సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుకు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులై, 2016 ఏప్రిల్ 6 నాటికి 30 ఏళ్ల వయసు మించని వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫిబ్రవరి 22 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 దరఖాస్తు ఫీజును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ప్రచురణ కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హతలు, శిక్షణ, శిక్షణ భృతి తదితర వివరాల కోసం www.sakshischoolofjournal sim.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 040-23386957 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు.