మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు | Dacoits loot finance minister, wife in train | Sakshi
Sakshi News home page

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

Published Thu, Mar 19 2015 3:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

మంత్రి దంపతులను దోచుకున్న దొంగలు

మధురై:  జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్-లో  ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆయన భార్య దోపిడీకి గురయ్యారు. దోపిడీ దొంగలు మంత్రి దంపతులను  తుపాకీతో బెదిరించి మరీ దోచుకున్నారు.  ఈ సంఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రత దుస్థితిని మరోసారి  వెలుగులోకి తెచ్చింది.  గురువారం  మధురై జిల్లాలోని కోసికోలన్ దగ్గర  జబల్పూర్- నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్  ఏసీ బోగీలోకి ఆయుధాలతో చొరబడ్డ దొంగలు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి జయంత్ మలైయా దంపతులతో పాటు మరికొంతమంది ప్రయాణికులను  కూడా దోచుకున్నారు. 

అంతేకాదు ఇదే మార్గంలో వెళ్తున్న మరో రైలులో కూడా  ఈ గ్యాంగ్ లూటీకి పాల్పడినట్టు తెలుస్తోంది.  దీనిపై   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ  సంఘటనతో షాకైన ఆర్థికమంత్రి జయంత్ .. దీనిపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుని  కలవనున్నారని సమాచారం. గతంలో కోసి కలన్  రైల్వేమార్గాన్ని టార్గెట్ చేసుకొని ప్రయాణికులను దోచుకున్నఘటనలు అనేకం జరిగినట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement