కెన్యాలోని మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు మంగళవారం రెచ్చిపోయారు.
నైరోబి : కెన్యాలోని మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు మంగళవారం రెచ్చిపోయారు. స్థానిక మార్కెట్ సమీపంలో ఉన్న ప్రజలపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులు పోలీసు ముఖ్య కార్యాలయానికి అందజేశారు. మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు దాడులు నిత్యకృత్యమైనాయి. గతంలో ఈ సంస్థకు చెందిన తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.