు, పొడి నోరు, నిద్రపోవడం, పెరిగిన ఆకలి వంటి మార్పులు కనిపించాయని చెప్పారు. ఈ గంజాయిలోని సీబీజీ ఓ అద్భుత ఔషధం అని చెప్పారు పరిశోధకులు. ఇక్కడ దీన్ని ఉపయోగించే పరిమితిని అర్థం చేసుకుంటేనే సత్ఫలితాలు పొందగలమని అన్నారు. దీనిపై కొనసాగుతున్న అధ్యయనాలు భవిష్యత్తులో సీబీజీ ప్రయోజనాలు, భద్రతపై సమగ్ర అవగాహన అందిస్తాయని నమ్మకంగా చెప్పారు శాస్త్రవేత్తలు. టైమ్స్నౌ న్యూస్ ప్రకారం ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యింది.(చదవండి: ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?) -
గల్లీ గల్లీలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: సింబయోసిస్ కాలేజీలో 25 మంది.. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది.. ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆరుగురు.. జోగిపేట జేఎన్టీయూలోని విద్యార్థులు ముగ్గురు.. .. ఇదేదో మెడల్స్ గెల్చుకున్న వారి జాబితా కాదు.. గంజాయికి అలవాటు పడి గత నెలలో ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)’అధికారులకు పట్టుబడినవారి జాబితా. ఇంకా ఇలాంటి ఘటనలు మరెన్నో. ధర తక్కువ, లభ్యత ఎక్కువ అన్నట్టుగా గంజాయి విక్రయాలు సాగుతుండటంతో.. యువత, విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య డ్రగ్స్కు సంబంధించి రాష్ట్రంలో 938 కేసులు నమోదుకాగా.. 1,921 మంది అరెస్టయ్యారు. ఇందులో 816 కేసులు (86.99 శాతం), 1,649 మంది (85.84 శాతం) గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రం ఆ«దీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వివిధ రూపాల్లో వాడుతూ.. రాష్ట్రంలో గంజాయికి అలవాటుపడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా.. కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చరస్, హషీష్ ఆయిల్, బంగ్ తదితర రూపాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైసూ్కల్, జూనియర్ కాలేజీ స్థాయిలో తొలుత సిగరెట్కు అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో, స్నేహితుల ద్వారానో గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి విక్రయదారులు.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గంజాయి నియంత్రణపై మరింత ఫోకస్ చేయాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒడిశా నుంచి రాష్ట్రంలోకి.. గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది. అక్కడ నుంచి ఛత్తీస్గఢ్, ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, ఆరీ్టసీ/ప్రైవేట్ బస్సులతోపాటు రైళ్లల్లోనూ గంజాయి హైదరాబాద్కు చేరుతోంది. గాంజాతోపాటు పాట్, హష్, స్టఫ్, స్టాష్.. ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. కొకైన్, హెరాయిన్, ఎల్ఏస్డీ వంటి డ్రగ్స్ ఒక గ్రాముకు లేదా ఒక డోసుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు కావాలి. అదే గంజాయి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచి్చస్తే 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్ స్ట్రిప్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇక ధనికవర్గాలకు చెందినవారు హిమాచల్ ప్రదేశ్లోని కస్సోల్ ప్రాంతం నుంచి వచ్చే ఖరీదైన ప్రత్యేక గంజాయిని వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చే గంజాయిలోనూ శీలావతి, గ్రీన్ రకాలకు డిమాండ్, రేటు ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.ప్రాణాలు తీస్తున్న ‘గంజా’మత్తు!హైదరాబాద్లోని సింగరేణి కాలనీకి చెందిన పి.రాజు గంజాయికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే తన ఇంటి సమీపంలో నివసించే ఆరేళ్ల చిన్నారిని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. రాజు కోసం పోలీసుల గాలింపు చేపట్టడంతో.. వరంగల్ జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలోని రోటరీనగర్కు చెందిన అమరబోయిన ఉదయ్కుమార్ తన అమ్మమ్మ రాంబా యమ్మ దగ్గర ఉంటున్నాడు. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉదయ్.. డిప్లొమా లో చేరాక గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి కోసం డబ్బులు కావాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఓ రోజు రాత్రి 11.30 గంటలకు హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్కు చెందిన నవీన్ గంజాయి మత్తులో ఓ వ్యక్తిపై గొడలితో దాడి చేసి చంపేశాడు. బెయిల్ వచ్చాక గంజాయి మత్తులో గ్రామస్తులతో ఘర్షణకు దిగడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీవ్ గంజాయికి బానిసగా మారడంతో.. ఆ ప్రభావం కుటుంబానికి చెందినవారందరిపై పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్మిల్లులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. పక్కన మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్నా బీహార్ వలస కూలీ వినోద్ మాజ్హి గంజాయి మత్తులో.. ఆ దంపతుల ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని గోపాల్రావుపేటకు చెందిన సురేశ్ పద్దెనిమిదేళ్ల వయసులోనే గంజాయికి బానిసయ్యాడు. మితిమీరి గంజాయి తీసుకోవడంతో చనిపోయాడు.వెంటనే బానిసలవుతారు మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్లపాటు తాగుతూ ఉంటేనే.. దానికి బానిసలుగా మారుతారు. అదే గంజాయి విషయంలో కొన్నిరోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్గుడ్ ఫ్యాక్టర్కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే.. సైకోసిస్ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. – ప్రతాప్ రాజన్, క్లినికల్ సైకాలజిస్ట్803 కిలోల గంజాయి పట్టివేతరూ.2.81 కోట్ల విలువ ఉంటుందన్న పోలీసులుశంషాబాద్ రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒక డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ విభాగం, శంషాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పెద్ద గోల్కొండ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై మాటువేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన కమిషన్ ఏజెంట్ సోమనాథ్ ఖార, డీసీఎం డ్రైవర్లు హెచ్ఎస్ విఠల్రెడ్డి, సంజీవ్కుమార్తోపాటు సునీల్ ఖోస్లా, జగ సునను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపు సూత్రధారులైన ఏపీలోని అరకు వాసి రాము, మహారాష్ట్ర వాసి సురేశ్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నట్టు వివరించారు. తరలింపు ప్లాన్ ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అరకువాసి రాము గంజాయి సరఫరాదారు.. అతడి వద్ద సోమనాథ ఖార పనిచేస్తున్నాడు. వారు ఇటీవల డీసీఎం యజమాని విఠల్రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ పరిసరాల్లో గూడ్స్ డెలివరీ కోసం వస్తే తమకు చెప్పాలన్నారు. విఠల్రెడ్డికి గత నెల 30న పటాన్చెరు నుంచి వైజాగ్ సరకు తరలించే ఆర్డర్ వచ్చింది. ఆ సరుకును డెలివరీ చేశాక.. ఈ నెల 1న వైజాగ్లోని సెజ్లో ఉన్న ఓ కంపెనీ నుంచి కెమికల్ సాల్వెంట్స్ తీసుకుని బయలుదేరారు. మధ్యలో గంజాయి బస్తాలను నింపారు. సోమనాథ్ ఖార ముందు ఓ కారులో వెళ్తుండగా.. వెనకాల డీసీఎం వచ్చింది. గంజాయిని హైదరాబాద్లోని పటాన్చెరు వరకు తీసుకొచ్చి అక్కడ సురేశ్పాటిల్కు అప్పగిస్తే.. అతను వేరే వాహనంలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. -
డ్రగ్స్తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్తోత్ నవీన్ నాయక్, ప్రణీత్రెడ్డి, రాహుల్రాజ్ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్పేట్కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు. ఆస్తులు జప్తు చేస్తాంఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్స్పెక్టర్లు, జీఆర్పీ పోలీసులు ఉన్నారు. -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సింహాచలం: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్కి రాజధానిని చేశారన్నారు. టాస్క్ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై దృష్టి సారిస్తామన్నారు.గంజాయి కారణంగా విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల గుర్తింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. రాత్రి పూట విశాఖలో గుంపులుగా ఉండే వారిపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ నగరంలో 1,700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. డీఅడిక్షన్ కేంద్రాల సంఖ్య పెంచి.. యువతకు, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తామన్నారు. లక్ష్మీనృసింహస్వామి భూముల్ని రక్షిస్తాం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను పరిరక్షిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచగ్రామాల భూసమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇటీవల చీమకుర్తిలో దివ్యాంగురాలి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఐదేళ్లలో ఎవరికీ భయం లేదని, తప్పుచేసిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉండటమే దీనికి కారణమన్నారు. పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు.కొంతమంది పోలీసులూ వైఎస్సార్సీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, లేదంటే తప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై ఎంక్వైరీ వేస్తామన్నారు. మహిళలు, ఆడపిల్లలను చెడుగా చూడటానికి కూడా భయపడేలా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాగా, హోంమంత్రికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవ్రస్తాన్ని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి అందజేశారు. -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్ను ఢీకొట్టి కంటైనర్ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్ను ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్లు కంటెయినర్ను పరిశీలించి 13 బ్యాగ్లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
అవి గంజాయి చాక్లెట్లే
శంషాబాద్: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం, వింతవింతగా ప్రవర్తిస్తుండటం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారమిచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది. విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల దాడులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్ ఎస్ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మి నార్ గోల్డ్ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యూపీ వయా ఒడిశా? ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా( 33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వ చ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దు రాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్నాథ్ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు. అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మి కులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా మగర్ వారా నెహ్రూబాగ్లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్ గోల్డ్ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. చాక్లెట్ ఫ్లేవర్తో గంజాయి కలిపి కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్ అదనపు డీసీపీ రామ్కుమార్, శంషాబాద్ ఏసీపీ రాంచందర్రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్ ఎస్ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు. -
అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్ ఆయిల్ను విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసుకుని వచ్చి..హైదరాబాద్లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తోంది ఒక ముఠా. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరి నుంచి హష్ ఆయిల్తో పాటు చెరస్ స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ నితిక పంత్ ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఓ యువతి కూడా ఉండగా..పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వినియోగం నుంచి విక్రేతలుగా మారి... గోల్కొండ పరిధిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ పదో తరగతి తప్పడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. తన స్నేహితుడైన సబ్జా కాలనీ వాసి అబు బకర్ బిన్ అబ్దుల్ ఎజాజ్ ద్వారా ఇతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటు అయింది. వీరిద్దరూ కలిసి తరచుగా హష్ ఆయిల్ ఖరీదు చేసి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి వినియోగిస్తుండే వారు. కాలక్రమంలో వీరికి నగరంలో డ్రగ్స్కు ఉన్న డిమాండ్ అర్ధమైంది. దీంతో తామే హష్ ఆయిల్ దందా మొదలు పెడితే వినియోగించడంతో పాటు విక్రయించడానికి అవకాశం ఉంటుందని భావించారు. దీంతో తమ స్నేహితుడు, బైక్ మెకానిక్ మహ్మద్ ఖాసిమ్ అరకు సమీపంలోని పాడేరు ప్రాంతానికి పంపారు. చేతులు మారే కొద్దీ రేటు పైకి... ఆ ప్రాంతంలో లభించే హష్ ఆయిల్ను లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసిన ఖాసిమ్ బస్సుల్లో నగరానికి తీసుకువచ్చాడు. సోమాజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్ ఇంటికి ఈ సరుకు తీసుకువచ్చేవారు. అక్కడే దాచి పెట్టడంతో పాటు అతడితో కలిసి ఈ హష్ ఆయిల్ను 5 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన చిన్న సైజు ప్లాస్టిక్ టిన్నుల్లో నింపేవాళ్లు. ఈ టిన్నుల్ని తమ వద్ద సబ్–పెడ్లర్స్గా పని చేస్తున్న విద్యార్థి ముబషిర్ ఖాన్ (మణికొండ), నితిన్ గౌడ్ (అయ్యప్ప సొసైటీ), క్యాటరింగ్ పని చేసే టి.పూనం కుమారీ కౌర్లకు ఒక్కో టిన్ను రూ.2 వేలకు అమ్మే వాళ్ళు. టోలిచౌకి వాసి జీషాన్ నవీద్, సమత కాలనీకి చెందిన సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కూడా వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తుండేవారు. వినియోగదారులకు రూ.3 వేలకు... హష్ ఆయిల్ నగరానికి తీసుకువచ్చే ఖాసిమ్, విక్రయించే ముజఫర్, అబుబకర్ తెర వెనుకే ఉండేవారు. వీరి సబ్–పెడ్లర్స్ మాత్రమే ఈ మాదకద్రవ్యాన్ని వినియోగదారులకు విక్రయించారు. 5 మిల్లీ లీటర్ల టిన్ను రూ.3 వేలు (లీటర్ రూ.6 లక్షలు) చొప్పున విక్రయించారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషాకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై షేక్ కవియుద్దీన్ బృందం రంగంలోకి దిగి వలపన్నింది. జీషాన్, అన్వరుల్లా మినహా మిగిలిన ఏడుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 310 మిల్లీ లీటర్ల హష్ అయిల్తో పాటు 70 గ్రాములు చెరస్ (గంజాయి సంబంధిత డ్రగ్) స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్న టాస్్కఫోర్స్ వీరికి చెరస్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేవి ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫిల్మ్నగర్ పోలీసులకు అప్పగించారు. -
జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ
సంగారెడ్డి అర్బన్: కోర్టు విధించిన జరిమానా చెల్లించేందుకు అదే కోర్టులో గంజాయిని దొంగతనం చేసిన నిందితుడి నిర్వాకమిది. సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ కథనం మేరకు.. ఈ నెల 19వ తేదీన కోర్టు హాలులోని న్యాయమూర్తి చాంబర్లో ఓ కేసుకు సంబంధించిన గంజాయి సంచిని సీజ్ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి గంజాయి సంచిని ఎత్తుకెళ్లారు. దీనిపై కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, షూ గుర్తుల ఆధారంగా నిందితుడు మగ్దూమ్నగర్కు చెందిన షేక్ మహబూబ్గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇదివరకు ఒక దొంగతనం, యాక్సిడెంట్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 14 ఏళ్లుగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఎవరైనా నిందితులకు బెయిల్ జామీను కావాలంటే డబ్బులు తీసుకొని పూచీకత్తు ఇస్తుంటాడు. అందులో భాగంగా సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు జామీను ఇచ్చాడు. అయితే వారు కోర్టుకు రానందున మహబూబ్ రూ.30వేలు కట్టాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎలా కట్టాలో తెలియక కోర్టు హాలులో ఉన్న గంజాయి మూటను అమ్మి డబ్బు చేసుకోవాలని భావించి దొంగతనం చేశాడు. గంజాయి మూటను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
గంజాయిపై భారత్తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..? గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు. గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. -
గంజాయి సాగులో మెడికోలు
కర్ణాటక: సమాజంలో ఆదర్శంగా ఉండవలసిన మెడికోలు పెడతోవ పట్టారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గంజాయికి బానిసై తమ అద్దె ఇంట్లో ఆ మొక్కల పెంపకం చేపట్టారు. పైగా గంజాయిని విక్రయిస్తూ చివరికి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి పట్టణానికి చెందిన విఘ్నరాజ్ (28), ధర్మపురి కడగత్తూరుకు చెందిన పాండిదొరై (27), కేరళలోని ఇడుక్కివాసి వినోద్ కుమార్ (27) నిందితులు. వీరు ముగ్గురూ శివమొగ్గ నగరంలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. విఘ్నరాజ్ గంజాయి మొక్కలను తీసుకుని వచ్చినట్లు తెలిసింది. గంజాయి విక్రయాలు శివగంగా లేఔట్లో అద్దె ఇంటిలో కుండీలో మొక్కలను పెంచసాగాడు. మొక్కలను ఎండబెట్టి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వినోద్, పాండి దొరైతో కలిసి విక్రయించడం ప్రారంభించారు. ఈ వ్యవహారం తెలియడంతో శివమొగ్గ గ్రామీణ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి 227 గ్రాముల ఎండు గంజాయిని, అలాగే ఇంట్లో 1.5 కేజీల బరువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 10గ్రాముల చరస్, గంజాయి గింజలను, గంజాయి నూనె కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా..
కుర్రాళ్లు చదువుకునేందుకు కాలేజీలో చేరుతారు. అలా కాలేజీలో చేరిన కుర్రాళ్లు బాగా చదువుకోవాలని అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు పరితపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుర్రాళ్లు దారితప్పుతుంటారు. అలా నేర సంబంధమైన కార్యకలాపాల్లోకి అడుగు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం కర్నాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు తీసుకుని.. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఒక కుర్రాడు తాను ఉంటున్న అద్దె ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. తరువాత వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు తమిళనాడు, కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు చేసిన గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయి కొనుగోలుకు రాగా.. కర్నాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని తమిళనాడులోని కృష్ణాగిరి నివాసి విఘ్నరాజ్గా గుర్తించారు. ఇతను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతను తాను ఉంటున్న ఇంటిలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శివమొగ్గ పోలీసు అధికారి జీకే మిథున్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు గత మూడున్నర నెలలుగా గంజాయి క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నాడన్నారు. ఇతనికి కేరళకు చెందిన వినోద్ కుమార్, తమిళనాడుకు చెంది పండీదోరాయ్కు సహకరిస్తున్నారని, ఈ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. విఘ్నరాజ్ ఇంటికి గంజాయి కొనుగోలుకు ఈ ఇద్దరు కుర్రాళ్లు రాగా, వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పలు మత్తు పదార్థాలు స్వాధీనం పోలీసులు నిందితుని ఇంటిపై దాడి చేసి 277 గ్రాముల గంజాయి, 1.63 కిలోల పచ్చి గంజాయి, 10 గ్రాముల చెరస్, గంజాయి విత్తనాల బాటిల్, 19 వేల రూపాలయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని.. -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
గంజాయి రవాణా ఒడిశా నుండి విశాఖ
-
మత్తుగా...మాయాలోకంలో!
►బెంగళూరుకు చెందిన ఇరవై రెండేళ్ల ఐఐటీయన్ శ్రీలత పాతికేళ్లలోపే ఐఏఎస్ అధికారి కావాలన్న కలను గంజాయి కారణంగా భగ్నం చేసుకుంది. ►చండీగఢ్కు చెందిన 43 ఏళ్ల ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుస్మిత చౌధురి గంజాయికి అలవాటుపడ్డ తన 12 ఏళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ►గాంధీనగర్కు చెందిన 48 ఏళ్ల గృహిణి అనామిక పటేల్ తన 17 ఏళ్ల కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న విషయం తెలుసుకుని పార్టీల్లో తప్ప ఎక్కడా గంజాయి సేవించకూడదని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. కంచర్ల యాదగిరిరెడ్డి మత్తులో గమ్మత్తుగా దొరికే అనందాన్ని వెతుక్కుంటూ దేశవ్యాప్తంగా గంజాయికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కళాశాల క్యాంపస్లు, నైట్ క్లబ్లు, పబ్లు, పేరు గాంచిన రెస్టారెంట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రీమియర్ విద్యాసంస్థల హాస్టళ్లలో గంజాయి సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది. అమ్స్టర్డ్యామ్ డ్రీమ్, మౌలానా క్రీమ్, బాంబే బ్లాక్ లాంటి గంజాయి రకాలు ఇప్పుడు యువత సంభాషణల్లో క్రేజీగా మారాయి. ‘గంజాయి అనేది మింట్, చాక్లెట్ లాగా సాధారణమైపోయింది, తక్షణ ఉల్లాసం కలిగించే మాదకద్రవ్యంగా 12 ఏళ్ల పిల్లలు సైతం దీనిని వాడుతున్నారు’అని అమృత్సర్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సవీందర్ సింగ్ చెప్పారు. ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో గంజాయి వినియోగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు, హ్యాష్ అని ముద్దుపేరు గంజాయిని హ్యాష్, హ్యాషిన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఢిల్లీలోని పహర్గంజ్ ‘హ్యాషెర్ప్ స్ట్రీట్’గా గంజాయి సేవించే వారికి సుపరిచితమైన స్థలం. గొట్టాల సాయంతో గానీ, సిగరెట్ల మాదిరిగా కాగితంతో చుట్టి గానీ గంజాయిని పీలుస్తుంటారు. దేశవ్యాప్తంగా హ్యాషెర్ స్ట్రీట్ లాంటి కేంద్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వేలాదిమంది యువతీ యువకులు గంజాయి సేవించడానికి ఆ సెంటర్లకు వెళ్తుంటారు. ఐఏఎస్ హోదా సాధించాలని కలలు కన్న శ్రీలత వారాంతంలో స్నేహితులతో కలిసి ఢిల్లీలోని హ్యాషెర్స్ స్ట్రీట్కు వెళ్లడం ప్రారంభమైన తరువాత తన జీవన సరళి మారిపోయింది. ‘ఖరగ్పూర్లో ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వచ్చి నా కూతురు హ్యాష్కు బానిసైంది. బంగారు భవిష్యత్ను పాడుచేసుకుంది’అని శ్రీలత తండ్రి గోపాలకృష్ణ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిషేధాన్ని పాలనా యంత్రాంగం సరిగ్గా అమలు చేయడం లేదంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా పెండింగ్లో ఉంది. గంజాయికి విపరీతమైన డిమాండ్ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ‘గంజాయి అమ్మకాల గురించి తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, పోలీసులతో స్మగ్లర్లకు సంబంధాల వల్ల ఏమీ చేయలేకపోతున్నామని’ఆయన అన్నారు. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్ ప్రాంతాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ గంజాయిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తున్నారట. అక్కడ భయానక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు. గడచిన పదేళ్లతో పోల్చి చూస్తే ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతాలో దీని వాడకం పాతిక రెట్లు పెరిగిందని ఎన్సీబీ రికార్డులు చెపుతున్నాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా కొన్ని వందల టన్నుల గంజాయిని వాడి ఉంటారని అంచనా. న్యూఇయర్ కోసం సిద్ధం చేసి ఉంచిన 2.5 క్వింటాళ్ల గంజాయిని ఒడిశాలో, 3.5 క్వింటాళ్ల గంజాయిని కేరళలో సీజ్ చేశారు. ఒక్క 2022లో ఎన్సీబీ దేశవ్యాప్తంగా 5.5 టన్నుల గంజాయిని ధ్వంసం చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాదక ద్రవ్యాలు, నియంత్రణ విభాగం 2022లో విడుదల చేసిన ఓ నివేదికలో 2010–2020మధ్య భారత్లో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ధర తక్కువ ఉండటమూ ఓ కారణమే సులువుగా దొరకడం, ధర తక్కువగా ఉండటమూ గంజాయి విస్తరించడానికి ప్రధాన కారణమని ఎన్సీబీ అధికారి ఒకరు విశ్లేషించారు. రూ.300 నుంచి రూ.1200 వరకు గంజాయి లభిస్తోందని చెప్పారు. ‘గతంలో 18–20 ఏళ్ల మధ్య యువత దీనికి బానిస అవుతున్నారని అనుకుంటే ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. ఇటీవల కొన్ని కేసులను పరిశీలించినప్పుడు ముంబైలో స్కూల్ పిల్లలు గంజాయిని వాడుతున్నట్లు మాకు తెలిసింది. గంజాయిని సేవిస్తున్న ఓ 13 ఏళ్ల కుర్రాడిని మా టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. గంజాయి తాగితే తప్పేమిటని ఆ బాలుడు ప్రశ్నించాడ’ని ఆ అధికారివాపోయారు. ముంబై. ఢిల్లీ, కోల్కతాలో విద్యాసంస్థల సమీపంలోనే ఉన్న పాన్ దుకాణాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నాయి. ముంబైలో ఇటీవల కొన్ని పాన్ షాపుల మీద దాడి చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పబ్లలో వెయిటర్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్, వసంత్ కుంజ్, ముంబైలోని కొలాబా, బాంద్రా, హైదరాబాద్లోని బంజారాహిల్స్, గచ్చిబౌలి, చెన్నైలోని తేనాంపేట, గోపాలపురం, బెంగళూరులోని చిక్పేట, జయానగర్ ప్రాంతాల్లో గంజాయి వాడకం విపరీతంగా ఉంది. హైదరాబాద్లో వందలాదిగా ఏజెంట్లు హైదరాబాద్లో గంజాయి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా ఉంది. సరైన వ్యక్తిని సంప్రదిస్తే నిమిషాల్లోనే కావాల్సిన వారి చేతికి అందుతుంది. గంజాయి కొనుగోలు చేయడం ఎంత సులువో.. ఓ ఏజెంట్ను పరిచయం చేసుకున్న ఈ ప్రతినిధికి అర్థమైంది. ఇటీవల ఓ పోలీసు అధికారి సాయంతో సాక్షి ప్రతినిధికి ఓ గంజాయి సరఫరా ఏజెంట్తో పరిచయమైంది. బాగా నమ్మకం కుదిరిన తరువాత ‘సాక్షి’ప్రతినిధి తనకు గంజాయి కావాలని అడిగితే ఆ ఏజెంట్ చేసిన సూచన ఇలా ఉంది.... ‘ఒంటరిగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు నడుస్తూ వెళ్లండి అయితే, మీరు అనుమానాస్పదంగా వ్యవహరించవద్దు. గంజాయి కోసం తహతహలాడుతున్నట్లు మీ ఫీలింగ్ ఉండాలి. అప్పుడు మా ఏజెంట్ మీ దగ్గరకు వస్తాడు. నేను ఇప్పుడు చెబుతున్న కోడ్ అతనికి వినిపించేలా చెప్పండి. తక్షణమే మీ చేతిలో ఒక పాకెట్ పెడతాడు’. ఈ ఉదంతం శాంపిల్ మాత్రమే. గంజాయి సరఫరా చేయడానికి నగరంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘గంజాయి వినియోగాన్ని అరికట్టాలంటే, పాఠశాలలు, కళాశాలలు, ఐటీ పని ప్రదేశాల్లో పరీక్షలను తప్పనిసరి చేయాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లోని పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ దేశంలో ఇలాంటి పరీక్షలను నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది’అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మెదడు, కాలేయంపై ప్రభావం కొకైన్ వంటి మాదకద్రవ్యాల కంటే గంజాయి సురక్షితమని కొందరు వాదిస్తున్నారు. అయితే, అది ఎంత మాత్రం నిజం కాదని వైద్యులు తేల్చిచెబుతున్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి సంఖ్య ఎలా పెరుగుతుందో దాని మూలంగా మానసిక సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుందని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ముంబైకి చెందిన కన్సల్టెంట్ డాక్టర్ ఫెబియన్ ఆల్మెదా అన్నారు. గంజాయి దినచర్యగా మారితే మెదడు, కాలేయం దెబ్బతింటాయని, మానసిక భ్రాంతులు ఏర్పడతాయని చెప్పారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో వస్తున్న పిల్లల్లో 50 శాతానికి పైగా మాదకద్రవ్యాల బారిన పడ్డవారేనని ఆయన వివరించారు. -
‘పరివర్తన’ ఫలించేలా
సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్ఈబీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై.. రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నిర్వహణలో లేని గనులపై దృష్టి గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయి గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్ రూమ్ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. -
గంజాయికి బానిసై వేధిస్తున్నాడని..
తిరుమలగిరి(తుంగతుర్తి): గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శనగర్కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్ (23) డీజే సౌండ్ బాక్సులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సౌమ్య, కుమా రుడున్నారు. గంజాయికి బానిసైన కిరణ్ రోజూ ఇంట్లో గొడ వపడుతుండటంతో సౌమ్య కుమారుడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరింతగా గంజాయి సేవించి వస్తూ రోజూ తల్లిదండ్రులను కొడుతున్నాడు. తనకు డబ్బులివ్వా లని 2 నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగులబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లిపోయారు. 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శకు తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్ తల్లిదండ్రులను కొట్టి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం గంజాయి సేవించి ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదనుగా కిరణ్ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు. అయితే కుమారుడి మరణం తట్టుకోలేక వారు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. అనంతరం కిరణ్ తల్లిదండ్రులు పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఆత్మరక్షణ కోసమే చంపేశాం రెండేళ్లుగా రోజూ గంజాయి సేవించి వచ్చి వేధిస్తున్నాడు. రోజూ కొడుతుండటంతో భయం భయంగా బతుకుతున్నాం. కుమారుడు ఏం చేస్తున్నాడని అడిగితే ఏమీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. సోమవారం మధ్యాహ్నం గంజాయి సేవించి వచ్చి మమ్మల్ని కొట్టాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మరక్షణ కోసం చంపేశాం. – కిరణ్ తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ -
గంజాయి పట్టుకున్నా నిందలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గంజాయిని పట్టుకుంటే ఎల్లో మీడియా స్వాగతించకుండా ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత భారీగా గంజాయిని పట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా వైఎస్సార్సీపీ వ్యతిరేక శక్తులకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► దేశవ్యాప్తంగా 2021లో పట్టుబడ్డ 7,49,761 కిలోల గంజాయిలో ఏపీలో దొరికింది 2,00,588 కిలోలు. రెండో స్థానంలో ఉన్న ఒడిశాలో 1,71,713 కిలో లు లభ్యమైంది. నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో సగం వరకూ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడిందన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదికలో ఇటీవల ఈమేరకు సమాచారం ఇచ్చింది. ► గంజాయి భారీ విస్తీర్ణంలో సాగయ్యే కేరళ, తమిళనాడులో ఏడెనిమిదేళ్ల క్రితం ప్రతికూల పరిస్థితులతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు విస్తరించింది. 2015–19 మధ్య టీడీపీ సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల గంజాయి విచ్చలవిడిగా సాగైంది. విశాఖ ఏజెన్సీ, పక్కనే ఉన్న ఒడిశా అటవీ, పర్వత ప్రాంతాలు దశాబ్దాలుగా గంజాయి సాగుకు ఆలవాలంగా మారాయి. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా, 2021లో భారీ మొత్తాల్లో గంజాయి లభ్యమైంది. సరైన దారులు లేకపోవడం, అమాయకులైన గిరిజనులను స్మగ్లర్లు మోసగించడం లాంటి పరిస్థితులను అధిగమించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. ఎన్సీబీ వార్షిక నివేదిక 2021లో రెండు పాయింట్లను పట్టుకుని టీడీపీ అనుకూల ప్రచారసాధనాలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు విశ్వసించరు. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణమే సర్కారు పనితీరుకు గీటురాయి. -
‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!
రాయ్పుర్: ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరాలను అడ్డుకునేందుకు ఆల్కహాల్కు బదులుగా గంజాయి తాగాలని ఉచిత సలహా ఇచ్చారు. లిక్కర్ వల్లే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గంజాయితో అలాంటి నేరాలు జరగవని జోస్యం చెప్పారు. గౌరేలా పెంద్రా మర్వాహి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు క్రిష్ణమూర్తి. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించాను. ఆల్కహాల్ కారణంగా అత్యాచారం, హత్య, గొడవలు జరుగుతున్నాయని చెప్పాను. కానీ, ఎవరైనా భంగ్, గంజాయి తాగిన వారు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అని అసెంబ్లీలోనే అడిగాను. వ్యసనాల అవసరాలను తీర్చేందుకు, లిక్కర్ నిషేధించేందుకు ఓ కమిటీని వేశారు. ప్రజలను భంగ్, గంజాయి వైపు ఎలా మళ్లించాలని ఆ కమిటీ ఆలోచించాలి. మత్తు కావాలనుకున్న వారికి అలాంటివే అందించాలి.’ అని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్. మత్తు పదార్థాలను ఓ ప్రజాప్రతినిధి ఎలా ప్రమోట్ చేస్తారు? అని ప్రశ్నించింది. మరోవైపు.. ఈ విషయంపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ను అడగగా.. మత్తు ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని తెలిపారు. దేశంలో గంజాయి విక్రయాలను చట్టబద్ధం చేయాలనుకుంటే ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఇదీ చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక -
స్కెచ్ వేశారు... పట్టుకున్నారు
పెందుర్తి: గంజాయి రవాణాపై వరుసగా ‘సెబ్’ దాడులు కొనసాగుతున్నాయి. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయిని సినీ ఫక్కీలో అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి సెబ్ పోలీస్ స్టేషన్లో అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా, రాజస్థాన్కు చెందిన రామ్ హోతాంగి, అనిషా సాబర్, ఆయూబ్ఖాన్, మరోవ్యక్తి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి సుజాతనగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిలో రామ్ హోతాంగి ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో సుజాతనగర్ తీసుకొస్తుంటారు. అక్కడి నుంచి వీరంతా వేర్వేరుగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్పై గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీపీ శ్రీకాంత్, సెబ్ అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ టీం సహకారంతో పెందుర్తి సెబ్ అధికారులు సుజాతనగర్ ఆర్చ్ వద్ద కాసు కాశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అనిషా చిక్కింది. బైక్లో ఉన్న 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితురాలిని విచారించారు. ఆమె చెప్పిన వివరాల మేరకు సుజాతనగర్లోని ఓ ఇంటిపై దాడి చేయగా అక్కడ నిల్వ ఉన్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. అదే సమయంలో సుజాతనగర్ వీధి చివర నిలిపిన కారులో ఉన్న 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిబ్బంది వస్తున్నారన్న సమాచారంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. నిందితుల్లో అనిషా సాబర్ను అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న సెబ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, పెందుర్తి సీఐ సరోజదేవి, టాస్క్ఫోర్స్ సీఐ అప్పలరాజు, ఇంటెలిజెన్స్ టీం సిబ్బందిని నగర సీపీ శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్వర్క్లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్పేటలోని ఓ ల్యాండ్మార్క్ను పికప్గా.. వారుండే లొకేషన్ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
ఏసీ కోచ్లో గంజాయి సరఫరా
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ బ్యాగ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని, ఏసీ కోచ్లో హైదరాబాద్ మీదుగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళుతున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్ హష్ ఆయిల్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన విజయ్ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ట్రావెల్ బ్యాగ్లలో సర్ది కిరాయి ఏజెంట్ల ద్వారా ఢిల్లీకి రైలులో అక్రమంగా రవాణా చేసేవాడు. ఈ దందాలో అతడికి ఢిల్లీకి చెంది న గంజాయి పెడ్లర్ ఇమ్రాన్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ నుంచి ఆర్డర్ అందుకున్న విజయ్.. 52 కిలోల గంజాయి, 25 బాటిళ్ల హష్ ఆయిల్ (ఒక్కోటి 40 మిల్లీ గ్రాములు) చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని ట్రావెల్ బ్యాగ్లలో సర్ది, ఇమ్రాన్కు సమాచారం అందించాడు. దీంతో సరుకు తీసుకొచ్చేందుకు ఉత్తర్ప్రదేశ్ ముహిద్దీన్పూర్కు చెందిన ఫయ్యూ మ్, జునైద్, సరిఖ్, మొహమ్మద్ నజీమ్ అనే కిరాయి ఏజెంట్లను ఇమ్రాన్ సంప్రదించాడు. ఈ నెల 3న ఢిల్లీలో రైలెక్కిన వీరు 5న వైజాగ్లో దిగి స్థానిక లాడ్జిలో బస చేశారు. విజయ్ నుంచి సరుకు తీసుకొని అదే రోజు రాత్రి దువ్వాడ రైల్వే స్టేషన్లో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలియడంతో మౌలాలీ రైల్వే స్టేషన్లో దిగారు. రాత్రి వరకూ స్టేషన్ ఆవరణలో గడిపారు. రాత్రి 11 గంటల తర్వాత సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి దక్షిణ్ ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నారు. రైలు ఎక్కేందుకు మౌలాలీ నుంచి బస్లో సికింద్రాబాద్ వెళుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు జెడ్టీఎస్ క్రాస్రోడ్స్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరంతర నిఘాతో అడ్డుకట్ట : సీపీ రాష్ట్రంలో డ్రగ్స్పై నిఘా పెరగడంతో సరఫరా తగ్గింది. ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు, అరెస్ట్లు చేస్తుండటంతో సరఫరాదారుల్లో వణుకు పుట్టింది. గంజాయి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. (చదవండి: ఫంక్షన్.. ఉండదిక టెన్షన్) -
గంజాయి దందాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను శాసిస్తున్న స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిద్ధమైంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కోసం జాయింట్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తోంది. 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఏవోబీలో గంజాయి దందాను శాసిస్తున్న 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెబ్ గుర్తించింది. వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారు. ఎంపిక చేసిన గిరిజనుల ద్వారా గంజాయి సాగు చేయించి, పంట వచ్చిన తరువాత ఎండబెట్టించి, వారే కొనుగోలు చేసి ఏడాది పొడుగునా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అడపాదడపా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాయి గానీ, ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన స్మగ్లర్లపై గురి పెట్టలేదు. మొదటిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఆట కట్టిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్న రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సెబ్ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. పరస్పర సహకారంతో ఇప్పటికే 50 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లని సెబ్ అరెస్టు చేసింది. రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలకు వెళ్లి 30 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ పోలీసులు 15 మందిని మన రాష్ట్రానికి అప్పగించారు. కేరళ ఇద్దరిని, కర్ణాటక ఇద్దరిని, తమిళనాడు ఒకరిని అప్పగించాయి. మిగిలిన స్మగ్లర్లను కూడా అరెస్టు చేసేందుకు సెబ్ రెండంచెల్లో ‘జాయింట్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తోంది. డీజీపీ చైర్మన్గా ఉండే నోడల్ ఏజెన్సీలో సెబ్ కమిషనర్, డీఐజీలు సభ్యులుగా ఉంటారు. సెబ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కార్యనిర్వాహక టాస్క్ ఫోర్స్లో ఎంపిక చేసిన జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు సభ్యులుగా ఉంటారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్షలు విధించేలా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం నుంచి అప్పగించింది 20 మందిని కాగా మన రాష్ట్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు ఇతర రాష్ట్రాల్లో అక్రమ మద్యం, ఇతర దందాలకు పాల్పడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చిన జాబితా మేరకు సెబ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని వివిధ రాష్ట్రాలకు అప్పగించారు. -
మీ ఇంట్లో పడుకుంటానంటూ మహిళలకు బెదిరింపు
తాడేపల్లి: మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ వర్క్షాప్ వెనుక ప్రాంతంలో గంజాయి తాగే యువకులు ఆగడాలు చేస్తూ స్థానికంగా ఉండే మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా వారిని ప్రశ్నిస్తే చేపల వేటకు వెళుతున్నాం మీకెందుకు అంటూ వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు ఫుల్గా గంజాయి తాగి బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న ఓ ఇంటి తలుపు కొట్టగా ఓ మహిళ తలుపు తీసింది. సదరు యువకుడు మీ ఇంట్లో పడుకుంటాను. నన్ను లోపలికి రానీయండి అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మహిళ సదరు యువకుడ్ని బయటకు తోసి తలుపులు వేసి భర్తకు, పక్కింటి వారికి ఫోన్ చేసింది. వేరే చోట ఉన్న భర్త హడావుడిగా ఇంటికి వచ్చేసరికి గంజాయి మత్తులో ఉన్న యువకుడు ఇంటిముందు నానా రచ్చ చేస్తున్నాడు. పక్కనే నివసించేవారు వచ్చేటప్పటికి తలుపు తీయాలంటూ గట్టిగట్టిగా కొట్టడంతో వారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసి పడుకోనివ్వరా అంటూ నానా యాగీ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు వందలాది మంది యువకులు చేపలవేట పేరుతో బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున కూర్చుని మద్యం, గంజాయి తాగి అక్కడకు వచ్చే మహిళలను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్న వారిని స్థానికులు ఆపి ప్రశ్నించారు. మాది ప్రకాష్నగర్, మేము ఇటు వస్తాం ఏం చేస్తారో చేసుకోండి అంటూ బూతులు తిట్టడంతో ఆ ప్రాంత మహిళలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క మత్స్యకారుడిని తప్ప ఎవరినీ అనుమతించమంటూ మహిళలకు హామీ ఇచ్చారు. -
Operation Parivartan: గంజాయి కట్టడికి దేశంలోనే భారీ ఆపరేషన్
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) వేళ్లూనుకున్న గంజాయి దందాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ అప్రతిహతంగా సాగుతోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్తో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ‘ఆపరేషన్ పరివర్తన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రచారం చేపట్టినా గిరిజనుల సహకారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) మన్యంలో ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా 10 మంది సభ్యులతో 30 బృందాలను ప్రభుత్వం నియమించింది. చదవండి: విశాఖ నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు మావోయిస్టుల బెదిరింపులు బేఖాతర్ మావోయిస్టుల సహకారంతోనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డ్రోన్ కెమెరాల సహకారంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తోంది. గిరిజనులను భయపెట్టేందుకు మావోయిస్టులు ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోస్టర్లు అతికించారు. ‘పోలీసు వాహనాల్లో ప్రయాణించవద్దు.. గంజాయి మొక్కల నరికివేతకు సహకరించవద్దు.. ప్రత్యామ్నాయం చూపకుండా గంజాయి సాగును నిర్మూలించడం హేయమైన చర్య’ అని పేర్కొంటూ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరుతో పోస్టర్లు అతికించారు. అయితే ‘సెబ్’ బృందాలు ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. గిరిజనులు కూడా పూర్తిస్థాయిలో దీనికి సహకరిస్తున్నారు. మన్యంలోకి ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తరువాతే ‘సెబ్’ ఈ ఆపరేషన్ను పకడ్బందీగా చేపట్టింది. తొలుత ప్రత్యేక నిఘా బృందాల ద్వారా క్షేత్రస్థాయి నివేదిక సేకరించింది. అనంతరం డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాలను గుర్తించి రంగంలోకి దిగింది. మూడు బేస్ క్యాంప్ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక బృందాలు మన్యంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుని ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిత్యం సగటున ఆరేడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహిస్తూ సగటున 150 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. అతిపెద్ద ఆపరేషన్ అక్టోబరు 30న ప్రారంభించిన ఆపరేషన్ పరివర్తన్లో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5,600 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం విశేషం. దీంతో పాటు అక్రమంగా రవాణా చేస్తున్న 18,600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 113 వాహనాలను జప్తు చేసి, 217 కేసులు నమోదు చేశారు. దాదాపు 2.15 కోట్ల గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీటి విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ దేశంలో అతి పెద్దది. 29 రోజుల్లోనే పెద్ద ఎత్తున గంజాయిని ధ్వంసం చేయడంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏవోబీతోపాటు దండకారణ్యం విస్తరించిన ఒడిశా, చత్తీస్ఘడ్, జార్ఖండ్లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సాగవుతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత విస్తృతస్థాయిలో ఆపరేషన్ చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పేర్కొనడం గమనార్హం. ఆపరేషన్ పరివర్తన్పై ఎన్సీబీ ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. -
గంజాయి అక్రమ రవాణాకు హాట్స్పాట్స్గా మారుతున్న రైళ్లు
-
AP: గంజాయికి చెక్.. ముమ్మరంగా ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి/పాడేరు/గూడెంకొత్తవీధి/చింతపల్లి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ‘ఆపరేషన్ పరివర్తన్’ను ముమ్మరం చేసింది. దీన్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అయిదు రోజుల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించింది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టపరిచారు. మొత్తం 283 కేసులు నమోదు చేసి 763 మందిని అరెస్టు చేశారు. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 179 వాహనాలను జప్తుచేశారు. 260 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్కుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్శాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఏడు బృందాలుగా పాడేరులో మకాం వేశాయి. జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఆదివారం 260 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అనకాపల్లి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాల్లో సుమారు 2 లక్షల గంజాయి మొక్కల్ని వేర్లతోసహా పీకేసి నిప్పంటించారు. గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనాపల్లి పంచాయతీల పరిధిలో సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాలవీధి, అసరాడ, కాకరపాడు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో, చింతపల్లి మండలంలోని టేకులవీధి, గడపరాయిలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. సీఐ అశోక్కుమార్, ఎస్ఐలు మహ్మద్ ఆలీషరీఫ్, షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఎస్ఈబీ అధికారులు త్రినా«థ్, మణికంఠ, డీవీజీ రాజు తదితరులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు విద్యార్థులతో 2కే రన్ ఏజెన్సీలోని గంజాయి సాగు, అక్రమ రవాణా నిర్మూలనలో గిరిజన యువత భాగస్వాములవ్వాలని పాడేరు ఏఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘నో టు గంజా’, పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా పాడేరులో గిరిజన విద్యార్థులతో 2కే రన్ నిర్వహించారు. చలిగాలులు ఉన్నప్పటికీ 500 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఏఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గంజాయి సాగు ద్వారా విశాఖ ఏజెన్సీకి చెడ్డపేరు వస్తోందన్నారు. గిరిజనులంతా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు యువతను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. గిరి జన యువత జైలు జీవితం గడుపుతూ భవి ష్యత్తును నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
గంజాయి వాడకంపై ఎక్సైజ్ శాఖ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్కు బానిసవడం లోనూ దశలుంటాయట. యువత మొబైల్ ఫోన్ల వాల్ పేపర్స్ను బట్టి వాళ్లు డ్రగ్స్కు బానిసలనే విషయాన్ని గుర్తించవచ్చట. వారు ఉపయోగించే కోడ్ భాషల ద్వారా వారు ఏ డ్రగ్ వాడుతున్నారో కూడా చెప్పొచ్చట. రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పరిశీలనలో వెల్లడైన ఈ అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలన్న సరదా యువత భవిష్యత్తును బలితీసుకుంటోంది. అప్పటికే ఆ అలవాటున్న స్నేహితుల ఒత్తిడీ ఇందుకు కారణం అవుతోంది. సరదా కాస్తా అలవాటుగా ఆ తర్వాత సీరియస్గా మారుతోంది. డ్రగ్స్ తీసుకోనిదే ఉండలేని పరిస్థితిలోకి తీసుకువెళుతుంది. స్నేహితుల బర్త్డే పార్టీలు, వారాంతపు రోజుల్లో జరిగే సరదా పార్టీలు గంజాయి తాగుడుకు వేదికలుగా మారుతున్నాయ ని ఎక్సైజ్ శాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ఆల్కహాల్ తాగితే వచ్చే వాసన తల్లిదండ్రులు సులభంగా గుర్తుపడతారని, అదే గంజాయి అయితే ఎలాంటి వాసన ఉండదన్న భావనతో అందుకు అలవాటుపడుతున్నారు. మిగతా డ్రగ్స్తో పోలిస్తే తక్కువ రేటుకు లభించడం, ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదనే ఒక అపోహతో చాలామంది గంజాయి తాగుతున్నారని ఎక్సైజ్ అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. నిర్బంధ విద్య బాధితులే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు, బీబీఏ, ఎంబీఏ కాలేజీలు, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, టెక్నో స్కూళ్లు, ఐఐటీ ఫౌండేషన్స్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో నిర్బంధ విద్యకు గురైన వాళ్లు గంజాయికి అలవాటు పడుతున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. అప్పటివరకు నాలుగు గోడల మధ్య బందీలు మాదిరి ఉన్న విద్యార్థులు పై చదువుల సమయంలో స్వేచ్ఛా భావనకు గురి కావడంతో పాటు కొత్త స్నేహాలతో దురలవాట్లను చేసుకుంటున్నట్టు ఎక్సైజ్ నివేదిక పేర్కొంటోంది. బ్యాగ్లాగ్ పరీక్షలుండటం, ప్రేమ విఫలమవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో పనిఒత్తిడి, కాల్ సెంటర్ ఉద్యోగుల్లో రాత్రి షిఫ్టులు, వారాంతపు పార్టీల కల్చర్కు బాగా అలవాటు పడిన వారు డ్రగ్స్ తీసుకుంటున్న జాబితాలో మెజారిటీగా ఉంటున్నారని తమ ప్రాథమిక అంచనాల్లో వెల్లడైనట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కుటుంబాలతో కాకుండా స్నేహితులతో కలిసి గోవా, అరకు, మనాలి ట్రిప్స్కు వెళ్లిన వారిలోనూ ఇలాంటి పోకడలు బయటపడ్డాయని తెలిపింది. విదేశీ, ఉత్తర భారతదేశ విద్యార్థులతో స్నేహం, వారి ప్రభావంతోనూ డ్రగ్స్కు అలవాటు పడుతున్నట్టు గుర్తించింది. మ్యూజిక్ మూడ్లో ఎల్ఎస్డీ స్నేహితులతో తొలుత గంజాయితో మొదలై తదుపరి దశలో ఎల్ఎస్డీగా పిలిచే లిసర్జిక్ ఆసిడ్ డై ఇథలమైడ్ తాగే వరకు వెళ్తోందని ఎక్సైజ్ అనేక కేసుల దర్యాప్తులో గుర్తించింది. గంజాయి తర్వాత సంగీతాన్ని, సైకడెలిక్/ట్రాన్స్ మ్యూజిక్ (ఓ విధమైన మానసిక భ్రాంతికి గురిచేసే మ్యూజిక్) ఎంజాయ్ చేయడానికి ఎల్ఎస్డీ స్టాంప్స్ (నాలుక మీద పెట్టుకునే చిన్న పట్టీ లాంటిది), బ్లాట్స్ (పీల్చే ద్రవం)ను వాడుతున్నట్టు తేలింది. దాదాపు 12 నుంచి 14 గంటల వరకు ఈ డ్రగ్స్ ప్రభావం ఉంటుందని, ప్రమాదరకరమైన ఈ డ్రగ్ గోవాలో జరిగే మ్యూజిక్ పార్టీల్లో యువత భారీగా తీసుకుంటున్నట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గంజాయి తీసుకునే స్నేహితుల కలిసిన సమయంలో నెక్ట్స్ లెవల్ డ్రగ్స్ (తదుపరి దశ మాదకద్రవ్యాలు) పేరిట జరిగే చర్చలో భాగంగా ఎల్ఎస్డీలు వాడుతున్నారని, డార్క్నెట్ ద్వారా ఇవి సులభంగా మార్కెట్లో దొరుకుతుండటంతో వాటి బారిన పడుతున్నారని చెబుతున్నారు. కోడ్ పదాలుంటే అనుమానించాల్సిందే.. తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ తదితర యాప్స్ను చెక్ చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విజ్ఞప్తి చేస్తోంది. వాటిలో ఏవైనా కోడ్ పదాలు ఉన్నట్టయితే డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అనుమానించాలని చెబుతోంది. వీడ్, స్కోర్, స్టఫ్, స్టాంప్, ఆసిడ్, పేపర్, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్, స్టాష్, మాల్, ఖాష్, స్టోనర్, పెడ్లర్, డమ్, పాట్, క్రిస్టల్, బూమ్, డీపీ (దూల్పేట్) అనే కోడ్ పదాలుంటే వీళ్లు డ్రగ్స్ వాడుతున్నట్టేనని భావించాలని సూచించారు. స్క్రీన్సేవర్లు, వాల్ పేపర్లను బట్టీ చెప్పొచ్చు డ్రగ్స్కు బానిసలైన వారి మొబైల్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్ట్యాపులు, వ్యక్తిగత డెస్క్టాప్లను గమనించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. వారి మొబైల్ లేదా కంప్యూటర్లలోని స్క్రీన్ సేవర్, వాల్ పేపర్లలో సైకోడెలిక్ చిత్రాలు, పొగతో కూడిన బొమ్మలు, మల్టీకలర్ ఇమేజులుంటే వారిని నిశితంగా గమనించాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులు బ్యాగ్ల్లో గనుక ఐ డ్రాప్స్, లైటర్స్, ఓసీబీ పేపర్స్ గనుక గమనిస్తే వారు గంజాయి సేవిస్తున్నట్టుగా భావించాలని స్పష్టంచేశారు. మరింత మత్తు కోసం కొకైన్ మద్యం తీసుకున్న తర్వాత మరింత కిక్ రావాలని యువత కొకైన్కు బానిసవుతున్నట్టు ఎక్సైజ్ అధ్యయనంలో తేలింది. 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కు లు మరింత కిక్ కోసం కొకైన్ను స్వీకరిస్తున్నారని, ఒత్తిడిని ఎదుర్కోలేక దీని వైపు మళ్లి మత్తులో మునిగి తేలుతున్నారని అధికారులు తెలిపారు. గంట వరకు ప్రభావం చూపించే కొకైన్ను కుంగిపోయిన పరిస్థితుల నుంచి వెంటనే తేరుకోవడానికి ఉపయోగిస్తుంటారని, వ్యాపారంలో నష్టపోయినవారు, కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్న వారు పార్కింగ్ ఏరియాల్లో కార్లలో దీనిని వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. తల్లిదండ్రుల సహకారం కీలకం మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే యువత తల్లిదండ్రుల సహకారం లభిస్తే మరింత సులభంగా, కఠినంగా డ్రగ్స్ సరఫరాను, వినియోగాన్ని అణిచివేయవచ్చు. అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఒక్కసారి పరిశీలించండి. ఇందులోని అంశాలను బట్టి మీ పిల్లల్ని గమనించండి. మీ నియంత్రణే వారికి శ్రీరామరక్ష. మరీ విపరీత దశలో ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. సంబంధిత డ్రగ్స్ సరఫరాదారులపై చర్యలు తీసుకునేందుకు, యువతను కాపాడుకునేందుకు ఇది దోహదపడుతుంది. – అంజిరెడ్డి, సూపరింటెండెంట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ -
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారీ ఎత్తున గంజాయిని నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలానికి నర్సీపట్నం నుంచి పోలీసు బలగాలను తరలించారు. -
ఏం ఐడియారా సామీ.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది
బెంగళూరు: ఎంబీఏ చదివాడు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.. నెమ్మదిగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. లాక్డౌన్ కాలంలో అవి సులువుగా లభించకపోవడంతో.. తనే వాటిని తయారు చేయాలనుకున్నాడు. ఇంటినే పెరడుగా మార్చి.. హైటెక్ పద్దతిలో ఇంట్లోనే గంజాయి పండించడం ప్రారంభించాడు. తనలానే ఇబ్బందిపడుతున్న మత్తుబాబులకు దాన్ని సరఫరా చేస్తూ.. భారీగా ఆర్జించాడు. ఏడాది కాలం నుంచి గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కాస్త పోలీసులకు తెలిసిపోయింది. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ హైటెక్ గంజాయి సాగు బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్ణాటకకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెంగళూరు కళ్యాణ్ నగర్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి ప్రాంతంలో నివసించేవాడు. ఈ క్రమంలో అతడు ఆధ్యాత్మికంవైపు మళ్లి.. గంజాయికి అలవాటు పడ్డాడు. గత మూడు సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తను తీసుకోవడమే కాక స్నేహితులను కూడా డ్రగ్స్కు అలవాటుపడేలా చేశాడు. (చదవండి: లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!) లాక్డౌన్ ఎఫెక్ట్.. ఇలా సాగిపోతున్న సమయంలో గతేడాది బెంగళూరులో భారీ ఎత్తున మత్తుపదార్థాలు వెలుగు చూడటంతో భయపడిన జావేద్.. కమ్మనహళ్లి ప్రాంతం నుంచి బిదాదికి మకాం మార్చాడు. ఆ ప్రాంతంలోని ఓ విల్లాలో మకాం పెట్టాడు. దాని రెంటే ఏకంగా 35 వేల రూపాయలు. ఇలా ఉండగా లాక్డౌన్ విధించడంతో డ్రగ్స్ లభించడం కష్టంగా మారింది. వాటికి బానిసైన జావేద్.. మత్తుపదార్థాలు లభించకపోవడంతో పిచ్చివాడిగా మారాడు. ఇంట్లోనే గంజాయి పెంపకం... ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం తన ఇంట్లోనే గంజాయి పెంచాలని భావించాడు. ఇందుకు గాను ఎల్ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్ని సెటప్ చేశాడు. అనంతరం డార్క్ వెబ్ నుంచి గింజలను ఆర్డర్ చేశాడు. యూరోప్ నుంచి వాటిని పొందాడు. ప్రారంభంలో తన ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్లో ఓ విత్తనాన్ని నాటాడు. అది విజయవంతంగా పెరగడంతో.. మరిన్ని గింజలను నాటాడు. (చదవండి: వెబ్ సిరీస్ స్ఫూర్తి.. ఈ జంటది మామూలు తెలివి కాదు!) గ్రాము ధర రూ.3-4 వేలు ఇలా ఇప్పటి వరకు 130 మొక్కలను పెంచాడు. వాటి పెంపకం కోసం చాలా అధునాతనమైన పద్దతిని సెట్ చేశాడు. వాటిని మత్తుపదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఈ హైడ్రో గంజాయిని వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఒక్క గ్రాము గంజాయిని 3-4 వేల రూపాయలకు విక్రయించడం ప్రారంభించాడు. ఎలా దొరికాడంటే.. రెండు రోజుల క్రితం క్రైం బ్రాంచ్ పోలీసులు డీజే హళ్లి ప్రాంతంలో మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జావేద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు చెప్పిన అడ్రెస్ ప్రకారం పోలీసులు జావేద్ విల్లాలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న హైటెక్ ఏర్పాట్లును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు డ్రగ్ పెడ్లర్స్ని.. ఇద్దరు ఇరానియన్లను అరెస్ట్ చేశారు. చదవండి: 8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..? -
రూ. 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
చుంచుపల్లి: ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి పుణేకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్చేశారు. వారి నుంచి రూ. 1.25కోట్ల 626 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చుంచుపల్లి సీఐ గురుస్వామి చెప్పారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్యాం శివాజీ ఖలే, ప్రభాకర్ తంబే, అరవింద్ గులేతో పాటు కున్లు ఒడిశా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని 26 బస్తాల్లో పేర్చి లారీలో కొబ్బరి మొక్కల మధ్యలో పెట్టి భద్రాచలం, కొత్తగూడెం మీదుగా తరలిస్తుండగా చుంచుపల్లి విద్యానగర్ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై మహేష్ పట్టుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా, కున్లు పరారయ్యాడు. -
రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్ రింగ్రోడ్డు టోల్ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్చేశారు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి ట్రక్కును పట్టుకున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్ కాంబ్లే, ఎన్.జోగ్దండ్ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్వర్క్లను ఎన్సీబీ ఛేదించింది. గత ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది. -
లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!
సాక్షి,డోర్నకల్: ఇందులో ఏముంది? ట్రాక్టర్ నుంచి లోడ్ దించుతున్నారంతే అనుకుంటున్నారా? సరిగ్గా చూస్తే.. ట్రాలీ కింద ప్రత్యేకంగా అమర్చిన అరలో బాక్స్లున్నాయి కదా.. అవన్నీ 3 క్వింటాళ్ల గంజాయి నింపిన పెట్టెలు. ఒక్కో దానిలో 2 కిలోలు ప్యాక్చేసి ఇలా 150 బాక్స్లను తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అమ్మపాలెం క్రాస్రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నారు. మరిపెడ మండలం తండాధర్మారానికి చెందిన బానోత్ కిరణ్కుమార్, కొత్తగూడెం జిల్లా కోయగూడెంకు చెందిన ఆర్ఎంపీ బాదావత్ సూర్య ఏపీలోని చింతూరులో గంజాయి కొని తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. కిలో రూ.3 వేలకు కొని మహారాష్ట్రలో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించి 31 మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, 6 కిలోల గంజాయి, రెండు కార్లు, 7 ల్యాప్టాప్లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, పది బెట్టింగ్ అకౌంట్ పుస్తకాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు వినాయక నగర్కు చెందిన షేక్ షాహీద్ అక్రమ్, ఖాజామొహిద్దీన్ అలియాస్ కల్తీ, భూమిరెడ్డి సురేష్ రెడ్డి, మునగా రామాంజనేయులు అలియాస్ రాము మరికొంతమంది కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం అరెస్టైన వారు, పరారీలో ఉన్న ప్రధాన బుకీలు కలిసి సుమారు రూ.34.78 కోట్ల మేర బెట్టింగ్లు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను సేకరించి ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు నివేదిస్తామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్రావును, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
కొడుకు పేరిట కొరియర్: తండ్రికి షాక్!
బెంగళూరు : కుమారుడి పేరిట వచ్చిన కొరియర్ బాక్స్లో ఉన్నది గంజాయని తెలిసి షాక్ తిన్నాడో తండ్రి. పిల్లాడి జీవితం పాడవకూడదన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించి, గంజాయి పంపిన వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు, సదాశివనగర్కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పిల్లాడి పేరిట ఓ కొరియర్ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరిచి చూశాడు. దాంట్లో గోధుమ రంగులో ఉన్న పొడి కనిపించింది. అనుమానం వచ్చిన ఆ వ్యాపార వేత్త వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. అనంతరం సదరు స్నేహితుడికి ఆ పొడిని ఫొటో తీసి వాట్సాప్లో పంపాడు. ( కన్నింగ్ కపుల్: పూజారులే టార్గెట్ ) ఆ వ్యక్తి దాన్ని గంజాయి పొడిగా గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ పార్శిల్ ఎమ్జీ రోడ్నుంచి వచ్చిందని గుర్తించారు. ఆ వ్యాపార వేత్త కొరియర్ ఆఫీసుకు వెళ్లి కొరియర్ పంపిన వ్యక్తి వివరాలు అడగగా వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 21న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పార్శిల్ పంపిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
చదువుతూనే గంజాయి దందా..
సాక్షి, పెద్దపల్లి : ఓ యువకుడు డిప్లొమా ఫైనల్ ఇయర్.. మరొకరు ఇంటర్.. ఇంకొకరు ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలో చేరాడు. ఈ ముగ్గురు కలిసి గంజాయి దందా చేస్తూ గురువారం పెద్దపల్లి పోలీసులకు చిక్కారు. గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి చేస్తున్న దందా చూసి పోలీస్ అధికారులు నివ్వెరపోయారు. డీసీపీ సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోండం ప్రదీప్రెడ్డి(19), బత్తుల శివకుమార్(19), మరో మైనర్.. ముగ్గురు కలిసి కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసి తోటి స్నేహితులకు విక్రయిస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన పెద్దపల్లి ఎస్సై ఉపేందర్రావు పెద్దకల్వల స్టేజీ వద్ద ముగ్గురు యువకులను సోదా చేయగా మూడు పాలిథిన్ కవర్లలో 750గ్రా. గంజాయి లభించింది. ముగ్గురు విద్యార్థులే కావడంతో ఎవరికీ అనుమానం కలగలేదని, కొంతకాలంగా వారు చేస్తున్న దందా పోలీసుల దృష్టికి రావడంతో నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ ముగ్గురి నుంచి గంజాయి కొనుగోళ్లు చేసినవారితో పాటు వ్యాపారానికి సంబంధాలు ఉన్నవారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ నరేందర్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులే.. కళాశాలలకు వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులు గమనించకపోతే చేజారిపోయే ప్రమాదముందని డీసీపీ సుదర్శన్గౌడ్ హెచ్చరించారు. పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారని, దీంతో వారి జీవితం పూర్తిగా దుర్భరమవుతుందన్నారు. సకాలంలో ఇంటికి వస్తున్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు. సింగరేణి కోల్బెల్టు ప్రాంతంలో ఇలాంటి దారి తప్పిన పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆందోళన చెందారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన వారికి కోర్టు 20ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మకం వ్యాపారంలో పోలీసులకు చిక్కినవారిపై పిడీయాక్టు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులే పిల్లలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
గంజాయి పోయిందా? మా వద్దే ఉంది : పోలీసులు
‘ఎవరిదైనా భారీ మొత్తంలో (590 కేజీల) గంజాయి పోయిందా? అయితే బాధపడకండి.. అది గత రాత్రి ట్రక్కుతో సహా మాకే దొరికింది. మీదైతే మాత్రం ధుబ్రి పోలీసులకు టచ్లో ఉండండి. వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అని అస్సాం పోలీసులు చేసిన ఓ ఫన్నీ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. పోలీసుల చెక్పాయింట్ చూసి ట్రక్కుతో సహా వదిలి జారుకున్న గంజాయి స్మగ్లర్లు పట్ల అస్సాం పోలీసులు చేసిన ఈ వ్యంగ్యం నవ్వులు పూయిస్తోంది. పోలీసులు ట్వీట్ చేసిన ఫొటోలో గంజాయి ప్యాక్ చేసిన 50 కాటన్లున్నాయి. దుండగులు చగోలియా చెక్పాయింట్లో ఈ బాక్సులను ట్రక్కుతో వదిలివెళ్లారు. గత కొంతకాలంగా ఆయా రాష్ట్రాల పోలీసులు ప్రజలకు వారి సేవలను మరింత చేరువయ్యేందకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ కేసులను చేధించడంలో.. ట్రాఫికి నిబంధనలు తెలపడం కోసం వినూత్న ట్వీట్స్తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. Anyone lost a huge (590 kgs) amount of Cannabis/Ganja and a truck in and around Chagolia Checkpoint last night? Don't panic, we found it. Please get in touch with @Dhubri_Police. They will help you out, for sure ;) Great job Team Dhubri. pic.twitter.com/fNoMjbGSKX — Assam Police (@assampolice) June 4, 2019 -
రూ.50 లక్షల గంజాయి పట్టివేత
పటాన్చెరుటౌన్: అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పటాన్చెరులోని ఎక్సైజ్ కార్యాలయంలో మెదక్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్య, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ గాయత్రి విలేకర్లకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి జహీరాబాద్కు చెందిన వీరుశెట్టి, కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కికి చెందిన పుత్రాజ్ నీలారామ్ మెట్రాజ్ రెండు వాహనాల్లో గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలించేందుకు తీసుకొస్తున్నారని పోలీసులకు సమాచా రం అందింది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించి రెండు కార్లలో తరలిస్తున్న సుమారు రూ.50 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయిని, ఆ కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుకున్న వారు కేవలం డ్రైవర్ లే అని, ప్రధాన నిందితులు జహీరాబాద్ నియో జకవర్గం ఝరాసంగం చెర్లపల్లి తండాకు చెందిన బన్సీలాల్, కర్ణాటక బల్కికి చెందిన సహదేవ్, రవూఫ్ఖాన్ అని వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పా రు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు, ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు -
గ‘మ్మత్తు’గా గంజాయి దందా
డ్రగ్స్ : తూప్రాన్ పట్టణానికి బతుకుదెరువు కోసం ఓ కుటుంబం పది సంవత్సరాల క్రితం వచ్చింది. వీరికి ఏకైక కుమారుడు. మంచి ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. అయితే కుమారుడు స్థానికంగా ఉన్న తన స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో చేడు వ్యసనాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తూప్రాన్లో యువకుల అడ్డాలు... పట్టణంలోని గోల్డెన్పార్కు, నర్సాపూర్ చౌరస్తాలోని హోటల్, పట్టణ సమీపంలోని పెద్ద చెరువుకట్ట, పట్టణ సమీపంలో నూతనంగా వెలసిన వెం చర్లు, బ్యాచ్లర్స్ నివాసం ఉంటున్న అద్దెగదుల ను వాడుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయి ని సిగరేట్లలో కలిపి తాగుతున్నారు. బాంకు, ఓసీ బీ అనే పేపరులో గంజాయిని నింపి సిగరేటుగా తయారు చేసుకొని తాగుతున్నట్లు సమాచారం. పల్లెలపై దృష్టి సారించిన అక్రమార్కులు.. హైదరాబాద్లో పోలీసుల నిఘా పెరిగిపోవడంతో గంజాయీ మాఫియా పల్లే ప్రాంతాల్లోని యువతపై దృష్టి సారించినట్లు తెలస్తుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరు యువకులతో పరిచయం పెంచుకుని అమ్మకాలు చేయిస్తోంది. వీరిలో ఎక్కువగా మధ్యతరగతి వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. ప్రకటనలకే పరిమితమైన అవగాహన.. మత్తు పదర్థాల వాడకంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అటువైపుగా ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడం, కళాశాలల్లో పెడదోవ పడుతున్న వారిపై దృష్టి సారించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసం ఎంతైన ఉంది. మత్తుబారిన పడిన వారిలో లక్షణాలు... మత్తుకు అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, శరీరంలోని ఇత ర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం తర్వాత కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. మొదట నాడీవ్యవస్థ, మెదడు, కండరాలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. తర్వాత తమ ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేరు. అధిక శబ్ధాలను వినలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎవరితో సరిగా మాట్లాడరు. డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో అల్సర్ బారినపడతారు. నాసికరంధ్రాలు వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి. సిగరేట్ల రూపంలో పీల్చేవారికి నాలుక రుచిని కోల్పోతుంది. ఊపిరితిత్తుల వ్యవస్థ గోడలు నాశనమై చివరకు మరణానికి దారితీస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. తమ చుట్టూ ఎం జరుగుతుందో కూడా గమనించరు. ఆ సమయంలో వారు ఏం చేస్తారో కూడా వారికి అర్థంకాదు. ఇంట్లోవారు గానీ.. మిత్రులుగానీ గమనిస్తే వీరిలో చాలా తేడాలు కనిపిస్తాయి. వీరికి వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి. గంజాయి మత్తులో.. స్నేహితులతోనో.. సరదాగానో వీటివైపు ఆకర్షితులైన యువకులు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యూత్ను టార్గెట్ చేస్తున్న కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలనుంచి పట్టణానికి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కేంద్రంలో పలువురు యువకులు జల్సాలు, షికార్లు, చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నారు. తెలిసీతెలియని వయసులో నేరాలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో చిక్కుకొని జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పట్టుబడిన పలు దొంగతనాల కేసుల్లో యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆయా కేసుల్లో యువకులను పోలీసులు విచారించే సమయంలో సరదాకోసం, తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడం, ప్రియురాలికి కానుకలు ఇవ్వడంకోసం అంటూ వెల్లడించడం పోలీసులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తూప్రాన్ పట్టణానికి మేడ్చెల్, కొంపల్లి, హైదరాబాద్, చేగుంట, కామారెడ్డి నుంచి కొందరు వ్యక్తులు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్లతో అమ్ముతున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకేట్ను రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. చర్యలు తీసుకుంటాం.. తూప్రాన్లో గంజాయి వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. యువత పట్ల ఎప్పటికప్పుడూ సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెంచాం. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా వారిపై పర్యవేక్షణ ఉండాలి. మంచి స్నేహితులు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గంజాయి విక్రయించడం చట్టరీత్య నేరం. గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – లింగేశ్వర్రావు, సీఐ, తూప్రాన్ దశాదిశాలేని చదువే కారణం... యవత విలువైన దుస్తులు, షూస్ ధరించాలని, ఖరీదైన కార్లలో, బైక్లపై తిరగాలని, విలాసవంతమైన జీవితం గడపాల ని కలలు కంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడడం కంటే... దొడ్డిదారిన వారికి కావాల్సిన వాటి కో సం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో విద్యార్థి ప్రతిభకు మార్కులే కొలమాన ంగా మారాయి. జ్ఞానం నేర్పుతున్నారనేగానీ నైతిక విలువలు, నీతి, నిజాయితీ, మంచి – చెడు, పెద్దలంటే గౌరవం నేర్పించడంలేదు. – మోత్కు రాంచంద్రం, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు -
కొత్త ‘మూర్ఛ మందు’ సక్సెస్!
మూర్ఛరోగ లక్షణాలను గణనీయంగా తగ్గించేందుకు గంజాయి నూనె కానబిడాల్ బాగా ఉపయోగపడుతుందని అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది మూర్ఛ రోగులకు ఈ కానబిడాల్ నూనెను అందివ్వడం మొదలుపెట్టారు. అధ్యయనానికి ముందు కొంత మందికి రెండు వారాల సమయంలో దాదాపు 144 సార్లు మూర్ఛ లక్షణాలు కనిపించేవి. పన్నెండు వారాల తరువాత పరిశీలించినప్పుడు ఈ సంఖ్య 52కు తగ్గిపోయింది. ఆ తరువాత నాలుగేళ్ల వరకూ మూర్ఛ లక్షణాల తీవ్రత తగ్గడమే కాకుండా, లక్షణాలు తక్కువగా కనిపించాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినా బేబిన్ అంటున్నారు. ఈ అధ్యయనం కోసం తాము గ్రీన్విచ్ బయో సైన్సెస్ అనే సంస్థ తయారుచేసిన ఎపిడోలెక్స్ అనే కానబిడాల్ నూనె వాడామని, గంజాయిలో మత్తు కలిగించే రసాయనం టీహెచ్సీ ఇందులో చాలా తక్కువ మోతాదులో ఉంటుందని చెప్పారు. దుష్ప్రభావాలు పెద్దగా లేవని అన్నారు. సాధారణ చికిత్స పద్ధతులకు లొంగని వేర్వేరు వర్గాల రోగులను తాము అధ్యయనంలో చేర్చామని, అందరిలోనూ ఫలితం ఒకేలా ఉండటం గుర్తించాల్సిన విషయమని చెప్పారు. -
ఒమేగా– 3 కొవ్వులతో కేన్సర్కు చెక్!
ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయన్న నమ్మకమున్న ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్లు పనిలో పనిగా కేన్సర్కూ చెక్ పెట్టగలవని అంటున్నారు ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఒమేగా –3 కొవ్వులు జీర్ణమయ్యే క్రమంలో ఎండోకానబినాయిడ్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని గుర్తించినట్లు అదితిదాస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ రసాయనం గంజాయిలో ఉండే కానబినాయిడ్స్ మాదిరిగానే ఉండే ఈ రసాయనం కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకోవడంతోపాటు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. గంజాయి కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము ఎముకల కేన్సర్ ఉన్న ఎలుకలపై పరిశోధనలు చేశామని అన్నారు. జీర్ణమైన ఒమేగా –3 కొవ్వుల కారణంగా వచ్చే రసాయనాలు తగుమోతాదులో ఉంటే, కేన్సర్ కణాలు మరణిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఈ పదార్థాలు కేన్సర్ కణితికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పెరగకుండా అడ్డుకున్నాయని అన్నారు. ఒమేగా–3 కొవ్వులు తరచూ తీసుకోవడం ద్వారా ఈ రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చునని సూచించారు. ఎండోకానబినాయిడ్ రసాయనాలను కృత్రిమ పద్ధతిలో అందించడం ద్వారా కూడా కేన్సర్కు చెక్ పెట్టవచ్చునని వివరించారు. -
అంటుకునే వ్యాధి
డ్రగ్స్... మత్తులో ముంచెత్తుతాయి. భ్రాంతిని కలిగిస్తాయి. ఒకసారి వీటి వలలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఎక్కువగా టీనేజ్లోకి అడుగుపెట్టే కుర్రకారు వీటి ఉచ్చులో చిక్కుకుంటుంటారు. ఇందులోంచి బయటకు రాలేని వారు అకాల మరణాలకు బలైపోతున్నారు. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. డ్రగ్స్కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరకే ఉద్రేకపడిపోతుంటారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతను పట్టించుకోరు. ముద్ద ముద్దగా మాట్లాడతారు. వారి వద్ద చిత్రమైన వాసన రావచ్చు. ఇలాంటి లక్షణాలున్న పిల్లలు మీ పరిసరాల్లో తారసపడితే వెంటనే వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయండి. ‘ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్’ (జూన్ 26) సందర్భంగా మీకోసం తెచ్చిన వ్యాసం ఇది. మాదక ద్రవ్యాల వాడకం అక్రమం అని మనకు తెలుసు. మరి ట్రాఫికింగ్ అంటే?.. దాని రవాణా. మనిషి నుంచి మనిషికి రవాణా అవ్వడాన్ని కూడా డ్రగ్స్ చట్టంలో ట్రాఫికింగ్ అనే అంటారు. డ్రగ్స్ వాడిన వారిమీద కఠిన చర్యలు ఉండొచ్చు, లేదా క్షమించి కొత్త జీవితానికి అవకాశం ఇవ్వొచ్చు. కానీ సరఫరా చేసే వారిమీద మాత్రం కఠిన చర్యలు తప్పవు! ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్. మన పరిసరాలు, మన కాలనీలు, ఇటువంటి దుష్టులతో అప్రమత్తంగా ఉండాలి! కిక్ కోసమో, థ్రిల్ కోసమో కుర్రాళ్లు దమ్ముకొట్టడం, మందుకొట్టడం వంటివి ప్రారంభిస్తారు. క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారుతాయి. సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు కొందరు. మరింత థ్రిల్ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొందరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్ వైపు అడుగులేస్తారు. ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు. మాదకద్రవ్యాలపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ నిషేధాన్ని అమలు చేస్తున్నా, మాఫియా ముఠాల ద్వారా వీటి సరఫరా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు ఎక్కువగా డ్రగ్స్ మాయలో చిక్కుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఇందులో చిక్కుకుంటే చాలు, అప్పటి వరకు సజావుగా సాగుతున్న చదువు చెట్టేక్కేస్తుంది. కెరీర్ సర్వనాశనమవుతుంది. నిత్యం డ్రగ్స్ మత్తులో జోగుతుండే వారి దరిదాపులకు రావాలన్నా జనం జంకుతారు. సన్నిహితులు సైతం దూరమవుతారు. డ్రగ్స్ మాయాజాలంలో పడినవారు సామాజిక సంబంధాలను కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి కుటుంబ సభ్యులే అండగా నిలవాల్సి ఉంటుంది. వారిని ఆ ఊబిలోంచి బయటకు తేవడానికి ఓపికగా ప్రయత్నించాల్సి ఉంటుంది. డ్రగ్స్తో ఇవీ అనర్థాలు డ్రగ్స్లో నానా రకాలు ఉన్నాయి. పొగ పీల్చేవి కొన్ని, ముక్కు ద్వారా పీల్చేవి కొన్ని, నోటితో తీసుకునేవి కొన్ని, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి కొన్ని... ఇవి కలిగించే అనర్థాలు రకరకాలుగా ఉంటాయి. ఎక్కువగా వాడుకలో ఉన్న డ్రగ్స్, అవి కలిగించే అనర్థాలు తెలుసుకుందాం... గంజాయి: సాధారణంగా చిలుంలోనో, సిగరెట్లలోనో దట్టించి పొగపీలుస్తారు. గంజాయి ఆకులతోనే తయారు చేసే భంగును పాలల్లో లేదా లస్సీ వంటి పానీయాల్లో కలుపుకొని తాగుతారు. గంజాయి, భంగు ప్రభావంలో ఉన్నవారిలో కళ్లు ఎర్రబారడం, పెద్దగా నవ్వడం, బిగ్గరగా మాట్లాడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి బానిసలైన వారిలో అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, తనపై తానే ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొకైన్: కొకైన్, కొకైన్ తరహా స్టిములెంట్స్ తీసుకున్న వారిలో డ్రగ్ ప్రభావం ఉన్న సమయంలో కనుపాపలు విప్పారడం, అతి చురుగ్గా ప్రవర్తించడం, తెలియని ఆనందంలో తేలిపోవడం, పెద్ద కారణం లేకుండానే త్వరగా కోపంతో రెచ్చిపోవడం, ఆందోళనతో అస్థిమితంగా ఉండటం, విపరీతంగా మాట్లాడటం, నిద్రాహారాలు లేకుండా గంటల తరబడి గడపగలగడం, నోరు, ముక్కు పొడిబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్: ఆల్ప్రోజోలాం, డైజెపాం వంటి యాంటీ డిప్రెసెంట్స్ డ్రగ్స్ను నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారికి, డిప్రెషన్తో బాధపడేవారికి వైద్యులు సూచిస్తుంటారు. ఎలాంటి సమస్యలు లేకున్నా, కొందరు వీటికి అలవాటు పడుతుంటారు. వీటిని మోతాదుకు మించి తీసుకునే వారిలో తప్పతాగినట్లు మత్తుగా తూగడం, చీదర కలిగించేలా ప్రవర్తించడం, మాటలు ముద్దముద్దగా రావడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెల్యూసినోజెనిక్ డ్రగ్స్: ఎల్ఎస్డీ వంటి డ్రగ్స్ హెల్యూసినేషన్ అంటే భ్రాంతి కలిగిస్తాయి. ఇవి తీసుకునేవారు ఈ లోకంతో పనిలేనట్లుగా ఉంటారు. దేని మీదా దృష్టి నిలపలేకపోతారు. నోట్లోంచి చొంగకారుతూ కంపరం పుట్టించేలా ఉంటారు. కండరాలపై నియంత్రణ కోల్పోతారు. వీరికి ఆకలి తీరుతెన్నుల్లోనూ, మూడ్స్లోనూ మార్పులు వస్తాయి. అసందర్భంగా నవ్వడం లేదా ఏడవడం, కోపంతో విరుచుకుపడటం, వస్తువులను విసిరిగొట్టడం, ఒక్కోసారి ఇతరులపై దాడికి తెగబడటం లేదా తమకు తామే హాని చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెరాయిన్: హెరాయిన్ ప్రభావంలో ఉన్నవారిలో కనుపాపలు ముడుచుకుపోవడం, కంట్లో వెలుగుపడినా కనుపాపలు పెద్దగా స్పందించకపోవడం, నిద్రవేళల్లో మార్పులు రావడం, విపరీతంగా చెమట పట్టడం, దగ్గు, ఆకలి మందగించడం, కండరాలు బిగుసుకుపోతుండటం, మాటిమాటికీ ముక్కు ఎగబీల్చుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాసన పీల్చే డ్రగ్స్: ముక్కుతో వాసనపీల్చే డ్రగ్స్ రకరకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కారుచౌకగా దొరికే వైటెనర్కు ఎక్కువమంది అలవాటు పడుతుంటారు. ఇలాంటి వాసన పీల్చే డ్రగ్స్కు అలవాటు పడినవారిలో కళ్లు నీళ్లతో నిండినట్లుగా కనిపించడం, గాజుకళ్లలా మారడం, దృష్టి సరిగా నిలపలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నోట్లోంచి చొంగకారుతూ అసహ్యకరంగా కనిపించడం, కండరాలపై నియంత్రణ లేకపోవడం, ఆకలి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డ్రగ్ అడిక్ట్స్ను ఇలా గుర్తించవచ్చు ∙కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయారవుతాయి. ∙ఆకలి, నిద్ర తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మందగించడం, గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా అతి చురుగ్గా నిద్రలేకుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణాలు గమనించవచ్చు. ∙వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ పూర్తిగా లోపిస్తుంది. మంచిబట్టలు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ∙ఒళ్లు వణుకుతుండటం, మాట ముద్ద ముద్దగా రావడం, వేగంగా కదలలేకపోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు, ఒంటి నుంచి దుస్తుల నుంచి విచిత్రమైన వాసన రావడం వంటి లక్షణాలు గమనిస్తే అలాంటి వారు డ్రగ్స్ మాయలో చిక్కుకున్నట్లే భావించాలి. అలవాటైన వారికి డ్రగ్స్ దొరక్కుంటే... డ్రగ్స్కు బాగా బానిసలైపోయిన వారికి అవి దొరక్కుంటే వారిలో మరింత విపరీత లక్షణాలు కనిపిస్తాయి. వారి భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి. క్రూరమైన భావనలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఒక్కోసారి కోపాన్ని అదుపు చేసుకోలేక దాడులకు పాల్పడటం, చివరకు హత్యలకు తెగబడటం వంటి దారుణాలకు పాల్పడతారు. పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తారు. తమకు తామే హాని చేసుకుంటారు. ఒక్కోసారి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడతారు. ప్రభుత్వాల వైఫల్యం ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే వస్తోంది తప్ప సిగరెట్ల వాడకం తగ్గుముఖం పట్టినట్లు డ్రగ్స్ వాడకం తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఆధునిక నిఘా వ్యవస్థలు కలిగి ఉన్న అగ్రరాజ్యాల ప్రభుత్వాలు సైతం డ్రగ్స్ మాఫియా ముఠాలను, డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ), ప్రపంచబ్యాంకు, డబ్ల్యూహెచ్ఓ సంస్థలు 2015లో విడుదల చేసిన ‘ఫ్యాక్ట్షీట్ ఆన్ స్టాటిస్టిక్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఇల్లిసిట్ డ్రగ్స్’ నివేదిక మాదక ద్రవ్యాలను నిలువరించడంలో ప్రభుత్వాల వైఫల్యానికి అద్దంపట్టేదిగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఏటా ఉత్పత్తవుతున్న మాదకద్రవ్యాల పరిమాణంతో పోల్చుకుంటే ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్న మాదకద్రవ్యాల పరిమాణం నామమాత్రంగా ఉంటోంది. ఇందులోని వివరాలు ఇలా ఉన్నాయి... ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 6,380 టన్నుల నల్లమందు ఉత్పత్తవుతోంది. ఇందులో 2,080 టన్నుల నల్లమందును యథాతథంగా వినియోగిస్తుంటే, మిగిలిన 4,300 టన్నుల నల్లమందును ప్రాసెస్ చేసి 480 టన్నుల హెరాయిన్ను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నల్లమందు, హెరాయిన్ వాడే వారి సంఖ్య దాదాపు 5.3 కోట్ల మంది వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 2015లో భద్రతా బలగాలకు పట్టుబడిన నల్లమందు 587 టన్నులు, హెరాయిన్ 80 టన్నులు మాత్రమే. మిగిలిన సరుకునంతా డ్రగ్ మాఫియా ముఠాలు యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నాయి. గంజాయి, కొకైన్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రసాయనిక మాదకద్రవ్యాల విషయానికొస్తే, 2015లో వాటి ఉత్పత్తి 190 టన్నులు ఉంటే, పట్టుబడినవి 23 టన్నులు మాత్రమే. నిఘా సంస్థలకు దీటుగా డ్రగ్స్ మాఫియా ముఠాలు కూడా ఎప్పటికప్పుడు హైటెక్ పోకడలను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన ‘ఫ్యాక్ట్షీట్’ ప్రకారం 2013– 2015 మధ్య కాలంలో ఈ లావాదేవీలు 50 శాతం మేరకు విస్తరించాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. డ్రగ్స్ మాఫియా కథా కమామిషు మాదకద్రవ్యాల వాడకం చాలా శతాబ్దాల నుంచే ఉన్నా, మాఫియా ముఠాల అవతరణ మాత్రం దాదాపు రెండు శతాబ్దాల కిందటే జరిగింది. పంతొమ్మిదో శతాబ్దిలో అమెరికాకు వలస వచ్చిన చైనా ముఠాలు అమెరికన్లకు నల్లమందును అలవాటు చేశారు. పారిశ్రామిక విప్లవం ఊపందుకుంటున్న కాలంలో నల్లమందు నుంచి హెరాయిన్, మార్ఫిన్, కోడీన్ వంటి మాదకద్రవ్యాల తయారీ మొదలైంది. అమెరికా అంతర్యుద్ధ కాలంలో గాయపడ్డ సైనికులకు అప్పటి వైద్యులు నొప్పి నివారిణిగా మార్ఫిన్ను ఇచ్చేవారు. నల్లమందు అనర్థాలను గ్రహించిన తర్వాత అమెరికన్ ప్రభుత్వం నల్లమందు, దాని అనుబంధ ఉత్పత్తులపై ఆంక్షలు విధస్తూ 1914లో హ్యారిసన్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వైద్యేతర అవసరాల కోసం నల్లమందు, హెరాయిన్ వంటి వాటిని ఉపయోగించడాన్ని నిషేధించింది. నిషేధాజ్ఞలు రుచించని చైనా వ్యాపారులు నల్లబజారును సృష్టించుకున్నారు. న్యూయార్క్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా నల్లమందు, హెరాయిన్ వంటివి విక్రయించేవారు. అమెరికాలో సాంస్కృతికంగా జాజ్ యుగం మొదలైన 1930లలో గంజాయి వాడుక పెరిగింది. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో అమెరికాలో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే అక్రమంగా వీటిని దిగుమతి చేసుకుని, రహస్యంగా అమ్మకాలు సాగించసాగాయి. వియత్నాం యుద్ధ కాలంలో హెరాయిన్ వాడుక మరింతగా పెరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ సైనికుల్లో దాదాపు 15 శాతం మంది హెరాయిన్కు బానిసలుగా మారడంతో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వియత్నాం యుద్ధం ముగిసిన కొద్ది కాలంలోనే డ్రగ్స్ అక్రమ వ్యాపారం భారీ స్థాయిలో విస్తరించింది. లాటిన్ అమెరికా దేశాల్లో డ్రగ్స్ మాఫియా ముఠాలు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు పట్టనివ్వని స్థాయికి చేరుకున్నాయి. మెక్సికన్ స్మగ్లర్ పాబ్లో ఎస్కోబార్ డ్రగ్స్ మాఫియాకు అంతర్జాతీయ డాన్గా ఎదిగాడు. ఎస్కోబార్ ముఠా 1975లో ఒక విమానంలో రవాణా చేస్తున్న 600 కిలోల కొకైన్ను కొలంబియా పోలీసులు పట్టుకున్నారు. తమ సరుకును పట్టుకున్న నలభై మంది పోలీసులను మాఫియా ముఠా సభ్యులు పిట్టల్లా కాల్చి చంపేశారు. అప్పట్లో ఈ సంఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డొచ్చిన వారికి కిడ్నాప్ చేయడం, అవసరమైతే హత్యలు చేయడం ఎస్కోబార్ ముఠాకు మంచినీళ్ల ప్రాయం కావడంతో ఎవరూ ఆ ముఠా జోలికి వచ్చేందుకు సాహసించేవారు కాదు. అప్పట్లో ఎస్కోబార్ ముఠా రోజువారీ ఆదాయం ఏకంగా 6 కోట్ల డాలర్ల (రూ.404 కోట్లు) వరకు ఉండేదంటే ఏ స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం కొనసాగించేదో ఊహించుకోవాల్సిందే. ఎస్కోబార్ బాటలోనే వివిధ దేశాల్లో వందలాది మంది డాన్లు తయారయ్యారు. దారితప్పిన యువకులు వారి పంచన చేరి నేరాల బాట పట్టారు. అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, పెరు, వెనిజులా, బొలీవియా, కొలంబియా, హోండురాస్, నికరగ్వా, ఇటలీ, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, పోలండ్, హంగెరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, కొరియా, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాం, శ్రీలంక, భారత్, ఇజ్రాయెల్, టర్కీ, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డ్రగ్స్ మాఫియా ముఠాలు ఇప్పటికీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మన దేశంలో మాఫియా మన దేశంలో మాఫియా ముఠాలు స్వాతంత్య్రానికి కొద్ది సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా తొలి తరం డాన్లు హాజీ మస్తాన్, కరీంలాలా మొదట్లో బంగారం, వెండి స్మగ్లింగ్ చేసేవారు. డ్రగ్స్ అక్రమ రవాణా కూడా లాభసాటిగా ఉండటంతో ఈ రంగంలోకీ అడుగుపెట్టారు. కొంతకాలానికి వరదరాజన్ ముదలియార్ ఈ రంగంలోకి వచ్చాడు. దావూద్ ఇబ్రహీం 1980లలో ఈ రంగంలోకి వచ్చి, ‘డీ కంపెనీ’ పేరిట ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. డీ కంపెనీ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కు మాత్రమే పరిమితం కాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం, ఆయుధాల అక్రమ రవాణ వంటి నానా ఘాతుకాలకు తెగబడింది. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన 1993 నాటి ముంబై పేలుళ్ల వెనుక ఉన్నది డీ కంపెనీ అనే సంగతి తెలిసిందే. ముంబై పేలుళ్ల తర్వాత దేశం విడిచి, పాకిస్తాన్లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంను అమెరికా ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించింది. దావూద్ ఇబ్రహీం భారత్ను విడిచి వెళ్లిన తర్వాత ఇక్కడేమీ డ్రగ్స్ మాఫియా ముఠాలు అంతరించిపోలేదు. పైగా ముంబై వెలుపల దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరించాయి. పంజాబ్ మాఫియా, గోవా మాఫియా ముఠాలు అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కుమ్మక్కై విచ్చలవిడిగా ఇక్కడకు మాదకద్రవ్యాలను చేరవేస్తున్నాయి. పంజాబ్ మాఫియా ధాటికి అక్కడి యువత మత్తులో కూరుకుపోయి నాశనమైపోతున్న పరిస్థితులపై వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళలో ఏకంగా ఐస్క్రీం పార్లర్లలోనే డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్న ఉదంతం కొన్ని సంవత్సరాల కిందట కలకలం రేపింది. హైదరాబాద్లోనూ డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వార్తలకెక్కాయి. బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో గంజాయి అక్రమసాగు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. కిక్కు లెక్కలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రెండేళ్ల కిందట విడుదల చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య 25.5 కోట్ల వరకు ఉంటుంది. గంజాయి వాడుతున్న వారి సంఖ్య 18.3 కోట్లు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి సంఖ్య దాదాపు 1.20 కోట్ల వరకు ఉంటుంది. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల 2016లో 1.44 లక్షల మంది మరణించారు. ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో 16 లక్షల మంది హెచ్ఐవీ పాజిటివ్తో బాధపడుతుంటే, మరో 61 లక్షల మంది హెపటైటిస్–సితో బాధపడుతున్నారు. స్టెరిలైజ్ చేయని సూదులతో ఒకరి నుంచి ఒకరు డ్రగ్స్ తీసుకుంటుండటంతో ఈ వ్యాధులు మహమ్మారిలా ముట్టడిస్తున్నాయి. డ్రగ్స్ వాడకం వల్ల హెపటైటిస్–సి సోకిన వారిలో 2.22 లక్షల మంది, హెచ్ఐవీ సోకిన 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో డ్రగ్స్ వాడేవారు 25.5 కోట్లు గంజాయి వాడేవారు 18.3 కోట్లు ఇంజెక్షన్ డ్రగ్స్ వాడేవారు 1.20 కోట్లు డ్రగ్ అడిక్ట్స్లో హెచ్ఐవీ బాధితులు 16 లక్షలు హెపటైటిస్–సి బాధితులు 61 లక్షలు డ్రగ్ అడిక్ట్స్ను బయటపడేయడం ఎలా? ఇంట్లోని పిల్లలెవరైనా డ్రగ్స్కు బానిసలైతే తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తీరని వేదన కలుగుతుంది. నిష్కారణంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్న పిల్లలపై కోపం ముంచుకొస్తుంది. కేవలం లోలోన కుమిలిపోవడం వల్ల లేదా వారిపై కోపతాపాలు చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, పరిస్థితి మరింతగా అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డ్రగ్స్కు బానిసలైన వారితో మరింతగా ఓపికగా, సహనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి కోసం మరింతగా నాణ్యమైన సమయాన్ని వెచ్చించి వారితో మాట్లాడి, ధైర్యం చెప్పి వారిని ఈ ఊబి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. అందుకోసం వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ∙డ్రగ్స్ మాయలో చిక్కుకున్న వారిపై కోపతాపాలు ప్రదర్శించకుండా, అనునయించడం ద్వారా మాత్రమే మార్చడం సాధ్యమవుతుంది. ∙‘ఇకపై నువ్వు డ్రగ్స్ తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం... అలా చేస్తాం.. ఇలా చేస్తాం’ అంటూ ఎమోషన్ బ్లాక్మెయిల్కు దిగకండి. అలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ∙డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి వారిపై ప్రభావం చూపేలా ఓపికగా వారికి వివరించడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ∙డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను వాళ్లకే తెలిసేలా చేయండి. వారెంత నష్టపోతున్నదీ వారి అనుభవంలోకి తేవడం ఒక మార్గం. ∙డ్రగ్స్ కారణంగా వారు కోల్పోయే ఆత్మగౌరవం, సామాజికంగా వారికి కలుగుతున్న గౌరవభంగం గురించి వారికి తెలిసేట్లు చేయండి. ∙డ్రగ్స్ అందనివ్వకుండా చేయడం, వాటిని పారేయడం వంటి చర్యలకు పాల్పడకండి. అలా చేస్తే, వారు మరింతగా డ్రగ్స్ కోసం ప్రయత్నిస్తారు. కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలను మానుకోండి. ∙డ్రగ్స్ బారిన పడిన వారిని దండించడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం, వారికి ఉపదేశాలు ఇవ్వడం, వారితో వాదించడం సరికాదు. వారిని చిన్నబుచ్చడం, ఆత్మన్యూనత కలిగేలా చేయడం ద్వారా వారిని అలవాటుకు దూరం చేయగలమనుకుంటే పొరపాటే! ∙డ్రగ్స్ నుంచి వారిని బయటపడేయాలంటే వారికి కావాల్సింది మీ నుంచి బేషరతు భరోసా. ‘మేం నీ వెంటే ఉన్నాం’ అనే భావనను వారిలో కల్పించాలి. దురలవాటును మానేశాక దాని గురించి మా వద్ద సిగ్గుపడేలా ప్రవర్తించాల్సిన పరిస్థితిని కల్పించబోమనే నమ్మకం కలిగించాలి. నిరంతరం ప్రోత్సహిస్తూ డీ అడిక్షన్ చికిత్స ద్వారా వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావాలి. -
విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్లు
సాక్షి, విజయవాడ : విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ దందా సాగిస్తున్నాయి. వీరిపై స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన ఎన్నారై నూతక్కి నాగేశ్వరరావు అమెరికా నుంచి నేరుగా నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీఐ కాలేజీ ఆవరణలో గంజాయి గ్యాంగ్లు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 నుంచి 15 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని సార్లు ముఠాలు శ్రుతిమించిపోతున్నాయని, విద్యార్థుల నుంచి ఫోన్లు, బ్యాగ్లు, పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు గుంజుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడుకొనే ఈ గ్యాంగ్లకు ఆరుమెల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా ఉన్నరని ఎన్నారై తన ఫిర్యాదులో ఆరోపించారు. ఒక్కోసారి వీధుల్లో ఈ గ్యాంగ్లు అల్లర్లకు పాల్పడుతూ స్థానికులను వేధిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీధుల్లో గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిపై కత్తులు, బ్లేడ్లతో దాడులకు దిగుతున్నారని, విద్యార్థులు అటుగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇదంతా మాచవరం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని సవాంగ్ను కోరారు. ఈ మేరకు గ్యాంగ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, పేర్లు వారి ఫోన్ నెంబర్లతో సహా కమీషనర్కు ఫిర్యాదు చేశారు. -
ఎలుకలు తినేశాయ్..
స్మగ్లర్ల నుంచి పట్టుకున్న గంజాయిని పోలీసులు ఏం చేస్తారు.. ఏదైనా భద్రత ఉన్న ప్రాంతాల్లో దాచేస్తారు.. అలా గంజాయిని దాచిన అర్జెంటినా పోలీసులకు ఓ రోజు షాక్ తగిలింది. వారు పట్టుకుని దాచిపెట్టిన గంజాయిలో 540 కిలోగ్రాములు మాయమై పోయిందట. దీంతో ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారట. దీంతో వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించారట. దీంతో అక్కడి పోలీసులు ఏం చెప్పారో తెలుసా.. 540 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని..! అది కూడా ఆ ఎలుకలు గంజాయికి బానిసైపోయి తిన్నాయని చెప్పారు. దీంతో అవాక్కయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 2017 ఏప్రిల్లో పైలర్ అనే ఓ పట్టణంలోని జైలులో పర్యవేక్షణ అధికారి జేవియర్ స్పెసియా బదిలీ కావడంతో అక్కడి గంజాయి మాయమైపోయిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చాలా రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు అలాంటిదేం లేదని తేల్చేశారు. ఆ పర్యవేక్షణ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చివరికి నివేదికలో తేల్చేశారు. ఏదో ఎలుకల పేరు చెప్పి తప్పించుకుందామనుకుంటే ఆ అధికారికి అసలుకే ఎసరొచ్చింది. ‘రెండేళ్లుగా అక్కడ గంజాయిని నిల్వ చేసి ఉండటంతో బాగా ఎండిపోయి ఉంది. అయితే అంత మొత్తంలో ఎలుకలు గంజాయిని తిని ఉంటే అవి కచ్చితంగా బతికే అవకాశం లేదు. చనిపోయి ఉండాలి.. అంటే చనిపోయిన ఎలుకలు అక్కడే ఉండాలి. కానీ అవి ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు’ అని డాక్టర్లు తేల్చారు. -
ఆ నూనెతో మూర్ఛ లక్షణాలు తగ్గుముఖం!
గంజాయి అంటే చాలామందికి పోలీస్ కేసులు.. ఒళ్లు తెలియని మత్తు గుర్తుకొస్తాయేమోగానీ.. వాస్తవానికి ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాంటర్బిల్ట్ బయో వీయూ రిసోర్స్ నుంచి సేకరించిన వైద్య రికార్డుల ఆధారంగా రాబర్ట్ కార్సన్ అనే ఓ శాస్త్రవేత్త మూర్ఛవ్యాధి చికిత్సలో గంజాయి పాత్ర ఏమిటన్నదానిపై పరిశోధన నిర్వహించారు. దాదాపు 108 మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులకు గంజాయి నుంచి తీసిన నూనెను మందుగా ఇచ్చినప్పుడు దాదాపు 40 శాతం మందిలో వ్యాధిలక్షణాలు సగానికి తగ్గిపోగా.. పదిశాతం మందిలో పూర్తిగా లేకుండా పోయాయి. మిగిలినవారిలోనూ కొంత మెరుగుదల కనిపించింది. వీరిలో 22 శాతం మంది తాము తీసుకుంటున్న సాధారణ మందుల మోతాదును గణనీయంగా తగ్గించుకోగలిగారు. శుద్ధి చేసిన గంజాయి నూనెపై తాము పరిశోధనలు చేసినప్పటికీ... చాలామంది వ్యక్తిగత స్థాయిలో దీన్ని వాడుతూనే ఉన్నారని ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని రాబర్ట్ కార్సన్ సూచిస్తున్నారు. -
సూర్యాపేటలో గంజాయి కలకలం..
సాక్షి, సూర్యాపేట: జిల్లాకేంద్రంలో ఓ కాలేజీ హాస్టల్లో గంజాయి దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. పోలీసుల తనిఖీల్లో గాయత్రి కాలేజీ హాస్టల్లో గంజాయి దొరికింది. దీనిపై హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం సహకారంతోనే ఇక్కడ గంజాయి దాచారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. -
4కిలోల గంజాయి పట్టివేత
నేరడిగొండ(బోథ్) : మండలంలోని రోల్మామడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని గురువారం ఆబ్కారీశాఖ అధికారులు పట్టుకున్నారు. సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా జట్వే మాన్సింగ్ ఇంట్లో 4 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సీఐ రాజమౌళి తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగుతో పాటు నిల్వలు ఉంచితే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎస్సై అరుణ్కుమార్, సిబ్బంది ఉన్నారు. నస్పూర్లో 300 గ్రాములు.. నస్పూర్(మంచిర్యాల): సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సంగంమల్లయ్యపల్లెలో గంజాయి విక్రయిస్తున్న ఎండీ.రసూల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. రసూల్ ఇంటిపై దాడి చేసి 30 ప్యాకెట్లలో ఉన్న సుమారు 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. రసూల్ను సీసీసీ పోలీసులకు అప్పగించారు. గంజాయి విక్రేతలపై టాస్క్ఫోర్స్ నిఘా ఉంచిందని, గంజాయిని నిర్మూలించే విధంగా టాస్స్ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది శేఖర్, రవి, సుమలత పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రగ్స్ రాకెట్లో నలుగురు విద్యార్థుల అరెస్ట్
న్యూ ఢిల్లీ : న్యూ ఇయర్ వేడుకలకు ముందు దేశ రాజధానిలో డ్రగ్స్ రాకెట్ ముఠాతో సంబంధం ఉన్న నలుగురు విద్యార్థులను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 1.14 కిలోల గంజాయితో పాటు ఎల్ఎస్డీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. ఎన్సీబి డిప్యూటీ జనరల్ డైరక్టర్ ఎస్కె జా మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం ఇటీవల ఎక్కువ అయిందని తెలిపారు. హిమచల్ ప్రదేశ్ నుంచి వీరికి డ్రగ్స్ సరఫర అవుతున్నాయన్నారు. హిందు కాలేజీకి చెందిన గౌరవ్ ఈ రాకెట్ని కింగ్పిన్ అనే కోడ్తో రన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నుంచి మిగిలిన ముగ్గురికి(అనిరుధ్ మాథుర్, టెన్జిన్ ఫుంచోగ్, సామ్ మల్లిక్) డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, వారు చెప్పిన వివరాల ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
గంజాయి సరఫరాదారు అరెస్ట్
బుక్కపట్నం: కొత్తచెరువు మండలం మామిళ్లకుంట క్రాస్ సమీపంలో సెరికల్చర్ కార్యాలయం వద్ద నాలుగు కిలోల గంజాయి బ్యాగుతో ఉన్న విశాఖ జిల్లా చింతపల్లి మండలం కందులగాదే గ్రామానికి చెందిన వంతల రమేష్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జ్ సీఐ హరినాథ్, ఎస్ఐ రాజశేఖర్రెడ్డితో కలిసి ఇన్చార్జ్ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి మీడియాకు వివరించారు. గత నెల 26న 44 కిలోల గంజాయితో పట్టుబడ్డ నిందితులు ఎరుకల శీనా, సరోజమ్మలతో ప్రస్తుతం అరెస్టయిన వంతల రమేష్కు సంబంధాలు ఉన్నాయన్నారు. శీనా, సరోజమ్మలకు గంజాయి సరఫరా చేసేవాడని, అందులో భాగంగా వారి వద్ద నుంచి డబ్బు తీసుకునేందుకు కొత్తచెరువుకు గంజాయితో వస్తుండగా రమేష్ను అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో మరికొంతమంది ఉన్నారన్నారు. వారినీ త్వరలో పట్టుకుంటామని చెప్పారు. -
576 కిలోల గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కేడీపేట అల్లూరి పార్క్ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 కిలోల గంజాయితో పాటు ఓ కారు, ఓ వ్యాను, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి ముఠా నేతల అరెస్ట్ ఓడీ చెరువు (పుట్టపర్తి) : గంజాయి ముఠాకు చెందిన ప్రధాన నాయకులను ఓడీ చెరువు మండలం గౌరాపురం క్రాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ సత్యనారాయణ ప్రత్యేక నిఘా పెట్టి శనివారం సాయంత్రం వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 లక్షల విలువ కలిగిన 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఓడీ చెరువు పోలీస్స్టేషన్లో మీడియాకు వివరించారు. ఓడీ చెరువు మండలం వంచిరెడ్డిపల్లికి చెందిన మంకముతక నారాయణ, విశాఖ జిల్లా సంకడ మండలం గండెంపల్లికి చెందిన గొర్ల ఈశ్వర్తో కలిసి గంజాయిని అనంతపురం, కర్ణాటకలోని బాగేపల్లి, చిక్»బళ్లాపూర్, బెంగళూరుకు తరలించి విక్రయించేవారు. గత బుధవారం పట్టుబడ్డ కొందరు నిందితులు ఇచ్చిన సమాచారంతో లోతుగా దర్యాప్తు చేసి ప్రత్యేక నిఘా వేసి నారాయణ, గొర్ల ఈశ్వర్ను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
గంజాయి తరలిస్తున్న మహిళల అరెస్టు
నర్సీపట్నం: టిప్పర్లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ మొబైల్ పార్టీ గురువారం స్వాధీనం చేసుకుంది. చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న టిప్పర్ను డిగ్రీ కళాశాల వద్ద ఆపి, తనిఖీ చేయగా 16 దుస్తుల మూటల్లో 250 కిలోల గంజాయిని గుర్తించినట్టు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. టిప్పర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేసినట్టు తెలిసింది. వీరందరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మన్యంలోని పాత దుస్తుల సేకరణ ముసుగులో గంజాయి తరిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన టిప్పర్ నర్సీపట్నానికి చెందినది. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ డివి.రాజును సంప్రదించగా మొబైల్ పార్టీ పట్టుకుందని, పూర్తి వివరాలు తెలియవలసి ఉందన్నారు. 40 కిలోల గంజాయి స్వాధీనం యలమంచిలి: రెండు ఆటోల్లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గుర్ని యలమంచిలి ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను శుక్రవారం తెలియజేస్తామని ఎక్సైజ్ సీఐ జయరామిరెడ్డి తెలిపారు. -
52 కేజీల గంజాయి పట్టివేత
కామారెడ్డి: జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోన్న మోహన్ రావు, శంకర్రావు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 52 కేజీల గంజాయి, తూపాను వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణి విలేకరుల సమావేశంలో తెలిపారు. -
డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం
గిద్దలూరు : డప్పుల్లో పెట్టి రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గిద్దలూరు రైల్వే పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మూడు డప్పుల్లో గంజాయిని కుక్కి రైలులోని సీటు కింద ఉంచి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక ఆర్పీఎఫ్ ఏఎస్సై నాగభూషణం తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు డప్పుల్లో ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయి తరలించేందుకు కొత్త పంధాను ఎన్నుకున్నారు. గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో స్టెప్నీ టైర్లలో గంజాయి ఉంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటుండటంతో స్మగ్లర్లు సరికొత్త విధానంలో డప్పుల్లో గంజాయి ఉంచి రైలులో తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా సీట్ల కింద ఉన్న డప్పులను గమనించిన ప్రయాణికులు.. ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ గుట్టురట్టయింది. ఆ డప్పులు ఎవరివని పోలీసులు ప్రశ్నించినా.. అందరూ తమవి కావని చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వాటిలో నాసిరకం గంజాయి ఉందని, ఇది కిలో రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర పలకదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
గంజాయి కూడా మెదడుకు మంచిదేనా!
బెర్లిన్: గంజాయి దమ్ము బిగించి కొడితే... ఆనందం సంగతి ఏమోగానీ ఆరోగ్యం పాడవుతుందని, త్వరగా చావుకు దగ్గరవుతామని చెప్పేవారు ఎందరో ఉంటారు. కానీ చిన్న మోతాదులో, క్రమం తప్పకుండా గంజాయిని తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఫలితంగా పదేళ్లు ఎక్కువకాలం బతికే అవకాశం ఉందని బాన్ యూనివర్శిటీ, హెబ్రూ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. వీరు మొదట ఎలుకలపై జరిపిన పరిశోధనలు విజయవంతం కావడంతో ఆ తర్వాత మనుషులపై పరిశోధనలు జరిపారు. అయితే చిన్న పిల్లలకంటే పెద్ద వాళ్లలోనే ఈ గంజాయి ప్రభావం బాగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. చిన్న పిల్లలు గందరగోళానికి గురైతే పెద్ద వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలిందని వారు చెప్పారు. ముందుగా తాము ఏడాది లోపు, ఏడాదిన్నర ఎలుకలపై ప్రయోగించి చూశామని, ఆ తర్వాత పిల్లలపై, పెద్దలపై ప్రయోగించి చూశామని చెప్పారు. గంజాయిలో ఉండే ‘కన్నాబినాయిడ్స్’ కారణంగా పెద్దవాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెట్టిందని వారు తెలిపారు. మెదడు సామర్థ్యం తగ్గిపోతున్న సమయంలో మెదడును ఈ గంజాయి ప్రభావితం చేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు. ఈ ప్రయోగం సందర్భంగా మానవుల ఇతర అవయవాలపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. అయితే మానవులపై ఇంకా పూర్తిస్థాయి క్లినికల్ అధ్యయనాలు జరపాల్సి ఉందని వివరించారు. -
గంజాయితో పట్టుబడిన విద్యార్థులు
ఒకరు విదేశీయుడు, ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ 30 ప్యాకెట్లు స్వాధీనం ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో గల ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి ప్యాకెట్లతో బుధవారం మధ్యాహ్నం పట్టుపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 30 ప్యాకెట్ల గంజాయిని (1100 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు విదేశీ విద్యార్థి కాగా ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ, మిగతావారు తెలంగాణకు చెందిన వారున్నారు. గురువారం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి కేసు వివరాలను వెల్లడించారు. ఇంజనీరింగ్ కళా శాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువు తున్న విద్యార్థులు కళాశాల ఎదుట ఉన్న గ్రీన్ సిటీ వెంచర్ వద్ద ఒక కారులో గంజాయిని సేవిస్తున్నారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు నిలిపివున్న కారు వద్దకు వచ్చి అనుమానంతో ప్రశ్నించారు. తడబడుతూ సమాధానం ఇవ్వడంతో పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ఐదు ప్యాకెట్ల గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి గుట్టురట్టయింది. వీరికి కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి ఏపీలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి అంద జేస్తున్నట్టు తేలింది. కళాశాల విద్యార్థులకు 50 గ్రాముల గంజాయి ప్యాకెట్టు రూ.500లకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇబ్రహీంపట్నంలోని విద్యార్థుల గది నుంచి మరో 25 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
కర్నూలు : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు ఆదేశాల మేరకు కర్నూలు ఎక్సైజ్ సీఐ పద్మావతి సిబ్బందితో కర్నూలు బంగారుపేట, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో దాడులు నిర్వహించారు. బంగారుపేటకు చెందిన నీలిషికారి సన్ను దగ్గర 1.65 కేజీల ఎండిన గంజాయి, ఉయ్యాలవాడకు చెందిన రంగమ్మ నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. దాడుల్లో ఎస్ఐ దుర్గా నవీన్బాబు, హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున, మాదన్న, లీలా మోహన్,రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర కిలో గంజాయి సీజ్
ఆళ్లగడ్డ: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. స్థానిక స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడు వివరాలను సీఐ వివరించారు. చాగలమర్రికి చెందిన నరసింహులు ఇతరులకు విక్రయించేందుకు ఇంటిలో నిల్వ చేయగా తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
విజయవాడ రైల్వేస్టేషన్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గురువారం జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ప్లాట్ఫాం నెంబరు 1, 9 పై అనుమాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారి బ్యాగులను జీఆర్పీ పోలీసులు తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని చెన్నైకి తరలిస్తున్నట్లు నిందితులు సెలైదొరై (42), మురుగన్(45), పెరుమాళ్లు(42) వెల్లడించారని జిఆర్పీ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
పాడుబుద్ధికి 10 నెలల జైలు
బాలుడి కిడ్నాప్ కేసులో కటకటాలు గోపాలపట్నం: గంజాయి వ్యసనం ఓ వ్యక్తిని కిడ్నాప్కి ప్రేరేపించింది. సొంత మేనమామే ఓ బాలుడిని ఆడిస్తున్నట్లుగా నటించాడు. తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆ బాలుడిని రైల్వేస్టేషన్లో వదిలేశాడు. గంజాయి మత్తులో పడి ఎటో వెళ్లిపోయాడు. పోలీసుల అప్రమత్తతతో ఆ బాలుడు దొరికాడు. ఆ నిందితుడు ఇపుడు కటకటాల పాలయ్యాడు. పెందుర్తికి చెందిన డోలా కిరణ్కుమార్ అనే వ్యాను డ్రైవరు మద్యం, గంజాయికి బానిసయ్యాడు. గోపాలపట్నం లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్న తన సోదరి బోనెల విజేత ఇంటికి గత నవంబరు 18న వచ్చాడు. ఆమె రెండున్నరేళ్ల కొడుకు తిలక్ని ఆడిస్తూ.. పెందుర్తిలో ఉన్న తన అమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలుడిని బైక్పై తీసుకెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైకుంఠరావు నేతృత్వాన ఎస్ఐ దుంపల శ్రీనివాస్ ఆగమేఘాలమీద నాలుగు బందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. వాట్స్యాప్లలో అన్ని పోలీస్స్టేషన్ల ఇన్చార్జిలకు నిందితుడి ఫొటోలు, బాలుడి ఫొటోలూ పంపారు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్లో ఆ మర్నాడు వేకువజామున రిజర్వేషన్ కౌంటర్లో అనుమానంగా తిరుగుతున్న కిరణ్కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. మైకంలో రోడ్డు పక్కన ఉన్న చుక్కా చిట్టమ్మ అనే వృద్ధురాలి ఒడిలో తిలక్ని పెట్టానని చెప్పాడు. ఆ వృద్ధురాలి అడ్రసు గాలించి మధురవాడలో వాంబే కాలనీలో పట్టుకున్నారు. ఇలా తిలక్ని తీసుకుని కుటుంబసభ్యులకు అందజేశారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో రెండవ మెట్రోపాలిటన్ మెజిస్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కిరణ్కుమార్కి పది నెలల జైలు, రెండువేల జరిమానా విధించారు. -
జోరుగా గంజాయి దందా
► కృష్ణపట్టెలో మిర్చి తోటల్లో సాగు ► ఆంధ్రా ప్రాంతంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండలోవిక్రయాలు ► మత్తుతో చిత్తవుతున్న యువత మిర్యాలగూడ : మిర్యాలగూడ డివిజన్లో గంజాయి దందా జోరుగా సాగుతోంది. డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె ఏరియాలో మిర్చి తోటలతో పాటు గట్ల మధ్యలో గుట్టు చప్పుడుకాకుండా సాగు చేస్తున్నారు. గంజాయి మొక్కలు పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గంజాయి మత్తుతో యువత చిత్తవుతోంది. డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె మండలాలైన దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్దవూర, తిర్మలగిరి సాగర్ ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సాధారణంగా మొక్కలు తెలిసిన వ్యక్తులు మాత్రమే దానిని గుర్తించే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులు గుర్తించే అవకాశం లేకపోవడం వల్ల మిర్చి తోటలు, బంతి పూల తోటలో, గట్ల మధ్యలో పెంచుతున్నారు. ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు ఎండబెట్టి పొడిచేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రైతులు ఆంధ్రాప్రాంతంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లిలో విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం. ఎండబెట్టిన గంజాయి పొడిని సాధారణ వ్యక్తుల మాదిరిగానే పొట్లాలు కట్టుకొని వచ్చి మిర్యాలగూడలోని రైల్వేస్టేషన్ సమీపంలో విక్రయాలు చేపడుతున్నారు. ఒక్క గంజాయి మొక్క 10 వేల రూపాయల నుంచి సుమారుగా 50 వేల రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెడుతుంది. ఖర్చు లేకుండా ఆదాయం వస్తున్నందున గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. ఇటీవల వెలుగుచూసిన సంఘటనలివే గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కడంతో కేసులు నమోదు చేశారు. డివిజన్ పరిధిలో ఎక్కువగా దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుపడ్డారు. ఇటీవల అడవిదేవులపల్లి మండలం ముల్కచర్ల పంచాయతీ పరిధిలోని కుర్రతండాలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దాడులు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అదే విధంగా గతంలో దామరచర్ల మండలం నర్సాపురం పరిధిలో మిర్చి తోటల్లో పెంచుతున్న గంజాయి మొక్కలను రెండు పర్యాయాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ఇస్తే పట్టుకుంటాం గతంలో గంజాయి విక్రయాలు ఎక్కవగా ఉండేది. ప్రస్తుతం తగ్గింది. మిర్యాలగూడలో విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం లేదు. ఒక వేళ ఇక్కడ గంజాయి విక్రయాలు చేపడుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. అదే విధంగా కృష్ణపట్టె ఏరియాలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం వచ్చినా దాడులు నిర్వహిస్తాం. – రాంగోపాల్రావు, డీఎస్పీ, మిర్యాలగూడ -
ఆయిల్ ట్యాంకర్లో 1500 కిలోల గంజాయి!
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పాడేరు మండలం చింతలవీధి వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా రవాణాచేస్తున్న 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీసులు కాపుకాసి ట్యాంకర్ను తనిఖీచేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఏయూ హాస్టల్లో వికృత చేష్టలు
⇒గంజాయి సేవించి విద్యార్థుల వీరంగం ⇒లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి అభ్యంతరకరం విన్యాసం ⇒ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన ⇒ఆ నలుగురు సస్పెన్షన్ విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు హద్దులు మీరారు. పూటుగా గంజాయి సేవించి వీరంగం చేశారు. మత్తెక్కిన మైకంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. తూగుతూ, ఊగుతూ సరాసరి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించారు. అక్కడున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఏయూ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి, అధ్యాపక వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. అప్రమత్తమై న యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు. వీరిలో నలుగురు విద్యార్థులు తాముంటున్న హాస్టల్ వద్ద శుక్రవారం రాత్రి పూటుగా గంజాయి సేవించారు. బయట ఉన్న కొందరితో అరగంట పాటు వాగ్వాదానికి దిగారు. మత్తు నషాళానికి ఎక్కిన తర్వాత ఒళ్లు మరిచారు. సమీపంలో ఉన్న లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించారు. ఒకరిద్దరైతే తమ ఒంటిపై ఉన్న దుస్తులను కూడా తొలగించుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డు కున్నా ఆగకుండా దూసుకెళ్లారు. హాస్టల్లో ఉన్న విద్యార్థినుల వైపునకు వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా స్పృహ లేకుండా నానా హంగామా చేశారు. పావుగంట పాటు వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు సెక్యూరిటీ సిబ్బంది నిలువరించి వారిని అతికష్టంపై అక్కడ నుంచి బయటకు గెంటివేశారు. మత్తులో తూగుతూ అదుపు తప్పిన వీరిని చూసి హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు భయకంపితులయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చొరవతో బయటకు పంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్లుగా ఇదే తంతు.. ఏయూలో కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్యానికి అలవాటుపడ్డారు. తాము ఉంటున్న హాస్టల్ గదుల్లో నిర్భయంగా మద్యం సేవిస్తున్నారు. హాస్టళ్ల పరిసరాల్లో ఎక్కడబడితే అక్కడ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తూనే ఉంటున్నాయి. అయినా హాస్టళ్ల వార్డెన్లు, ఏయూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రాత్రి పూట బయట వ్యక్తులు కూడా మద్యంతో పాటు గంజాయి సేవిస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా గంజాయి పీల్చడానికి అలవాటు పడ్డారు. ఇటీవల కాలంలో అది మరింత అధికమవుతోంది. ఫలితంగా ఇప్పుడు హద్దులు మీరి వీరంగం చేయడం, లేడీస్ హాస్టళ్లలోకి ప్రవేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆ నలుగురు సస్పెన్షన్! మత్తులో తూగి అసభ్యకరంగా ప్రవర్తించిన నలుగురు విద్యార్థులను ఏయూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కెమికల్ ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపాల్ను ఆదేశించినట్టు ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు శనివారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విషయాన్ని వారికి తెలియజేశామన్నారు. ఏయూలో అసాంఘిక కార్యకలాపాలను, గంజాయి, మద్యం సేవనాన్ని సహించబోమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఐదు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
చింతూరు(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి భారీగా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చింతూరు మండలం మోతుగూడెం పెదవాగు వద్ద మంగళవారం కాపు కాశారు. ఈ సందర్భంగా వారు అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి సోదాలు జరిపారు. అందులో దాచి ఉంచిన రూ.26 లక్షల విలువైన 530కిలోల గంజాయిని గుర్తించారు. ఈ సందర్భంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయి సహా లారీని స్టేషన్కు తరలించారు. -
10కిలోల గంజాయి స్వాధీనం
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ నుంచి ఎకై్సజ్ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక పద్మావతి హైస్కూల్ సమీపంలో నివసిస్తున్న సారా విక్రేతరాలు ఇస్తేరమ్మ ఇంటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. దాడుల్లో నాలుగు బిందెల సారాతో పాటు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ జానకిరామ్ మాట్లాడుతూ నిందితురాలి ఇంటిలో తనిఖీ చేస్తుండగా సిబ్బందిపై దాడికి యత్నించిందన్నారు. నిందితురాలిని విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో స్థానిక ఎస్ఐ లోకేష్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ సుబ్బయ్య, ఆర్ఐ జాకీర్ హుసేన్, వీఆర్వో గౌస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
370 కిలోల గంజాయి స్వాధీనం
12 మంది అరెస్టు మాడుగుల, గొలుగొండ, హుకుంపేట మండలాల్లో పోలీసులు 370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాడుగుల మండలంలో ఇద్దర్ని, గొలగొండ మండలంలో నలుగుర్ని, పెదబయలు మండలంలో ఆరుగుర్ని అరెస్టు చేశారు. మాడుగుల : విశాఖ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి, 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ ఫోర్స్మెంట్ సీఐ సీవీవీఎస్ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. ముందస్తు సమాచారం మేరకు దాడులు జరిపి, ఆటోలో తరలిస్తున్న 310 కిలోల గంజాయిని ముకుందపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎస్.దుర్గ, కాళ్ల వెంకట మాలిబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్టు సీఐ ప్రసాద్ తెలిపారు. గొలుగొండ: ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని శనివారం గొలుగొండ పోలీసులు పాలకపాడు ప్రాంతాలలో పట్టుకున్నారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారులో 40 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడిచే శారు. బీహార్కు చెందిన ఎం.ఆలీమ్, సీలేరుకు చెందిన భద్ర, బిస్మమ్, గణేష్ అనే నలుగుర్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. వీరి వద్ద నుంచి కారు, బైక్, నాలుగు సెల్ఫోన్లు, రూ.40 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ కేశవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట: పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి హుకుంపేట మీదుగా అరకులోయ ప్రాంతానికి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని హుకుంపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొంతిలి సమీపంలోని రోడ్డు వద్ద హుకుంపేట ఎస్ఐ బొండా నాగకార్తీక్, సిబ్బంది శనివారం వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయం లో మఠం ప్రాంతం నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 30 కిలోల గంజాయి బయటపడింది. ఆటోను సీజ్ చేసి, మఠం గ్రామానికి చెందిన జన్ని భాస్కరరావు, అరకులోయకు చెందిన పి.కృపానందం, కొర్రా చిత్రు,బీహర్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్, మిధున్ కుమార్, జగ్రనా«థ్ సాహూను అరెస్ట్ చేసి, విశాఖ సెంట్రల్ జైల్కు రిమాండ్కు తరలించారు. -
విశాఖలో 1,080 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు రూరల్(విశాఖపట్టణం): విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం సంగులోయ వద్ద ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో అనకాలపల్లి ఎక్సైజ్ పోలీసులు సంగులోయ గ్రామం వద్ద మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యానులో తీసుకువస్తున్న 1,080 కిలోల గంజాయి పట్టుబడింది. వ్యాన్ డ్రైవర్ కమ్ ఓనర్ పరారు కాగా అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్తోపాటు బైక్ను సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై లీలారాణి తెలిపారు. పట్టుబడిన వారు అన్నవరం, కొయ్యూరు ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. -
బార్వాద్ టు ముంబై.. వయా వికారాబాద్
► యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు ► రైతులను పావులుగా వాడుకుంటూ సాగు ► రైల్వే పోలీసుల కళ్లుగప్పి బోగీల్లో తరలింపు ► ముంబై, సూరత్, పుణెల్లో అమ్మకాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గంజాయి రవాణాకు వికారాబాద్ అడ్డాగా మారుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ దందా వెనుక బడా ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. కోట్పల్లి, బంట్వారం మండలంలో వాణిజ్య పంటల మాటున సాగు చేస్తున్న గంజాయి రైలు మార్గాన ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. రైళ్లలో నిఘా, చెక్పోస్టులు లేకపోవడంతో మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగు తోంది. మహారాష్ట్ర లాతూరు కేంద్రంగా పని చేస్తున్న స్మగ్లర్లు ఇక్కడి రైతులను పావులుగా చేసుకొని ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు ఇటీవల అధికారుల దాడిలో బయటపడింది. నల్లబజారులో గంజాయికి డిమాండ్ నిషేధిత మత్తు పదార్థం కావడంతో నల్లబజారులో గంజాయికి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే లాతూరుకు చెందిన స్మగ్లర్లు అమాయక రైతాంగానికి ఆశ చూపి.. తమ పొలాల్లో గంజాయి సేద్యం చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమం లోనే కర్ణాటక సరిహద్దులోని కోట్పల్లి మం డల పరిధిలోని గ్రామాల్లో గంజాయి పంట సాగవుతోంది. పసుపు, కంది పంటల మధ్య లో ఎకరాకు 25 గంజాయి మొక్కలను పెంచు తారు. ఒక్కో మొక్క నుంచి సుమారు అరకేజీ వరకు గంజాయి ఉత్పత్తి అవుతుంది. ఇలా పండించిన గంజాయిని ఎండపెట్టి ఇంట్లో నిల్వ చేసిన తర్వాత లాతూరుకు చెందిన స్మగ్లర్లు గ్రామాలకు వచ్చి.. కిలోకు రూ.2 వేల చొప్పున ఖరీదు చేస్తారు. నేరుగా మధ్యవర్తు లో.. స్మగ్లర్లో ఇంటికే వచ్చి సేకరిస్తున్నందున ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు రైతులు గంజాయి ఉచ్చులో పడ్డారు. ఇదే అదనుగా గతంలో కేవలం బార్వాద్కే పరిమితమైన ఈ దందా ఇతర గ్రామాలకూ పాకింది. తరలింపు ఇలా.. బార్వాద్ నుంచి వికా>రాబాద్ రైల్వేస్టేషన్ మార్గమధ్యంలో చెక్ పోస్టులు లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. ఈ ప్రాం తం రాష్ట్ర సరిహద్దులో ఉండడం.. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఎవరూ పసి గట్టరని భావిస్తున్న అక్రమార్కులు గంజాయి సాగుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనిపి స్తోంది. వికారాబాద్ నుంచి రాకపోకలు సాగించే రామేశ్వరం –ఓకా ఎక్స్ప్రెస్, విశాఖ పట్నం –ముం బై ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కాచి గూడ ప్యాసింజర్, కోణార్క్ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లలో గంజాయిని ముంబై, లాతూరు ప్రాంతాలకు తరలుతున్నట్లు విచారణలో తేలిందని తాండూరు ఎక్సైజ్ ఇన్్స క్టర్ భరత్భూషణ్ ‘సాక్షి’కి తెలిపారు. కనిపెట్టకుండా... గంజాయి రవాణాలో ముఠా సభ్యులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన మత్తు పదార్థాన్ని లగేజీ బ్యాగుల్లో భద్ర పరిచి.. దాన్ని ప్రయాణికుల బోగీల సీట్ల కింది భాగంలో దాచిపెడతారు. ఈ సంచు లపై అనుమానం రాకుండా మరో బోగీలో ముఠాసభ్యులు ప్రయాణిస్తారు. ఎవరైనా సంచులను పసిగట్టినా ఏమి మట్టి అంటకుం డా బయటపడాలనే ఆలోచనతోనే ఈ ఎత్తు గడ వేస్తున్నట్లు తెలిసింది. రైల్వే పోలీసులు గుర్తించకపోతే ముంబై, సూరత్, పుణెలకు చేరవేస్తారు. కిలో గంజాయిని రూ.7 వేల వర కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు వెలుగులోకి వచ్చిందిలా..? వికారాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్భూషణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దాం తో బార్వాద్ కేంద్రంగా కొన‘సాగు’ తోన్న గంజాయి గుట్టు రట్టైంది. వ్యవసాయ పొలా ల్లో సాధారణ పంటల మధ్యలో గంజాయి మొక్కల పెంపకం బహిర్గతమైంది. అధికా రులు రైతులుగా భావిస్తున్న లక్ష్మారెడ్డి, వెంక టయ్య, రాచయ్య, శ్రీశైలం, పాండయ్య ఇళ్ల లో తనిఖీలు నిర్వహించగా బ్యాగుల్లో ఉన్న 43 కిలోల ఎండబెట్టిన గంజాయి లభిం చింది. లక్ష్మారెడ్డి, వెంకటయ్య సాగుచేస్తున్న పసుపు, పత్తి పొలాల్లోనూ అధికారులు తని ఖీలు నిర్వహించారు. పత్తి, పసుపు పొలాల మధ్య గంజాయిసాగు చేసినట్టు తనిఖీల్లో తేలింది. పొలాల్లో 50 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బార్వాద్ నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్ వరకు చెక్పోస్టులు లేకపోవడం.. రైళ్లలో కూడా నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి రవాణా సులువుగా సాగుతుండడంతో ఈ ప్రాంతం తమకు అనువుగా స్మగ్లర్లు మలుచుకున్నారు. -
నాలుగు కిలోల గంజాయి స్వాధీనం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం నుంచి వర్క్షాపునకు వెళ్లే దారిలో బద్వేలుకు చెందిన పుల్లగూర నారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.15వేలు విలువ జేసే నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ అధికారుల ఆదేశాల మేరకు గంజాయి మీద దృష్టి సారించామన్నారు. ఆ మేరకు తమకు వచ్చిన సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి. గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్సైజ్ ఎస్ఐ కిషోర్ కుమార్, హెడ్కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష జరిమానా
బిచ్కుంద: గంజాయి విక్రయిస్తూ దొరికిన నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఎక్సైజ్ సీఐ సాయన్న సోమవారం వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని కందర్పల్లి గ్రామానికి చెందిన రాము గతంలో గంజాయి కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అయితే, రాము కొద్ది రోజులుగా గంజాయి రవాణా ప్రారంభించాడు. పది రోజుల క్రితం గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. దీంతో తహసీల్దార్ గోవర్ధన్ అతడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకంగా, రెండోసారి తప్పు చేస్తూ దొరికిన నిందితులకు జరిమానాతో పాటు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
‘పేట’లో గంజాయి మాఫియా
సూర్యాపేట గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలో విస్తరించిన ఈ మాఫియా.. చిన్నారులు మొదలు.. ఇంజినీరింగ్ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. మత్తుకు అలవాటుపడుతున్న యువకులు›తల్లిదండ్రులను చితకబాదడం ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి వారితో సంబంధాలు ఏర్పరుచుకుని ఈదందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న యువతకు గంజాయిని అందిస్తూ జీవితాలు బుగ్గిచేస్తున్నారు. పట్టణ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న బొడ్రాయి బజార్, పాత వ్యవసాయ మార్కెట్, రాజీవ్నగర్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, ఇందిరమ్మ కాలనీల్లో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. కొంతమంది యువకులు మధ్యవర్తులుగా ఉండి విద్యార్థులు, యువతకు చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో టిప్పర్, బొలేరో వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. యువతకు గంజాయి అందిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు పెట్టినా ఈ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా.. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి రవాణా కొనసాగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాల ప్రహరీని ఆనుకొని కొందరు వాహనాల్లో వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తుకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు తమ జీవితాలను చిత్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బొడ్రాయిబజార్కు చెందిన కొందరు యువకులు కూడా గంజాయి రవాణాలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నంబరు ప్లేట్లు లేని కార్లను వినియోగిస్తూ.. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం – వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశాం. నర్సాపూర్, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. గంజాయి వాడుతూ దొరికిన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయం.. ఏకంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. గంజాయి రవాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. చెడు అలవాట్లను మాన్పించే బాధ్యత తల్లిదండ్రులదే. -
గంజాయి స్మగ్లర్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన సీహెచ్ రాజా వెల్డింగ్ వర్కర్. ఆ రకంగా వచ్చే ఆదాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి తుని ప్రాంతానికి చెందిన అనంత రమేష్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే గంజాయి వ్యాపారంలో ఉన్న రమేష్ తాను అందించే ‘సరుకు’ను చెప్పిన చోటుకు చేర్చితే ఒక్కో ట్రిప్కు రూ.10 వేల చొప్పున చెల్లిస్తానని రాజాకు చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజాకు 40 కేజీల గంజాయిని 20 ప్యాకెట్లలో పార్శిల్ చేసి.. వాటిని రెండు ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి బుధవారం అందించాడు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్లాలని, అక్కడికి చేరిన తర్వాత ఎవరికి ‘సరుకు’ డెలివరీ చేయాలో చెప్తానని అన్నాడు. దీంతో రాజా శుక్రవారం ఎంజీబీఎస్లో బస్సు దిగాడు. ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం వలపన్ని నిందితుడిని అరెస్టు చేసింది. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కొటిక్ సెల్కు అప్పగించారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో గురువారం చోటుచేసుకుంది. మన్యం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సాయి అనే వ్యక్తి బైక్పై గంజాయి తరలిస్తుండగా.. గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి ఓ బైక్తో పాటు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
23 కిలోల గంజాయి స్వాధీనం
రోలుగుంట మండలం బీబీపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.46 వేలు ఉంటుంది. గంజాయిని అక్రమ తరలించడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజబాబు(50) స్థానికుడు కాగా..రేణి రాజా(45) తమిళనాడుకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి కేసూ గల్లంతే
సూత్రధారులకు పసుపు ముసుగు చివరికి డ్రైవర్ బలిపశువయ్యాడు కేసు మాఫీకి రాజకీయ పైరవీలు అతీగతీ లేని గంజాయి రవాణా కేసు అధికార పార్టీలోకి వెళ్లగానే తప్పులు ఒప్పులవుతాయా?.. అదేలా.. తప్పు తప్పే కదా!.. ఎక్కడున్నా కేసు కేసే కదా!! అంటారా.. అరకులో ఇటీవల పార్టీలు జంప్ చేసిన నేతలను అడగాల్సిందే. అప్పుడుగానీ.. ఎప్పుడు తప్పో.. ఎప్పుడు ఒప్పో.. మీకు తెలిసిరాదు.. లేదంటే ఈ కథనం చదవండి.. మీకే అర్థం అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు ఉన్నారు. వీరంతా ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లగానే ఆ కేసును ఎక్సైజ్ పోలీసులు అటకెక్కించేశారు. గంజాయి తరలిస్తున్న వాహనం డ్రైవర్ను మాత్రం బలి చేసి కేసును నిర్వీర్యం చేసేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి. విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు, అక్రమ రవాణాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాలకు టీడీపీ నేతలే అండదండలు అందిస్తున్నారు. పొరపాటున పోలీసుల దాడుల్లో పట్టుబడితే చిన్న చేపలను బలిచేసి కేసులను నీరుగార్చేస్తున్నారు. 2014 ఆగస్టు 10న నమోదైన గంజాయి రవాణా కేసును పరిశీలిస్తే.. మన్యంలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్లో సుమారు 350 కిలోల గంజాయిని జి.మాడుగుల-పాడేరు ప్రధాన మార్గంలో రాత్రి వేళ తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వేర్వేరుగా ఆ రోడ్డులో మాటు వేశారు. పోలీసులను చూసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయిన అంబులెన్స్ను ఎట్టకేలకు పాడేరు- సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. డ్రైవర్ పరారు కాగా, సుమారు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో గంజాయి తరలింపు వెనుక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు దళారుల హస్తం ఉందన్న వాదనలు వినిపించాయి. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముందుగా అంబులెన్స్ డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. సూత్రధారులు తమ నాయకుడైన ఓ ప్రజాప్రతినిధితో ఒత్తిడి తేవడంతో పోలీసులు కేసును పట్టించుకోవడం మానివేశారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు.. అసలేం జరుగుతోంది.. అన్న కోణంలో అధికారుల దర్యాప్తు సాగలేదు. పట్టుబడిన అంబులెన్స్కు ముందు పెలైట్గా వెళుతున్న బైక్ను అప్పట్లో జి.మాడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నడిపిన వ్యక్తి మాత్రం పరారయ్యాడు. ఇప్పటికీ ఆ నిందితుడు ఎవరనేది పోలీసులు కనిపెట్టలేదు. బైక్ మాత్రం నేటికీ జి.మాడుగుల స్టేషన్లోనే ఉంది. స్థానికసంస్థల ప్రజాప్రతినిధి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి నేతగా హల్చల్ చేస్తుండటంతో ఇక ఆ కేసు ఊసు కూడా పోలీసులు ఎత్తడం లేదు. గంజాయి రవాణా వ్యవహారంలో ఒక్క డ్రైవర్ను మాత్రమే బలిచేసి కేసును దాదాపుగా మూసేశారు. అసలు నిందితులు తప్పించుకున్నారు.. -డ్రైవర్ మత్స్యరాజు ఆరోపణ ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని గోమంగి ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ మత్స్యరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజు ఉదయం ఆస్పత్రిలో అంబులెన్స్ను ఉంచి పాడేరులోని తమఇంటికి వెళ్లిపోయాయనని.. అయితే మరుసటి రోజు అంబులెన్స్ గంజాయితో దొరికిందంటూ తనపై కేసు పెట్టారని చెప్పారు. తాను గంజాయి లోడ్తో అంబులెన్స్ను నడపలేదని చెప్పినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిందితులు తప్పించుకొని, తాననొక్కడినే బలి చేశారని చెప్పారు. ఆ కేసులో వాస్తవంగా ఎవరెవరు ఉన్నారనేది పోలీసులకు తెలుసునని వ్యాఖ్యానించాడు. ఆరోపణలు వచ్చాయి.. కానీ..: ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర అప్పట్లో ఆ వాహనాన్ని తానే పట్టుకున్నానని ప్రస్తుతం గాజువాకలో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న ఉపేంద్ర చెప్పారు. ‘ఇప్పటివరకు డ్రైవర్ ఒక్కరినే అరెస్టు చేశాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది దీని వెనుక సూత్రధారులని ఆరోపణలు వచ్చాయి. కానీ.. పక్కా ఆధారాలు లభించలేదు. మరో ముగ్గురు నిందితులపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం’.. అని ఆయన చెప్పారు. కేసును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారన్న వాదనలపై మాట్లాడుతూ తాను అప్పట్లో పాడేరులో మొబైల్ పార్టీ సీఐగా మాత్రమే పనిచేశానన్నారు. నిందితులను పట్టుకుని అప్పజెప్పడం మినహా దర్యాప్తులో తమ పాత్ర ఉండదన్నారు. ఈ కేసు విషయమై ప్రస్తుత పాడేరు ఎక్సైజ్ సీఐ కె.రాజారావుతో ‘సాక్షి’ మాట్లాడగా, తాను ఇటీవలే బదలీపై వచ్చానన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుని నిష్పక్షపాతంగా విచారణ చేపడతానని చెప్పారు. దోషులు అధికార పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదన్నారు. ఎమ్మెల్యే రాజీనామాకు సీపీఎం డిమాండ్ ఆనంతగిరి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని అనంతగిరి ఎంపీటీసీ సభ్యుడు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డి.గంగరాజు, సీపీఎం మండల కార్యదర్శి మొస్యాలు డిమాండ్ చేశారు. వారు బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో డీ ఫాం భూముల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్నారు. పాడేరు సబ్ కలెక్టర్ మంగళవారం బహిరంగ విచారణ చేసిన సమయంలో నడిమివలస, పందిరివలసకు చెందిన బాధితులు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి డబ్బులు ఇచ్చి తమ పట్టాలు తీసుకున్నారని తమ దృష్టికి తీసుకుని వచ్చారన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
22 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి నగరానికి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని నూర్మతి గ్రామానికి చెందిన కిమ్ముడు మల్లేష్ ఆటోడ్రైవర్. 2011లో ఇతడి స్నేహితుడు సి.రాజు ఒక రోజు బాడుగకు మల్లేష్ ఆటోను తీసుకున్నాడు. దీన్ని వినియోగించిన రాజు విశాఖ అటవీ ప్రాంతమైన గుండెల్లి నుంచి గంజాయి ఖరీదు చేసి అక్రమ రవాణా చేస్తూ వి.మాడుగుల పోలీసులకు చిక్కాడు. ఆటోను బాడుగకు ఇచ్చిన ఆరోపణలపై పోలీసులు మల్లేష్ను కూడా అరెస్టు చేశారు. జైలు నుంచి బెయిల్పై వచ్చిన ఇతగాడు గంజాయి అక్రమ రవాణాను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసి హైదరాబాద్తో పాటు విజయవాడలో ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు హోల్సేల్గా విక్రయిస్తున్నాడు. మల్లేష్కు కొన్నాళ్ల క్రితం విజయవాడకు చెందిన ప్రైవేట్ టీచర్ గొల్ల కల్యాణ్ బాబుతో పరిచయమైంది. కొన్ని రోజుల క్రితం మల్లేష్కు ఫోన్ చేసిన కల్యాణ్ హైదరాబాద్కు చెందిన సాగర్, విజయ్సింగ్లకు గంజాయి సరఫరా చేయాలని చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలిసి విశాఖపట్నంలోని థంగులం గ్రామానికి చెందిన కామరాజుకు రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చి 40 కేజీల గంజాయి తీసుకున్నారు. దీన్ని డెలివరీ చేసేందుకు కారులో తీసుకుని మంగళవారం నగరానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్రెడ్డి షాహినాయత్గంజ్లోని జోషివాడి వద్ద కాపుకాసి పట్టుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కేసును సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కోటిక్ సెల్ విభాగానికి అప్పగించారు. పరారీలో ఉన్న నగరవాసులు సాగర్, విజయ్సింగ్లతో పాటు థంగులం గ్రామానికి చెందిన కామరాజు కోసం గాలిస్తున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు.