
వారిపై చర్యలు తీసుకోవాలి
రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చాడ
సాక్షి, హైదరాబాద్: దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా, అందుకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
నిందితులలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోగా, రోహిత్ దళితుడే కాదంటూ కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు.