యువత తప్పు దోవ పడితే..! | 'Amma Nanna Oorelithe' To Be Released on Dec 5 | Sakshi
Sakshi News home page

యువత తప్పు దోవ పడితే..!

Published Wed, Nov 20 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

యువత తప్పు దోవ పడితే..!

యువత తప్పు దోవ పడితే..!

యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..

 యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం  ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ముఖ్య తారలు. ఓ ప్రత్యేక పాటను సోనియా అగర్వాల్ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువత తప్పుదోవ పట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఒక్క సినిమాలో అన్నింటినీ చెప్పలేం. అందుకే ప్రధాన అంశాలను తీసుకుని ఈ సినిమా చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. అత్యధిక థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో  ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి  సహనిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాణ సారథ్యం: గాజుల ఖాదర్ భాషా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement