స్నాతకోత్సవం.. వర్చువల్‌గా | Virtual graduation ceremony for Indian students in U.S | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవం.. వర్చువల్‌గా

May 24 2020 6:32 AM | Updated on May 24 2020 6:32 AM

Virtual graduation ceremony for Indian students in U.S - Sakshi

వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భారత విద్యార్థులు, కుటుంబీకులు, మిత్రులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరిగే అన్ని స్నాతకోత్సవాలు రద్దవడం తెల్సిందే. దీంతో ఎంబసీ ఆఫ్‌ ఇండియా స్టూడెంట్‌ హబ్‌ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించింది. అనుకోని ఘటనలే అంతులేని అవకాశాలను కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలో భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విద్యార్థుల్లోనే భవిష్యత్‌ ఆవిష్కరణ కర్తలు, ఎంటర్‌ ప్రెన్యూర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ లాలిత్య మున్షా, నటి గౌతమి తడిమెల్ల, తబలా మాస్టర్‌ దివ్యాంగ్‌ వాకిల్, ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ వేణు గోపాల్, ఐపీఎస్‌ ఆఫీసర్‌ అపర్ణ కుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement