మెట్రో రైలు భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా భద్రత..
హైదరాబాద్ : మెట్రో రైలు భద్రతపై డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని, మెట్రో రైల్వేస్టేషన్లో తీసుకోవాల్సిన నేర నిరోధక చర్యలు, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పోలీసుల బందోబస్తు, రైల్వేస్టేషన్లు, రైల్వే ట్రాక్లపై ఉగ్రవాద నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మెట్రో అధికారులపై అనురాగ్ శర్మ సమీక్ష జరిపారు. ప్రయాణికుల లగేజ్, ఇన్ అండ్ అవుట్ లో కల్పించే భద్రత, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, పార్కింగ్ భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, డాగ్ స్వ్కాడ్, బలగాల ఏర్పాటుతో నిర్వహణ ఖర్చుపై కూడా ఆయన సమీక్షించారు.