నిర్భయ కేసులో అమికస్ క్యూరీలపై స్పష్టత | Nirbhaya case: SC to conduct hearing beyond working hours | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసులో అమికస్ క్యూరీలపై స్పష్టత

Jul 12 2016 11:48 AM | Updated on Sep 2 2018 5:24 PM

‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు అమికస్ క్యూరీల నియామకంపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది.

న్యూఢిల్లీ: ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు అమికస్ క్యూరీల నియామకంపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. వీరి నియామకం దోషుల తరఫు లాయర్ల హోదా, సామర్థ్యాన్ని కించపరచదని తెలిపింది. అమికస్ క్యూరీల నియామకంతో లాయర్ల సామర్థ్యంపై ప్రజల్లో కొన్ని తప్పుడు అభిప్రాయాలు నెలకొని ఉన్నాయని దోషుల తరఫు న్యాయవాది ఒకరు చెప్పాక జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ పై విధంగా స్పందించింది.

కేసులో రెండు వర్గాలు తమ న్యాయవాదులను నియమించుకున్నా కోర్టులు అమికస్ క్యూరీలను నియమిస్తాయి. దీనర్థం న్యాయవాదులు అసమర్థులని కాదు. అమికస్ క్యూరీల అభిప్రాయంతో కేసు గురించి మరింత తెలసుకుంటాం ’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement