జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.