
ఇందిర, రాజీవ్కు పిండ ప్రదానం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరి పిండ ప్రదానాలు చేశారు. మంగళవారం పుష్కర స్నానానికి మంగపేట వెళ్లిన ఆయన పుష్కర ఘాట్లో ఇందిర, రాజీవ్ ఆత్మలకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు.