25కి పెరిగిన గోరఖ్పూర్ మృతుల సంఖ్య | Gorakhdham Express accident: Death toll in train mishap climbs to 25 | Sakshi
Sakshi News home page

25కి పెరిగిన గోరఖ్పూర్ మృతుల సంఖ్య

Published Tue, May 27 2014 12:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

25కి పెరిగిన గోరఖ్పూర్ మృతుల సంఖ్య

న్యూఢిల్లీ :  గోరఖ్పూర్ రైలు ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య మంగళవారానికి 25కి చేరింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సమీపంలో నిన్న జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మరణించినట్లు వార్తలు వస్తుండగా... అధికారులు మాత్రం 14 మంది మృతి చెందినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు  ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

కాగా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 10 వేలు పరిహారంగా ఇస్తామని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సహాయాన్ని అందిస్తామని యూపీ ప్రభుత్వం పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement