Rajiv Gandhi
-
మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
స్నేహంలో ఎదగాలి కానీ, స్నేహాలతో ఎదగకూడదు. ‘‘ఎదగటానికి కాకపోతే ఇంకెందుకు స్నేహాలు?!’’ అనే వాళ్లకు నేను ఒకటే చెబుతాను. స్నేహాన్ని నిచ్చెనగా చేసుకొని ఎదగటమంత పతనం వేరే ఇంకేదీ ఉండదు. రాజీవ్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మొదట నేను అదే ఆలో చించాను. ఇద్దరం డూన్ స్కూల్లో స్నేహితులం.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నేహితులం. తను ఇంపీరియల్ కాలేజ్కి మారిపోయాక కూడా స్నేహితులమే. నేను ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరినప్పుడు; శ్రీమతి గాంధీ గవర్నమెంట్లో, ఆ తర్వాత రాజీవ్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రెటరీగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు అంటని స్నేహం మాత్రమే మా మధ్య ఉంది. రాజీవ్ రమ్మంటున్నారు కదా అని వెళితే, స్నేహాన్ని నిచ్చెనగా వేసుకోవటమే అవుతుంది. ఆ మాటే రాజీవ్తో అన్నాను. ‘‘మీకు నిచ్చెన వేస్తానని అనటం లేదు మణీజీ. కేబినెట్కు మీరొక నిచ్చెన అయితే బాగుంటుందని మాత్రమే అడుగుతున్నాను’ అన్నారు రాజీవ్. రాజీవ్ అలా నాతో ఒక రాజనీతిజ్ఞుడిగా మాట్లాడటం అదే తొలిసారి!నాకనిపించిందీ, శ్రీమతి గాంధీ చనిపోయిన రోజు సాయంత్రం కాదు రాజీవ్ ఈ దేశానికి ప్రధాని అయింది, ఇదిగో ఇలా ఒడుపుగా మాట్లాడటం నేర్చుకున్నాకేనని!కేంబ్రిడ్జ్లో మార్క్సిస్ట్ సొసైటీ ఉండేది.అందులో నేను మెంబర్ని. నన్ను కలవటానికి రాజీవ్ అక్కడికి వస్తుండేవారు. తను నాకంటే రెండేళ్లు జూనియర్. స్టూడెంట్స్ యూనియన్కు నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆయన మాట... రాలు పూల తోటలా ఉండేది. కచ్చితంగా ఆయన వల్ల నాకు కొన్ని ఓట్లయితే పడి ఉంటాయి. బహుశా నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచి ఉంటే ఆ హుషారుతో రాజీవ్ రాజకీయాల్లోకి ల్యాండ్ అయ్యేవారా?! లేదు. తల్లి మరణం ఆ పైలట్ తలపై పెట్టి వెళ్లిన కిరీటం ఈ రాజకీయం. కిరీటాన్ని దించకూడదు. కిరీటానికి తలవంపులూ తేకూడదు. ఆ సాయంత్రం – శ్రీమతి గాంధీ హత్యకు గురైన రోజు సాయంత్రం... కొత్త ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి రాజీవ్ మాట్లాడవలసి వచ్చింది. కెమెరాలు ఆయన ముందు గుమికూడాయి. పది మాటలకు పన్నెండుసార్లు తడబడ్డారు రాజీవ్!కానీ, కొద్దిరోజులే ఆ తడబాటు! రాజీవ్కు మాటలు, చేతలు వచ్చేశాయి! పడుతూ లేస్తూనే వెళ్లి దేశ ప్రజలకు దగ్గరయ్యారు. ఆఖరికి – శ్రీమతి గాంధీని నిరంతరం విమర్శిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్న అరుణ్ శౌరి కూడా రాజీవ్ మీద నుంచి చూపు మరల్చుకోలేక పోయారు!రాజీవ్ వెళ్లిపోయి 34 ఏళ్లు. నేను కాంగ్రెస్లోనే ఉండి పోయి 36 ఏళ్లు. ఈ 83 ఏళ్ల వయసులో నా స్నేహితుడు రాజీవ్ గురించి నేను ఏం చెబుతాను? రాజకీయ ధురంధరుడు అనా? అలా చెబితే అది జ్ఞాపకం అవుతుందా? ‘‘కాలేజ్లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు’’ అని చెప్పక పోతేనే మా స్నేహం అపురూపం అవుతుందా?చదవండి: మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ‘‘కాలేజ్లో రాజీవ్ గాంధీ బాగా చదివేవారు కాదన్న సంగతిని ఇప్పుడెందుకు చెప్పటం! అయ్యర్ కి పిచ్చి పట్టింది’’అంటున్నారు అశోక్ గెహ్లోత్, బీజేపీ వాళ్లు వైరల్ చేసిన నా జ్ఞాపకాల క్లిప్ను చూసి. స్నేహంలో ఎదిగినవారు కాదు గెహ్లోత్. స్నేహాల నిచ్చెనలతో ఎదిగినవారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే, సీఎం పదవిని వదులుకోవలసి వస్తుందని సోనియాజీ ఆదేశాన్నే కాదన్న సకుటుంబ, సపరివార స్నేహశీలి ఆయన!ఇలాంటి వాళ్లకు పదవులే జ్ఞాపకాలు. జ్ఞాపకాలనే పదవులుగా మిగిల్చుకున్న నాలాంటి వాళ్లు పిచ్చివాళ్లు!!-మాధవ్ శింగరాజు -
నిద్రలేచిన ‘బోఫోర్స్ స్కాం’
నలభైయ్యేళ్ల క్రితం పుట్టుకొచ్చి, పుష్కరకాలం క్రితం శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్ కుంభకోణం మళ్లీ ఆవులిస్తోంది. దాన్ని సమాధి చేసేవరకూ ఇంచుమించు ప్రతియేటా ఏదో ఒక కొత్త సంగతితో బయటికొస్తూ, వచ్చినప్పుడల్లా పెను సంచలనానికీ, దుమారానికీ కారణమైన బోఫోర్స్ ఆ రకంగా ‘ఎవర్ గ్రీన్’. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన అభ్యర్థన పత్రంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, అమెరికా న్యాయ విభాగాన్ని సంప్రదించటంతో అది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కబోతున్నదని భావించవచ్చు. అప్పట్లో బోఫోర్స్ స్కాంపై దర్యాప్తు చేశామని చెప్పిన అమెరికన్ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ ‘ఫెయిర్ ఫాక్స్’ నుంచి సమాచారం సేకరించాలన్నది సీబీఐ ప్రధాన ధ్యేయం. వాస్తవానికి ఈ అభ్యర్థన పత్రాన్ని జారీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్లోనే ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరూ అధిగమించలేని స్థాయిలో 1984 లోక్సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్కు 404 స్థానాలు సాధించిపెట్టిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీని... ఆ తర్వాత మరో మూడేళ్లకు బయట పడిన ఈ కుంభకోణం ఊపిరాడనీయకుండా చేసింది. ఇందులో తనకు లేదా తన కుటుంబ సభ్యు లకు ఎలాంటి ప్రమేయమూ లేదని రాజీవ్ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికిపైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకూ నిందితులపై కేసు ల్లేవు. దర్యాప్తు లేదు. అంతవరకూ మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్ రేడియో 1987లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్లోనూ పెను సంచలనం కలిగించాయి. ఈ స్కాంలో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతోపాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి నాలుగు వందల 155 ఎంఎం శతఘ్నులు కొనుగోలు చేయటానికి రూ. 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా,అందులో రూ. 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్కు ఏజెంట్గా వ్యవహరించిన విన్చద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ‘ది హిందూ’ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభ కోణంపై వరసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డ్బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.దాదాపు పదిహేనేళ్లపాటు దర్యాప్తు పేరుతో సీబీఐ సాగించిందంతా ఒక ప్రహసనం. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. అతని బ్యాంకు ఖాతాల విషయమై సమాచారం కావాలంటూ భారత్ నుంచి వచ్చిన అభ్యర్థనను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రికి అంతకు ఏడాదిముందు... అంటే 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాధవ్సిన్హ్ సోలంకీ ఉత్తరం అందజేశారు. ఇక 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకొస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచి పైన అయినా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సీబీఐ ముందుకు కదలనే లేదు. వాస్తవానికి అంతకుముందు 2003లో మలేసియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనా లోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు. సరిగదా... లండన్లోని కత్రోచి ఖాతాలకూ, ముడుపులకూ సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి, 2009లో ‘వాంటెడ్’ జాబితా నుంచి అతని పేరు తొలగింపజేయటంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. నిందితులుగా ఉన్న కత్రోచి, విన్ చద్దాలకు రూ. 41 కోట్లు అందాయని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. వీరిద్దరికీ ఏఈ సర్వీసెస్ నుంచీ, స్వెన్స్కా అనే సంస్థ నుంచీ సొమ్ములు బదిలీ అయ్యా యని తెలిపింది. ఆ తర్వాతైనా సీబీఐ చేయాల్సింది చేయలేదు. ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మావల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. నిందితులందరిపై కేసుల ఉపసంహరణకు అనుమతించమని అది దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటుచేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.రాజీవ్ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్ బ్యాంక్లో ‘మాంట్ బ్లాంక్’ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్ ముడుపులున్నాయని తాము కనుగొన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆగ్రహోదగ్రు డయ్యారని ‘ఫెయిర్ ఫాక్స్’ సారథి మైకేల్ హెర్ష్మాన్ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికితీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవు తుంది. ఈసారైనా ఆ పని జరుగుతుందా అనేది వేచిచూడాలి. -
వయనాడ్లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోనియా, రాహుల్ను నాడు తిట్టిన కారణంగానే నేడు కవర్ చేసుకునేందుకే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు.కాగా, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహా స్థాపన చేపట్టారు.నాడు సోనియా గాంధీని బలిదేవత, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని తిట్టారు. వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేశారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్టెస్ బాబేజ్ ఆత్మ బాధపడుతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: హైడ్రాపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. -
చీప్ లిక్కర్ తాగావా..? జగ్గారెడ్డి కౌంటర్
-
‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేస్తోంది‘: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్లోని చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx— ANI (@ANI) August 1, 2024 -
వంగలపూడి అనితకు కొండా రాజీవ్ కౌంటర్
-
రాజీవ్ వర్ధంతి: 1991 మే 21న ఏం జరిగింది?
ఈరోజు(మే 21) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 21న ప్రతి ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడిలో హతమయ్యారు. ఆత్మాహుతి బాంబర్ బెల్ట్ బాంబును ప్రయోగించారు. రాజీవ్ గాంధీతో పాటు అక్కడున్న పలువురు హతమయ్యారు.రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ ఎన్నికల సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ)కు చెందిన మహిళా సభ్యురాలు రాజీవ్ గాంధీ పాదాలను తాకి, బాంబును పేల్చివేసింది. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్లా పైకి లేచింది. ఈ ఘటనలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.రాజీవ్ గాంధీ హత్యానంతరం విపి సింగ్ ప్రభుత్వం మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉగ్రవాదాన్ని నిర్మూలనకు పాటుపడతామని ప్రమాణం చేస్తారు. అలాగే, ఈ రోజుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక సందేశాలు పంపిస్తారు.భారత ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం తన 40 ఏళ్ల వయస్సులో దేశానికి ప్రధాని అయ్యారు. తన పదవీ కాలంలో రాజీవ్ పలు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అవి నేడు ఎంతో ఉపయోగకరమైనవిగా నిరూపితమయ్యాయి.రాజీవ్ గాంధీ 1986లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. రాజీవ్ గాంధీ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారు. దేశంలో కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చారు. సూపర్ కంప్యూటర్ల రూపకల్పనకు ప్రోత్సాహాన్ని అందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించారు. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు అందించారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
గీతాంజలి పిల్లల బాధ్యత ఎవరిది? కొండా రాజీవ్ ఎమోషనల్
-
రాజీవ్ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ మృతి!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు. క్రిప్టోజెనిక్ సిర్రోసిస్తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు. 2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు. -
జూ.ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోయినట్టే..!
-
చంద్రబాబును ఎందుకు గుర్తుపెట్టుకోవాలో లోకేష్ చెప్పగలడా ?
-
రాజస్థాన్ ఎన్నికలు: నోరు జారిన ఖర్గే, క్షమాపణలు
రాజస్థాన్ ఎన్నికల సభలో కాంగ్రెస్సీనియర్ నేత నోరుజారి ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును ప్రస్తావించడం వైరల్గా మారింది. సోమవారం ఒక బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఒక సందర్భంగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరుకు బదులుగా ఆయన కుమారుడు రాహుల్ గాంధీపేరును పేర్కొనడం విమర్శలకు తావిచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ ‘యే కబ్ హువా?’ (ఇది ఎప్పుడు జరిగింది?) ట్విటర్లో ఆక్షేపించింది. అనూప్గఢ్ (Anupgarh)లో ఏర్పాటు చేసినబహిరంగసభలో ఖర్గేమాట్లాడుతూ ‘రాహుల్గాంధీ లాంటి నేతలు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, వెంటనే పొరపాటు గ్రహించిన ఆయన క్షమాపణలు చెప్పారు. పొరపాటున రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చారు. జాతి సమైక్యత కోసం రాజీవ్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులున్నారు. కానీ బీజేపీలో మాత్రం ప్రాణాలు తీసే నేతలు ఉన్నారంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాగా రాజస్థాన్లో నవంబర్ 25వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఖర్గే, సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, సీపీ జోషి ఇతర పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోకు ‘జన ఘోషన పత్ర’గా పేరు పెట్టారు. 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకం.ఫలితాలు డిసెంబరు 3న వెల్లడికానున్నాయి. ये कब हुआ? pic.twitter.com/OCCR65Q1qc — BJP (@BJP4India) November 20, 2023 -
నాటి రాజీవ్ సభ చారిత్రకం.. సీటు మాత్రం బీజేపీ పరం!
అది..1985.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రచారానికి రహ్లీ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. భారీగా జనం హాజరు కావడంతో ఆ సభ చారిత్రాత్మకంగా నిలిచింది. రాజీవ్ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. బహిరంగ సభ విజయవంతమైన నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మహదేవ్ ప్రసాద్ వరుసగా మూడోసారి రికార్డుస్థాయి ఓట్లతో విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలంతా భావించారు. అయితే మహాదేవ్ ప్రసాద్కు ప్రత్యర్థిగా బీజేపీ 32 ఏళ్ల గోపాల్ భార్గవ్ను రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడగానే అందరూ ఉలిక్కిపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహదేవ్ తన ప్రత్యర్థి భార్గవపై దాదాపు 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ ఈ ఓటమిపై విశ్లేషణ చేసింది. బుందేల్ఖండ్లో ఓటర్లు నోటాను విరివిగా ఉపయోగించారని, ఇక్కడి ఓటర్లు అన్ని పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తేలింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అప్పటి అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నేత శ్యామ చరణ్ శుక్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, రహ్లీ నుండి మహదేవ్ ప్రసాద్ హజారీ పేరును సూచించారు. తొలుత మహదేవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినా, ఆ తర్వాత అంగీకరించారు. కాగా నాటి నుంచి ఇప్పటి వరకు రహ్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ గెలవలేదు. 1985 నుంచి బీజేపీ ఈ సీటును గెలుచుకుంటూ వస్తోంది. ఈ ట్రెండ్ 2018 వరకు కొనసాగుతూ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో గోపాల్ భార్గవ ఈ స్థానం నుంచి బీజేపీ టికెట్పై వరుసగా 9వ సారి పోటీకి దిగారు. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం? -
నారా లోకేష్ అరెస్ట్ పక్కా: కొండా రాజీవ్ గాంధీ
-
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం!
నేడు భారతదేశంలో భారీగా ఫీజులు వసూలు చేసే న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయితే వీరిలో రామ్ జెఠ్మలానీ పేరు ముందుగా వినిపిస్తుంది. అత్యధిక ఫీజులు, వివాదాస్పద కేసులు, క్లయింట్ల జాబితా కారణంగా రామ్జఠ్మలానీ పేరును నేటికీ తలచుకుంటుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రినూ తన హవా చాటారు. రామ్ జెఠ్మలానీ 1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్తాన్లోని సింధ్లోని షికార్పూర్లో జన్మించారు. తన 17 సంవత్సరాల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్తో ఎల్ఎల్బీ పట్టా పొందారు. నాటి బొంబాయి శరణార్థుల చట్టానికి వ్యతిరేకంగా జెఠ్మలానీ పిటిషన్ వేశారు. అమానవీయమైన అంశం అయినందున దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే ఆయన గెలిచిన మొదటి కేసు. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1959లో నానావతి కేసులో జెఠ్మలానీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నేవీ అధికారి కేవాస్ మాణిక్షా నానావతి తన భార్య ప్రియుడి కాల్చి చంపి, పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ కేసులో కేవాస్ మాణిక్షా నానావతి తరపున న్యాయపోరాటం చేయడం ద్వారా జెఠ్మలానీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1960వ దశకంలో రామ్జెఠ్మలానీ హాజీ మస్తాన్తో సహా పలువురు స్మగ్లర్ల కేసులను వాదించారు. ఈనేపధ్యంలో రామ్ జెఠ్మలానీ.. స్మగ్లర్ల లాయర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. జెఠ్మలానీ చాలా కాలం డిఫెన్స్ లాయర్గా ఉన్నారు. తాను న్యాయవాదిగా మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడు. అందుకే ఆయన తన దగ్గరకు వచ్చేవారు నేరస్తులా కాదా అనేది పట్టించుకోలేదని చాలామంది చెబుతుంటారు. కొన్ని కేసులను స్వీకరించేందుకు రామ్ జఠ్మలానీ రూ. 25 లక్షల వరకు తీసుకునేవారని అంటారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది ఆయనే. పార్లమెంట్పై దాడికి పాల్పడిన కాశ్మీరీ ఉగ్రవాది అఫ్జల్ గురు తరపున కూడా ఆయన వాదించారు. కానీ ఈ కేసులో రామ్ జఠ్మలానీ విజయం సాధించలేదు. జెఠ్మలానీ గతంలో బీజేపీ నేత ఎల్కె అద్వానీ తరపునా న్యాయపోరాటం చేశారు. అద్వానీని సమర్థించారు. అంతే కాకుండా అమిత్ షా, లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప, జయలలిత, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన రాజకీయ నాయకులపై ఆయన కేసులు పెట్టారు. రాంజెఠ్మలానీ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.ఆయన రెండుసార్లు బీజేపీ లోక్సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా,అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. జెఠ్మలానీ.. కాన్సైన్స్ ఆఫ్ మార్విక్, జస్టిస్ సోవియట్ స్టైల్, బిగ్ ఈగోస్-స్మాల్ మ్యాన్, కాంఫ్లిక్ట్స్ ఆఫ్ లాస్, మార్విక్ అన్చేంజ్డ్ అండ్ అన్రిపెంటెంట్ అనే పుస్తకాలను రాశారు. రామ్ జఠ్మలానీ పదవీ విరమణ చేసిన రెండేళ్ల అనంతరం 2019, సెప్టెబరు 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆమె మెడలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్! -
నాటకీయత లేని యాక్షన్ సినిమా
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది. ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో! ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్ను మనం ఊహించుకోవచ్చు. పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’ ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు. ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు. బేనజీర్తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే. అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్లోని ఓ రెస్టారెంట్లో బేనజీర్తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం! ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు ?
-
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్ప్రదేశ్ ముజఫ్ఫర్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’ -
రాజీవ్ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొనియాడారు. రాజీవ్ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. గాందీభవన్లోనూ.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆధునిక సాంకేతిక సారధి.. టెక్నాలజీకి ఆయనొక వారధి!
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన దివంగత భారత ప్రధాని 'రాజీవ్ గాంధీ' గురించి అందరికి తెలుసు. ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కుడైన ఈయన హయాంలో సమాచార, కమ్యూనికేషన్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. నేడు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెలికామ్ రంగంలో విప్లవం.. అప్పట్లో 'రాజీవ్ గాంధీ' ప్రభుత్వం కమ్యూనికేషన్ నెట్వర్క్ను విస్తరిస్తూ పట్టణాలలో గ్రామాలలో సహాయక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపట్టింది. దీనికోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ శామ్ పిట్రోడాను సలహాదారుగా నియమించుకుని 'సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్' (C-DOT)ని ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు, భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా పురుడుపోసుకున్నాయి. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రారంభం.. రాజీవ్ గాంధీ హయాంలో 1986లో టెలిఫోన్ నెట్వర్క్ను విస్తరించడం జరిగింది. ఇందులో భాగంగానే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభమైంది. టెలికామ్ నెట్వర్క్ డెవలప్మెంట్.. టెలికామ్ నెట్వర్క్ కూడా ఈయన హయాంలోనే బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO) విప్లవం గ్రామీణ భారతదేశం ఆకాంక్షలను సాకారం చేయడంలో సహాయపడింది. గ్రామీణ & పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడంలో ఇది సహాయపడింది. ఇదీ చదవండి: ఫోన్ కొనుక్కోవడానికి ఏడాది జాబ్.. ఇప్పుడు స్మార్ట్ఫోన్ కంపెనీకే సీజీఓ డిజిటల్ ఇండియా.. భారతదేశంలో డిజిటల్ విప్లవం బాగా అభివృద్ధి చెందటానికి రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ పరిశ్రమలు చాలా కృషి చేశాయి. అంతే కాకుండా వీరి కాలంలోనే కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి.. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాయువేగంగా అభివృద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పన్నులు, కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై సుంకాలను (ట్యాక్స్) బాగా తగ్గించారు. దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమని భావించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. -
బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్
నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్లతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్లో సన్బాత్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు. ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు
-
'ప్రధాని మోదీకి కూడా వారిలాగే..' అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు. లోకమాన్య తిలక్ అవార్డ్ అందుకోవడానికి ప్రధాని మోదీ మహారాష్ట్రకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్.. ప్రధాని మోదీని కొనియాడారు. దేశంలోనే గాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ప్రతి రోజూ 18 గంటలపాటు పనిచేస్తున్నారు. దివాళీ సందర్భంగా దేశమంతా ఇంట్లో పండగ చేసుకుంటే ఆయన మాత్రం సరిహద్దుల్లో సైన్యంతో దివాళీ జరుపుకుంటారని అజిత్ పవార్ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.. ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకెవరికీ లేవు అంటూ అజిత్ పవార్ మోదీని కొనియాడారు. ఇందిరా గాంధీకి అప్పట్లో ఇదే విధమైన గౌరవం దక్కింది. మళ్లీ రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుంది. అదే విధమైన గౌరవాన్ని ప్రధాని మోదీ పొందుతున్నారని అజిత్ అన్నారు. ఇటీవలే ఎన్సీపీని చీల్చి అధికార బీజేపీ పార్టీలో చేరిన అజిత్ పవార్.. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నిజాన్ని మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అభివృద్ధే ప్రధానమని తెలిపిన అయన.. ప్రతిపక్షంలో ఉంటే సాధించలేమని అన్నారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు, ఆందోళనలు మాత్రమే చేయగలం.. అభివృద్ధి కాదంటూ అజిత్ పవార్ మాట్లాడారు. 'మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలందరూ స్వాగతం పలికారు. నేను, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ కాన్వాయ్లోనే ఉన్నాం. ఎవరు కూడా నల్ల జెండాలను చూపించలేదు. రోడ్డుకు ఇరువైపులా నిలపడి మోదీకి స్వాగతం పలికారు. దేశంలో రక్షణ పరంగా మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానియైనా కోరుకుంటారు. మణిపూర్ అంశాన్ని ఎవరు కూడా మద్దతివ్వరు. ప్రధాని ఆ సమస్యను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది. మణిపూర్ అంశాన్ని అందరం ఖండిస్తున్నాం.' అని అజిత్ పవార్ అన్నారు. ఇదీ చదవండి: గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు -
శ్రీలంకకు పంపించండి
సాక్షి, చైన్నె: తనతో పాటు తిరుచ్చి శిబిరంలో ఉన్న వారిని శ్రీలంకకు పంపించాలని ప్రధాని నరేంద్రమోదీకి రాజీవ్ హత్య కేసులో విడుదలైన శాంతను విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు ప్రధానికి లేఖ రాశాడు. వివరాలు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన నళిని, మురుగన్, పేరరివాలన్ శాంతన్, రవిచంద్రన్, రాబర్ట్, జయకుమార్ను గత ఏడాది సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో నళిని, పేరరివాలన్, రవిచంద్రన్ తమిళనాడు వాసులు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. దీంతో వీరిని శ్రీలంకకు పంపించడంలో సమస్యలు నెలకొని ఉన్నాయి. దీనిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మురుగన్, శాంతన్, రాబర్ట్ను తిరుచ్చి కేంద్ర కారాగారం ఆవరణలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. అయితే, తమను బయటకు పంపించాలని పదేపదే ఈ నలుగురు నిరసనలకు దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శని వారం శాంతను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. జైల్లో ఉన్నప్పుడే తమకు స్వేచ్చ ఉండేదని, అయితే ఇక్కడ చీకటి గదుల్లో తమను బంధించినట్లుగా పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఇక్కడ తాము నలిగి పో తున్నామని, దయ చేసి శ్రీలంకకు పంపించాలని కోరాడు. రక్త సంబంధీకులను మాత్ర మే చూసేందుకు ఇక్కడ అనుమతి ఇస్తున్నారని, తమకు రోజు వారీగా ఆహారం ఖర్చు రూ. 175 ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని పేర్కొన్నాడు. శ్రీలంకకు త్వరితగతిన పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాడు. -
ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల కాలం పూర్తైంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నాం. ఎన్నికల వరకు రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే మోదీ లక్ష్యం. గత పాలనలోని మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోదీదే. గతంలో ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదం మంచిదే. ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశ్యంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందించడం సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో కేంద్ర పథకాల విషయంలో రూపాయి పేదవాడికి పంపిస్తే 15 పైసలు మాత్రమే అందుతున్నాయని రాజీవ్ గాంధీ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీబీటీ విధానంతో లబ్ధిదారుడికి నేరుగా ప్రధాని మోదీ ప్రయోజనం చేకూరుస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘మానవత్వం లేని కేసీఆర్ ప్రభుత్వం’ -
బీజేపీకి పిచ్చిపట్టింది.. ఉత్తరాఖండ్ మంత్రి వ్యాఖ్యలపై రావత్ ఫైర్..
డెహ్రాడూన్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు, ప్రమాదాలు అని ఉత్తరాఖండ్ బీజేపీ మంత్రి గణేష్ జోషి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి పిచ్చి పట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. వారి త్యాగాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రావత్ ఈమేరకు ఏఎన్ఐ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధానులు ఇంధిరా గాంధీ, రాజీవ్ గాంధీలవి హత్యలు కాదు ప్రమాదాలు అని గణేష్ జోషి అన్నారు. బలిదానం అనేది గాంధీ కుటంబాల గుత్తాదిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముంగిపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన నానమ్మ, నాన్న చనిపోయిన వార్తలను ఫోన్ ద్వారానే తెలుసుకున్నానని, ఆ ఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం.. -
‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే’
ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి.. గాంధీ కుటుంబాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలేనని అవి బలదానాలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా బలిదానం అనేది గాంధీ కుటుంబాల గుత్తాధిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో జరిగిన ఆ రెండు హత్యలు ప్రమాదాలేనన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ శ్రీనగర్లోని భారత్జోడో యాత్ర ముగింపులో ప్రసంగిస్తూ దేశ సేవలోనే తన తండ్రి, నానమ్మలు ప్రాణాలు వదిలారంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జోషి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ యాత్ర సజావుగా సాగడంలో ప్రధాన మంత్రి మోదీ ఘనత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. అక్కడ భారత్ జోడో యాత్ర జయప్రదం కావడంలో ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఆయన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అందువల్లే రాహుల్ లాల్చౌక్లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగారని జోషి అన్నారు. కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు ప్రసంగంలో తన నానమ్మ, నాన్న చనిపోయారన్న దుర్వార్తను ఫోన్కాల్ ద్వారానే తెలుసుకున్నామని, నాటి ఘటనలు తలుచుకున్నా బాధగ అనిపిస్తుందని చెప్పారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్ అన్నారు. ఈ బాధ కేవలం ఒక ఆర్మీ మనిషికే అర్థమవుతుంది. పుల్వామాలో మరణించిని సీర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి అవగతమవుతుంది. ఆ విషాద ఘటనల తాలుకా కాల్స్ ఎలా ఉంటాయో కాశ్మీరులు కూడా బాగా అర్థం చేసుకోగలరని అన్నారు రాహుల్ గాంధీ. (చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. ప్రజల బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ముగింపు సభలో రాహుల్.) -
రాజీవ్గాంధీతో సాన్నిహిత్యం... వైఎస్ఆర్తో అనుబంధం
-
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్లు.. అసలు ఆనాడేం జరిగింది?
నరకం, అవును నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే.. కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే.. రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే.. నిజంగా నరకమే. 1991లో అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్ను మట్టుపెట్టిన ఎల్టీటీఈ గ్యాంగులో మెజార్టీ దోషులు సెనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్ది జైల్లో ఉన్నారు. వీరికి ఉరి శిక్ష తృటిలో తప్పినా.. యావజ్జీవం మాత్రం వెంటాడింది. మెజార్టీ తమిళులు మద్దతివ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు పెరిగి చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి కలిగింది. అసలు నాడేమీ జరిగింది.? జైలు పక్షుల సమగ్ర కథనం ఇది.. ఒక నాయకుడు... ఒక నిర్ణయం... ఒక హత్య, తెర వెనక కొన్ని వందలమంది, అరెస్టయింది 26 మంది... శిక్ష పడింది ఏడుగురికి, ఉరి శిక్ష మాత్రం నలుగురికి. సినిమాను మించిన ఎన్నో ట్విస్టులను ఒక్కబిగిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991లో రాజీవ్ హత్య జరిగింది. ఆ కేసు చాలా మలుపులు తిరిగింది. ఎంతో మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినా.. చివరికి దోషులుగా తేలింది 26మంది. అయితే వీరిలోనూ నేరుగా ప్రమేయమున్న వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. దాదాపు ఐదేళ్ల పాటు సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులోనూ సుదీర్ఘంగా కేసు నడిచింది. 1999లో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఇక తమ జీవితం ముగిసిందనుకున్నారు దోషులు. రాజీవ్ను చంపిన పాపానికి నేడో, రేపో ఉరి తీయడం ఖాయమనుకున్నారు. అయితే ఎక్కడో ఆశ మిగిలింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. కేసు మరికొంత కాలం సాగింది. ఈలోగా తమిళనాడులో సీను మారింది. రాజీవ్ను హత్య చేయడం సరే కానీ, అరెస్టయిన వాళ్లు అమాయకులు, కేవలం ఓ ఆపరేషన్లో భాగమయ్యారన్న ప్రచారం తమిళనాడంతా పాకింది. దీంతో దేశంలో ఎప్పుడూ లేనట్టుగా నేరస్థులపై సానుభూతి వెల్లువెత్తింది. 1999లో నలుగురికి మరణశిక్షను నిర్దారించింది సుప్రీం. అయితే తమిళనాడులో పరిస్థితి మాత్రం మారింది. దోషులకు అనుకూలంగా రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ఒకరేంటీ తమిళనాట జనమంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కేంద్రంలో పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు. ఈ లోగా 2006లో మరో బాంబు పేల్చింది ఎల్టీటీఈ. 2006లో రాజీవ్ హత్య వెనక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని తెలిపాడు ప్రభాకరన్. నిజానికి 1990లలో ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు, ఎల్టీటీఈ లీడర్లతో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్.. నేరుగా రాజీవ్ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక సమస్య ఉండదనుకున్నారు రాజీవ్. రాజీవ్ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్.. జాఫ్నా వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్నే ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటలిజెన్స్ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల బోగట్టా. నిజానికి ఆ సమయంలో ప్రధాని ఎవరున్నా.. నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నది సీనియర్ అధికారులు ఎవరయినా చెబుతారు. ఎవరూ ఊహించనివిధంగా పెరంబూదూర్లో హత్యకు స్కెచ్ వేసిన ఎల్టీటీఈ పకడ్బందీగా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాత అంతే వేగంగా సిట్ అధికారులు హత్య కేసును చేధించారు. 2006లో ఈ విషయన్నాంతా వెల్లడించిన ఎల్టీటీఈ.. తప్పు చేశాడు కాబట్టే శిక్షించాం అన్న రీతిలో వ్యవహరించింది. ఎల్టీటీఈ ప్రకటనతో జైల్లో ఉన్న ఖైదీల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎప్పటికప్పుడు ఉరి విషయానికి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరిగింది. (రాజీవ్ హత్యకేసుకు సంబంధిత కథనాల కోసం కింద లింక్స్ క్లిక్ చేయండి) (Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!) (రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!) (ఇందిర చేసిన తప్పే రాజీవ్ను బలి తీసుకుందా?) -
రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!
శ్రీ పెరంబుదూర్.. ప్రస్తుత చెన్నై ఒకప్పటి మద్రాస్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన శ్రీమతి మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్ను చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి RK రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ AJ దాస్కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్.. తన కూతురి కోకిలను ఆ లిస్ట్లో చేర్చాలంటూ దాస్పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కూతురు లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేది. ఐతే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజీవ్గాంధీ వైజాగ్ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. ఐతే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ ఐన రాజీవ్.. తాను కూడా ఓ చేయి వేసి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ విమానం వద్దకు వచ్చేశారు. సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్లోని మీనంబాకం ఎయిర్పోర్ట్కు చేరారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు. రాజీవ్ రావడంతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వేదికవైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న రాజీవ్ను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీపడ్డారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజి దగ్గరకు చేరింది. ఐతే ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. స్థానిక ఫోటోగ్రాఫర్ హరిబాబుతో కలిసి వచ్చిన ఆ యువతి మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది. లతా కణ్నన్, ఆ పక్కనే ఆమె కూతురు కోకిల, వారికి కాస్త దూరంగా విలేఖరిలా ఉన్న ఓ యువకుడు, అతనికి దగ్గర్లో ఫోటోగ్రాఫర్ హరిబాబు.. వారికి సమీపంలో గంధపు దండ చేతిలో పట్టుకున్న కళ్లద్దాల యువతి.. ఆమెకు కొద్ది దూరంలో మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభ. ఇదీ సభా స్థలి వద్ద పరిస్థితి. ఒక్కో క్షణం భారంగా గడుస్తోంది. రాజీవ్ను మింగేయడానికి మృత్యువు నెమ్మదిగా ముందుకొస్తోంది. ఇవేమీ తెలియని రాజీవ్... చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఆ ఊపులోనే స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనకాలే నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా SI అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది. కాలం కూడా ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది. SI వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్ను మృత్యువు కాటేసింది. -
ఎట్టకేలకు నళిని విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?
Rajiv Gandhi Case Nalini Sriharan.. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న వారు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలవుతున్నారు. దాదాపు 31 సంవత్సరాల జైలు జీవితం అనంతరం దోషిగా ఉన్న నళిని బయటకు వచ్చారు. ఇక, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీవ్ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్ వెల్లూర్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. కాగా, జైలు అధికారులు.. అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత నళినిని విడుదల చేశారు. ఇక, రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినితో పాటు రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనును కూడా విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నళిని, రవిచంద్రన్లు దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. మరోవైపు.. రాజీవ్గాంధీ హత్య కేసులో నళిని, శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. గత మే 18న పెరారివాళన్ పెరోల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక, 1991లో శ్రీపెరంబుదూర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ మృతిచెందారు. #RajivGandhiAssassination | A day after the Supreme Court ordered the release of the six remaining convicts in the Rajiv Gandhi assassination case, #NaliniSriharan was released from Vellore jail on Saturday.https://t.co/3n7kxF5oZF pic.twitter.com/9z5h8jn9M8 — Express Chennai (@ie_chennai) November 12, 2022 -
రాజీవ్ గాంధీ హంతకులకు సుప్రీంకోర్టు లో ఊరట
-
రాజీవ్ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు..
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషుల ముందస్తు విడుదలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో దోషిగా 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన ఎ.జి.పెరారివళన్ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గత మే 18న విడుదలవడం తెలిసిందే. మిగతా దోషులకూ అదే వర్తిస్తుందని న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘వారికి క్షమాభిక్ష పెట్టాలంటూ గతంలోనే తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీంతోపాటు దోషుల సత్ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని తెలిపింది. దాంతో 30 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఎస్.నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, ఆర్.పి.రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పయస్, శంతన్కు విముక్తి లభించింది. శ్రీహరన్, శంతన్, రాబర్ట్, జయకుమార్ శ్రీలంక దేశస్తులు. నళిని, రవిచంద్రన్ ముందస్తు విడుదలకు పెట్టుకున్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సహ దోషి పెరారివాళన్ విడుదలను కోర్టు దృష్టికి తెచ్చారు. 2021 డిసెంబర్ 27 నుంచి వారిద్దరూ పెరోల్పై బయటే ఉన్నారు. మిగతా నలుగురు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. మాకెంతమాత్రమూ అంగీకారం కాదు. కోర్టు సరైన స్ఫూర్తితో వ్యవహరించలేదు’’ అని పార్టీ నేతలు రణ్దీప్ సుర్జువాలా, అభిషేక్ సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులన్నారు. సుప్రీం తీర్పుపై సమీక్ష కోరడమా, న్యాయపరంగా ఇతరత్రా చర్యలు చేపట్టడమా యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు విన్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ప్రధానిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల విడుదలను సమర్థిస్తారో, లేక తీర్పుపై సమీక్ష కోరతారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దోషులను సోనియా, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ క్షమించి ఉండవచ్చు. అది వారి గొప్పదనం. కానీ పార్టీగా వారి నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెస్ సమర్థించబోదు. ఈ విషయంలో పార్టీ వైఖరి ముందునుంచి ఒకేలా ఉంది’’ అని చెప్పారు. తమిళనాట మాత్రం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే దోషుల విడుదలను స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అన్నారు. నళిని తల్లి హర్షం సుప్రీం తీర్పు పట్ల నళిని తల్లి ఎస్.పద్మ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ‘‘అంతులేని ఆనందమిది. నళిని, మేమంతా ఇంతకాలం అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు’’ అన్నారు. పెరోల్పై బయట ఉన్నందున తీర్పుపై స్పందించేందుకు నళిని నిరాకరించింది. ఆమె కూతురు ప్రస్తుతం లండన్లో ఉంటోంది. ఆ రోజు ఏం జరిగింది...? 1991 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21న రాజీవ్గాంధీ తమిళనాడులో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో రాత్రి వేళ సభలో పాల్గొన్నారు. రాత్రి 10:10 సమయంలో శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన తెన్మొళి రాజారత్నం అలియాస్ థాను అనే ఎల్టీటీఈ మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు ఆర్డీఎక్స్తో కూడిన బెల్టు బాంబు పెట్టుకుని రాజీవ్ను సమీపించింది. ఆయనకు పూలమాల వేసింది. కాళ్లకు మొక్కేందుకన్నట్టుగా కిందకు వంగింది. ఆమెను పైకి లేపేందుకు రాజీవ్ కాస్త ముందుకు వంగుతూనే తనను తాను పేల్చేసుకుంది. దాంతో రాజీవ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది కూడా మరణించారు. ఎల్టీటీఈని అడ్డుకునేందుకు శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు శాంతి పరిరక్షణ దళం పేరిట అక్కడికి భారత సైన్యాన్ని పంపుతూ ప్రధానిగా రాజీవ్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహించి సంస్థ అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. విచారణలో మలుపులు 1991 మే 21: రాజీవ్ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 1991 జూన్ 11: పెరారివాళన్ను అరెస్టు చేసిన సిట్. టాడా చట్టం కింద కేసు. 1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్ ఆత్మహత్య. 1992: రాజీవ్ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పథక రచన చేసినట్టు వెల్లడి. 1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1999: నలుగురు నిందితుల అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది. నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. 2001: శంతను, మురుగన్, పెరారివాళన్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 2011: రాజీవ్ను హత్య చేసినందుకు భారత్కు ఎల్టీటీఈ క్షమాపణ. 2014: రాజీవ్ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫార్సు. 2019: నళినికి తొలిసారి పెరోల్. 2021: నళిని, రవిచంద్రన్లకు పెరోల్. 2022: సుప్రీంకోర్ట్ తీర్పుతో మే 18న పెరారివాళన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 2022 సెప్టెంబర్: నళిని, రవిచంద్రన్ విడుదలకు సుప్రీంకోర్ట్ ఆదేశం. నవంబర్ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు. -
Rajiv Gandhi park: అత్యాధునిక హంగులతో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
-
స్వతంత్ర భారతి: బోఫోర్స్ కుంభకోణం
బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలుకు జరిగిన లావాదేవీలలో రాజీవ్ గాంధీకి సన్నిహితులైనవారికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని వెల్లడి కావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉపయోగపడింది. అప్పటి వరకు యువ ప్రధాని రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరు ఉండేది. బోఫోర్స్ ముడుపుల గురించి వెల్లడి కావడంతోనే ఆ మంచి పేరు కాస్తా తుడిచిపెట్టుకుపోయింది. 64 కోట్ల ఆ బోఫోర్స్ ముడుపుల కుంభకోణం నేటికీ దేశంలోని అవినీతికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. దర్యాప్తులు జరగడం, చార్జిషీట్లు దాఖలు అవడం, లెటర్ రొగేటరీలు జారీ అవడం జరిగినా వాస్తవంగా దోషులెవ్వరో ఇంతవరకు రుజువు కాలేదు. ఈ కేసు దేశంలో నేరస్థులకు శిక్ష వేయడంలో న్యాయ వ్యవస్థ వైఫల్యానికి కూడా నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ను అనునిత్య భయపెట్టిన ఈ కుంభకోణం రాజకీయ అవినీతి నిఘంటువులో అంతర్భాగంగా చిరకాలం నిలిచిపోతుంది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ♦124 అత్యద్భుతమైన ఇన్నింగ్స్ కలిగి ఉన్న గవాస్కర్ 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ♦బ్యాంకు చెక్కుల క్లియరెన్సుకు ‘మేగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ’ వాడకం ప్రారంభం. ♦మతకలహాల కారణంగా మీరట్లో జరిగిన అల్లర్లలో పోలీసుల కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన 50 మంది దుర్మరణం. -
నాన్న మరణమే అనుభవ పాఠం: రాహుల్
కేంబ్రిడ్జి: తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం జీవితంలో తనకు అతి పెద్ద అనుభవ పాఠమని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. ‘‘అది నాకు తీవ్ర వేదన మిగిల్చింది. ఒక కొడుకుగా తండ్రిని కోల్పోవడం చాలా బాధ కలిగించింది’’ అన్నారు. లండన్లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో కార్పస్ క్రిస్టి కాలేజీ ఆధ్వర్యంలో ‘ఇండియా ఎట్ 75’ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. నాన్న మరణం తనకెన్నో విషయాలు నేర్పిందన్నారు. భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు. హిందూ జాతీయవాదం, కాంగ్రెస్లో గాంధీ కుటుంబం పాత్ర తదితరాలపై విద్యార్థులు, భారత సంతతి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్ఎస్ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదు. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరం’’ అని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామన్నారు. యూకే పర్యటనలో లేబర్ పార్టీ నేత జెరెమీ కొర్బిన్తో రాహుల్ భేటీని బీజేపీ తప్పుబట్టింది. కొర్బిన్ వ్యక్తం చేసే భారత వ్యతిరేక విధానాలకు వంత పాడుతున్నారా అని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. -
రాజీవ్ మార్గంలో వెళ్లడమే ఆయనకు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో వెళ్లడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్లతో కలసి భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పరుగులు పెట్టించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోని గొప్ప సంస్థలకు దేశానికి చెందిన వారు సీఈవోలుగా ఉన్నారంటే అందుకు రాజీవ్ అమల్లోకి తెచ్చిన విధానాలే కారణమన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారని, ఆయన హయాంలోనే దేశంలో సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జాతి సమైక్యత కోసం నాడు దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని, ఆయన బాటలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ రాష్ట్రాల పర్యటన సీఎం వ్యక్తిగతమని, ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, రుణమాఫీతో పాటు ఇతర రైతాంగ సమస్యలకు పరిష్కారం చూపి ఆయన దేశంలో పర్యటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు నిధులివ్వడంలో తప్పులేదని భట్టి అభిప్రాయపడ్డారు. -
Rajiv Gandhi వర్ధంతి.. ఆ దుర్ఘటనే రాజకీయాల్లోకి లాక్కొచ్చింది
వెబ్డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం. ► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్మూర్తి హౌజ్లో గడిచింది. ఆపై డెహ్రూడూన్లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్లో చదువుకున్నాడు. ► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన. ► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది. ► ఇంగ్లండ్ నుంచి భారత్కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్లో ఆయన పైలెట్ కాగలిగారు. ► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు. ► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు. ► రాహుల్, ప్రియాంక.. రాజీవ్గాంధీ-సోనియాగాంధీల సంతానం. ► తమిళనాడు శ్రీపెరంబుదూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సద్బావన దినోత్సవం
-
అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కొండా రాజీవ్ గాంధీ
-
రాజీవ్ గాంధీ హత్య కేసు: వారిద్దరికి ఎక్కువ రోజులు పెరోల్ కుదరదు
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్కు ఎక్కువ రోజులు పెరోల్ ఇచ్చేందుకు కుదరదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి తెలిపారు. బుధవారం వేలూరు పురుషులు, మహిళా సెంట్రల్ జైలులో ఆకస్మికంగా తనఖీలు చేసి ఖైదీలకు అవసరమైన వసతులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఖైదీలు తయారు చేస్తున్న చెప్పులు, షూలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మురుగన్, నళిని, శాంతన్, ఆరుగురు ఖైదీలతో నేరుగా వెళ్లి మాట్లాడానన్నారు. ఆ సమయంలో మురుగన్, నళిని ఆరు నెలలు పెరోల్ ఇప్పించాలని కోరారని, నెల రోజులు ఇచ్చేందుకు కుదురుతుందని చెప్పానన్నారు. కోర్టు అనుమతి ఇస్తే తాము పెరోల్పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న షూ లు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. జైలులో నిషేధిత పదార్థాలు తీసుకెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గాంధీ, ఎమ్మెల్యే నందకుమార్, కార్తికేయన్, డీఆర్ఓ రామ్మూరి, సబ్ కలెక్టర్ విష్ణుప్రియ, జైళ్లశాఖ డీఐజీ జయభారతి, జైలు సూపరింటెండెంట్ రుక్మణి పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ హంతకులకు దీర్ఘకాలిక పెరోల్?
సాక్షి, చెన్నై : రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు దీర్ఘకాలం ఆంక్షలు, షరతులతో జైలు బయట ఉండేందుకు వీలుగా పెరోల్ నిబంధనల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని గత మంత్రి వర్గం తీర్మానం చేయడం, దాన్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపడం తెలిసిందే. తమను విడుదల చేస్తూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నిందితులు న్యాయ పోరాటం చేశారు. చివరకు బంతి మళ్లీ రాష్ట్రపతి కోర్టులోకి చేరింది. డీఎంకే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంగా నిందితుల విడుదలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అయితే చట్టపరమైన చిక్కులు డీఎంకేను కలవరంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కుమారుడితో సహా మిగిలిన వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని పేరరివాలన్ తల్లి అర్బుదమ్మాల్ బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం స్టాలిన్ను కలిసి విన్నవించారు. వారి విడుదలకు ఎదురవుతున్న చట్టపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ మేరకు నిందితులు ఎక్కువ కాలం జైలులో కాకుండా షరతులు, నిబంధనలకు అనుగుణంగా తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు వీలుగా ఈ మార్గాన్ని ఎంచుకునే పనిలో పడినట్టు సమాచారం. వీరి కోసమే పెరోల్ నిబంధనల్ని మార్పులు చేయడానికి కసరత్తులు సాగుతున్నాయి. నిందితులు ఏడుగురిలో పెరరివాలన్, నళిని, రవిచంద్రన్ మాత్రం తమిళనాడుకు చెందిన వారు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. ఆ ముగ్గురు కుటుంబంతో గడిపేందుకు వీలుగా, మిగిలిన నలుగురిని శ్రీలంకకు పంపించకుండా ఇక్కడి శరణార్థుల శిబిరంలో స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపేందుకు తగినట్టు దీర్ఘ కాలిక పెరోల్ కసరత్తు సాగుతుండటం గమనార్హం. -
ఇప్పుడు చెప్పండి..ఎవరు అగౌరపరిచారో : అమిత్ షా
సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తనపై చేసిన ఆరోపణలపై అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్లోని శాంతికేతన్ పర్యటన సందర్భంగా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చీలో కూర్చొని అమిత్ షా అగౌరవపరిచారంటూ కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. దీనిపై స్పందించిన అమిత్ షా..తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, సీనియర్ నేత అయ్యిండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలే రవీంద్రనాథ్ ఠాగూర్ని అవమానించారని, ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. (మహారాష్ట్రలో మూడు చక్రాల పాలన) గతంలో మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ.. ఠాగూర్ కుర్చీలో కూర్చున్నారని, రాజీవ్ గాంధీ అక్కడ టీ కూడా సేవించారని షా తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన అనంతరం ఠాగూర్ను ఎవరు అగౌరవపరిచారో చెప్పాలని సవాల్ విసిరారు. తాను సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడానికి కిటికీ వద్ద కూర్చున్నానని, గతంలో ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ గాంధీ కూడా అక్కడ కూర్చున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అమిత్ షా సభ ముందు ఉంచారు. మరోవైపు షాపై అధిర్ రంజన్ చౌదరి చేసిన ఆరోపణల్ని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ బిద్యూత్ చక్రవర్తి కూడా తోసిపుచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేశారు. (గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ కన్నీరు) -
రాజీవ్ హత్య కేసు: రాష్ట్రపతి భవన్కు క్షమాభిక్ష
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ఖైదీల విడుదల అంశం రాజ్భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్కు చేరింది. సుప్రీం కోర్టు ఇచ్చి న వారంరోజుల గడువు పూర్తయినా నేటికీ ఎటూ తేలని వ్యవహారంగా మారిపోయింది. సాక్షి, చెన్నై : రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జడ్జి నాగేశ్వరరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్ గత నెల 21న విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. పేరరివాళన్ సహా ఏడుగురు ఖైదీల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 9న సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానంపై గవర్నర్ మూడు లేదా నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పా రు. సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకూడదా అని జడ్జి నాగేశ్వరరావు ప్రశ్నకు అవసరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. విచారణను రెండు వారా లు వాయిదా వేయాలని పేరరివాళన్ తరఫు న్యా యవాది కోర్టును కోరా రు. దీనిపై జడ్జి స్పంది స్తూ తమిళనాడు గవర్నర్ నిర్ణ యం వరకు వేచిచూద్దామని తెలిపారు. మూడు లేదా నాలుగు రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ చెప్పిన మాటలను రికార్డు చేస్తున్నామని చెప్పి విచారణను రెండు వారాలకు వాయిదా వేశా రు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ అఫిడవిట్ను సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసింది. అందులో ‘పేరరివాళన్ క్షమాభిక్షకు సంబంధించిన అన్ని పత్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ విషయంలో రాష్ట్రపతికి మాత్రమే పూర్తి అధికారం ఉంది. చట్ట ప్రకారం ఆయన తగిన నిర్ణయం తీసుకుంటారు.’ అని ఉంది. దీంతో పేరరివాళన్ పిటిషన్పై విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. రాజీవ్ హత్య కేసులో ఖైదీల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు పట్టుపడుతున్నాయి. గవర్నర్ తనకు అధికారం లేదని తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం రాజ్భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్కు చేరింది. -
రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు
సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజక వర్గంలో పర్యటించడానికి ముందు రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి కొంతమంది దుండగులు నల్లరంగు పూశారు. సోమవారం వారణాసిలోని రాజీవ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటనను ఖండిసస్తూ, నల్లరంగు పూసిన విగ్రహాన్ని పాలతో కడిగారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, దోషులుగా తేలిన వారిని శిక్షించాలని కాంగ్రేస్ నాయకులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించారు. ఈ సంఘటనను ఖండిస్తూ ‘‘పోలీసులు ఈ దుండగులను గుర్తించి అరెస్టు చేయాలని’’ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప నాయకులను అగౌరవపరచడం ఎప్పటికీ అనుమతించకూడదని’’ రాజస్థాన్ సిఎం అన్నారు. ఇటువంటి సంఘటనే 2015 డిసెంబర్లో పంజాబ్లోని లూధియానాలో జరిగింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఐడి) తో సంబంధం ఉన్న ఇద్దరు యువకులు సేలం టాబ్రిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహంపైన ఎరుపు, నలుపు రంగులతో స్ప్రే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ విగ్రహానన్ని కాంగ్రెస్ కార్యకర్తలు శుభ్రం చేయగా, ఈ చర్యకు కారణమైన దుండగులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు పాల్పడినట్లు లుధియానా పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వారణాసిలోని జాతీయ రహదారిని ప్రారంభించి, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. వారణాసి ఘాట్లపై లేజర్ ప్రదర్శనను ఆస్వాదించారు. ప్రధాని మోడీ దీపావళి ఉత్సవ్ ప్రసంగంలో మాట్లాడుతూ.. అన్నపూర్ణ దేవత విగ్రహం వారణాసి నుంచి దొంగిలించబడి ఒక శతాబ్దం తరువాత కెనడా నుంచి తిరిగి రావడం ‘‘కాశీకి ఒక ప్రత్యేక సందర్భం’’ అని ప్రధాని తెలిపారు. -
బబిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
షోలాపూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్గాంధీపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ క్రీడాకారిణి బబితా పోగాట్కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. షోలాపూర్లో జరిగిన ఈ ఆందోళనలో బబితా పోగాట్ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు ఆమె పోస్టర్ను చెప్పులతో కొట్టి తమ నిరసనలు తెలిపారు. షోలాపూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దివంగత రాజీవ్గాంధీ క్రీడాకారుల కోసం, యువత కోసం చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బబితా పొగాట్ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. (పవార్, దేశ్ముఖ్లకు బెదిరింపు కాల్స్) -
మాజీ ప్రధాని రాజీవ్కి టీ పీసీసీ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్ : స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.. ఉదయం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు. అలాగే గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, టి.కుమార్ రావ్, బొల్లు కిషన్, ప్రేమ్ లాల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. -
అందుకు గర్విస్తున్నాను : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : నిజమైన దేశభక్తుడికి కుమారుడిగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. నేడు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాహుల్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, పరోపకారి అయిన తండ్రికి కొడుకు అయినందుకు గర్విస్తున్నాను. ప్రధాన మంత్రిగా రాజీవ్ గారు దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించారు. తన దూరదృష్టితో దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా.. అప్యాయతతో, కృతజ్ఞతతో ఆయనకు నమస్కరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించింది. రాజీవ్కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. ‘యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి’ అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి. एक सच्चे देशभक्त,उदार और परोपकारी पिता के पुत्र होने पर मुझे गर्व है।प्रधानमंत्री के रूप में राजीव जी ने देश को प्रगति के पथ पर अग्रसर किया।अपनी दूरंदेशी से देश के सशक्तीकरण के लिए उन्होंने ज़रूरी कदम उठाए।आज उनकी पुण्यतिथि पर मैं स्नेह और कृतज्ञता से उन्हें सादर नमन करता हूँ। pic.twitter.com/aDdKMf74wK — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2020 -
రాజీవ్ గాంధీకి శుభాకాంక్షలు: రాహుల్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో పంచాయతీ వ్యవస్థ కీలకంగా మారిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అవసరార్థులను చేరుకోవడంలో పంచాయతీ వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ‘ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. స్థానిక, స్వీయ పరిపాలన సృష్టికర్త అయిన రాజీవ్ గాంధీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాను. పంచాయతీ అధిపతులు, స్థానిక సంస్థల సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో దేశంలో సహాయం అవసరమైన ప్రతిఒక్కరిని గుర్తించడంలో పంచాయతీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంద’ని రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్పంచ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్పోర్టల్ను ప్రధాని ప్రారంభించారు. కరోనా విలయంతో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. చదవండి: అందరికీ న్యాయం జరగడం ముఖ్యం అంటున్న అఖిలేశ్ -
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్గాంధీ పెయింటింగ్కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
రాజీవ్ హత్య: గవర్నర్నే సాగనంపే యత్నం
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకుల విడుదల కోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్నే సాగనంపే ప్రయత్నం న్యాయస్థానంలో బెడిసికొట్టింది. సదరు పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజీవ్గాంధీ హత్యకేసులో నళిని, మురుగన్, పేరరివాళన్, రాబర్ట్పయాస్, జయకుమార్, శాంతన్, రవిచంద్రన్.. ఈ ఏడుగురు ఖైదీలు వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి తొలుత పడిన ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. యావజ్జీవ ఖైదీలుగా 28 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతూ గతంలో కొందరు వేసిన పిటిషన్కు సుప్రీంకోర్టు సానుకూలంగా ఒకింత స్పందించింది. ఖైదీల విడుదల అంశంపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ విచక్షణకు వదిలేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పరిణామాలు చోటుచేసుకోగా వారి విడుదలకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమె తీర్మానం చేశారు. సదరు ఫైల్ను సుమారు నాలుగేళ్ల క్రితమే గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపారు. రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు రాజీవ్ హంతకుల విడుదల కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వ ఉదాసీనత వల్లే విడుదలలో జాప్యం చోటుచేసుకుందని ఆక్షేపించాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సైతం 2018 సెప్టెంబర్ 9వ తేదీన అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి గవర్నర్ బంగ్లాకు పంపారు. ఈ దశలో రాజీవ్గాంధీతో పాటు మరణించిన వారి కుటుంబాల ఖైదీల విడుదలకు అభ్యంతరం తెలుపుతూ గవర్నర్కు వినతిపత్రాలు పంపారు. ఇది కేవలం రాజీవ్గాంధీ, ఖైదీల కుటుంబాలకు చెందిన అంశం కాదు ఇంటి పెద్ద మరణంతో తామంతా కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదన లేవనెత్తారు. ఈ దశలో గవర్నర్ న్యాయశాస్త్ర నిపుణులను రాజ్భవన్కు పిలిపించుకుని చర్చించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించారు. సుమారు రెండున్నరేళ్లపాటు గవర్నర్ అనేక విడతలుగా రాజీవ్ హంతకుల విడుదల అంశంపై సమీక్షలు జరిపారు. ఆ తరువాత నుంచి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రాజీవ్ హంతకుల విడుదలపై గవర్నర్ ఔనని..కాదని..ఏ విషయాన్ని ప్రకటించక పోవడంతో రెండేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. ఏడుగురు ఖైదీల విడుదల విషయం దాదాపూ మూలపడిందనే చెప్పవచ్చు. గవర్నర్ను రీకాల్ చేయాలంటూ పిటిషన్ అసెంబ్లీ మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన గవర్నర్ భన్వారీరాల్ రాజ్యాంగాన్ని ధిక్కరించినందున అతడిని రీకాల్ చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చెన్నై కున్రత్తూరుకు చెందిన తందైపెరియార్ ద్రావిడ కళగం కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కన్నదాసన్ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వివరాలు.. ముఖ్యమంత్రి నియామకం మినహా ఇతర వ్యవహారాల్లో గవర్నర్ స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలులేదని రాజ్యాంగం 356 (1)లో పేర్కొని ఉంది. గతంలో బీజేపీ నేతగా, ఆర్ఎస్ఎస్ సానుభూతిపరునిగా ఉండిన భన్వారీలాల్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించే తమిళులపట్ల తన అయిష్టతను బహిరంగా చాటుకుంటున్నారు. అందుకే మంత్రివర్గ తీర్మానంపై 15 నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్యాంగశాసనాలను ధిక్కరించే విధంగా భన్వారీలాల్ వ్యవహరిస్తున్నందున న్యాయస్థానం జోక్యం చేసుకుని గవర్నర్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తులు సత్యనారాయణన్, హేమలతతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మంత్రివర్గం చేసిన తీర్మానాలపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్కు గడవు అంటూ ఉండదని గతంలోనే కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్రపతిచే నియమితులైన గవర్నర్ను పదవి నుంచి తొలగించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించలేమని వివరిస్తూ సదరు పిటిషన్ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. -
కాంగ్రెస్దే అధికారం
దూద్బౌలి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, నాయకులంతా కలసి కట్టుగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి.కుంతియా అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్గాంధీ సద్భావన స్మారక కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉగ్రవాదుల నిర్మూలన, శాంతి సామరస్యం కోసం చార్మినార్ సద్భావన యాత్ర ప్రారంభించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్గాంధీ అన్నారు.విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ గోపాలకృష్ణను ఎమ్మెల్సీ కమలాకర్ చేతుల మీదగా రాజీవ్గాంధీ స్మారక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్, మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డి. శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ హత్య సరైనదే: సీమాన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం తమిళనాడులో మరోసారి దుమారం లేపింది. శాంతి ఒప్పందం పేరిట శ్రీలంకతో రాజీవ్గాంధీ రాయబారం నడిపినందుకు తామే మట్టుబెట్టామని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అధినేత సీమాన్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎల్టీటీఈ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్ తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వర్గాన్ని హతమార్చిన రాజీవ్గాంధీని తమిళ భూమిలోనే మట్టుబెట్టామన్నారు. చెన్నైలోని సీమాన్ ఇల్లు, ఎన్ఎంకే కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం రావడంతో, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీమాన్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 1991 మే 21వ తేదీన శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంకలో జరుగుతున్న ఎల్టీటీఈ పోరు నేపథ్యంలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు. ఎల్టీటీఈ పోరుకు తమిళనాడులోని అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి. వాటిల్లో ఎన్టీకే కూడా ఒకటని చెప్పవచ్చు. ఎల్టీటీఈకి బహిరంగ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్న సీమాన్ తన పార్టీ పతాకంలో సైతం పులుల బొమ్మకు చోటిచ్చి తన సంఘీభావాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రం నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరీ రాష్ట్రం కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీచేస్తున్నారు. -
రాజీవ్ యుద్ధనౌకను వాడుకున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ తన వ్యక్తిగత ట్యాక్సిగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో రాంలీలా మైదానంలో నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘మిత్రులారా! యుద్ధనౌకను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు.. మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ కాంగ్రెస్ కుటుంబం దేశానికి గర్వకారణం అయిన ఐఎన్ఎస్ విరాట్ను హాలీడే ట్రిప్కు వెళ్లడానికి వ్వక్తిగత ట్యాక్సిగా వాడుకుంది’’ అని విమర్శించారు. రాజీవ్ గాంధీ ఆయన కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ యాత్రపై 1980లో ఇండియా టుడే మ్యాగజైన్ ప్రచురించిన 'ఇడిలిక్ వెకేషన్ ఆఫ్ దీ గాంధీ లక్షద్వీప్ అర్చిపీలాగో' ఆర్టికల్ను మోదీ ట్వీట్ చేశారు. ఆ ఆర్టికల్లో రాజీవ్ గాంధీ తన భార్య సోనియా గాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఆయన అత్త మామలతో కలిసి ఐఎన్ఎస్ విరాట్లో విహర యాత్రకు వెళ్లినట్లుగా ఉంది. అయితే దీనిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయో తెలుసుకోవడాని ఇండియా టూడే, భారత నేవి అధికారులను ఇంటర్వ్యూ చేసింది. దానిలో భాగంగా ఇండియన్ నేవీ యుద్ధ నౌకలను వ్యక్తిగత అవసరాలకు ఎన్నిసార్లు ఉపయోగించారు అనే ప్రశ్నకు.. నేవీ ఇంటిగ్రేటెడ్ అధికారులు భారత నౌకల్లో అనాధికార, ప్రైవేట్ ప్రయాణాలకు అనుమతి లేదని' సమాధానం ఇచ్చింది. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ విహార యాత్రకు ఐఎన్ఎస్ విక్రాంత్ను ఉపయోగించారా? అనే ప్రశ్నకు భారత నావికదళం' దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1987 డిసెంబర్ 28న త్రివేండ్రం నుంచి ఐఎన్ఎస్ విరాట్ను ప్రారంభించారని, 1987 డిసెంబర్ 29 న మినికాయ్ దీవి నుంచి తిరిగి బయలుదేరారు. రాజీవ్ గాంధీతో ఎవరు వెళ్లారు అనే ప్రశ్నకు నావికాదళం ఇలా సమాధానం ఇచ్చింది 'సోనియా గాంధీతో కలిసి రాజీవ్ గాంధీ విరాట్ను ప్రారంభించినట్లు' తెలిపారు. Ever imagined that a premier warship of the Indian armed forces could be used as a taxi for a personal holiday? One Dynasty did it and that too with great swag. Read this and share widely! https://t.co/OcqpHsQ8xM — Narendra Modi (@narendramodi) May 8, 2019 -
రాజ్భవన్లో రాజీవ్ హంతకులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేశారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోగా, రాజీవ్ హంతకుల విడుదల ‘బంతి’ మళ్లీ రాజ్భవన్కు చేరింది. విడుదల చేయాలా వద్దా అనే అంశంలో గవర్నర్ వేగం పెరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తం 1991, మే 21న చెన్నై శివారు శ్రీపెరంబుదూరుకు వచ్చిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురు ఖైదీల ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారగా గత 27 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్షను అనుసరించి సుదీర్ఘకాలం అయిన కారణంగా ఈ ఏడుగురిని విడుదల చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. జయ హయాంలోనే తమిళనాడు ప్రభుత్వం విడుదలకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే మరణించిన వారి కుటుంబాలవారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, గవర్నర్కు ఉత్తరాలు రాయడంతో విడుదలలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే సుప్రీంకోర్టు ఇటీవలే ఆ పిటిషన్ను కొట్టివేయడమేగా, ఇందుకు సంబంధించి ఎలాంటి కేసులు పెండింగ్లో లేనిపక్షంలో ఏడుగురి విడుదలపై గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. వారంలో చట్ట నిపుణుల నివేదిక: ఇదిలా ఉండగా, రాజీవ్ హంతకుల విడుదల ఎంతో సున్నితమైన అంశం కావడంతో గవర్నర్ ఆచితూచి అడుగేస్తున్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం తనకు అందగానే నిర్ణయం తీసుకునేందుకు కోర్టులో కేసులు విచారణలో ఉన్నందున ఏ విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇందుకు సంబంధించిన పనులు మాత్రం ఆనాడే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొందరు మేధావులను రాజ్భవన్కు రప్పించుకుని ఈ విషయంపై చర్చించగా రాజీవ్ హంతకుల విడుదల అంశం 20 ఏళ్లుగా నానుతోంది, అనేక ఘట్టాలను అధిగమించింది. న్యాయస్థానాల్లో అనేక కేసులను ఎదుర్కొంది. ఆయా కారణాల వల్ల అంత సులభంగా నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. జాతీయస్థాయిలో ప్రముఖులైన చట్ట నిపుణులు సలహాలను లిఖితపూర్వకంగా తీసుకుని, అందుకు అనుగుణంగా ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవరర్న్కు వారు సూచించారు. ఈ సలహామేరకు ప్రముఖ చట్ట నిపుణులను గవర్నర్ పురమాయించారు. సుప్రీంకోర్టులోని పిటిషన్ అడ్డుకూడా తొలగిపోవడంతో చట్ట నిపుణుల నివేదిక వారంరోజులు రాజ్భవన్కు చేరుకుంటుందని విశ్వసనీయ సమాచారం. నివేదిక అందగానే రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల కావడం ఖాయమని ఆశిస్తున్నారు. గవర్నర్ మౌనమేల: దురైమురుగన్ ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు నుంచి తాజాగా స్పష్టమైన అనుమతులు లభించినా రాజీవ్ హంతకుల విడుదలపై గవర్నర్ మౌనం పాటించడం ఏమిటని డీఎంకే కోశాధికారి దురైమురుగన్ ఆక్షేపించారు. వేలూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ వ్యవహారశైలి ఎంతో బాధాకరమని, ఇంకా జాప్యం చేసిన పక్షంలో ఆయన హృదయం పాషాణమని భావించాల్సి వస్తుందని అన్నారు. రాజీవ్ హంతకుల విడుదల ఆయన జీవిత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
ఆయన రావణుడు..
ఇండోర్ : సార్వత్రిక సమరం తుది అంకానికి చేరడంతో ప్రధాన పార్టీలు వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ధుర్యోదనుడిగా అభివర్ణించగా, కాషాయ పార్టీ నేత ఒకరు ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని రావణుడిగా పేర్కొన్నారు. బీజేపీ నేత జితు జిరాతి ఇండోర్లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ధుర్యోదనుడితో పోలుస్తున్నారు..అయితే ఆమె తండ్రి దేశాన్ని అమ్మిన రావణాసురుడని బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ అవినీతిలో నెంబర్ వన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంతో ఇరు పార్టీల నడుమ వ్యక్తిగత విమర్శలు తారాస్ధాయికి చేరాయి. -
జరిగిందేదో జరిగింది.. అయితే ఇప్పుడేంటి?
న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కులు మరణించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్యామ్ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పిట్రోడా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ‘ సిక్కు సమాజం ఎంతో వేదన అనుభవించింది. 1984లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ దాడిపై శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇవి.. జరిగిందేదో జరిగిపోయిందట. భారత్ ఇలాంటి పాపాలు చేసిన కాంగ్రెస్ హంతకులను ఎన్నటికీ క్షమించబోదు అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్సింగ్లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. Agony of the entire Sikh community. Suffering of all those Sikh families killed by Congress leaders in 1984. Attack on Delhi’s secular ethos. All Summed up in these three words by Sam Pitroda - Hua To Hua. India will never forgive #MurdererCongress for its sins. pic.twitter.com/ouYXeHJHlf — Chowkidar Amit Shah (@AmitShah) May 9, 2019 -
ఐఎన్ఎస్ విరాట్ చుట్టూ రాజకీయ దుమారం
-
ఐఎన్ఎస్ విరాట్లో వారసుల జల్సా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత నావికా దళ ఆస్తులను గాంధీ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ను తమ కుటుంబం విహారం కోసం వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన మరుసటి రోజే ఇదే అంశంపై జైట్లీ ట్వీట్ చేశారు. పనిమంతులు (కామ్దార్) దేశ నావికా సంపత్తిని ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తే వారసులు (నామ్దార్) వాటిని కుటుంబ సభ్యులతో జల్సా చేసేందుకు వ్యక్తిగత విహారానికి వాడుకుంటారని జైట్లీ ట్వీట్ చేశారు. అంతకుముందు భోఫోర్స్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ రాజీవ్ గాంధీని ప్రధాని మోదీ అవినీతిలో నెంబర్ వన్ అని వ్యాఖ్యానించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. -
‘రాజీవ్ను బీజేపీయే బలితీసుకుంది’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలోకి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని లాగడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ హత్యకు బీజేపీదే బాధ్యతని మండిపడ్డారు. రాజీవ్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్ధలు హెచ్చరించినా అదనపు భద్రత కల్పించేందుకు అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం నిరాకరించడాన్ని బీజేపీ సమర్ధించిందని గుర్తు చేశారు. విద్వేషం కారణంగానే రాజీవ్ తన ప్రాణాలు కోల్పోయారని, తనపై తప్పుడు ఆరోపణలకు బదులిచ్చేందుకు ఆయన మన మధ్య లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ విరాట్ను రాజీవ్ హయాంలో గాంధీ కుటుంబం తమ సొంత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని మోదీ విరుచుకుపడిన మరుసటి రోజు పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత జలాల వద్ద నిఘాను పర్యవేక్షించాల్సిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను పదిరోజుల పాటు రాజీవ్ కుటుంబ సభ్యుల విహార యాత్రకు ఉపయోగించుకున్నారని మోదీ మండిపడ్డారు. -
కాంగ్రెస్ సహా ప్రతిపక్షం చేతులెత్తేసింది
కురుక్షేత్ర/ఫతేహాబాద్/న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఐదు దశలు పూర్తయ్యేసరికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హరియాణాలోని కురుక్షేత్ర, ఫతేహాబాద్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రజల ఆశీర్వాదంతో మే 23వ తేదీ సాయంత్రం వెలువడే ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవ్వడం ఖాయమని తేలిపోయింది. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు విఫలమవడంతో కాంగ్రెస్, దాని అవినీతి కూటమి పార్టీలు చేతులెత్తేశాయి’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ‘అవినీతి పంట’ పండించింది.. గత కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరకే రైతుల భూములను లాగేసుకుని అవినీతి పంట పండించిందని, అందుకు హరియాణానే రుజువని ప్రధాని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి నేతలందరినీ జైళ్లకు పంపడం ఖాయమని కాంగ్రెస్కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వీధివీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ‘పాకిస్తాన్ అంటే కాంగ్రెస్కు ఎంతో ప్రేమ. దేశం సుభిక్షంగా ఉండటం పాక్ పుణ్యమేనంటుంది. రక్షణ విధానం బలహీనంగా ఉన్న ఏ దేశమైనా అగ్రదేశమవుతుందా? తనను తాను రక్షించుకోలేని దేశం మాట ఇతర దేశాలు వింటాయా?’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. సిక్కు వ్యతిరేక దాడులతో సంబంధమున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ సీఎంగా చేసిందని, పరోక్షంగా కమల్నాథ్నుద్దేశిస్తూ అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ఏర్పాటు చేసుకున్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, అమర సైనికులకు స్మృతిచిహ్నం ఒక్కటి కూడా నిర్మించలేకపోయాయన్నారు. నా తల్లిని కూడా దూషించారు ‘ప్రేమ పదకోశం(లవ్ డిక్షనరీ)నుంచి సేకరించిన తిట్లతో నిత్యం తనను దూషించే కాంగ్రెస్ పార్టీ నేతలు.. తన తల్లిని కూడా వదల్లేదని ప్రధాని విమర్శించారు. ‘వారి అవినీతిని అడ్డుకుని, దొరతనాన్ని ప్రశ్నించినందుకే ప్రేమ ముసుగు వేసుకుని హిట్లర్, దావూద్ ఇబ్రహీం, ముస్సోలినీ, ఔరంగజేబ్ కంటే క్రూరుడు, పిచ్చికుక్క, కోతి..ఇలా రకరకాల పేర్లతో నన్ను తిడుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ నా తల్లినీ వారు దూషించారు. నా తండ్రి ఎవరని ఆమెను అడిగారు. ఈ నిందలన్నీ నేను ప్రధాని పదవిని చేపట్టాక చేసినవే’ అని మోదీ పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వం వృథా.. ‘ఏ పనీ చేయని సర్కారుకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వమే ఉదాహరణ. తమను తాము మార్చుకోలేని వాళ్లు దేశాన్ని మార్చుతామంటూ అధికారంలోకి వచ్చారు. చిల్లర ముఠాలను బలపరుస్తూ దేశానికి శత్రువులను పెంచుతున్నారు’ అన్నారు. ఆయుష్మాన్ భారత్ను ఢిల్లీ ఆస్పత్రుల్లో అమలు చేయనందుకే ఆప్ ప్రభుత్వాన్ని ఉపయోగం లేని(నాకామ్ పంతి) ప్రభుత్వంగా మోదీ అభివర్ణించారు. మావోలు, వేర్పాటు వాదులను సమర్ధించే వారిని మోదీ తరచూ చిల్లర (టుక్డేటుక్డే)గ్యాంగ్గా పేర్కొనడం తెల్సిందే. ఐఎన్ఎస్ విరాట్ను ట్యాక్సీలా వాడారు! రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. ‘రాజీవ్గాంధీ, ఆయన బావమరుదుల కుటుంబాలు కలిసి పది రోజుల విహారయాత్రకు బయలుదేరారు. ఆ యాత్రకు దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లో గస్తీ కోసం వినియోగించే ఐఎన్ఎస్ విరాట్ను సొంత ట్యాక్సీ మాదిరిగా వాడుకున్నారు. విరాట్’పై హెలికాప్టర్ను సైతం నేవీ సిద్ధంగా ఉంచింది. విరాట్తోపాటు వారంతా ఒక దీవిలో పది రోజుల పాటు ఆగారు. విదేశీయులను యుద్ధ నౌకలో తీసుకెళ్లడం ద్వారా దేశ భద్రత విషయంలో రాజీ పడలేదా అనేదే నా ప్రశ్న. ఐఎన్ఎస్ విరాట్ను 1987లో భారత నేవీలోకి తీసుకోగా 2016లో విధుల నుంచి తొలగించారు. -
మోదీ వ్యాఖ్యలపై ‘సుప్రీం’కు కాంగ్రెస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిలో నంబర్ వన్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతవారం ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రధాని ఈవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్(ఈసీ)కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాజీవ్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈసీ క్లిన్చిట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్మిత దేవ్ మరోసారి సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి చెడు సంప్రదాయానికి ఒడిగట్టినవారిగా మోదీ, అమిత్ షాను ప్రకటించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. వారికి ఈసీ క్లీన్చిట్ ఇచ్చినట్లు ఉన్న రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు పిటిషన్దారుకు సూచించింది. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ నేత ఆజంఖాన్లపై ఈసీ చర్యలు తీసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. -
‘మోదీకి మానసిక వైద్యం ఎంతో అవసరం’
రాయ్పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్పందిస్తూ.. మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నిద్రలేకపోవడం మూలంగా మోదీకి మతిభ్రమించిందని, వెంటనే ఆయన్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని బాఘేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ రోజుకు మూడు, నాలుగు గంటలే నిద్రపోతున్నారని అందుకే ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా మోదీపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న భూపేష్ బాఘేల్.. తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. సరిగా నిద్రపోనివారు మానసిక అనారోగ్యానికి గురవుతుంటారని, మోదీకి కూడా అలాంటి జబ్బే వచ్చిందని పేర్కొన్నారు. మోదీని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైందని.. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటని బాఘెల్ ప్రశ్నించారు. రాజీవ్ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను మోదీ మర్చిపోవడం దారుణమన్నారు. ఆయన పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని గుర్తుచేశారు. కాగా మే 4న ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘రాజీవ్ క్రూరుడే’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) జాతీయ ప్రతినిధి మజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్ దేశంలోనే అతిపెద్ద మూకహత్యలకు పాల్పడిన క్రూరుడని వ్యాఖ్యానించారు. రాజీవ్ను నెంబర్వన్ అవినీతిపరుడిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా మూక హత్యలను ప్రేరేపించిన ప్రధానిగా రాజీవ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా రాజీవ్ అవినీతిలో అగ్రగణ్యుడే కాకుండా అతిపెద్ద మూకహత్యల ప్రేరేపకుడు కూడా అని ఆరోపించారు. సిక్కుల ఊచకోతను రాజీవ్ ప్రోత్సహించారని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎప్పుడో మరణించిన రాజీవ్పై ప్రధాని తాజా వ్యాఖ్యలు అమానవీయమని విపక్షాలు భగ్గుమన్నాయి. -
కర్మ మీకోసం ఎదురుచూస్తోంది!
న్యూఢిల్లీ: భారత దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా అంతమయ్యారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ‘మోదీజీ.. యుద్ధం ముగిసిపోయింది. కర్మ ఫలితం మీకోసం ఎదురుచూస్తోంది. మీ గురించి మీ మనసులో ఉన్న భావాలను నా తండ్రిపై రుద్దడం ద్వారా మీరు తప్పించుకోలేరు. మీకో పెద్ద కౌగిలింత, ప్రేమతో.. రాహుల్’ అని ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో శనివారం ప్రచారంలో పాల్గొన్న మోదీ రాహుల్గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి రాజీవ్గాంధీని ఆయన అనుచరులంతా ‘మిస్టర్ క్లీన్‘గా అభివర్ణించేవారు. చివరకు ఆయన నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లడిగే మోదీ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి వ్యక్తిని అవమానించారు. అమేథీ ప్రజల సేవలోనే రాజీవ్ ప్రాణలు అర్పించారు. ఆ ప్రజలే మోదీకి బుద్ధి చెబుతారు. మోదీజీ.. మీలాంటి మోసకారుల్ని దేశం ఎన్నటికీ క్షమించదు’ అని విమర్శించారు. సభ్యత, సంస్కారాల విషయంలో మోదీ అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలపై ఓ గుజరాతీగా సిగ్గుపడుతున్నానని రాజీవ్ స్నేహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రాయని డైరీ.. టామ్ వడక్కన్ (బీజేపీ!)
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో ఒక్కరికీ నేనెవరో తెలీదు. బీజేపీలోకి వచ్చి ఒక్కరోజైనా కాలేదు. ముప్పై ఏళ్లుగా నేను బీజేపీలో ఉన్నట్లే అంతా నన్ను పలకరిస్తున్నారు సంస్కారవంతమైన పార్టీ. ఎంత చక్కటి సంస్కారాన్ని అలవరిచారు మోదీజీ తన పార్టీకి!! నేనొచ్చాక, నా వెనుకే ఇంకో ఇద్దరు బీజేపీలోకి వచ్చారు. ఎవరో భార్యాభర్తలు. ‘‘ఎవరు వీళ్లు? ఎక్కడా చూడనట్లుందే?’’ అని శ్రీధరన్ పిళ్లైని అడిగాను. కేరళ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఎవరైనా.. ‘ఎక్కడో చూసినట్లుందే’ అంటారు. మీరు మాత్రం ‘ఎక్కడా చూడన ట్లుందే’ అంటున్నారు. మీ ప్రశ్నలోనే సమా ధానం ఉంది.. వాళ్లెవరో’’ అన్నాడు పిళ్లై. ‘‘గాటిట్’’ అని పెద్దగా అరిచాను. ‘‘ఏమిటి గాటిట్’’ అన్నాడు పిళ్లై. ‘‘ఎక్కడా చూడనట్లుంటే.. వాళ్లు కాంగ్రెస్ వాళ్లై ఉంటారు. అంటే వీళ్లిద్దరూ కాంగ్రెస్ నుంచే కదా వచ్చారు బీజేపీలోకి’’ అన్నాను. ‘‘బ్రిలియంట్’’ అన్నాడు పిళ్లై! అది నా బ్రిలియన్స్ కాదు. కాంగ్రెస్ పార్టీ బ్రిలియన్స్. రాజీవ్ గాంధీ దగ్గర పని చేశాను. నేనెవరో ఎవరికీ తెలీదు. సోనియా గాంధీ దగ్గర పని చేశాను. నా పేరేమిటో ఎవరికీ తెలీదు. రాహుల్ దగ్గర పని చేశాను. నేనెవరో నేనే మర్చిపోయాను. రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు.. ఆ సభలో.. ‘ఎక్స్క్యూజ్మీ.. నా పేరేమిటో చెప్పగలరా?’ అని టెస్టింగ్ కోసం ఇద్దరుముగ్గుర్ని అడిగాను. తెలీదన్నారు! ‘పోనీ, టామ్ వడక్కన్ ఇక్కడెక్కడైనా మీకు కనిపించారా?’ అని అడిగాను. ‘మీపేరేమిటో కనుక్కుని మీకు చెప్పమంటే చెప్పగలం కానీ, టామ్ వడక్కన్ కనిపించాడా అని అడిగితే ఎలా చెప్పగలం? ఆ పేరే వినలేదు’’ అన్నారు!స్టన్ అయ్యాను! ఆ ఇద్దరుముగ్గురికికాస్త దూరంగా వెళ్లి, ఇంకో ఇద్దరుముగ్గుర్ని కదిలించాను. ‘‘చూడండీ.. అక్కడున్న ఆ ఇద్దరుముగ్గురు టామ్ వడక్కన్ పేరే వినలేదంటున్నారు. ఆశ్చర్యంగా లేదూ..’’ అన్నాను.‘‘ఆశ్చర్యం ఏముందీ.. వాళ్లకే కాదు, మాకూ తెలీదు.. టామ్ వడక్కన్ ఎవరో’’ అన్నారు. హర్ట్ అవ్వాలో అవకూడదో తెలీలేదు. ‘‘హర్ట్ అవనవసరం లేదు’’ అనే మాట వినిపించింది! తలతిప్పి చూశాను. ‘‘మీరు వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి. నివ్వెరపోయాను. నిశ్చేష్టుడినయ్యాను. నాకు నేనే కొత్తగా అనిపించాను.‘‘మీరు టామ్ వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి మళ్లీ. ఆరాధనగా అతడి వైపు చూశాను. ‘‘మీరెవరు?’’ అని అడిగాను. ‘‘నేనెవరో మీకు తెలియనవసరం లేదు. మీరెవరో ఈ ప్రపంచానికి తెలియాలి. మీది త్రిశ్సూర్ అని తెలియాలి. కార్పొరేట్ ఉద్యోగం మానేసి కాంగ్రెస్లో చేరారని తెలియాలి. ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తానని ముప్పై ఏళ్లుగా అడుగుతున్నా కాంగ్రెస్ మీకు టికెట్ ఇవ్వలేదని తెలియాలి. పుల్వామా ఎటాక్ల మీద కాంగ్రెస్ పార్టీ యాంటీ–ఆర్మీ కామెంట్స్ మమ్మల్ని బాధించాయని తెలియాలి. అందుకే మీరు బీజేపీలో చేరారని తెలియాలి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా! కన్నీళ్లొచ్చేశాయి నాకు. ‘‘మీరెవరో చెప్పారు కాదు’’ అన్నాను చేతులు జోడిస్తూ. ‘‘రవిశంకర్ ప్రసాద్ అంటారు నన్ను. మోదీ దగ్గర మినిస్టర్ని’’ అన్నాడు. ‘‘కేరళలో మిమ్మల్ని పిళ్లై మీట్ అవుతాడు’’ అని చెప్పాడు. చెప్పినట్లే పిళ్లై నన్ను కలిశాడు.‘‘ఏంటి పిళ్లై.. ఆ చప్పుళ్లు?’’ అని అడిగాను. ‘‘ఆ భార్యాభర్తలు వచ్చారు కదా. వాళ్లను ఆహ్వానిస్తూ డప్పులు కొడుతున్నారు’’ అన్నాడు! నిజంగానే పార్టీకి ఎంత మంచి సంస్కారం నేర్పించారు మోదీజీ!!. మాధవ్ శింగరాజు -
నల్లరంగు పూస్తే... రూ. కోటి ఇస్తా!
చండీగఢ్ : పంజాబ్లోని సలేమ్ తబ్రీ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఇద్దరు స్థానిక యువకులు నల్ల రంగు పులిమి వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగి పాలతో విగ్రహాన్ని శుభ్రపరిచారు. ఇందులో భాగంగా గుర్సిమ్రన్ సింగ్ అనే నాయకుడు మంగళవారం తన టర్బన్(సిక్కులు ధరించే తలపాగా)తో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తుడిచారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో సిక్కు మతస్థులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వాట్సాప్ నెంబర్ను ట్విటర్లో షేర్ చేసిన కెనడాకు చెందిన ఓ సిక్కు వ్యక్తి.. గుర్సిమ్రన్ సింగ్ ముఖానికి నల్లరంగు పూస్తే... కోటి రూపాయల బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. మరికొంత మంది ఎన్నారైలు సదరు నేతను బెదిరిస్తూ ఫోన్కాల్స్ చేస్తుండటంతో దీనికంతటికీ శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకులే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా 1984 నాటి సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని.. ఆయన విగ్రహానికి రంగు పులిమిన యువకులు డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. लुधियाना मे @Akali_Dal_ के नेताओं द्वारा श्री राजीव गांधी जी के बुत पर कालिख पोत दी थी, उसके विरोध मे सबसे पहले पहुंचकर श्री राजीव जी के बुत को अपनी (दस्तार) पगड़ी उतारकर उनके बुत को साफ़ किया एवं पवित्र आत्मा वाले राजीव जी के बुत को दूध से नहलाया🙏@RahulGandhi @PunjabGovtIndia pic.twitter.com/9eQkLTyB5r — Gursimran Singh Mand (@gursimranmand) December 25, 2018 -
‘అప్పటి నుంచి ఏడవని రోజు లేదు’
చెన్నై: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష ఎదుర్కొంటున్న వారిని విడుదల చేయవద్దని అప్పటి బాంబు పేలుడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కోరారు. ఈ కేసులో పట్టుబడి 27 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సంఘటనలో తల్లిని కోల్పోయిన అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లి శవం ముక్కలు ముక్కలుగా నాకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రతి రోజూ మా అమ్మను తలచుకుని ఏడవని రోజు లేదు. నా బాధను ఊహించుకోండి. మా అమ్మ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే మా నాన్న కూడా చనిపోయాడు. ఇద్దరూ చనిపోవడంతో నేను అనాథ అయ్యాను. దీంతో చదువును పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మా జీవితాలు నాశనం అయ్యాయి. మమ్మల్ని ఆదుకునేందుకు, ఓదార్చడానికి ఎవరూ రాలేదు. బాంబు పేలుడు ఘటనలో చనిపోయన కుటుంబాలతో ఒకరోజు నిందితులను ఉండనీయండి..ఆ తర్వాత వారి క్షమాభిక్ష గురించి ఆలోచిద్దా’మని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అబ్బాస్ వాచ్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరో బాధితురాలు శాంతా కుమారి అప్పటి భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనలో శాంతాకుమారి సోదరి సరోజాదేవి చనిపోయింది. శాంతాకుమారి కూడా బాంబు దాడిలో గాయపడింది. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి శాంతా కుమారికి 10 సంవత్సరాలు పట్టింది. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ వద్ద రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన చోటే ఆయన స్మారక స్థూపం నిర్మించారు. ఆ ఘటనలో చనిపోయిన వారందరి కుటుంబ సభ్యులను 27 సంవత్సరాల తర్వాత రామలింగ జ్యోతి అనే కవి ఒక దగ్గరికి చేర్చారు. నిందితులందరూ ఇప్పటికే 27 సంవత్సరాల జైలు జీవితం గడిపారని, వారికి రెండో అవకాశం ఇవ్వాలని మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ జైలులోనే మాస్టర్స్ డిగ్రీ చేసింది. పేరారివాలన్ రచయితగా మారాడు. మురుగన్, శాంతమ్లు ఇద్దరూ జైలులోని దేవాలయంలో పూజారులుగా మారారు. మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్ గ్రూప్ పీపుల్స్ వాచ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాజెన్ మాట్లాడుతూ..జైలు జీవితం అనేది ఒక శిక్ష మాత్రమే కాదని, అది పునరావాసం లాంటిదని అన్నారు. నిందితులు ఇప్పటికే సగం జీవితం జైలులో గడిపారని, జైలు జీవితం అనంతరం వారికి మంచి పౌరులుగా బ్రతికే అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. మన రాజకీయాల కోసం వాళ్ల విడుదలను అడ్డుకోవద్దని కోరారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఆయనతో పాటు మరో 14 మంది కూడా మృతిచెందారు. ఆ కేసులో నిందితులు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. -
ఇంతకు రాజీవ్ హంతకులు విడుదలవుతారా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో తమకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ ఏడుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారం తమిళనాడు రాష్ట్ర గవర్నర్కు ఉందంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, దోషులను తాను ఎప్పుడో క్షమించేశానని రాజీవ్ గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో దోషులు విడుదలయ్యే అవకాశం ఉందా ! అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. దోషులందరిని విడుదల చేయాల్సిందిగా ఆదివారం నాడు తమిళనాడు కేబినెట్ కూడా తీర్మానించి ఆ మేరకు రాష్ట్ర గవర్నర్కు సిఫార్సు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసును పునర్ పరిశీలించాల్సిందిగా తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి లాగా గవర్నర్కు లేనందున గవర్నర్ సిఫార్సును ఆమోదించి దోషుల విడుదలకు ఆదేశాలు జారీ చేస్తారా? ఆయన చేసినంత మాత్రాన దోషులు విడుదలవుతారా? గవర్నర్ నిర్ణయాన్ని తిరిగి కేంద్రం సవాల్ చేసే అవకాశం లేదా? ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గవర్నర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనుమతిస్తుందా? అనుమతిస్తే అందుకు ప్రజల సానుభూతి కేంద్రానికి లభిస్తుందా ? కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందా? లేదా మొదటి నుంచి దోషుల విడుదలను కోరుతున్న తమిళనాడు ప్రభుత్వానికి దక్కుతుందా? రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం 2014లో నిర్ణయించింది. భారతీయ శిక్షాస్మతిలోని 432 సెక్షన్ కింద దోషుల శిక్షను తగ్గించేందుకు లేదా రద్దు చేసేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండడంతో నాడు తమిళనాడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. కేసును రాష్ట్ర పోలీసులు కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారించినందున ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరని కేంద్రం వాదించింది. దీంతో కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. 2015లో అదే భారతీయ శిక్షాస్పతిలోని 435 సెక్షన్ కింద కేంద్రం అనుమతి తప్పనిసరంటూ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ కింద రాష్ట్ర గవర్నర్ దోషులకు క్షమాభిక్షను ప్రసాదిస్తే 435 సెక్షన్ కింద కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దోషులను విడుదల చేయవచ్చని అదే తీర్పులో సుప్రీం కోర్టు సూచించింది. దీంతో పాతికేళ్లకుపైగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు దోషులు తమిళనాడు గవర్నర్కు మెర్సీ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఆమోదించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కేబినెట్ ఆదివారం నాడు సిఫార్సు చేసింది. దోషులను విడుదల చేయడం వల్ల అంతర్జాతీయ పర్వవసానాలను ఎదుర్కోవల్సి వస్తుందంటూ ప్రతి దశలో దోషుల విడుదలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేయదా? చేయడానికి చట్టపరంగా అవకాశాలు కూడా ఉన్నాయి. క్షమించే అధికారం...ఆంక్షలు వివిధ కేసుల్లో శిక్ష పడిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసే అధికారాలను రాజ్యాంగంలోని 72వ అధికరణ కల్పిస్తుండగా, అలాంటి అధికారాలనే రాష్ట్ర గవర్నర్కు రాజ్యాంగంలోని 161వ అధికరణ కల్పిస్తోంది. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల పరిధిలోకి వచ్చే ఏ చట్టం కిందయినా, ఏ నేరానికైనా, ఎంత శిక్ష పడినా, దోషుల శిక్షను తగ్గించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలోని అధికారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి కనుక ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలో శిక్షలు పడిన దోషులకు గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ప్రమాణాలు ఉండాల్సిందే క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయికదా! అని వాటిని విచక్షణా రహితంగా ఉపయోగించడానికి వీల్లేదంటూ ఓ రెండు కేసుల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సూచించింది. ‘ఇవేమి విశేషాధికారాలు కాదు. పనితీరుకు సంబంధించిన విచక్షణాధికారాలు. దోషుల క్షమాభిక్ష కారణంగా అది వారి ఒక్కరికే లాభం చేకూర కూడదు. వారితోపాటు ప్రజలకు కూడా మేలుచేస్తుందని అనుకున్నప్పుడే ఈ అధికారాలు ఉపయోగించాలి. రాజకీయ లబ్ధిని ఆశించి అసలు నిర్ణయం తీసుకోరాదు. 72వ అధికరణ కింద రాష్ట్రపతి, 162 కింద గవర్నర్కు సంక్రమించే అధికారాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరేం జరుగుతుంది? రాష్ట్ర కేబినెట్ సిఫార్సును తింపి పంపే అధికారం గవర్నర్కు లేకపోయినప్పటికీ, ఆ సిఫార్సుపై న్యాయ సమీక్షను కోరే అవకాశం ఆయనకు ఉంది. పైగా దోషులు స్వయంగా తనకే పిటిషన్లు పెట్టుకున్నందున తానే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజీవ్ హత్య కేసులో ప్రజలకు మేలు చేసే అంశం లేనందున గవర్నర్ పిటిషన్లకు తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఒకవేళ గవర్నర్ దోషుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నా సవాల్ చేసే అధికారం కేంద్రానికి ఉంది. దోషులను ఎవరు క్షమించినా రాజీవ్తోపాటు మరణించిన 17 మంది వ్యక్తుల కుటుంబాలు దోషులను క్షమించక పోవచ్చు.వారైనా సవాల్ చేయవచ్చు! అంతర్జాతీయ అంశాలు దోషుల్లో ముగ్గురు శ్రీలంక జాతీయులు అవడం వల్ల అంతర్జాతీయ న్యాయ, దౌత్యపరమైన అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. శ్రీలంక జాతీయులను విడుదల చేసి వారి దేశానికి పంపిస్తే వారిని తిరిగి అరెస్ట్ చేసి వారి చట్టాల ప్రకారం విచారించి మళ్లీ శిక్ష విధించే అవకాశం ఉంది. వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా, మరో దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా దౌత్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. -
రాజీవ్గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్ అంతం!
ముంబై: ఈ ఏడాది జూన్తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్ సింగ్ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్ ప్రకాశ్కు రోనా విల్సన్ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్ (ఫెరారీ), వెర్నన్(గొంజాల్వేస్), ఇతరులు అర్బన్ ఫ్రంట్ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్ ‘మోదీ రాజ్’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. మరో రాజీవ్ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్ను తన నిర్ణయం చెప్పమని విల్సన్ లేఖలో కోరారని పరంబీర్ సింగ్ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సైతం అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది. విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాం. కొరియర్ ద్వారా పాస్వర్డ్తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్లో సుధా భరద్వాజ్ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్పూర్లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్లను అరెస్టు చేశారు. -
రాజీవ్ హంతకులను విడుదల చేయం
-
రాజీవ్ హంతకులను విడుదల చేయం : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. హంతుకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తరుఫున అఫడవిట్ దాఖలు చేయాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్రం రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని శుక్రవారం న్యాయస్థానానికి తెలిపింది. కాగా మాజీ ప్రధాని హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని రాజ్యాంగంలోని 161 అధికరణ ప్రకారం గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా రాజీవ్ హంతుకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది వారిని విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. 27 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష కింద వారిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. -
గోపాల్కృష్ణ గాంధీకి ‘సద్భావన అవార్డు’
న్యూఢిల్లీ: జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ సద్భావన అవార్డుకు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాల్కృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ నెల 20న రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల నగదు ఇవ్వనున్నారు. -
రాజీవ్ దేశం కోసమే జీవించారు
న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛను బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రించాలని చూస్తోంటే, తాను మాత్రం దాన్ని గౌరవిస్తూ, ప్రాథమిక హక్కుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని కించపరుస్తూ ఇటీవల నెట్ఫ్లిక్స్ సిరీస్ విడుదలైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ నా తండ్రి ఈ దేశం కోసమే జీవించారు, మరణించారు. ఓ కల్పిత వెబ్ సిరీస్ పాత్రదారుడి వ్యాఖ్యలు ఈ నిజాన్ని మార్చలేవు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
నాడు నో నేడు ఎస్
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ ముందస్తు విడుదలపై కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. రాజీవ్ హంతకులకు క్షమాభిక్షపై గతంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పిన అఖిలభారత కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్గాంధీ తాజాగా మాటమార్చారు. ‘పేరరివాళన్ను ముందుగా విడుదల చేయదలిస్తే ఎలాంటిæ అభ్యంతరం లేదని ప్రకటించారు. సదరు ఖైదీల క్షమాభిక్ష వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండడంతో రాహుల్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజీవ్గాంధీ హత్యకు సంబంధించి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో పేరరివాళన్ ఒకడు. వేలూరు జిల్లా జోలార్పేటకు చెందిన ఇతనిపై సీబీఐ ముఖ్యమైన నేరారోపణలు చేసింది. రాజీవ్గాంధీ హత్యకోసం ఆత్మాహుతి దళం బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను పెరిరవాళనే కొనిచ్చాడనే అభియోగంపై 1991 జూన్ 11వ తేదీన అరెస్ట్చేసింది. రాజీవ్ హత్యకేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పేరరివాళన్కు మరణశిక్ష విధించింది. అతనితోపాటు మురుగన్, శాంతన్, నళినిలకు సైతం ఉరిశిక్ష విధించింది. 1998లో టాడా న్యాయస్థానం విధించిన ఈ శిక్షను 1999లో సుప్రీంకోర్టు సైతం ఖరారుచేసింది. ఆ తరువాత పేరరివాళన్ విడుదల చేయాలని అనేక సంఘాలు ఆందోళనలు చేశాయి. అతని తల్లి అర్బుతమ్మాళ్ పలువురు నేతలను కలుస్తూ మద్దతు సేకరించారు. అయితే ఈపోరాటాలు సాగుతుండగానే 2014లో పేరరివాళన్ తదితరులను ఉరివేసేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వారు చేసుకున్న విజ్ఞప్తిపై పదేళ్లుగా నిర్ణయం తీసుకోనందున ఉరిశిక్ష వేయకూడదని సుప్రీం కోర్టులో బాధితులు పిటిషన్ వేశారు. దీంతో ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువడింది. అంతేగాక, పేరరివాళన్ విడుదలపై తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. దీంతో పేరరివాళన్ విడుదల ఖాయమనే ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పేరరివాళన్ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లోప్రయత్నం చేశారు. చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతించలేదు. దీంతో పేరరివాళన్ గత 27 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 1991లో అతడు ఇచ్చిన వాంగ్మూలం తప్పుగా తర్జుమా చేసినందునే మరణిశిక్షకు గురైనాడని కేసు విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ హత్యకేసులో పేరిరవాళన్ అమాయకుడనే భావన నెలకొన్నా జైలు నుంచి విడుదలకు అవకాశం ఏర్పడలేదు. అతని తల్లి ఇప్పటికీ కొడుకు విడుదల కోసం పోరాడి అలసిపోయారు. రంజిత్ రాయబారం రాజీవ్ హంతకులు, ముఖ్యంగా పేరరివాళన్ ముందస్తు విడుదల అంశం దాదాపు తెరమరుగు కాగా, ప్రముఖ తమిళ దర్శకులు పా రంజిత్ రాయబారం చేయడంతో మరలా తెరపైకి వచ్చింది. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలుసుకున్న రంజిత్ సుమారు రెండుగంటలపాటూ తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సమయంలో పేరరివాళన్ విడుదలకు సహకరించాల్సిందిగా రంజిత్ కోరారు. ‘పేరరివాళన్ విడుదల విషయంలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని రాహుల్ బదులివ్వగా రంజిత్ ధన్యవాదాలు తెలిపారు. రంజిత్తో కలిసి రాజకీయాలు మాట్లాడుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతోపాటు ఫొటో పెట్టారు. కాగా, గతంలో సోనియా విజ్ఞప్తి మేరకు నళిని మరణదండన, యావజ్జీవ శిక్షగా మారింది. రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో పేరరివాళన్ విడుదలయ్యేనా, తల్లి అర్బుతమ్మాళ్తోపాటు ఇతరుల కల నెరవేరేనా, రాహుల్ విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించేనా అనే అనుమానాలు వరుసపెట్టాయి. ఆనాడే చుక్కెదురు మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని భావించిన జయలలితకు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడే చుక్కెదురైంది. అంతేగాక మాజీ ప్రధానిని హత్యచేసిన వారికే క్షమాభిక్షా అంటూ ఆనాడు సాక్షాత్తు రాహుల్గాంధీనే అడ్డుపుల్లవేశారు. మరి ఈరోజు అదే వ్యవహారంలో తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని మంత్రి కడంబూరు రాజా చెప్పడం ద్వారా బంతిని కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు. -
కారుణ్య మరణానికి అనుమతివ్వండి! : రాజీవ్ హంతకురాలు
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని తల్లి అర్బుదమ్మాల్ ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాజీవ్గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్, నళినితో పాటు ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నందున విడుదల చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి విడు దలను నిరాకరించారు. దీంతో నిరాశ చెందిన పేరరివాలన్ తల్లి జోలార్పేటలోని తన నివా సంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్య కేసులో 19 ఏళ్ల వయస్సులో ఉన్న పేరరివాలన్ను విచారణకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారన్నారు. 27 ఏళ్లుగా చట్ట ప్రకారం విడుదల అవుతాడని ఎదురు చూసినా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం జయలలిత రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారస్సు చేశారన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. కోర్టు నుంచి మంచి తీర్పు వింటామనే ఆశతో ఉన్న ఏడుగురికి నిరాశ మిగిల్చేలా రాష్ట్రపతి నిరాకరణ తెలపడం బాధాకరమన్నారు. మహాత్మాగాంధీ హత్యకేసు నిందితులకు 14ఏళ్లు మాత్రమే శిక్ష విధించి విడుదల చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేరరివాలన్ను 27 ఏళ్లుగా విడుదల చేయకపోవడంపై కన్నీరు మున్నీరయ్యారు. -
మోదీ హత్య ప్లాన్ : నన్ను టార్గెట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేయడానికేనని విరసం నేత వరవరరావు వ్యాఖ్యానించారు. ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ... ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు. ఇటీవల మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్ను పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని ఆయన అన్నారు. రోనా జాకబ్ విల్సన్ భీమకోరేగావ్ ఘటనలో దొరకలేదని, ఢిల్లీ, పుణెలో దాడులు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వరవరరావు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్తో సంబంధం లేదని చెప్పనని, ఇదంతా తనను టార్గెట్ చేయడమే అనిపిస్తుందన్నారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదని, మహా అయితే తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకంటే ఏమీ కాదని వరవరరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంఘాలు, విప్లవ రచయితలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరేగావ్లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జాకబ్ విల్సన్ను అరెస్ట్ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. అరెస్ట్ అయిన జాకబ్ విల్సన్ ల్యాప్ టాప్లో ప్రధాని హత్యకు కుట్రపన్నారంటూ పూణె పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉన్నట్లు తెలిసింది. మోదీని కూడా రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ, ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. -
ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా?
-
రాజీవ్ తరహాలోనే మోదీ హత్యకు కుట్ర!
పుణే : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడైంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే మావోయిస్టులు ప్రధాని మోదీని అంతం చేసేందుకు ప్లాన్ వేశారని పుణే పోలీసులు చెప్పారు. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. మోదీ హత్యకు కుట్ర పన్నడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మావోయిస్టులు ఆ లేఖను గతేడాది ఏప్రిల్లో రాశారు. ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జాకబ్ విల్సన్ను అరెస్ట్ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది. కుట్రకు కారణాలేంటి..! దేశ వ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతోందని, తమ మనుగడ కష్టమవుతుందని భావించి ప్రధానిని అంతమొందించాలని మావోయిస్టులు కుట్ర పన్నారు. తమకు ప్రధాని కొరకరాని కొయ్యగా మారారని, అసలే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హత్య కుట్రకు ఓ కారణమని పోలీసులు తెలిపారు. మోదీ రోడ్షోలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే తమ చర్యలు ఉండాలని హై కమాండ్కు మావోయిస్టులు రాసిన లేఖలో ఉంది. నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేయాలని ఇందు కోసం 8 కోట్ల రూపాయలు కావాలని మావోయిస్టు కేంద్ర కమిటీకి తెలిపారు. కాగా, మరోవైపు ప్రధాని మోదీ హత్యకు ఐసిస్ ఉగ్రసంస్థ గత (మే) నెలలో కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఐసిస్ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. స్నిప్పర్ రైఫిల్తో మోదీని కాల్చి హత్యచేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్ బృందం ఇటీవల వెల్లడించింది. -
గవర్నర్ ఆ పేర్లన్నీ బయటపెట్టాలి!
పట్నా: బోఫోర్స్ స్కామ్పై బిహార్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిజాయితీపరుడని, ఆయన చుట్టూ ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలే బోఫోర్స్ స్కామ్కు కారకులంటూ సత్య పాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపగా, ఆ పేర్లను గవర్నర్ బయటపెట్టాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మే 18న పట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాలిక్.. రాజీవ్ గాంధీపై ప్రశంసలు గుప్పించారు. ప్రసంగంలో మధ్యలో బోఫోర్స్ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన రాజీవ్కు ఈ స్కామ్తో సంబంధం లేదని, ఆయన చాలా మంచి వ్యక్తని, చుట్టూ ఉన్న కొందరు తప్పుడు మనుషుల మూలంగానే ఆయన కళంకం ఎదుర్కోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ కాంగ్రెస్ నేతలు ఎవరో తనకు తెలుసున్న గవర్నర్ మాలిక్.. పేర్లు వెల్లడించేందుకు మాత్రం విముఖత వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేత, బోఫోర్స్ స్కామ్ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అజయ్ అగర్వాల్ స్పందించారు. ‘ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ మాలిక్, ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐకి ఇస్తే ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. దేశాన్ని కుదిపేసిన ఈ స్కామ్లో కాంగ్రెస్ కీలక నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మాలిక్ వ్యాఖ్యలతో అవి బలపడ్డాయి. ఆయన సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని అజయ్ తెలిపారు. కాగా, అజయ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీజేపీ నేత అయిన సత్య పాల్ మాలిక్ను గతేడాది ఎన్డీయే ప్రభుత్వం బిహార్ గవర్నర్గా నియమించింది. బోఫోర్స్ నేపథ్యం... భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నాగర్, బోఫోర్స్ కంపెనీ, అర్డ్బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఖత్రోచి, భట్నాగర్, చద్దా, ఆర్డ్బో ఇప్పటికే మరణించారు. 2005లో హైకోర్టు తీర్పుకంటే ముందు 2004 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. సీఐఏ పత్రాల్లో...నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్ దర్యాప్తు ఆపేసిందని అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొంది. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ పర్యటన అనంతరం బోఫోర్స్పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4న వెలువరించిన సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్ గాంధీ 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
మాజీ ప్రధాని రాజీవ్కు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు, పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్భూమికి వెళ్లి సోమవారం ఉదయం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజీవ్ కూతురు ప్రియాంక వాద్రా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ సేవల్ని వారు స్మరించుకున్నారు. టెక్నాలజీ(ఐటీ) రంగాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని రాజీవ్ అని పేర్కొన్నారు. కాగా, 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్ కుమారుడు రాహుల్ గాంధీ సింగపూర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం’ అంటూ వ్యాఖ్యానించారు. -
రాజీవ్ హత్య కేసు: నళినీ పిటిషన్ తిరస్కరణ
చెన్నై: మాజీ ప్రధాని రాజీమ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న నళిని తన ముందస్తు విడుదల కోరుతు దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని నళిని పిటిషన్లో పేర్కొంది. ఆమె అభ్యర్ధనను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శశిధరన్, ఆర్. సుబ్రహ్మణ్యన్ల బెంచ్ ఆ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. రాజీవ్ గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున, నళిని ఎలాంటి పిటిషన్ దాఖలు చేసిన స్వీకరించవద్దని 2017 నవంబర్లో తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళిని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై న్యాయమూర్తి రాజీవ్ శక్దేర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్గాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సింగపూర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం.’అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రాజీవ్పై బాదల్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్లను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్ తనతో ఢిల్లీ అంతటా కలియతిరిగారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బాదల్ ప్రస్తావించారు. జగదీష్ టైట్లర్ వ్యాఖ్యల ప్రకారం రాజీవ్గాంధీ సిక్కుల హత్యాకాండను దగ్గరుండి పర్యవేక్షించారని స్పష్టమవుతోందని బాదల్ ఆరోపించారు. టైట్లర్ వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్గా పరిశీలించాలని కోరారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై సుప్రీం కోర్టు ఇటీవల నూతన సిట్ను ఏర్పాటు చేసి కేసుల పునర్విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఇంధిరాగాంధీని ఆమె బాడీగార్డులు కాల్చిచంపిన అనంతరం ఢిల్లీ, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లలో 3325 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 2,733 మంది మరణించారు. -
దళిత రాజకీయాలే కీలకమా?
జాతిహితం మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్ తికాయత్ లేదా రిటైర్డ్ కల్నల్ కిశోరీసింగ్ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు. దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా? దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు. దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్రాం కాంగ్రెస్కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు. దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్లోని ఒక ఎంఎల్ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే. మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది. పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా? సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్ ఖలీద్ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో. బోఫోర్స్ కుంభకోణం విష యంలో రాజీవ్ను తప్పు పడుతూ వీపీ సింగ్ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయ డంతో అలహాబాద్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్కు, కాంగ్రెస్ అభ్యర్థి, లాల్బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి. ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్ బ్రిగేడ్, పాంప్లెట్ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు. అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఒక రాహుల్... ఒక బిలావల్!?
వారసత్వం.. పాతరాతి యుగం నుంచి నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగం వరకూ.. కొనసాగుతున్న పద్దతి. పరిస్థితులు మారినా.. వ్యవస్థలు మారినా.. నేపథ్యాలు మారినా వారసత్వం మాత్రం మారడం లేదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజు మరణించిన తరువాత అతని పెద్ద కుమారుడు రాజయ్యేవాడు.. ఇదే పరిస్థితి ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ కనిపిస్తోంది. ఉపఖండంలో దాయాది దేశాలుగా భావించే భారత్, పాకిస్తాన్లలో వారసత్వం చుట్టే పార్టీలు, రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయాలు అత్యంత శక్తివంతమైనవి. ఉపఖండంలోని 200 కోట్ల మంది ప్రజలు.. ఓటుతో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, పాలకుడిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత్, అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్లలో రాజకీయ వారసులే.. పార్టీలను ముందుకు నడిపిస్తున్నారు. బ్రిటీష్ కాలం నుంచి పార్టీ ఒకటైతే.. దేశ ఆవిర్భావితం తరువాత ఏర్పడ్డ పార్టీ మరొకటి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలపై ఆయా కుటుంబాలదే పెత్తనం. ఇక్కడే రాజరికంలో ఉన్నట్లు ఆయా కుటుంబాల్లోని పెద్ద కుమారులకే పార్టీ అధినేతలుగా పట్టం కట్టారు. రేప్పొద్దున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే.. వారే దేశాధినేతలు. ప్రజాస్వామ్యంలోనూ రాజరికం..అందులోనూ కుటుంబస్వామ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ భారత్లోని రాహుల్ గాంధీకి, పాకిస్తాన్లోని బిలావల్ జర్దారీ భుట్టోకి ఇక్కడే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరూ బ్రిటన్లోనే ఉన్న విద్యను అభ్యశించారు. ఇద్దరూ యువకులే. బిలావల్ పార్టీ చీఫ్గా వ్యవహరిస్తున్నసమయంలో పీపీపీ పాకిస్తాన్లో అధికారంలో ఉంది. అప్పుడు వయసు తక్కువగా ఉండడంతో బిలావల్ ప్రధాని కాలేకపోయాడు. ఇక్కడ రాహుల్ గాంధీది అదే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుంచి 2014 వరకూ అధికారంది. కాంగ్రెస్ దేశంలో దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాలేకపోయారు. భారత దేశంలో గాంధీ.. అనే పేరుకు చాలా ప్రతిష్ట ఉంది. ఇక్కడ వ్యక్తికన్నా.. గాంధీ అనే ట్యాగ్లైన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గత ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 27 ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో కొందరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారిని సంప్రదించిన ఘటనలున్నాయి. ఇన్ని వైఫల్యాలున్నా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నారు.. ఇందుకు ప్రధాన కారణం అతను గాంధీ వారసత్వంగా రాజకీయాల్లో కోనసాగడమే. బిలావల్.. ఇక పాకిస్తాన్లోనూ భుట్టే అనే ఇంటి పేరు చాలా శక్తివంతం. రాహుల్ గాంధీ కన్నా బిలావల్ భుట్టో 18 ఏళ్ల చిన్నవాడు. ప్రస్తుతం అతని వయసు 29 ఏళ్లు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని బిలావల్ ముందుకు నడిపిస్తున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయిన జుల్ఫీకర్ఆలీ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని స్థాపించాడు. జుల్ఫీకర్ఆలీ భుట్టో కుమార్తె అయిన బేనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. దాదాపు దశాబ్దం కిందట బేనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బిలావల్ పీపీపీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఇద్దరిలోనూ సారూప్యతలు బిలావల్, రాహుల్ గాంధీలు.. ఇద్దరూ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. బిలావల్ తల్లిని, తాతయ్యను పోగొట్టుకుంటే.. రాహుల్ చిన్నతనంలోనే తండ్రిని, నానమ్మను కోల్పోయాడు. ఇందిరను బాడీ గార్డులో హత్య చేయగా.. జుల్ఫీకర్ ఆలీ భుట్టోను ఉరి తీశారు. రాజీవ్, బేనజీర్ల మరణం కూడా ఒకేలా ఉంటుంది. పాకిస్తాన్లో భుట్టో కుటుంబం, భారత్లో నెహ్రూ-గాంధీ ఫ్యామిలీలు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశాయి. ఇద్దరు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సమయంలో పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇద్దరూ ప్రదానులు మాత్రం కాలేకపోయారు. ఇద్దరికీ ఇంటిపేరే వరం, శాపంగానూ మారింది. యాధృచ్చికంగా రాజకీయాల్లోకి వచ్చినా తమ పార్టీలను గెలిపించేందుకు ఇద్దరూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇద్దరిలోనూ ఉన్న ప్రధాన సారూప్యత.. వివాదాలు. పాకిస్తాన్లో బిలావల్ భుట్టో మీద, భారత్లో రాహుల్ గాంధీ మీద.. ఉన్నన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మరెవరిమీద ఉండవేమో! ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్లో పర్వేజ్ ముషారఫ్, నవాజ్ షరీఫ్లు వారిమీద చేసే వివాదాస్స వ్యాఖ్యలకు కొదవ లేదు. ఎన్నికలు ఇద్దరికీ పరీక్ష గుజరాత్లో జరిగిన శాసనసభ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వ రెఫరెండమ్గా అందరూ భావిస్తున్నారు. ఈ కారణం వల్లే రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా గుజరాత్లో దాదాపు 3000 వేల కిలోమీటర్లు పర్యటించారు. బిలావల్ కూడా వచ్చే ఏడాది పాకిస్తాన్ ఎన్నికల్లో తల్లి పోటీ చేసిన సింధ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి బిలావల్ భుట్టో.. వారసత్వంగానే అధినేతలు అయినా.. పార్టీలను విజయతీరాలకు చేరిస్తేనే.. వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది వాస్తవం. -
మూడు దశాబ్దాల భోఫోర్స్
న్యూఢిల్లీ : భోఫోర్స్.. మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ పదం మాత్రం రాజీవ్గాంధీని, కాంగ్రెస్ను విడచి పెట్టడం లేదు. తాజాగా భోఫోర్స్ కుంభకోణంపై విచారణను అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అణిచివేసిందనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. భోఫోర్స్ కుంభకోణంపై ప్రయివేట్ డిటెక్టివ్ హైఖేల్ హెర్ష్మన్ పేర్కొన్న వాస్తవాలు-పరిస్థితులను పరిశీలిస్తామని బుధవారం సీబీఐ ప్రకటించింది. అమెరికాలోని ఫైర్ఫాక్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అధ్యక్షుడైన మైఖెల్ హెర్ష్మన్ తాజాగా ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ గాంధీకి స్విస్ బ్యాంక్ ఖాతా గురించి పేర్కొన్నారు. అంతేకాక గత వారం జరిగిన ప్రయివేట్ డిటెక్టివ్ల సమావేశంలోనూ భోఫోర్స్ స్కామ్లో నల్లధనం స్విస్ ఖాతాలకు ఎలా చేరిందో ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మరోసారి భోఫోర్స్ స్కామ్పై సీబీఐ పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. 30 ఏళ్ల భోఫోర్స్ 1986 మార్చి 24 : భారత ప్రభుత్వం 410 యూనిట్ల 155 ఎంఎం హవిట్జర్ గన్స్ కొనుగోలుకు స్వీడన్కు చెందిన ఏబీ భోఫోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1,437.72 కోట్లు. 1987 ఏప్రిల్ 16 : భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి భోఫోర్స్ సంస్థ ఈ ఒప్పందం చేసుకున్నట్లు తొలిసారి స్వీడిన్ రేడియో ప్రకటించింది. 1987 ఏప్రిల్ 20 : ఈ ఒప్పందంలో ఎవరు మధ్యవర్తిగా లేరు, ఎవరికీ ముడుపులు చెల్లింపులు చేయలేదని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ లోక్సభలో ప్రకటన. 1987 ఆగస్టు 6 : బీ శంకరానాంద్ నేతృత్వంలో భోఫోర్స్ ముడుపులపై విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు ఫిబ్రవరి 1988 : భోఫోర్స్ కుంభకోణంపై నిజానిజాలు తెలుసుకునేందుకు భారతీయ విచారణాధికారుల స్వీడన్ పర్యటన 1988 జులై 18 : భోఫోర్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదకను పార్లమెంట్కు సమర్పించింది. నవంబర్ 1989 : సాధారణ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరాజయం. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు 1990 జనవరి 22 : భోఫోర్స్ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదు.. విచారణకు ప్రభుత్వం ఆదేశం 1990 ఫ్రిబరి 7 : భోఫోర్స్ స్కామ్పై స్విస్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారిక లేఖ 1992 ఫిబ్రవరి 17 : భోఫోర్స్ స్కామ్లో ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయో ప్రకటించిన ప్రముఖ జర్నలిస్ట్ అండర్సన్. 1993 జులై 30 : భోఫోర్స్ కేసులో కీలక పాత్రధారి ఒట్టావియో ఖత్రోచి దేశం విడిచి వెళ్లిపోయాడు. మళ్లీ ఏనాడు దేశంలోకి అడుగు పెట్టలేదు. 1997 ఫిబ్రవరి 17 : ఖత్రోచి మీద ఎన్బీడబ్ల్యూ రెడ్ కార్నర్ నోటీస్ జారీ. 1998 డిసెంబర్ 8 : ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లోని బ్యాంక్ ఖాతాలకు ముడుపుల మళ్లింపు గురించి స్విస్ ప్రభుత్వానికి రెండో లేఖ రాసిన భారత్. 1999 అక్టోబర్ 22 : ఖత్రోచీపై ఛార్జిషీట్ ధాఖలు 2000 : తనపై ఉన్న అరెస్ట్ వారెంట్ను కొట్టివేయాలని సుప్రీం కోర్టును కోరిన ఖత్రోచి. ముందు సీబీఐ విచారణకు హాజరు కండి. తరువాత పరిశీలిద్దం అన్న సుప్రీం కోర్టు. 2000 మార్చి 18 : భోఫోర్స్ విచారణ కోసం తొలిసారి భారత్కు వచ్చిన చద్దా. 2000 అక్టోబర్ 9 : భోఫోర్స్ కుంభకోణంలో హిందూజా సోదరులను చేర్చుతూ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ 2000 డిసెంబర్ 20 : ఖత్రోచి మలేసియాలో అరెస్ట్. మలేషియన్ సెషన్స్ కోర్టులోనే విచారణ 2003 జులై 21 : కత్రోచి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ 2004 ఫిబ్రవరి 4 : రాజీవ్ గాంధీ, డిఫెన్స్ సెక్రెటరి భట్నగర్ మృతి చెందడంతో చార్జిషీట్ను వారి పేర్ల తొలగింపు 2005 మార్చి 31 : హిందూజా, ఏబీ భోఫోర్స్ల విచారణకు క్వాష్ పిటీషన్పై ఢిల్లీ హైకోర్ట్ అనుకూలంగా తీర్పు. 2005 సెప్టెంబర్ 19 : ఢిల్లీ హైకోర్ట్ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన సీబీఐ. విచారణ కొనసాగించవచ్చని తేల్చి చెప్పిన సుప్రీం. 2006 జనవరి 16: ఫ్రీజింగ్ అకౌంట్ల లావాదేవీలపై పూర్తి సమాచారాన్ని చెప్పాలని సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. 2007 ఫిబ్రవరి 6 : ఖత్రోచిని అర్జెంటీనాలో అరెస్ట్ చేసిన పోలీసులు. భారత అభ్యర్థనను తోసిపుచ్చిన అర్జెంటీనా. 2009 ఏప్రిల్ : ఖత్రోచిమీద రెడ్ కార్నర్ నోటీస్ ఉపసంహరించుకున్న సీబీఐ 2009 అక్టోబర్ : ఖత్రోచి మీద కేసును ఉసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరిన సీబీఐ. అదే సమయంలో లండన్ బ్యాంక్లోని ఖత్రోచి లావాదేవీలపై డాక్యుమెంట్స్ కోసం అగర్వాల్ అనేవ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు. 2010 డిసెంబర్ 31 : ఖత్రోచీ, విన్ చద్దాలు పన్ను ఎగవేతపై ఇన్కంట్యాక్స్ ట్రిబ్యునల్ ఆగ్రహం. కేసు నమోదుకు ఆదేశం. 2011 పిబ్రవరి 9 : భోఫోర్స్ స్కామ్పై సీబీఐ తీరును విమర్శించిన ఇన్ఫర్మేషన్ కమిషన్. 2012 ఏప్రిల్ 24 : భోఫోర్స్ కుంభకోణంపై మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అమితాబ్ బచ్చన్ల పాత్ర ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్వీడన్ ప్రభుత్వం ప్రకటన. 2013 జులై 13 : భోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఖత్రోచి మరణం. 2017 జులై 14 : సుప్రీంకోర్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే భోఫోర్స్ కేసుపై పునర్విచారణ సాధ్యమవుతుందని సీబీఐ ప్రకటన. 2017 అక్టోబర్ 18 : ప్రైవేటు డిటెక్టివ్ మైఖేల్ హెర్షమ్ పేర్కొన్న బోఫోర్స్ కుంభకోణం గురించి వాస్తవాలను, పరిస్థితులను పరిశీలిస్తానని సిబిఐ ప్రకటన. -
‘రాజీవ్ హంతకులను విడుదల చేయవద్దు’
సాక్షి, చెన్నై: ‘పిటిషన్దారులు హతమార్చింది సాధారణ వ్యక్తిని కాదు, మాజీ ప్రధాని రాజీవ్గాంధీని. ఆయన దారుణ హత్య దేశం మొత్తాన్ని కుదిపేసింది. పైగా ఇంతటి ఘోరానికి పాల్పడి యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నా ఏమాత్రం పశ్చాత్తాపం పడని వారిని క్షమించి ముందుగా విడుదల చేయడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది’. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో బుధవారం ఒక పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్యకేసులో వేలూరు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న రాబర్ట్ పయాస్, జయ కుమార్ తమను ముందుగా విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2006లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు సెల్వం, పొన్ కలైయరసన్లు విచారిస్తున్నారు. పిటిషన్ దారులను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదు, అలా ముందుగా విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలోనే ఈ పిటిషన్పై హైకోర్టులో వాదించింది. ఈ పిటిషన్ న్యాయమూర్తుల ముందుకు బుధవారం మరోసారి విచారణకు రాగా.. తమిళనాడు ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. 2012లో తయారు చేసిన కౌంటర్ పిటిషన్నే మరోసారి దాఖలు చేశారు. అప్పట్లో హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజగోపాల్ పేరుతో దాఖలు చేసిన ఆ పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. యావజ్జీవ శిక్ష ఖైదీలైన రాబర్ట్పయాస్, జయకుమార్లు 20 ఏళ్లకు పైగా జైలులో ఉన్నారని, అయితే వారిపై రుజువైన హత్యా నేరం చాలా తీవ్రమైందని, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వారి చేతిలో దారుణ హత్యకు గురికావడం దేశం యావత్తును స్తంభింపజేసిందని ఆయన చెప్పారు. ముందస్తు విడుదల కోరుతూ 2006లో వారు చేసిన పిటిషన్పై 2007లో విచారణ కమిషన్ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ కమిషన్ అన్ని కోణాల్లో విచారణ జరిపిందని అన్నారు. పిటిషన్ దారులు 2009లో జైలులో శాంతి భద్రతల సమస్యలు సృష్టించినట్లుగా విచారణ కమిషన్ సమర్పించిన ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో వారిలో మానసిక పరివర్తన చోటు చేసుకున్నట్లుగా అధికారులు పేర్కొనలేదు కాబట్టి ముందుగా విడుదల చేయకూడదని అన్నారు. అంతేగాక 2010లో ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ సైతం వీరి విడుదలకు సిఫార్సు చేయలేదని తెలిపారు. అలాగే వీరిని ముందుగా విడుదల చేయొచ్చా? లేదా చేయకూడదా? అనే రీతిలో రాజీవ్గాంధీ కుటుంబ సభ్యులెవరు ఉత్తరం రాయలేదని చెప్పారు. ఆయా కారణాల దృష్ట్యా రాబర్ట్ పయాస్, జయ కుమార్లను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తులు కేసుపై విచారణను ఈ నెల18వ తేదీకి వాయిదా వేశారు. -
కాంగ్రెస్ రాజీవ్తోనే నాశనం!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో జరిగే రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఓ అంచనాతో రహస్య నివేదికలు తయారు చేసుకోవటం పలు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలకు అలవాటైన పనే. భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ అమెరికా ఐబీ వర్గాలు ఇలానే ఓ నివేదికను రూపొందించాయి. ఆ నివేదిక ఇప్పుడు బహిర్గతం కావడంతో సంచలనంగా మారింది. ఇందిరాగాంధీ హత్యకు దాదాపు రెండేళ్ల ముందే 1983 జనవరి 14న ఈ నివేదికను యూఎస్ కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) తయారు చేసింది. ఒకవేళ అనివార్య కారణాలతో ఇందిర మరణిస్తే ఆమె వారసుడిగా రాజీవ్గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని అందులో నివేదించింది. ‘రాజీవ్గాంధీకి రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ప్రజలను ఆకర్షించటంలోనే కాదు. జూనియర్ కావటంతో పార్టీని సమర్థవంతంగా నడపటంలోనూ విఫలమై తీరతారు.’ అని పేర్కొంది. ఆయనకు ఇందిరాగాంధీలా రాజకీయ చతురత లేదని, ఒకవేళ రాజీవ్ ప్రధాని అయితే మాత్రం ఆ అధికారాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేరని, రాజకీయ అస్థిరత ఏర్పడి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తి పార్టీ ఉనికికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఆర్ వెంకట్రామన్, పీవీ నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీ తివారీలు ఆ హోదాకు రైట్ ఛాయిస్ అంటూ అభిప్రాయపడింది. ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలైన ఓ పిటిషన్కు బదులుగా సీఐఏ ఈ 30 పేజీల నివేదికను ఇండియా ఇన్ ది మిడ్-1980, గోల్స్ అండ్ ఛాలెంజ్ పేరిట బహిర్గత పరిచింది. -
‘దయతో నా జీవితానికి ముగింపు ఇవ్వండి’
చెన్నై: తన కారుణ్య మరణానికి(మెర్సీ కిల్లింగ్) అనుమతించాలంటూ రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన రాబర్ట్ పియోస్ దరఖాస్తు చేసుకున్నాడు. తన విజ్ఞప్తిని మన్నించి తనకు విముక్తినివ్వాలంటూ జైలు భద్రతాధికారికి లేఖ రాశాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో రాబర్ట్ కూడా ఒకరు. ఇప్పటికే అతడికి జీవిత కారాగార శిక్ష పడగా 26 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం రాబర్ట్తో సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులను సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని నిర్ణయించగా దానిని సుప్రీంకోర్టు అడ్డుకుంది. దాంతో వారి విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇక తనకు కారుణ్యమరణానికి అనుమతించాలంటూ అతడు పిటిషన్ పెట్టుకున్నాడు. రాబర్ట్ శ్రీలంకకు చెందిన తమిళియుడు. 1980లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) బలగాలు చేసిన వేధింపుల్లో తన కుమారుడు చనిపోయాడనే ఆగ్రహంతో రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు చేసిన కుట్రలో అతడు కూడా పాలుపంచుకున్నాడని తేల్చి అరెస్టు చేయగా అతడికి జీవిత ఖైదు పడింది. 1991 మే నెలలో రాజీవ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే, తన కారుణ్యమరణం కోసం చేసుకున్న దరఖాస్తుపై జైలు అధికారి స్పందిస్తూ ‘అతడు రాసిన లేఖ ద్వారా మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం, దీనిని రాష్ట్ర డీజీపీ ద్వారా హోంశాఖకు పంపిస్తాం. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున కేంద్రమే ఈ విషయం తేలుస్తుంది’ అని చెప్పారు. -
రాజీవ్ గాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు
పట్నా: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. నెహ్రూ కుటుంబంలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి మనిషి అని కొనియాడారు. హిందువులను జాగృత పరచడానికి ఎంతో కృషి చేశారని మెచ్చుకున్నారు. 'కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్ లో ప్రసారం చేయడానికి రాజీవ్ గాంధీ అనుమతించారు. భక్తులు పూజలు చేసేందుకు అయోధ్యలోని రామాలయం తలుపులు తెరిపించార'ని పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ స్వామి చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, తాము అంత్యక్రియలు చేయనున్నామని వ్యాఖ్యానించారు. -
‘సద్భావన’ చిహ్నాన్ని కూల్చడం దారుణం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చిహ్నాన్ని కూల్చడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా పాతబస్తీలో ఏర్పాటు చేసిన చిహ్నాన్ని కూల్చడంపై పీసీసీ నేతలు సోమవారం వేర్వేరుగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఉత్తమ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యాత్ర చిహ్నాన్ని తెలంగాణ జాగృతి నేతలు కూల్చడం అన్యాయమని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ... రాజీవ్ యాత్ర చిహ్నాన్ని తొలగించిన వారిపై కఠినంగా వ్యహరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ పోల్ను పోలీసులకు తెలియకుండా తీయడం సాధ్యం కాదన్నారు. -
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
-
రాజీవ్ హత్యపై ఐదేళ్ల ముందే చెప్పిన సీఐఏ
న్యూయార్క్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య గురించి అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించిందా? ఆయనపై దాడి జరిగే సూచనలు ఉన్నాయని హత్య జరగడానికి ఐదేళ్ల ముందే ఊహించిందా? అంటే అవునని ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. అయితే, అంతకంటె ముందే రాజీవ్ హత్యకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ 1986లోనే ఓ 23 పేజీల్లో 'ఇండియా ఆఫ్టర్ రాజీవ్..' అనే పేరుతో సీఐఏ రాసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఐఏనే ఇటీవల బయటపెట్టింది. 1986వరకు సీఐఏకు అందిన సమాచారం మేరకు అది రాసిన నివేదికలో తొలి వాక్యంగా 'ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన పదవికాలం ముగిసేనాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్యాప్రయత్నమే' అని మరో వాక్యంలో రాసింది. ఇలా సీఐఏ చెప్పిన సరిగ్గా ఐదేళ్ల తర్వాత 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్యకు గురయితే కచ్చితంగా భారత్కు అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం పడుతుందని కూడా సీఐఏ అప్పట్లోనే అంచనా వేసింది. పలు గ్రూపులు రాజీవ్ హత్యకోసం యత్నిస్తున్నాయని, అది ఏ సమయంలోనైనా జరగొచ్చే అవకాశం ఉందని సీఐఏ రిపోర్టు తెలిపింది. అంతేకాదు, రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పీవీ నరసింహరావు, వీపీ సింగ్లాంటి ప్రజ్ఞావంతులు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. -
రాజీవ్ కోసమే స్వీడన్ బోఫోర్స్ దర్యాప్తు ఆపేసింది
న్యూఢిల్లీ: నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్ దర్యాప్తు ఆపేసిందని సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ పర్యటన అనంతరం బోఫోర్స్పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4 నాటి సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్ గాంధీ 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
అభివృద్ధికి ‘హిందుత్వ’ జోడిస్తేనే గెలుపు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి అభివృద్ధి మంత్రం ఒక్కటే సరిపోదని.. హిందుత్వ అంశాన్ని జోడిస్తేనే ఓట్లు పడతాయని బీజేపీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ‘ఆర్థికాభివృద్ధి చాలా అవసరం. కానీ ఎన్నికల్లో ఇదొక్కటే సరిపోదు’ అని ఆజ్తక్ చానల్ నిర్వహించిన ‘దేశ్ కా ముద్దా’ (దేశం ముందున్న ప్రధాన సమస్య) కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. ‘పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దీంతో ఆర్థిక వ్యవస్థ 3 నుంచి 9 శాతానికి పెరిగింది. రాజీవ్ గాంధీ కాలంలో పారిశ్రామికాభివృద్ధి 14 శాతానికి చేరింది. కానీ వీరిద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు’ అని స్వామి చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధులు ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని.. వీరంతా వాజ్పేయి నుంచి నేర్చుకోవాలన్నారు. 2004 లోక్సభ ఎన్నికల సమయంలో భారత్ వెలిగిపోతోందన్న బీజేపీ నినాదం బెడిసికొట్టి.. సగం సీట్లను కమలదళం కోల్పోవాల్సి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే అభివృద్ధికి హిందుత్వను జోడించటం ద్వారానే మంచి ఫలితాలు సాధించొచ్చన్నారు. -
హంతకురాలి ఆత్మకథ
-
రాజీవ్కు మోదీకి తేడా ఏమిటీ?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆల్ ఇండియా రేడియో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1984లో జరిగిన ఢిల్లీ అల్లర్ల గురించి ప్రస్తావించారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆనాటి విషయాలను ప్రస్తావించడం ఆయనకు సమంజసమే కావచ్చు. కానీ ఆనాటి ఢిల్లీ అల్లర్లకు, 2002లో గుజరాత్లో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లకు మధ్య ఎన్నో పోలికలున్న విషయాలను ఆయన మరచిపోయినట్లు ఉన్నారు. నాడు ప్రధాన మంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ, గుజరాత్ అల్లర్లప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నేడు ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ఇద్దరూ బాధ్యతా రహితంగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. ఢిల్లీలో మూడు రోజులపాటు అల్లర్లు చెలరేగాక, గుజరాత్లో మూడు నెలలపాటు అల్లర్లు చెలరేగాయి. అదేమి చిత్రమోగానీ నవంబరు మూడవ తేదీన ఇందిరాగాంధీ అంత్యక్రియలతో కుళాయి నీళ్లు ఆపేసినట్లు ఢిల్లీ అల్లర్లు ఆగిపోయాయి. ‘ఓ మహా వృక్షం కూలినప్పుడు ప్రకంపనలు రావడం సహజమే’ అని బాధ్యతారహిత వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ అల్లర్లను రాజీవ్ గాంధీ పరోక్షంగా ప్రోత్సహించగా, గోద్రాలో హిందువులను ఊచకోత కోసారని పదే పదే ప్రస్థావించడం ద్వారా నరేంద్ర మోదీ అల్లర్లను ప్రోత్సహించారు. 1985లో జనవరి నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇందిరాంధీకి, భోపాల్ గ్యాస్ బాధితులకు సంతాపం తెలిపిన ప్రభుత్వం ఢిల్లీ అల్లర్ల బాధితులను విస్మరించింది. మోదీ ప్రభుత్వం కూడా గుజరాత్ అల్లర్ల బాధితులకు సంతాపం ప్రకటించలేదు. ఢిల్లీ అల్లర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మాసిపోయిన గాయాలను మళ్లీ రేపినట్లు అవుతుందంటూ తప్పించుకుంటూ వచ్చారు. మళ్లీ అల్లకల్లోలంగా మారుతున్న పంజాబ్లో శాంతియుత పరిస్థితులను స్థాపించేందుకు అకాలీ దళ్ చీఫ్ హెచ్ఎస్ లోంగోవాల్ను రాజీవ్ గాంధీ చర్చలకు ఆహ్వానించారు. అయితే ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు కమిషన్ను ఏర్పాటు చేస్తేనే వస్తానని ఆయన షరతు పెట్టారు. దాంతో తప్పనిసరై 1985, ఏప్రిల్ నెలలో ఢీల్ల అల్లర్లపై రంగనాథ్ మిశ్రా కమిషన్ను ఆయన ఏర్పాటు చేశారు. 1987లో ఆ కమిషన్ నివేదికను పార్లమెంట్కు సమర్పించింది. అయితే దానిపై పార్లమెంట్లో చర్చకు రాజీవ్ ప్రభుత్వం అనుమతించలేదు. గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నరేంద్ర మోదీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నానావతి కమిషన్ను ఏర్పాటు చేశారు. 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్ రెండేళ్ల క్రితమే తన నివేదికను గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. ఇప్పటివరకు ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. దానిపైనా చర్చించలేదు. ఇలాంటి నివేదికలు అసెంబ్లీకి సమర్పించాక ఆరు నెలల్లోగా చర్చించాలన్నది నియమం. రెండు కమిషన్లు తేల్చిందీ ఏమీలేదని అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశ రాజకీయాలను కుదిపేసిన ఈ రెండు అల్లర్లలో దోషులెవరికీ శిక్ష పడలేదు. పైగా ఢిల్లీ అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకులు హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్లను నాడు రాజీవ్ గాంధీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. గుజరాత్లోని నరోదయా పాటియాలో జరిగిన ముస్లింల ఊచకోతకు కారణమైన నిందితులను రెచ్చగొడుతూ మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలిన మాయా కొద్నానీని 2007లో మోదీ తన కేబినెట్లోకి తీసుకున్నారు. అటల్ బిహారి వాజపేయి అధికారంలోకి వచ్చాక నాటి ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు మరో కమిషన్ను వేశారు. ఆ కమిషన్ 2005లో పార్లమెంట్కు నివేదికను సమర్పించింది. దానిపై అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ కూడా జరిపింది. ప్రతిపక్షం డిమాండ్ మేరకు మన్మోహన్ సింగ్ నాటి సిక్కుల ఊచకోతకు క్షమాపణలు చెప్పారు. రేడియో కార్యక్రమంలో 1984 నాటి అల్లర్లను ప్రస్తావించిన మోదీ, తన హయాంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు నివేదికను ఇప్పటికైనా చర్చకు అనుమతించాలి. నాడు రాజీవ్ను ఆదర్శంగా తీసుకున్న మోదీ నేడు మన్మోహన్ సింగ్ను కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.....................ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
‘ఆవ’చేలో అవాస్తవాల పంట
విశ్లేషణ రాజీవ్గాంధీ ప్రధానిగా ఉండగా మూడు దశాబ్దాల క్రితం ఒక విప్లవానికి నాంది పలికారు. దానినే తరువాత వంటనూనెల విప్లవం (ఎల్లో రివల్యూషన్) అని వ్యవహరించారు. 1986 సంవత్సరంలో ఆయన చమురుగింజల టెక్నాలజీ మిషన్ను ప్రారంభించారు. అప్పటిదాకా వంటనూనెల దిగుమతులకు రాజ పోషకురాలిగా ఉన్న భారతదేశాన్ని 1993-94 ఆర్థిక సంవత్సరానికల్లా చమురు గింజల టెక్నాలజీ మిషన్ ఆ నూనెల ఉత్పత్తిలో ఇంచుమించు స్వయం సమృద్ధ దేశంగా మలిచింది. అంటే ఒక్క దశాబ్దంలోపుననే అంత మార్పు తెచ్చింది. వాస్తవానికి ఇది గొప్ప విజయం కిందే లెక్క. ఆ తరువాతే పతనం మొదలైంది. ఆ పసుపు విప్లవాన్ని చావగొట్టి చెవులు మూసేయాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తెచ్చిన ఒత్తిడుల ముందు భారతదేశం సంతోషంగా సాష్టాంగ పడింది. నిజానికి ఆశాజనకంగా ఉన్న దేశీయ వంటనూనెల ఉత్పత్తి రంగం ఆర్థిక సరళీకరణ అనే బలివితర్ది మీద ఎలా బలైపోయిందో తెలుసుకోవడానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ. వంట నూనెల దిగుమతుల సుంకాల మీద హద్దూపద్దూ లేని తీరులో కోతలు విధించారు. దీనితో చౌకబారు ఉత్పత్తులు దేశంలోకి వెల్లువెత్తాయి. ఫలితం- రైతులు చమురుగింజల ఉత్పత్తికి దూరంగా జరిగారు. దిగుమతి సుంకాలలో తగ్గుదల అంటే అదేమీ సాధారణ తగ్గింపు కాదు, దాదాపు 300 శాతం ఉన్న సుంకాలను దశలవారీగా సంపూర్ణంగా తొలగించారు. శరాఘాతం వంటి ఈ పరిణామంతో రైతులు చమురుగింజల సేద్యానికి నీళ్లొదిలారు. చమురుగింజల ప్రాసెసింగ్ పరిశ్రమ తలుపులు కూడా మూసుకు పోయాయి. ప్రస్తుతం భారతదేశం తన వినియోగానికి అవసరమైన వంటనూనెలలో 67 శాతం దిగుమతి ద్వారానే సమకూర్చుకుంటున్నది. అందుకు చెల్లిస్తున్న మూల్యం ఏకంగా రూ. 66,000 కోట్లు. ఆహ్వానించదగిన యోచన భారత్ తన వంటనూనెల దిగుమతి వ్యయాలను బాగా కుదించుకోవాలనే యోచనలో ఉందంటూ ఈ మధ్య పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దావె రాయిటర్ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఆ ప్రకటన నిస్సందేహంగా ఆహ్వానించదగినది. వంటనూనెల దిగు మతుల మీద ఆధారపడే పరిస్థితిని బాగా తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ కూడా ఒక సంద ర్భంలో ప్రకటించారు. కాస్త చదువుకున్న ఏ పౌరుడినైనా అడగండి! అతడేం చెబుతాడు? దిగుమతులను తగ్గించుకుని, దేశ రైతాంగానికి సాయపడాలనే చెబుతాడు. ఒకప్పుడు వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కలిగిన ఈ దేశం, లోపభూయిష్టమైన వాణిజ్య విధానాల పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలోనే ఆ నూనెలు దిగుమతి చేసుకునే దేశాలలో రెండో అతిపెద్ద దేశంగా మారవలసిన దుస్థితికి దిగజారిందన్న వాస్తవాన్ని కనీసం మంత్రులైనా గ్రహించాలి. భారత ఆహార సంస్థ విభజన కోసం ఏర్పాటు చేసిన శాంతకుమార్ ఉన్నత స్థాయి సంఘం ఎదుట నా వాదన వినిపించాను. చమురుగింజల విప్లవాన్ని వాణిజ్య సరళీకరణ ఏ విధంగా ధ్వంసం చేసిందో నేను వివరిస్తే ఆయన బాగా అర్థం చేసుకున్నారు. మన వాణిజ్య విధానాలను పునఃపరిశీలించాలంటూ శాంత కుమార్ సంఘం చేసిన సిఫార్సు ఉద్దేశం చౌక దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తులను రక్షించడమే. కేంద్రమంత్రులు రాధామోహన్సింగ్, అనిల్దావె దేశంలో వంటనూనెల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వాటి దిగుమతుల మీద సుంకాలను పెంచే విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. అందుకు కృషి చేయాలి. అంతేగానీ వంటనూనెల ఉత్పత్తుల పెంపు పేరుతో వివాదాస్పదమైన జన్యు మార్పిడి ఆవ వంగడాలను వాణిజ్య స్థాయిలో సాగు చేయడానికి అనుమతిం చడం పరిష్కారం కాదు. ఒక విషయం సుస్పష్టం. 2015లో భారత్ రూ.66,000 కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి కారణం ఆ సంవత్సరం చమురు గింజల ఉత్పత్తి తగ్గడం వల్ల మాత్రం కాదు. మనం దిగుమతులను ప్రోత్సహిం చడానికే అంత మూల్యం చెల్లించాం. ఇదే భారత దిగుమతుల వ్యయం పాలిట గుదిబండగా మారిపోయింది. కేంద్రం నియమించిన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సురక్షితం అన్న ముద్రతో మూడు రకాల జన్యుమార్పిడి ఆవ వంగడాలకు (డీఎంహెచ్-11 సహా మరో రెండు రకాలు) పచ్చజెండా ఊపింది. ఇలాంటి వంగడాలకు మంత్రిత్వ శాఖల మధ్య పనిచేసే ఈ సంస్థ అనుమతి తప్పనిసరి. వాస్తవం ఏమిటంటే సురక్షిత వంగడం అంటూ దానికి ఆపాదించిన ఆ అంశాలు ఏవో మాత్రం వారు బహిర్గతం చేయలేదు. అయితే ఈ అంశాలను వెబ్సైట్ ద్వారా ప్రజలకు వెల్లడించవలసిందనీ, వారి అభిప్రాయాలను ఆహ్వానించవల సిందనీ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జీఈఏసీని ఆదేశించింది. ఆ సమా చారంలో నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిన అంశం ఒకటి ఉంది. అది- జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఆవ వంగడం సాగుతో కలుపు మందు వాడకం బాగా పెరుగుతుందన్న సంగతి తెలిసినా జీఈఏసీ సభ్యులలో ఎలాంటి అలజడి కనిపించడంలేదు. నిజానికి జన్యుమార్పిడి ఆవ వంగడం సాగులో పెరిగిన కలుపు మందు వాడకం బహుళజాతి బేయర్ కంపెనీకి బాగా ఉపయోగ పడుతోంది. ఎందుకంటే ఆ మందును ఆ కంపెనీయే విక్రయిస్తున్నది. పురుగు మందులు వాడక తప్పదు జన్యుమార్పిడి కంపెనీలు మొదట ఏం చెప్పినా, బీటీ పత్తికి కూడా రసా యనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. ఆ విధంగా దేశంలో పురుగు మందుల వాడకం విపరీతమైంది. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం 2005 సంవత్సరంలో దేశంలో పత్తి పంటకోసం రూ. 649 కోట్ల రూపాయల విలువైన రసాయనిక పురుగు మందులను వినియోగించడం జరిగింది. 2010 సంవత్సరానికి దేశంలో జరుగుతున్న దేశీయ వంగడపు పత్తి సాగులో 92 శాతం బీటీ పత్తి రకాల వంగడాల వైపు మళ్లింది. ఆ ప్రకారం చూస్తే పురుగు మందుల వాడకం రూ. 880.40 కోట్లకు చేరింది. చైనాలో కూడా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారమన్నట్టు ప్రవేశపెట్టిన బీటీ కాటన్ రకాలను సాగులో పెట్టారు. అయితే తెగుళ్ల నివారణకు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువగా రసాయనిక మందులను అక్కడ ఉపయోగించవలసి వచ్చింది. బ్రెజిల్ మరొక ఉదాహరణ. అక్కడ పురుగు మందుల వాడకం ఒక దశాబ్ద కాలంలో 190 శాతం పెరిగిపోయింది. నిజానికి అర్జెంటీనాకు బ్రెజిల్ కొన్ని జన్యుమార్పిడి వంగడాలను ఇచ్చింది. తెల్ల పురుగు ఆశించడం, ఇతర తెగుళ్లతో 2015లో వచ్చిన సంక్షోభం తరు వాత దేశంలో రైతులు మూకుమ్మడిగా బీటీ కాటన్ పత్తిని బహిష్కరించారు. ఈ పరిణామం నుంచి పర్యావరణ మంత్రిత్వ శాఖ గుణపాఠం నేర్చుకోవాలి. తెల్లపురుగు ఆశించి పంట నాశనమైనందుకు జన్యుమార్పిడి వంగడాల సరఫరా సంస్థలను ఎందుకు బాధ్యులను చేయరాదో నాకు అవగతం కావడం లేదు. ఈ పురుగు ఆశించి పంట నాశనమైన కారణంగా ఒక్క పంజాబ్లోనే 300 మంది పత్తి రైతులు బలవన్మరణాల పాలైనారు. కాటన్ రైతులు ఇంత దారుణమైన సంఖ్యలో మరణిస్తుంటే వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతు సంక్షేమ సంస్థలు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాయి? భారతదేశంలో మనిషి ప్రాణం అంటే అంత చులకనా? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు రైతు సంక్షేమం వ్యవసాయ శాఖకు చట్టబద్ధమైన బాధ్యత. ఇదొక వృథా చర్చ జన్యుమార్పిడి ఆవ వంగడాలతో 26 శాతం అధిక దిగుబడి వస్తుందంటూ చేసే ప్రచారం ఎంత అసంబద్ధమో ఇప్పటికే జన్యుమార్పిడి పంటల రహిత భారత ఉద్యమ సమాఖ్య చాటి చెప్పింది. ఆ సమాఖ్య వారు కొన్ని ఇతర ఆవ వంగడాల మాదిరిగానే జన్యుమార్పిడి వంగడం ఎంత వ్యర్ధమైనదో కూడా వెల్లడించారు. ప్రస్తుతం జన్యుమార్పిడితో సంబంధం లేని ఐదు ఆవ వంగడాలు ఉన్నాయి. వీటి దిగుబడి డీఎంహెచ్-11 జన్యుమార్పిడి ఆవ వంగడం కంటే చాలా ఎక్కువ. అందుకే, ఎంతో తక్కువ దిగుబడి ఉండే జన్యుమార్పిడి ఆవ వంగడంతో వంట నూనెల దిగుమతి వ్యయాన్ని ఎలా కుదించగలరో నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. ఈ విధంగా చూస్తే జన్యుమార్పిడి ఆవ వంగడం గురించి చర్చ మొత్తం ఒక చెత్త వంగడం కేంద్రంగా జరుగుతున్న చర్చ అని అనిపించడం లేదా? దేశంలోని మొత్తం వంటనూనెల వినియోగంలో ఆవ నూనె వాటా పదిశాతం. ఇప్పుడు దృష్టి సారించవలసిన అంశం ఏమిటంటే, వంటనూనెల దిగుమతుల మీద సుంకం పెంపు. దీనితో పాటు దేశీయ ఉత్పత్తికి సేకరణ ధరను పెంచడం కూడా. జన్యుమార్పిడి ఆవ వంగడమే సమస్యలన్నింటికీ పరిష్కారమంటూ చేసే వాదనలను ఇక కట్టిపెట్టాలి. ఇది నిజం కాదు. మనం కొనుగోలు చేస్తున్న ఆవనూనెలో ఎక్కువ భాగం కల్తీయే అంటూ టీవీ చానళ్లు ప్రసారం చేసే వ్యాపార ప్రకటనలలో బాబా రాందేవ్ చెప్పడం మనం చూస్తున్నాం. ఇది తక్షణం దృష్టి సారించవలసిన రంగం. ఆవనూనె మార్కెట్ను శుద్ధం చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహార ప్రమాణాల భద్రత సంస్థతో చేతులు కలుపుతాయని నేను భావిస్తున్నాను. వినియోగదారునికి కావలసినది ఇలాంటి చర్యే. దేవిందర్శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com -
నలుగురు క్రీడాకారులకు రాజీవ్ఖేల్ రత్న అవార్డులు
-
ఘనంగా రాజీవ్గాంధీ జయంతి
-
రాజీవ్కు నివాళి
సోమాజిగూడ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. రాష్ట కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలి విపక్ష నత షబ్బీర్ అలీ, ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి దానం, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రాజీవ్గాంధీ జయంతి
మందమర్రి : దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 72వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల రమేశ్, సంగి సంతోశ్ మాట్లాడుతూ రాజీవ్గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువచ్చి దేశం ప్రగతి మూల కారకుడయ్యాడని పేర్కొన్నారు. రాజీవ్గాంధీ స్ఫూర్తిని ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కలిగి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గం ప్రభాకర్, రాజబాబు, నరేందర్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ : రాజీవ్గాంధీ 72వ జయంతిని శనివారం రామకృష్ణాపూర్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్చౌక్లోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చడానికి రాజీవ్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోపతి రాజయ్య, వార్డు సభ్యులు గోపతి బానేష్, సురేశ్, నాయకులు శ్రీనివాస్, లచ్చన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. -
ట్వీట్ చేసి ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది. మొన్నటికిమొన్న కశ్మీర్ ను 'భారత్ ఆక్రమిత కశ్మీర్'గా అభివర్ణించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపగా.. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది. ఇందిరాగాంధీ హత్య సందర్భంలో రాజీవ్ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. 'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు. ఈ మరణాలను ఉద్దేశించి రాజీవ్ ఈ వ్యాఖ్య చేసినట్టు భావించడంతో అప్పట్లో దుమారం రేపింది. తాజాగా రాజీవ్ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ విభాగం ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేసింది. దీనిపై దుమారం రేగడంతో వెంటనే ఆ వ్యాఖ్యను పీసీపీ ట్విట్టర్ నుంచి తొలగించింది. అయినా నెటిజన్లు ఆ ట్వీట్ ప్రింట్ స్క్రీన్లతో హోరెత్తిస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. అయితే, బెంగాల్ పీసీసీ మాత్రం తాము ఆ ట్వీట్ చేయలేదని పేర్కొంటున్నది. -
రాజీవ్ ఆశయాల కోసం ఉద్యమించాలి
వరంగల్ : భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఆశయాల సాధన కోసం యువజన కాంగ్రెస్ ముందుండి పోరాటం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అ న్నారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో శుక్రవారం యుజన కాంగ్రెస్ విభాగం అధ్వర్యం లో రాజీవ్గాంధీ 25వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకొని ‘హమ్ మే హై రాజీవ్’ అనే ఒక రోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారుుని మాట్లాడుతూ రాజీవ్గాంధీ అధికారంలోకి వచ్చిన అనంతరమే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి రోహిత్సింగ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్య క్షుడు కట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ నాల శ్రీహరి, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఈవీ. శ్రీనివాసరావు, నాయకులు లింగాజీ, రవీంద ర్, ప్రదీప్, శ్రీనివాస్రెడ్డి, రాంకీ, రాహూల్, ఫిరోజ్, విక్రం, సంపత్, ఫర్హస్ పాల్గొన్నారు. -
స్వప్రయోజనాల కోసమే పార్టీ వీడుతున్నారు
గాజులరామారం/చింతల్: కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాంచందర్ కుంతియా అన్నారు. మంగళవారం కుత్భుల్లాపూర్ వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాజీవ్ గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకుని నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘యాంటీ టైజం డే’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత ప్రాధాన్యతను గుర్తించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. ప్రస్తుతం కమ్యునికేషన్, అంతరిక్ష పరిశోధనల అభివృద్ధికి ఆయనే మ బాటలు వేశారన్నారు. రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్రాల విభజన చేయలేదని, దేశఅభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విభజనలకు మద్దతు ఇచ్చామన్నారు. కొందరు నేతలు తమ వ్యాపారాలు, ఛానళ్లను కాపాడుకునేందుకు, పదవుల కోసం టీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. అదో పిచ్చి కేసు... కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అగస్ట్యా వేస్ట్ ల్యాండ్ అర్ధం లేనిదన్నారు. వీహెచ్ మాట్లాడుతూ రెండేళ్ల మోదీ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. సోనియా రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ లేడన్నారు. సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మోదీ ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశం కోసం ప్రాణాలిచ్చిందెవరు?
► ఉగ్రవాదానికి చరమగీతం పాడాలి ► మోసాలు చేయడం టైజమ్ కంటే ప్రమాదం ► ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ మహబూబ్నగర్ అర్బన్ : ‘నరేంద్రమోదీ ఆయేగా...అచ్ఛాదిన్ లాయెగా’ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు.. దేశం కోసం ప్రాణాలిచ్చింది ఎవరో చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతురావు బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరుతూ తెలంగాణలో పర్యటిస్తున్న వీహెచ్ శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ముందుగా అశోక్ టాకీస్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాంటీ టైజమ్పై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెప్పించి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున బ్యాంకుల్లో జమచేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. విజయమాల్యా రూ.కోట్లు కొల్లగొట్టాడని, అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల డబ్బును ఎగ్గొట్టినా కేంద్రం ఏం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాజీవ్గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు, రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల స్వయంపాలన, మహిళా రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా కంప్యూటర్ రంగాన్ని విస్తరించారన్నారు. ఏఐసీసీ మరో కార్యదర్శి,వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించిన వారి నోర్లు కుట్టేస్తాం, నాలు కోసేస్తామని బెదిరిస్తూ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. ఉగ్రవాదం అంతానికి అందరం కృషిచేయాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీ మల్లు రవి, మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, నాయకులు ముత్యాల ప్రకాశ్, రంగారావు, గోపాల్యాదవ్, హనీఫ్, అమరేందర్ రాజు, పటేల్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీకి నాంది.. రాజీవ్ గాంధీ : మాజీమంత్రి సీఆర్ఆర్
ఎదులాపురం : దేశంలో టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందడానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఆర్ఆర్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఖ్యాతి రాజీవ్ గాంధీకి దక్కుతుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ భారత జాతిని ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేయడానికి తాపత్రయపడితే నేటి ప్రభుత్వాలు మతతత్వానికి పెద్ద పీట వేస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచాయని విమర్శించారు. రాజీవ్ గాంధీ హయంలో నెహ్రూ రోజ్గార్ పథకం ద్వారా గ్రామాల రూపు రేఖలను మార్చారని, నేడు కేవలం మాటల గారడితో పబ్బం గడుపుకునే ప్రభుత్వాలున్నాయని పేర్కొన్నారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శనీయమైనదని ప్రతీ ఒక్కరూ రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు యాసం నర్సింగ్ రావ్, సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కే. ప్రవీణ్ కుమార్, సుకేందర్, అంబకంటి అశోక్, సాజిద్ ఖాన్, దిగంబర్ రావ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్గాంధీకి ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని రాజీవ్ సమాధి వీరభూమి వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పుష్ప గుచ్చాం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు గులామ్ నాబి ఆజద్, అహ్మాద్ పటేల్, సుశీల్ కుమార్ షిండే, పీసీ చాకో, షీలా దీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్లు పాల్గొని... రాజీవ్కు ఘనంగా నివాళులర్పించారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించిన సంగతి తెలిసిందే. -
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ పేరు తీయొద్దు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియానికి రాజీవ్గాంధీ పేరును తొలగించొద్దని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ పేరును తొలగిస్తే పెద్దఎత్తున ప్రతిఘటిస్తామన్నా రు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్గాంధీని అప్రతిష్ట పాలు చేయాలని అప్ప టి ప్రభుత్వాలు ప్రయత్నించినా మచ్చలేని మనిషిగా నిరూపించుకున్నారన్నారు. ఈ నెల 21న రాజీవ్గాంధీ వర్థంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలేరులో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. ప్రధాని మోదీ ఆదర్శ విలువలు పాటించాలని, ఆయన తల్లిని గుజరాత్కు పంపకుండా తన వద్దే ఉంచుకోవాలని సూచించారు. -
ఇందిరకు పెద్ద కోడలంటే ఇష్టం!
ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి * ఇందిరకు దగ్గర కాలేకపోయిన మేనక * దివంగత ప్రధానిపై ఆమె వ్యక్తిగత వైద్యుడి పుస్తకం న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. తన చిన్న కుమారుడు సంజయ్గాంధీ మరణించిన తర్వాత చిన్న కోడలు మేనకాగాంధీ రాజకీయాల్లో తనకు సహాయంగా ఉండాలని కోరుకున్నారని.. అయితే ఇందర పెద్ద కుమారుడు రాజీవ్గాంధీకి వ్యతిరేక వర్గంలో మేనకాగాంధీ ఉండటంతో ఆమె తన అత్తకు దగ్గర కాలేదని.. ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన కె.పి.మాథుర్ తాజాగా రాసిన పుస్తకంలో వివరించారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్ మాజీ వైద్యుడైన మాథుర్ 20 ఏళ్ల పాటు ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. 1984 అక్టోబర్లో ఆమె హత్యకు గురయ్యే వరకూ ప్రతి రోజూ ఉదయం ఇందిరను కలిసేవారు. ఆయన రాజకీయవేత్తగా ఇందిర ప్రస్థానం, కుటుంబంతో ఆమె సంబంధాలపై ‘ద అన్సీన్ ఇందిరాగాంధీ’ పేరుతో పుస్తకం రాశా రు. ఈ పుస్తకానికి ఇందిర మనుమరాలు ప్రియాంకా గాంధీ ముందుమాట రాశా రు. ‘‘ఇందిరకు ఎప్పుడూ తన పెద్ద కోడలు సోనియా అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే.. సంజయ్ మరణించిన కాలంలో ఆమె మేనక వైపు కొంత మొగ్గు చూపారు. కానీ మేనక ఆమెకు దగ్గర కాలేకపోయారు. ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి. అయితే.. రాజకీయ వ్యవహారాలకు వచ్చే సరికి మేనక అభిప్రాయాలను ఇందిర పట్టించుకునేవారు. ఎందుకంటే.. ఆమెకు మంచి రాజకీయ దృక్కోణం ఉంది’’ అని పేర్కొన్నారు. ఆ సదస్సే కారణం... ‘‘సంజయ్ మరణించిన రెండేళ్ల లోపే.. కఠిన పరిస్థితుల్లో ఆమె (నాటి) ప్రధాని నివాసం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లక్నోలో సంజయ్ విచార్ మంచ్ సదస్సు నిర్వహించ తలపెట్టినపుడు ఇందిర విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఆ సదస్సులో మాట్లాడవద్దని మేనకకు ఇందిర సమాచారం పంపారు. కానీ మేనక ఆ సదస్సులో మాట్లాడారు. ఇది విభేదాలకు దారితీసింది’’ అని చెప్పారు. ఇందిర, సోనియాలు కలిసిపోయారు ‘‘రాజీవ్, సోనియా వివాహం తర్వాత.. ఇందిర, సోనియాలు చాలా త్వరగా కలసిపోయారు. ఇందిరకు సోనియా చాలా గౌరవం ఇచ్చేవారు. సోనియాపై ఇందిర ఆపేక్ష, మక్కువ చూపేవారు. అతి త్వరలోనే సోనియా ఇంటి బాధ్యతను తీసుకున్నారు’’ అని డాక్టర్ మాథుర్ పేర్కొన్నారు. ‘‘ఇందిర ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకునేవారు. ప్రత్యేకించి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేవారు. శరీరం, మనసుకు సంబంధించి అంశాలు.. ప్రజాదరణ గల సైన్స్ మేగజీన్లు ఇష్టపడేవారు. అంతర్జాతీయ ప్రచురణల్లో క్రాస్వర్డ్ పజిల్స్ను పరిష్కరించటం ఆమెకు చాలా ఇష్టం. ఒక్కోసారి మధ్యాహ్న భోజనం తర్వాత పేక ఆడేవారు’’ అని వివరించారు. ఎమర్జెన్సీ ఆమెకు నచ్చకపోయినా... ఎమర్జెన్సీ పరిస్థితులను వివరిస్తూ ‘‘ప్రధాని (ఇందిర), సంజయ్లపై వ్యతిరేకత గంట గంటకూ పెరుగుతూపోతోంది.అప్పటి పరిస్థితులపై ఆమె కూడా అసంతృప్తిగా ఉన్నారు. కానీ.. ఎందుకో ఆమె జోక్యం చేసుకోలేదు. దాన్ని అలాగే కొనసాగనిచ్చారు. చిన్న కుమారుడిపై తన అధిక ప్రేమకు ఆమె బాధితురాలై ఉంటారు’’ అని మాథుర్ చెప్పారు. -
'రాజీవ్ బతికుంటే రామ మందిరం నిర్మించేవారు'
ముంబై: 'రాజీవ్ గాంధీ బతికుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది. అప్పటివరకు వివాదంలో చిక్కుకుని ఉన్న ఆలయం తాళాలు తీయించింది రాజీవే. అంతేకాదు శిలాన్యాస్(పునాదిరాయి) ఉత్సవానికి కూడా ఆయన అనుమతి ఇచ్చారు. మందిర నిర్మాణం సజావుగా సాగేలా ముస్లిం పెద్దలతో రాజీవ్ చర్చించారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను సమగ్రంగా వినేవారు. ఆయన చనిపోకుండా ఉండుంటే మందిరం ఈపాటికి దేదీప్యమానంగా వెలుగుతుండేది' అంటూ రామమందిరంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి. వీలుచిక్కినప్పుడల్లా నెహ్రూ, గాంధీ కుంటుంబంపై విరుచుకుపడే స్వామి ఈ సారి రాజీవ్ గాంధీపై ప్రశంసలు కురిపించడం, అదికూడా వివాదాస్పద అయోధ్య మందిరం నిర్మాణానికి రాజీవ్ కృషిచేశారనడం గమనార్హం. ఆదివారం ముంబైలో నిర్వహించిన 'అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎందుకు,ఎలా?' అనే సెమినార్ లో ప్రసంగించిన స్వామి.. రాజీవ్ గురించి తనకు బాగా తెలుసునని, ఆయన రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యేదుంటే మందిర నిర్మాణం తప్పక పూర్తి చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. నిజానికి రాజీవ్ రామరాజ్య భావనను సమర్థించేవారు కాకపోయినప్పటికీ, సమస్య పరిష్కారం కోసం ముస్లిం నాయకులను ఒప్పించే ప్రయత్నం చేశారని స్వామి గుర్తుచేశారు. అంతిమంగా బాబ్రీ మసీదు కూల్చిన ప్రదేశంలోనే మందిర నిర్మాణానికి న్యాయస్థానం అనుమతి ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికల్లా మందర నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. దేశంలో పాఠశాలలు,హాస్పిటల్స్,రోడ్లు,టాయిలెట్ల నిర్మాణం ముఖ్యమా? రామ మందిరం ముఖ్యమా? అన్న ప్రశ్నకు బదులిస్తూ మొదటిది ప్రభుత్వ బాధ్యత అని, నా పని మందిర నిర్మాణం కోసం కృషి చేయడమని చెప్పారు. -
రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసిన మోదీ
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంట్ ఫలప్రదమైన చర్చలు జరగాలని మోదీ అన్నారు. అయితే సభలో జరుగుతున్న పరిణామాల పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రతిపక్షాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులు పాస్ కావడంలో ప్రతిపక్షాలు సహకరించాలని మోదీ విఙ్ఞప్తి చేశారు. సభలో ప్రొసీజర్ను అనుసరిస్తే చర్చలు ఫలప్రదమౌతాయన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. పార్లమెంట్లో ఓ ప్రధానిలా కాకుండా మెదటిసారి సభలోకి వచ్చిన ఓ వ్యక్తిలా తన భావాలని వెల్లడించాలని భావిస్తున్నాని మోదీ తెలిపారు. పార్లమెంట్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. బిల్లులు ఆమోదించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని మోదీ అన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోజు సభలో మహిళలే మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. కాగా కేంద్ర మానవవనరుల సహాయమంత్రి రామ్ శంకర్ కటారియా వివాదాస్పద వ్యాఖ్యలపై పార్లమెంట్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. కటారియా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజ్యసభలో తీర్మాణం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ నేత రాజా పిలుపునిచ్చారు. -
అయోధ్య తలుపులు తెరవడం రాజీవ్ తప్పు: ప్రణబ్
అయోధ్య తలుపులు తెరవడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన పెద్ద తప్పని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఆయన విడుదల చేసిన పుస్తకం రెండో సంపుటిలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. కొన్ని నిజాలు తనతోనే సమాధి అవుతాయని ప్రణబ్ అందులో రాశారు. తన డైరీని డిజిటలైజ్ చేయాల్సిందిగా తన కుమార్తెకు చెప్పానని, అయితే అందులోని అంశాలు మాత్రం ఎప్పటికీ బహిర్గతం కావని ప్రణబ్ తెలిపారు. తానెప్పుడూ ప్రధానమంత్రి పదవిని ఆశించలేదని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత తాను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నానని అనడంలో అర్థం లేదని చెప్పారు. ఈ విషయంపై రాజీవ్ గాంధీతో జరిగిన సంభాషణను కూడా ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు. అయోధ్య తలుపులు తెరవడం రాజీవ్ గాంధీ చేసిన పొరపాటని ఆయన రాశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన భారత దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసిందని అభిప్రాయపడ్డారు. ద టర్బులెంట్ ఇయర్స్ 1980-96 అనే పుస్తకంలో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ప్రధాని పదవి, బాబ్రీ మసీదు కూల్చివేత, రాష్ట్రపతి పాలన.. ఇలాంటి అంశాలపై తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించారు. -
‘యావజ్జీవం’పై స్పష్టత
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసు దోషుల విడుదల వ్యవహారంలో కేంద్రానికీ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఇచ్చిన తీర్పు ఆ మాదిరి కేసులన్నిటి విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై స్పష్టత నిచ్చింది. ఇన్నాళ్లుగా ఆ తరహా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్న అధికారాలకు కళ్లెం వేసింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల, వారి కుటుంబసభ్యుల ఆశలపై చన్నీళ్లు చల్లిన ఈ తీర్పు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఈ తీర్పునకు కారణమైన రాజీవ్ హత్య కేసు తిరిగిన మలుపులు అన్నీ ఇన్నీ కాదు. తమిళ టైగర్లు 23 ఏళ్లక్రితం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్గాంధీ బలయ్యారు. ఆ కేసులో నలుగురు దోషులు-శాంతన్, మురుగన్, నళిని, పేరరివలన్లకు మరణశిక్ష పడింది. నలుగురికి యావజ్జీవ శిక్ష పడింది. నళిని మరణశిక్షను తమిళనాడు గవర్నర్ యావజ్జీవ శిక్షగా మార్చారు. మిగిలిన ముగ్గురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లనూ తోసిపుచ్చడంతో వారు రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అక్కడ సైతం తిరస్కరణ ఎదురైంది. అయితే దీనంతటికీ 11 ఏళ్ల సమయం తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ వారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. అలవిమాలిన జాప్యం జరిగినందున ఈ ముగ్గురి శిక్షనూ యావజ్జీవ శిక్షగా మారుస్తూ నిరుడు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అన్నాడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వ కేబినెట్ హుటాహుటీన సమావేశమై మొత్తం ఏడుగురు దోషుల్నీ విడుదల చేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని, ఆలోగా స్పందించకపోతే తామే విడుదల చేస్తామని స్పష్టంచేసింది. ఇంత వేగంగా తీసుకున్న నిర్ణయం వెనక ఆ రాష్ట్రంలో అన్నా డీఎంకే, డీఎంకేల మధ్య ఏర్పడిన రాజకీయ పోటీ.... మరికొన్నాళ్లలో జరగబోయే లోక్సభ ఎన్నికలు ప్రధానకారణాలని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయంగా లబ్ధిపొందాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఆ ఉద్దేశంతోనే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దానికి అడ్డుపడింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఉండే అధికారాలు ఎలాంటివో...అనుసరించాల్సిన మార్గమేమిటో తాజా తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. అయిదుగురు న్యాయమూర్తులున్న ధర్మాసనం 3-2 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. అయితే రెండు తీర్పులూ యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం జైల్లో ఉండటమేనన్న అంశంలోనూ, ఆ శిక్షలో మినహాయింపూ లేదా వెసులుబాటు కోరడానికి రాజ్యాంగంలోని అధికరణలకింద ఖైదీలకుండే హక్కుల విషయంలోనూ ఏకీభావం ప్రకటించాయి. కానీ ఒకసారి మరణశిక్ష పడి, అది యావజ్జీవశిక్షగా మారిన ఖైదీలను జస్టిస్ దత్తు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులూ ప్రత్యేక కేటగిరీగా పరిగణించి...అలాంటివారికి యావజ్జీవ శిక్షలో మినహాయింపు కోరే హక్కు ఇక ఉండబోదని తేల్చి చెప్పారు. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం అలాంటి విచక్షణను ప్రదర్శించే అధికారం న్యాయస్థానాలకు ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే రాజీవ్గాంధీ హంతకుల విషయంలో జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని గుణదోషాల జోలికి న్యాయమూర్తులు వెళ్లలేదు. ఆ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల నేతృత్వంలోని మరో ధర్మాస నం వేరేగా విచారిస్తున్నది. కానీ ఇప్పుడిచ్చిన తీర్పు జయ ప్రభుత్వానికి విఘాతమనే చెప్పాలి. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏడుగురి విడుదలనూ తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పక్షంలో వారి విడుదలకు సహకరించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. ఇక నేర శిక్షాస్మృతిలోని నిబంధనల కింద ఖైదీల శిక్షలో మినహాయింపునిచ్చేందుకు ప్రభుత్వాలకుండే అధికారానికి పరిమితులు విధించడం సబబుకాదని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు...శిక్షలో మినహాయింపు ఇచ్చే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానిదేనన్న మెజారిటీ అభిప్రాయంతోనూ వారు విభేదించారు. నేర శిక్షాస్మృతిలోని 432(7) నిబంధన ప్రకారం కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల విషయంలో ఖైదీలకు మినహాయింపు ఇవ్వాలో లేదో నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని సొలిసిటర్ జనరల్ వాదనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గుచూపారు. శిక్షాకాలానికి ముందే విడుదల కావొచ్చునన్న ఖైదీల ఆశలపై న్యాయస్థానాలు నీళ్లు చల్లరాదని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చుతూ దోషుల చేతుల్లో హత్యకు గురైనవారిపై ఆధారపడిన వ్యక్తులకు కూడా అలాంటి ఆశలుంటాయని, వారి మాటేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా రెండు ప్రయోజనాలమధ్య పోటీ పెట్టే పక్షంలో ఖైదీల ముందస్తు విడుదల ఎప్పుడూ తప్పే అవుతుంది. అయితే నేరస్తులను సమాజంనుంచి వేరుపరిచి ఖైదు చేయడంలోని ఉద్దేశం వారిలో పరివర్తన తీసుకురావడం, వారిని సంస్కరిం చడం. అందువల్లే మారారనుకునేవారికి శిక్ష తగ్గింపునిచ్చే అధికారాన్ని మన రాజ్యాంగమూ, చట్టాలూ ప్రభుత్వాలకు కల్పించాయి. ఈ అధికారాలు దుర్వి నియోగమవుతున్నాయనే విషయంలో వేరే వాదనకు తావులేదు. ప్రస్తుత కేసులో ఖైదీల పరివర్తన అంశంకాక వారి ముందస్తు విడుదలవల్ల కలిగే ప్రయో జనాలే పాలకులకు ముఖ్యమయ్యాయి. ఇలాంటి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఖైదీల ముందస్తు విడుదలపై తటస్థంగా వ్యవహరించగల యంత్రాంగాన్ని ఏర్పరిచి, దాని సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకునే విధానం అమల్లో పెడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలుగులో దీనిపై కేంద్రం ఆలోచించాలి. -
ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు!
♦ రాజీవ్ హంతకుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్య ♦ శిక్షల విధింపులో ఔదార్యం సమాజానికి నష్టం న్యూఢిల్లీ: సీఆర్పీసీలోని 432(1) నిబంధన కింద దోషులకు శిక్షను తగ్గించడం లేదా శిక్షను రద్దు చేసే అధికారాన్ని కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ తమకు తాము తీసుకోకూడదని బుధవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దోషులు పెట్టుకున్న దరఖాస్తుల ఆధారంగానే సీఆర్పీసీ సెక్షన్ 432(2)లో పేర్కొన్న ప్రకారం ఆ ప్రక్రియ చేపట్టాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, సంబంధిత కోర్టు అభిప్రాయం ప్రకారం శిక్ష తగ్గింపు, లేదా రద్దుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకులను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అయితే, ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీల్లో ఇద్దరు న్యాయమూర్తులు ఆ తీర్పుతో విభేదించడం విశేషం. దోషులకు శిక్ష తగ్గింపు విషయంలో ప్రభుత్వాలకు ఉన్న చట్టబద్ధ అధికారాలను కోర్టులు తప్పించలేవని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం సాప్రే అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ లలిత్ ప్రత్యేకంగా 80 పేజీల తీర్పును రాశారు. ధర్మాసనం తీర్పులోని ఇతర ముఖ్యాంశాలు, కీలక వ్యాఖ్యలు.. ► తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి శిక్షలు విధించడంలో ఔదార్యం చూపితే.. అది సమాజంలో అస్తవ్యస్తతకు, శాంతిభద్రతల క్షీణతకు దారితీస్తుంది. దానివల్ల వేలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ► సామాన్యుల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రభుత్వ యంత్రాంగం రక్షణ కల్పించలేకపోతోందనేది కఠిన వాస్తవం. అందువల్ల తీవ్ర స్థాయి నేరాల్లో శిక్షల విధింపులో ఔదార్యం కూడదు. ► అక్రమ సంపాదనతో, అధికార కాంక్షతో ఉన్న అత్యున్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఇలాంటి చట్టవ్యతిరేక శక్తులు సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఆ వ్యక్తుల చేతిలో వీరు గూండాలుగా, డబ్బులు తీసుకుని హత్యలు చేసేవారిగా మారుతున్నారు. ► చట్టం ప్రకారం నడుచుకోకపోవడం ఇప్పుడు సాధారణం అయింది. ► ఈ ప్రొఫెషనల్ క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్, గూండాల బెదిరింపులతో కుటుంబ సభ్యులు, ఇతర దగ్గరి వారు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకురాని పరిస్థితిని చాలా కేసుల్లో చూశాం. ► కేసుల విచారణలో జాప్యం వల్ల అండర్ట్రయల్స్గా ఉన్న నేరస్తులు మరిన్ని తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. కేసుల సంఖ్యకు సరిపోయే స్థాయిలో జడ్జీలు లేకపోవడం దీనికి ఓ కారణం. ► శిక్ష రద్దుకు సంబంధించిన ఆశా కిరణాన్ని రాజీవ్గాంధీ హంతకులు ఆశించకూడదు. నేర ఘటన తరువాత ఎలాంటి ఉపశమనం పొందని బాధితులు, వారి బంధువులకే అది వర్తిస్తుంది. సంక్షిప్తంగా... ’పెషావర్’ముష్కరుల ఉరితీత: పెషావర్ ఆర్మీ స్కూలులో గతేడాది డిసెంబర్లో 150 మందికిపైగా చిన్నారులు, ఇతరులను చంపిన ఘటనలో పాలుపంచుకున్న నలుగురు తాలిబాన్ ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది. తృణమూల్ నేతను విచారించిన సీబీఐ: శారదా స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి శంకుదేబ్ పాండాను సీబీఐ విచారించింది.. మరో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు: పాస్పోర్టు ఏజెంటుగా పనిచేస్తూ.. పాక్కు సహకారం అందిస్తున్న షేక్ బాదల్(59) అనే మరో ఐఎస్ఐ ఏజెంటును కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. -
అవును.. ఆ నిర్ణయం తప్పే!
-
అవును.. ఆ నిర్ణయం తప్పే!
రష్దీ పుస్తకం నిషేధంపై చిదంబరం వ్యాఖ్య న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రచించిన ‘ద శాటానిక్ వెర్సెస్’ పుస్తకంపై 27 ఏళ్ల క్రితం (1988లో) అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిషేధం విధించటం తప్పేనని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ లిటరరీ ఫెస్ట్’కు హాజరైన చిదంబరం.. (ఈ పుస్తక నిషేధం సమయంలో రాజీవ్ హయాంలో చిదంబరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు) ‘రష్దీ పుస్తకంపై నిషేధం తప్పే. నన్ను 20 ఏళ్ల క్రితం అడిగినా ఇదే సమాధానం చెప్పేవాడిని’ అని అన్నారు. ఎమర్జెన్సీ విధించటం కూడా పొరపాటేనని.. అయితే 1980లో ఇందిరాగాంధీ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. మరోసారి అధికారంలోకి వస్తే ఎమర్జెన్సీ ఉండదన్న ఇందిర ప్రకటనను స్వాగతించిన ప్రజలు మళ్లీ ఆమెకు పట్టంగట్టడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ సూత్రం మాకూ వర్తిస్తుంది: జైట్లీ న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్(మూల నిర్మాణ సిద్ధాంతం) రాయలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, పార్లమెంటు సార్వభౌమత్వాన్ని కాపాడేందుకూ ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక వ్యవస్థను కాపాడేందుకు మిగిలిన వ్యవస్థలను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదన్నారు. టైమ్స్ లిట్ ఫెస్ట్లో మాట్లాడుతూ.. ఎన్జేఏసీని సుప్రీంకోర్టు మరోసారి పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతానికి ఎన్జేఏసీని కొట్టివేసినా.. భవిష్యత్లో దానిపై చర్చించాల్సి వస్తుందన్నారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించాక రాష్ట్రపతే జడ్జీలను నియమిస్తారని రాజ్యాంగం చెబుతుంది. కానీ కొలీజియం వ్యవస్థ ద్వారా సీజేఐ ఎవరినీ సంప్రదించకుండా నేరుగానే నియమకాలు చేపడతారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం’ అని అన్నారు. -
డిజిటల్ ఇండియా ఆద్యుడు మోదీ కాదు.. రాజీవ్ గాంధీ
ముంబై: డిజిటల్ ఇండియా ప్రారంభ కర్త ప్రధాని మోదీ కాదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ప్రముఖ టెక్నోక్రాట్, దేశీయ టెలికాం విప్లవ పితామహుడు సత్యనారాయణ గంగారామ్ పిట్రోడా (శామ్ పిట్రోడా) అన్నారు.దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ క్రెడిట్ను మోదీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ధ్వజం ఎత్తారు. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారంలో ప్రస్తుత తరం కొట్టుకుపోరాదని ఆయన హెచ్చరించారు. డిజిటల్ ఇండియా విప్లవం 25 ఏళ్ల కిందటే ప్రారంభమైందని చెప్పారు. డిజిటల్ ఇండియా రూపకల్పనకు మరో 20 ఏళ్లు పడుతుందన్నారు. ఆయన ఇక్కడ జరిగిన తన స్వీయ జీవిత చరిత్ర పుస్తకమైన ‘డ్రీమింగ్ బిగ్: మై జర్నీ టు కనెక్ట్ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ హయాంలో నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మ్యాటిక్స్ (ఎన్సీఐ) ఏర్పాటుతోనే డిజిటల్ ఇండియా విప్లవం ప్రారంభమైందని పిట్రోడా తెలిపారు. డిజిటల్ ఇండియా ఒక సుదీర్ఘ ప్రక్రియ అని రాత్రికి రాత్రే జరిగిపోదని పేర్కొన్నారు. అయితే మోదీ ప్రభుత్వం మరింత పట్టుదలతో డిజిటల్ ఇండియా ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నదని ఆయన ప్రశంసించారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమలో పనిచేస్తున్న పిట్రోడాను రాజీవ్ 1984లో ఆహ్వానించి టెలికాం కమిషన్ ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించారు. ఆయన తరువాత ఎన్సీఐతో పాటు సీ-డాట్ను దేశంలో ప్రారంభించారు. సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ తన స్నేహితుడు, మార్గదర్శి, తాత్వికుడు అయిన పిట్రోడా భారత్లో టెలికాం విప్లవానికి నాంది పలికారన్నారు. భవిష్యత్తును దర్శించి, దానిని సృష్టించేందుకు చేయవేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. -
తపాలా బిళ్లల రద్దు తగదు
అఫ్జల్గంజ్ : ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై రూపొందించిన తపాలా బిళ్లల రద్దుకు నిరసనగా టీపీసీసీ నాయకులు మంగళవారం అబిడ్స్లోని జీపీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ తపాలా బిళ్లలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. తపాలా బిళ్లలు పునరుద్ధరించాలని కోరుతూ చీఫ్ పోస్ట్ మాస్టర్ సుధీర్బాబుకు వినతిపత్రం సమర్పించారు. -
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
-
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
హైదరాబాద్: దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ పోస్టల్ స్టాంపులను రద్దు చేయడం సరికాదని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆరోపించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం సంకుచితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విదేశాలు కూడా రాజీవ్ , ఇందిర పేరిట స్టాంపులు విడుదల చేశాయని అన్నారు. రాజీవ్ స్టాంపులను తిరిగి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోస్టాపీసుల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు. -
ఇందిర, రాజీవ్ స్టాంపులు ఔట్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ముఖచిత్రాలతో కూడిన స్టాంపుల ముద్రణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆధునిక భారత నిర్మాతల’ పేరుతో ఇప్పటివరకు వీరిద్దరి స్టాంపులు రోజువారీ వినియోగానికి అందుబాటులో ఉండేవి. అయితే విధానపరమైన మార్పును తెస్తూ... ‘భారత నిర్మాతలు’ థీమ్తో పలువురు ప్రముఖుల పేరిట నిత్యవినియోగానికి స్టాంపులను ముద్రించనున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, మౌలానా ఆజాద్, భగత్సింగ్, జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా, వివేకానంద, మహరాణా ప్రతాప్... తదితరుల ముఖచిత్రాలతో స్టాంపులు మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖుల గౌరవార్థం స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసే విధానం అమలులో ఉంది. ఇలాంటివి పరిమిత సంఖ్యలోనే ముద్రిస్తారు. అలాకాకుండా ప్రముఖులందరి ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను నిత్యవినియోగానికి అందుబాటులోకి తేవాలని కేంద్ర కమ్యుని కేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తపాలా శాఖను ఇదివరకే ఆదేశించారు. ఇందిర, రాజీవ్లతో పాటు హోమీ జే భాభా, జేఆర్డీ టాటా, సీవీ రామన్, సత్యజిత్ రేల స్టాంపుల ముద్రణను కూడా నిలిపివేశారు. అయితే మహాత్మాగాంధీ, జవహర్ లాల్నెహ్రూ, బి.ఆర్.అంబేడ్కర్, మదర్ థెరిసాల ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను ఇదివరకటిలాగే కొనసాగిస్తారు. ఇందిర, రాజీవ్ల స్టాంపులను నిలిపేయాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మోదీ సర్కారు ఇంకా ఎంతకు దిగజారుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇద్దరు ప్రధానుల జ్ఞాపకాలను తుడిచిపెట్టే ప్రయత్నంలో మోదీ సర్కారు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. -
రాజీవ్ అందగాడనే పెళ్లాడా
లాహోర్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అందగాడనే తాను వివాహం చేసుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరితో అన్నారు. 2005లో నాటి పాక్ ప్రధాని ముషార్రఫ్తో కలసి భారత్కు వచ్చిన ఖుర్షీద్ సోనియాతో జరిపి సరదా సంభాషణను తన కొత్త పుస్తకం ‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’లో పొందుపరిచారు. అందులో సోనియా మాటలను ఉటంకించారు.‘అప్పుడు నేను (సోనియా) కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుతున్నాను. నా ఎదురుగా అందమైన యువకుడు వెళుతున్నాడు. నా పక్కనే ఉన్న సోహైల్ను(కాంగ్రెస్ నేత ఇఫ్తికరుద్దిన్ కుమారుడు) అతను ఎవరని అడిగాను. అతను(రాజీవ్) పండిట్ నెహ్రూ మనవడు అని సొహైల్ చెప్పాడు. నేను చిరునవ్వుతో ఆయన్ను(రాజీవ్) పలకరించా’ అని సోనియా చెప్పారన్నారు. -
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
ముంబై : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరుపుకునే సద్భావానా దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సద్భావానా ప్రతిజ్ఞ చేయించగా, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.. రాజ్భవన్ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కూపరాగే గ్రౌండ్లో ప్రతిఏటా జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకుని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విధాన సభలో ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం తిలక్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సద్భావనా దివాస్ జరుపుకున్నారు. కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు రాజీవ్ జయంతి సందర్బంగా కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముంబై కాంగ్రెస్ (ఎంఆర్సీసీ) అధ్యక్షుడు సంజయ్ బలప్రదర్శన చేయడం శోచనీయమంటూ కొందరు నేతలు బాహాటంగానే విమర్శించగా, వీధుల్లో తిరిగే వాళ్లను వెల్లగొట్టాలంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కామత్ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ 71 జయంతి సందర్భంగా కూపరాగే గ్రౌండ్లోని రాజీవ్ విగ్రహం వద్దకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్, నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు (ఎంఆర్సీసీ) సంజయ్ నిరుపమ్ మాత్రం మహాలక్ష్మి రేస్కోర్స్ నుంచి కూపరాగే గ్రౌండ్ వరకు సద్భావనా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలు కృపాశంకర్ సింగ్, భాయ్ జగ్తాప్, అమిన్ పటేల్, వర్షా గైక్వాడ్, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మండిపడ్డ నగరానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ, ‘రాజీవ్ జయంతి రోజు సంజయ్ నిరుపమ్ బలప్రదర్శన చేయడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలంతా ఉదయం 9 గంటలకే కూపరాగే గౌండ్కు చేరుకోవడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఈ సందర్భాన్ని బలప్రదర్శన చేయడానికి నిరు పం ఉపయోగించుకున్నారు’ అని విమర్శించా రు. కార్యక్రమానికి మాజీ ఎంపీలు మిలింద్ డియోరా, ప్రియా దత్ గైర్హాజరయ్యారు. అంతకుముందు మాట్లాడిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ , ముంబై నుంచి హ్యాకర్ల (వీధుల వెంట తిరిగే అమ్ముకునే వాళ్లు)ను తరిమికొట్టాలని పరోక్షంగా సంజయ్ నిరుపమ్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నిరుపం కూపరాగే వద్దకు రాకపోవడంపై స్పందించిన కామత్, ఎవరో రాకపోతే కాంగ్రెస్కు వచ్చిన ముప్పేమీ లేదని, కాంగ్రెస్ విలువలు, మనోభావాలకు వచ్చిన నష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అజోయ్ మెహతాను కలసిన సంజయ్ నిరుపం, వీధుల వెంట తిరిగి అమ్ముకునే వాళ్లను ముంబై నుంచి పంపేయాలని ఆదేశిస్తూ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్ దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు రాజ్భవన్ సిబ్బంది, అధికారులతో సద్భావనా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్భవన్ సిబ్బంది, ప్రజాపనుల శాఖ సిబ్బంది, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు, ముంబై పోలీసులతో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ‘కుల, మత, భాష, ప్రాంతాలతో సం బంధం లేకుండా దేశ ప్రజలందరి కోసం సహభావంతో పని చేస్తాం’ అని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి బీ వేణుగోపాల్ రెడ్డి, ఉప కార్యదర్శి పరిమళ్ సింగ్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని (ఆగస్టు 20) ‘సద్భాభావన దివాస్’గా ప్రతి ఏడు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. -
'రాజీవ్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం దుర్మార్గం'
హైదరాబాద్: రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ముఖ్యనేతలు గురువారం పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పంజాగుట్ట నుంచి నెక్లెస్రోడ్లోని ఇందిరా విగ్రహం వరకు టీపీసీసీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్గాంధీ కీలక పాత్ర షోషించారంటూ కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేలా సుష్మాస్వరాజ్ లాంటి పెద్దలు మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. మత సమరస్యం కోసం రాజీవ్గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర దేశానికి ఆదర్శమన్నారు. గాంధీ భవన్, ఇందిరాభవన్లోనూ రాజీవ్ గాంధీకి నివాళుర్పించారు. -
'ఐటీ విప్లవ పితామహుడు'
డెహ్రాడూన్:భారతదేశంలో ఐటీ విప్లవంలో వచ్చిన సమూల మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే కారణమని ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రశంసలు కురిపించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన రావత్.. రాజీవ్ గాంధీ ఎప్పటికీ ఐటీ విప్లవ పితామహుడిగా నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రపంచదేశాల్లో భారత్ ను బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేదని రావత్ తెలిపారు. ఆయన 1984-89 మధ్య కాలంలో దేశ ప్రధానిగా చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోతాయన్నారు. ఆయన ఎప్పుడూ నియంతలా కాకుండా ప్రజల ఐక్యత కోసం పాటు పడేవారని కొనియాడారు. ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడంలోనే కాకుండా.. ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని ఆయననే పేర్కొన్నారు. ఆ క్రమంలోనే పంచాయతీ రాజ్ లను తీర్చిదిద్దడానికి రాజీవ్ ఎంతో కృషి చేశారన్నారు. -
రాజీవ్కు ప్రధాని మోదీ నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు మోదీ గురువారం ట్విట్ చేశారు. 1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా పని చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడు లోని పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబును ప్రయోగించి హత్య చేసిన విషయం తెలిసిందే. -
రాజీవ్గాంధీకి ఘన నివాళి
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా గురువారం జాతీ యావత్తు ఆయన్ని స్మరించుకుంది. న్యూఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్ద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు ఆమె కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వీరభూమి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. -
అధునాతన భారతమే రాజీవ్ ఆశయం
భారత్ను 21వ శతాబ్దంలోకి నడిపించాలని పిలుపునిచ్చిన వారు రాజీవ్గాంధీ (ఆగస్ట్ 20, 1944-మే 21, 1991). నెహ్రూ, ఇందిరాగాంధీల వారసునిగా, నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పదవిని అధిష్టించిన మూడో వ్యక్తిగా రాజీవ్ తనదైన ముద్రను వేశారు. భారత శాస్త్ర, సాంకేతికరంగాన్ని ఆధునీకరించి, పరుగులు పెట్టించిన వారాయన. పైలట్గా జీవితం గడుపుతున్న రాజీవ్ అనుకోని పరిస్థితులలో తల్లి ఇందిర హత్య (అక్టోబర్ 31, 1984) తరువాత భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది డిసెంబర్ లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 411 స్థానాలు సాధించింది. ఆ పార్టీ చరిత్రలో ఇదొక మైలురాయి. రాజీవ్ తన హయాంలో విదేశాంగ విధానానికి కొత్త రూపును ఇచ్చి, అన్ని దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పారు. శ్రీలంక అంతర్యుద్ధం ముగింపునకు కృషి చేస్తూ ఇరుపక్షాలను శాంతి చర్చలకు ఆహ్వానించారు. లంక ప్రభుత్వం ఆహ్వానం మేరకు శాంతి స్థాపక దళాన్ని కూడా పంపారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు చేశారు. ఫిరాయింపులతో రాజకీయ అస్థిరత్వం పెరిగిపోయిన తరుణంలో ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ రాజ్యాంగబద్ధం చేశారు. దీనితో రాజ కీయ పక్షం అనే వ్యవస్థ బలోపేతమైంది. 1985-1991 మధ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడం, గాట్ ఒప్పందం మీద సంతకం చేసి ప్రపం చీకరణ పరిణామాల మధ్య సాహసోపేతంగా ముందుకు నడిచారు. నేడు ఇంత విశేషంగా విస్తరించిన సాఫ్ట్వేర్ రం గానికి బీజాలు పడినది రాజీవ్ హయాంలోనే. టెలిఫోన్ రంగాన్ని శాఖలుగా విభజించి అభివృద్ధి చేశారు. ఎం.టి. ఎన్.ఎల్., వి.ఎస్.ఎన్.ఎల్., బి.ఎస్.ఎన్.ఎల్. సంస్థలు గా ప్రత్యేక ప్రతిపత్తితో ఏర్పాటైనాయి. టీవీ రంగం అభివృద్ధికి కూడా రాజీవ్ తనవంతు కృషి చేశారు. శాంపిట్రోడా ఇచ్చిన సలహాలు కూడా రాజీవ్కు ఎంతగానో ఉపకరించాయి. ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు రాజీవ్. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన పీవీ నరసింహారావు జవ హర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. 1989లో జరిగిన ఎన్ని కలలో జనతాదళ్ విజయం సాధించి, వీపీ సింగ్ ప్రధాని పదవిని చేపట్టా రు. రాజీవ్ ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించారు. ఇన్ని కోణాల నుంచి దేశానికి సేవలందించిన రాజీవ్ చరిత్రలో చిరస్మరణీయం. (నేడు రాజీవ్ 71వ జయంతి) డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ -
'ఇటలీ మాఫియారాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది'
పార్లమెంటులో చర్చ మొత్తం తనమీదే సాగుతున్న తరుణంలో.. లలిత్ మోదీ మరో బాంబు పేల్చారు. ఇటాలియన్ మాఫియా రాణికి తాను డబ్బు ఇచ్చి ఉండాల్సిందని, ఆ డబ్బును తనకు అప్పు ఇవ్వాల్సిందిగా వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోదీ 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. ఈరోజు పార్లమెంటు సజావుగా సాగి ఉండేదంటూ ఓ ఫాలోవర్ ఇచ్చిన ట్వీట్కు సమాధానంగా లలిత్ మోదీ స్పందించారు. తనకు ఓ కప్పు టీ కోసం సంతకం చేసేంత శక్తి లేదని, కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉందని తెలిపారు. అయితే అలా తాను తెచ్చిన డబ్బును క్రికెట్ మాఫియా ఖర్చు పెడుతుందని వ్యాఖ్యానించారు. తాను 1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభిలాషులు ముందుగా వెళ్లి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలిసి ఓ కప్పు టీ తాగాలని చెప్పారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనను అక్కడకు కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారని, కావాలంటే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోడానికి ప్రధానమంత్రి ఇంటి రికార్డులు సరిచూసుకోవచ్చని సవాలు చేశారు. తర్వాత కెప్టెన్కు సూట్కేసు ఇవ్వాల్సిందిగా చెప్పారని, తాను అలాగే ఇచ్చినని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలా చేస్తారని లలిత్ మోదీ తెలిపారు. కావాలంటే వాళ్లు దీన్ని ఖండించుకోవచ్చని.. అయితే ఏదైనా చేసేముందు ప్రధాని ఇంటి రికార్డులు చెక్ చేసుకోవాలని అన్నారు. తన ఎంట్రీ అందులో రికార్డు అయి ఉంటుందని స్పష్టం చేశారు. కావాలంటే కెప్టెన్ లేదా ఇటాలియన్ దీన్ని ఖండించుకోవచ్చన్నారు. ఇక ఎవరైనా ఢిల్లీలోని సతీష్ శర్మ ఇంటికి వెళ్తే, ఆయన వాళ్లను గర్వంగా ఒక గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారని, అందులో కింద ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు నిండి ఉంటుందని లలిత్ మోదీ ఆరోపించారు. True. I should have asked @varungandhi80 to loan it to me. Then all would have been happy and Italian mafia queen -
రాజీవ్ హంతకులు క్షమాభిక్షకు అనర్హులు
సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష పొందే అర్హత లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఆ హత్య విదేశీయుల పాత్ర ఉన్న కుట్ర ఫలితమని పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలి, జైలుశిక్ష అనుభవిస్తున్న శ్రీలంకకు చెందిన శ్రీహరన్ అలియాస్ మురుగన్, శాంతన్, రాబర్ట్ పియస్, జయకుమార్లతో పాటు, భారతీయులైన నళిని, రవిచంద్రన్, అరివులకు క్షమాభిక్ష ప్రసాదించి, జీవిత ఖైదునుంచి విముక్తి కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై కేంద్ర అభిప్రాయాన్ని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వివరించారు. ‘వీరు మన మాజీ ప్రధానమంత్రిని చంపారు. ఇందులో విదేశీయుల కుట్ర ఉంది. వారికి క్షమాభిక్ష ఏంటి? వారి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి, గవర్నర్(తమిళనాడు) ఇద్దరూ తిరస్కరించారు’అని రంజిత్ వివరించారు. దోషుల్లో మురుగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ హాజరయ్యారు. వాదనల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా.. ‘నేరస్థుల మరణ శిక్షను మేం ఇప్పటికే జీవిత ఖైదుగా మార్చాం. ఇప్పుడు మళ్లీ మా తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. సీబీఐ దీన్ని సవాలు చేయొచ్చా? వారికి శిక్ష పడింది కూడా సీబీఐ దర్యాప్తుతోనే కదా!’ అని ధర్మాసనం ప్రశ్నిం చింది. మరోవైపు, ‘ఒక సారి మేం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత వారికి శిక్ష తగ్గించే విషయంలో అధికారం రాష్ట్రాలకు ఉంటుం ది. దోషులు ఇప్పటికే 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని, అది చాలని తమిళనాడు ప్రభుత్వంవాదిస్తోంది. ఈ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’అని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర దర్యా ప్తు సంస్థలు విచారణ జరిపిన కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే లేదాశిక్షను తగ్గించే అధికారం కేంద్రాలకు ఉంటుందా? లేక రాష్ట్రాలకు ఉంటుందా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. -
ఇందిర, రాజీవ్కు పిండ ప్రదానం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరి పిండ ప్రదానాలు చేశారు. మంగళవారం పుష్కర స్నానానికి మంగపేట వెళ్లిన ఆయన పుష్కర ఘాట్లో ఇందిర, రాజీవ్ ఆత్మలకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు. -
బోఫోర్స్ గన్స్ నాణ్యమైనవే!
న్యూఢిల్లీ: బోఫోర్స్ గన్స్ నాణ్యతలో అద్భుతమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా లేవనెత్తడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరిక్కర్ పై విధంగా స్పందించారు. స్వీడన్ కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో మేటి అని ఆయన తెలిపారు. అయితే ప్రణబ్ వ్యాఖ్యలపై మాట్లాడానికి పరిక్కర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడుదలుచుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఆ గన్స్ నాణ్యతపై అడిగితే మాత్రం అవే అద్భుతమైనవిగా చెబుతానని పరిక్కర్ చమత్కరించారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో రాష్ట్రపతి బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదని.. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామని ప్రణబ్ తెలిపారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నాన్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1986లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో స్వీడన్కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. -
బోఫోర్స్ కుంభకోణం అని ఏ కోర్టు నిర్ధారించలేదు: ప్రణబ్
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన 'బోఫోర్స్' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బోఫోర్స్ ఒప్పందం కుంభకోణం తేనెతుట్టను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కదిలించారు. బోఫోర్స్ ఒప్పందం ...కుంభకోణం అని నిర్థారాణ కాలేదని ఆయన అన్నారు. బోఫోర్స్ ఒప్పందం స్కాం అని మీడియాలోనే వచ్చిందని ప్రణబ్ పేర్కొన్నారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదన్నారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నానన్నారు. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు. స్వీడన్కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. 'బోఫోర్స్' దెబ్బకు 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోకీ ఆరోపణలు ఎదుర్కొన్న ఖత్రోకీ, అరెస్టును తప్పించుకునేందుకు 1993లో భారత్ను విడిచి పారిపోయాడు. అతడి అప్పగింత కోసం సీబీఐ రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. తొలుత 2002లో మలేసియాను, తర్వాత 2007లో అర్జెంటీనాను ఖత్రోకీ అప్పగింత కోసం కోరినా ఫలితం లేకపోయింది. 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వ్యవహారంపై బీజేపీ... మరోసారి సీబీఐ దర్యాప్తుకు అప్పట్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
రాజీవ్ ఆశయాలు సాధిద్దాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్గాంధీ ఆశయాల సాధనకు అందరూ నడుం బిగించాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాజీవ్ జ్యోతి సద్భావన కమిటీ వ్యవస్థాపక చైర్మన్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాజీవ్జ్యోతి యాత్రను ప్రతిఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఈనెల 15వ తేదీన బెంగళూరు నుంచి ప్రారంభమైన రాజీవ్జ్యోతిని కర్ణాటక పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ గురువారం చెన్నైకి చేరుకుంది. ఇక్కడి రాజీవ్ స్మారక స్థూపం వద్ద టీఎన్సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, జయకుమార్, చెల్లకుమార్, మాజీ ఎంపీ వసంతకుమార్, యశోద, వి. నారాయణస్వామి, స్మారక స్థూపం ఇన్చార్జ్ మురుగానందం రాజీవ్జ్యోతికి స్వాగతం పలికారు. దేశసమైక్యత, సమగ్రత, సెక్యులిరిజంను కాపాడుతాం, శాంతిపరిరక్షణకు పాటుపడతాం, ఉగ్రవాదం, మతత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ నేతలచేత పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు. -
రాజీవ్ గాంధీకి మోదీ సెల్యూట్
మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు. 1991 సంవత్సరంలో ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో మరణించిన రాజీవ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని తన ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాద మానవబాంబు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. Paying tributes to former Prime Minister Shri Rajiv Gandhi on his death anniversary. — Narendra Modi (@narendramodi) May 21, 2015 -
రాజీవ్గాంధీకి సోనియా, రాహుల్ ఘన నివాళి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్దకు వారు చేరుకుని ఘన నివాళులర్పించారు. వారితో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలు రాజీవ్కు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు అజయ్ మాకెన్, పీసీ చాకో, గాంధీ కుటుంబసభ్యులు రాజీవ్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
సంబంధాల బలోపేతానికి ‘యాక్ట్ ఈస్ట్’
ఫిజీ జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందినవారే. రాజీవ్గాంధీ అనంతరం 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో మోదీ నల్లధనం వెలికితీత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మోదీ విదేశీ పర్యటనలు మయన్మార్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11-20 తేదీల మధ్య మూడు దేశాల్లో పది రోజులపాటు పర్యటించారు. 40 మంది ప్రపంచ దేశాల నేతలను కలుసుకున్నారు. మొదటగా మయన్మార్ (బర్మా) వెళ్లారు. ఆ దేశ రాజధాని నేపిటాలో అధ్యక్షుడు థీన్సేన్తో సమావేశమయ్యారు. నవంబర్ 12న నేపిటాలో జరిగిన 12వ ఆసియాన్-భారత్ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఇందులో ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యులైన పది దేశాల నేతలు పాల్గొన్నారు. బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స దేశాలకు ఆసియాన్లో సభ్యత్వం ఉంది. ఈ సదస్సులో మోదీ ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో భారత్కు ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవిగా మోదీ స్పష్టం చేశారు. 2015 చివరికల్లా ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నాయకులు లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ 13న నేపిటాలో నిర్వహించిన తొమ్మిదో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు వ్యతిరేకంగా తూర్పు ఆసియా సదస్సు చేసిన ప్రకటనను మోదీ సమర్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సులో పది ఆగ్నేయాసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా (మొత్తం 18) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ప్రతిపక్ష నేత ఆంగ్సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా: మయన్మార్ నుంచి నరేంద్రమోదీ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందుగా ఆయన బ్రిస్బేన్లో నిర్వహించిన జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు నవంబర్ 15, 16 తేదీల్లో జరిగింది. జి-20 సదస్సు అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్తో కాన్బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగించారు. సిడ్నీలోని ఆల్ఫోన్స ఎరినాలో 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నవంబర్ 17న మాట్లాడారు. ఈ సందర్భంగా జన్ధన్ యోజన పథకం గురించి వివరించారు. కేవలం పది వారాల్లోనే ఏడు కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు చెప్పారు. నవంబర్ 18న మెల్బోర్న నగరానికి వెళ్లారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న మెల్బోర్న క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన విందులో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్.లక్ష్మణ్, అలన్ బోర్డర్ పాల్గొన్నారు. ఫిజీ: మూడు దేశాల పర్యటనలో చివరగా నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజీ దేశాన్ని సందర్శించారు. 33 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఫిజీలో పర్యటించడం ఇదే ప్రథమం. 1981లో ఫిజీలో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామాతో సమావేశమయ్యారు. ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఫిజీ దేశంలోని చక్కెర పరిశ్రమకు భారత్ 75 మిలియన్ డాలర్ల రుణ సహాయం అందిస్తుందని ప్రకటించారు. నేపాల్లో సార్క సదస్సు: 2014 నవంబర్ 25న 18వ సార్క శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు నేపాల్ రాజధాని ఖాట్మాండు చేరుకున్నారు. సార్క సదస్సు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. సార్కలో భారత్తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ఖాట్మండు సదస్సు సందర్భంగా మోదీ పాకిస్థాన్ మినహా మిగతా దేశాల నాయకులతో విడిగా చర్చలు జరిపారు. మాదిరి ప్రశ్నలు 1. 12వ ఆసియాన్ - భారత సదస్సు 2014 నవంబర్ 12న ఏ నగరంలో నిర్వహించారు? ఎ) సింగపూర్ బి) మనీలా సి) హనోయ్ డి) నేపిటా 2. ఆగ్నేయాసియా దేశాల కూటమిలో సభ్యత్వం లేనిది? ఎ) లావోస్ బి) వియత్నాం సి) జపాన్ డి) మలేషియా 3. ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఎ) థాయిలాండ్ బి) ఫిలిప్పీన్స సి) ఇండోనేషియా డి) మలేషియా 4. థీన్సేన్ ఏ దేశాధ్యక్షులు? ఎ) బ్రూనై బి) కాంబోడియా సి) వియత్నాం డి) మయన్మార్ 5. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సదస్సులో ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని ప్రకటించారు? ఎ) బ్రిక్స్ బి) ఆసియాన్- భారత్ సి) జి-20 డి) సార్క 6. 2015 నాటికి ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎ) 100 బి) 200 సి) 150 డి) 250 7. తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)లో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి? ఎ) 10 బి) 18 సి) 16 డి) 20 8. భారత్కు సభ్యత్వంలేని కూటమి? ఎ) జి-20 బి) తూర్పు ఆసియా సదస్సు సి) బ్రిక్స్ డి) ఆసియాన్ 9. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంగ్సాన్ సూకీతో సమావేశమయ్యారు. ఆమె ఏ దేశ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు? ఎ) వియత్నాం బి) చైనా సి) మయన్మార్ డి) థాయిలాండ్ 10. అమెరికా ఏ కూటమిలో సభ్యదేశంగా ఉంది? ఎ) ఆసియాన్ బి) ఎస్సీవో సి) సార్క డి) తూర్పు ఆసియా సదస్సు 11. 2014 నవంబర్ 15, 16 తేదీల్లో జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఎ) దక్షిణ కొరియా బి) కెనడా సి) మెక్సికో డి) ఆస్ట్రేలియా 12. నరేంద్ర మోదీ కంటే ముందు 28 ఏళ్ల కిందట 1986లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత ప్రధాని? ఎ) ఇందిరాగాంధీ బి) వి.పి. సింగ్ సి) రాజీవ్ గాంధీ డి) ఐ.కె. గుజ్రాల్ 13. జి-20 దేశాలు 2018 వరకు అంతర్జాతీయ ఆర్థికవృద్ధిని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి? ఎ) ఒక శాతం బి) రెండు శాతం సి) నాలుగు శాతం డి) అయిదు శాతం 14. జి-20 దేశాల సదస్సు పూర్తి కాకుండానే మధ్యలోనే నిష్ర్కమించిన నాయకుడు? ఎ) స్టీఫెన్ హార్పర్ బి) డేవిడ్ కామెరాన్ సి) షింజో అబే డి) వ్లాదిమిర్ పుతిన్ 15. జి-20లో సభ్యత్వం ఉన్న సంస్థ? ఎ) అంతర్జాతీయ ద్రవ్యనిధి బి) ప్రపంచ బ్యాంక్ సి) యూరోపియన్ యూనియన్ డి) అంతర్జాతీయ వాణిజ్య సంస్థ 16. ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంగా జి-20 ఎప్పుడు ఏర్పడింది? ఎ) 1999 బి) 2003 సి) 2008 డి) 2000 17. 2013లో 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సలు పొంది ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం? ఎ) అమెరికా బి) భారత్ సి) చైనా డి) జపాన్ 18. 2015 నవంబర్లో జి-20 సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఎ) బాలి, ఇండోనేషియా బి) రియాద్, సౌదీ అరేబియా సి) అంతల్యా, టర్కీ డి) టొరాంటో, కెనడా 19. 2016లో జి-20 శిఖరాగ్ర సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఎ) చైనా బి) భారత్ సి) అర్జెంటీనా డి) మెక్సికో 20. జి-20 దేశాల తొమ్మిదో శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిందెవరు? ఎ) బరాక్ ఒబామా బి) డిల్మా రౌసెఫ్ సి) జాకోబ్ జుమా డి) టోనీ అబాట్ 21. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని? ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్ గాంధీ సి) లాల్బహదూర్ శాస్త్రి డి) నరేంద్ర మోదీ 22. ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో ఆల్ఫోన్స ఎరీనాలో 20 వేలమంది ప్రవాస భారతీయులనుద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు? ఎ) బ్రిస్బేన్ బి) కెయిన్స సి) సిడ్నీ డి) అడిలైడ్ 23. భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఆస్ట్రేలియా ప్రధాని ఏ నగరంలోని క్రికెట్ మైదానంలో విందునిచ్చారు? ఎ) మెల్బోర్న బి) సిడ్నీ సి) పెర్త డి) బ్రిస్బేన్ 24. బ్రిస్బేన్ నగరంలో ఏ జాతీయ నాయకుని కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఆవిష్కరించారు? ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్ బి) మహాత్మాగాంధీ సి) శ్యామప్రసాద్ ముఖర్జీ డి) బాలగంగాధర్ తిలక్ సమాధానాలు: 1) డి; 2) సి; 3) సి; 4) డి; 5) బి; 6) ఎ; 7) బి; 8) డి; 9) సి; 10) డి; 11) డి; 12) సి; 13) బి; 14) డి; 15) సి; 16) ఎ; 17) బి; 18) సి; 19) ఎ; 20) డి; 21) డి; 22) సి; 23) ఎ; 24) బి. ఎన్. విజయేందర్రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఉద్యోగాలు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హైదరాబాద్లోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వేర్హౌస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 25 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైప్రైటింగ్లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జనవరి 19 వెబ్సైట్: http://cewacor.nic.in/ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఓఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - టోపో ట్రెయినీ: 118 అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). వయసు: 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్టీరియోస్కోపిక్ ఫ్యుజన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 21 వెబ్సైట్: www.surveyofindia.gov.in జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల సంఖ్య: 65 విభాగాలు: ఇన్సూరెన్స్, హెచ్ఆర్, జనరల్, ఫైనాన్స్/ అకౌంట్స్, ఇంజనీరింగ్ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), లీగల్, స్టాటిస్టిక్స్, మెడికల్. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జనవరి 24 వెబ్సైట్: www.gicofindia.in -
స్మృతి సరే... రాజీవ్ 'జాతకం' సంగతేంటి?
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ జ్యోతిష్యుడ్ని కలవడంపై రాద్ధాంతం చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్పై దాడికి కాషాయం పార్టీ తన అంబుల పొదలో నుంచి సరికొత్త ఆయుధాన్ని వెలికి తీసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోసం ఆయన తాత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జాతక చక్రం వేయించాలని తన సోదరి కృష్ణ హతిసింగ్ కి 1944, ఆగస్టు 29వ తేదీన రాసిన లేఖను బీజేపీ బుధవారం వెలుగులోకి తీసుకువచ్చింది. ఇదే అంశంపై నెహ్రు తన కుమార్తె ఇందిరకు కూడా లేఖ రాశారని బీజేపీ పేర్కొంది. కాగా నవంబర్ 25వ తేదీన స్మృతి ఇరానీ తన భర్తతో కలిసి రాజస్థాన్లోని భిల్వారాలో జ్యోతిష్కుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువడ్డాయి. స్మృతి ...జ్యోడిష్యుడిని కలవటంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ జాతకంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. -
ఎయిర్పోర్ట్కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రాజీవ్గాంధీ పేరే కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. కాని డొమెస్టిక్ టెర్మినల్కు మాత్రం మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో నూతనంగా మరో విమానాశ్రయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది... ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. విమానాశ్రయ పేరు మార్పును రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన అధికార, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు. -
రాజీవ్ గాంధీ తర్వాత మళ్లీ మోదీయే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాలలో పదిరోరజుల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన మయన్మార్లో పర్యటిస్తున్నారు. అక్కడి పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఆస్ట్రేలియా వెళ్తారు. 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న రెండో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అవుతారు. ఆస్ట్రేలియాలో జరిగే జి20 దేశాల సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. అనంతరం, ఆ దేశ ప్రధానమంత్రి టోనీ అబాట్తో చర్చలు కూడా జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటన కోసం అక్కడి ప్రవాస భారతీయులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అమెరికాలో నరేంద్రమోదీ పర్యటించినప్పుడు అక్కడ మాడిసన్ స్క్వేర్ ప్రాంతంలో ఆయన చేసిన ప్రసంగం చరిత్రాత్మకం కావడం, లక్షలాది మంది దాన్ని వీక్షించడం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియాలో కూడా మోదీకి ఘన స్వాగతం పలకాలని అక్కడివారు భావిస్తున్నారు. -
ఘనంగా రాజీవ్ సద్భావన యాత్ర
హైదరాబాద్ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు చార్మినార్ కట్టడం నుంచి సద్భావన యాత్ర చేపట్టి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని తెలంగాణ సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ సద్భావన అవార్డు-2014 ను ప్రముఖ కార్మిక నాయకుడు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించి హైదరాబాద్లో మతకలహాలు నెలకొనడంతో శాంతిని నెలకొల్పేందుకు రాజీవ్ ముందుకొచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్సీ షబ్బీర్అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోదండ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షులు దానం నాగేందర్ పాల్గొన్నారు. -
ఉండాల్సింది 299....
సాక్షి కడప : దివంగత ముఖ్యమంత్రి కలల సౌధమైన రాజీవ్గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) కష్టాలను ఎదుర్కొంటోంది. మెరుగైన వసతులతోపాటు అత్యాధునిక పరిజ్ఞానంతో నెలకొల్పిన రిమ్స్లో బోధించే అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వైద్య విద్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు విద్యార్థులతోపాటు ఇటు రోగులకు ఉత్తమ సేవలు అందాలంటే భారీగా ఏర్పడిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ సర్కార్ వైఎస్సార్జిల్లాపై వివక్ష చూపుతున్నదన్న ఆరోపణలున్న నేపధ్యంలో రిమ్స్పై ఏమాత్రం శ్రద్ధ కనబరుస్తునన్నదే అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. వైఎస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనను ఎంతో ఆదరించిన కడప జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఏడాది పూర్తికాక ముందే కడప నగర శివార్లలో రిమ్స్ కలల సాకారానికి పునాదులు వేశారు. 2005-06లో మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థులు విద్యనభ్యసించేందుకు చొరవ తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి కేబినేట్ సమావేశంలో కడపతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన రిమ్స్ల అభివృద్ది కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్లు కనపడటంతో విద్యార్థుల, రోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2007లో సెమీ అటానమస్ విధానాన్ని తీసుకొచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం తనిఖీలకు వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో తీర్చిదిద్దారు. కడప రిమ్స్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చి దిద్దేందుకు అప్పట్లో ప్రభుత్వం కృషి చేసింది, నగర శివార్లలోని పుట్లంపల్లె ప్రాంతంలో పాపికొండలకు సమీపంలో రిమ్స్ సముదాయం కోసం 230 ఎకరాలను కేటాయించారు. 750 పడకలకు సరిపడే విధంగా ఐపీ భవనంలో విభాగాలను కేటాయించారు. అత్యవసర విభాగాల దగ్గర నుంచి ప్రతి విభాగానికి సంబంధించిన వార్డులను విస్తరించేలా సౌకర్యాలు కల్పిస్తూ వచ్చారు. 299కి పనిచేస్తున్నది 94 మందే! ఓపీ, కళాశాల విభాగాలలో ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను నియమించుకునేలా సౌకర్యాలు క ల్పించారు. ైవె ద్య విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రధానంగా 18 విభాగాలు అవసరం. మరో ఆరు విభాగాలకు కలుపుకుని మొత్తం 299 మంది అధ్యాపకులు అవసరమైతే వారిలో కేవలం 94 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. సెమీ అటానమస్లో భాగంగా నియమితులైన అధ్యాపకులు దాదాపు ఎక్కువ మంది మార్చి, ఆగస్టు నెలల చివరినాటికి కాంట్రాక్టు కాల పరిమితి ముగిడయంతో వారు వెళ్లిపోయారు. దీంతో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ యేడాది జనవరి నుంచి కొరత ఎక్కువైంది. సెమీ అటానమస్ విధానం సమయంలో డెరైక్టర్ను కూడా నియమించారు. ప్రస్తుతం డెరైక్టర్గా పని చేస్తున్న డాక్టర్ సిద్దప్ప గౌరవ్ పదవీ కాలం ఈ నెల 16వ తేదీకి ముగియనుంది. 9వ బ్యాచ్కు చేరుకున్న వైద్య విద్య ఇప్పటికి 8 బ్యాచుల్లో 3 బ్యాచుల వారు వైద్య విద్య కోర్సును పూర్తి చేసుకుని పలుచోట్ల డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 2014-15 బ్యాచ్కు ఇటీవల మెడికల్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం150 మంది వైద్య విద్యార్థులు, 20 మంది పీజీ విద్యార్థులు చేరేందుకు రిమ్స్లో అవకాశముంది. 9వ బ్యాచ్ వైద్య విద్యార్థులకు ఈ నెల 1వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం పీజీ విద్యార్థులు 17 మంది చేరారు. 205 ఖాళీలు కేవలం వైద్య, అధ్యాపక బృందానికి సంబంధించినవి ఉన్నాయి. సెమీ అటానమస్ విధానం మరలా ప్రభుత్వం రెన్యువల్ చేస్తే సమస్య లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో వైద్యులను కూడా విభజిస్తే ఉన్న వాళ్లలో చాలామంది సీనియారిటీ ప్రకారం పదోన్నతులు లభించి రిమ్స్కు వస్తే సమస్య లేకుండా పోతుంది. ఇలాంటి అవకాశం కల్పిస్తే తప్ప వైద్య విద్యార్థులకు గాని, రోగులకు గాని మేలు జరిగే అవకాశం కనిపించడం లేదు.